ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు | Phailin effect: Heavy rains continue to shower in odisha | Sakshi

ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

Published Sun, Oct 13 2013 8:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 90 కిలోమీటర్ల వాయవ్యంగా కేంద్రీకృతమై ఉన్న పై-లీన్ తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 90 కిలోమీటర్ల వాయవ్యంగా కేంద్రీకృతమై ఉన్న పై-లీన్ తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్పూర్లో తీవ్ర విధ్వంసం సంభవించింది. పక్కా ఇళ్లు తప్ప పూరిళ్లు అలన్నీ కూలిపోయాయి. సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. తీరప్రాంతాల్లో ఇప్పుడు కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మరో 36 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

పై-లీన్ తుఫాను ప్రభావంతో ఒడిసా పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజికి వరద నీరు ఉధృతంగా వస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు బ్యారేజికి ఉన్న 8 గేట్లు ఎత్తేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో వరద గాలుల తీవ్రతకు 15 పడవలు దెబ్బతిన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement