ప్రధాని మోదీపై సీనియర్ లీడర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానిమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీలు విముర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ నుంచి ఊహించనిరీతిలో ప్రశంసలు దక్కాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని శరద్ పవార్ స్వాగతించారు. ఇది సరైన నిర్ణయమని పేర్కొన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీనియర్ నేత పవార్ అని ప్రశంసించారు.