ఏడాదికి 99 కోట్ల పెట్రోల్‌ ఆదా! | PM Modi inaugurates longest Chenani-Nashri tunnel | Sakshi
Sakshi News home page

ఏడాదికి 99 కోట్ల పెట్రోల్‌ ఆదా!

Apr 2 2017 5:29 PM | Updated on Aug 15 2018 6:34 PM

ఏడాదికి 99 కోట్ల పెట్రోల్‌ ఆదా! - Sakshi

ఏడాదికి 99 కోట్ల పెట్రోల్‌ ఆదా!

దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణదూరం కూడా గణనీయంగా రెండుగంటలు తగ్గనుంది. అంతేకాకుండా పెట్రోల్‌ రూపంలో ఏడాదికి రూ. 99 కోట్లు ఆదా కానున్నట్టు భావిస్తున్నారు.

  • దేశంలో అతిపెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గం ప్రారంభం
  • జమ్ము నుంచి శ్రీనగర్‌కు ప్రయాణసమయం రెండుగంటలు కట్‌
  • జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీ
     
  • దేశంలోనే అతిపెద్ద సొరంగమైన చెనానీ-నష్రీ టన్నెల్‌ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. జమ్మూ-శ్రీనగర్‌ మధ్య ప్రయాణదూరం 300 కిలోమీటర్లు కాగా.. ఈ సొరంగమార్గం ఏర్పాటు వల్ల అందులో 41 కిలోమీటర్ల దూరం.. 10.9 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణసమయం కూడా రెండుగంటలు ఆదా కానుంది. అంతేకాకుండా పెట్రోల్‌ రూపంలో ఏడాదికి రూ. 99 కోట్లు ఆదా కానున్నట్టు భావిస్తున్నారు.

    ఉధంపూర్‌ జిల్లాలో ఆస్ట్రియన్‌ టెక్నాలజీతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగాన్ని ప్రారంభించిన అనంతరం జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ, గవర్నర్‌ వోహ్రాతో కలిసి ప్రధాని మోదీ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అనంతరం ఆయన ఉధంపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement