సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ | UP: Woman claims spouse sent 'triple talaq' for opposing previous marriage | Sakshi
Sakshi News home page

సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ

Published Wed, Apr 5 2017 8:28 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ - Sakshi

సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ

కాన్పూర్‌: ఇదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసినందుకు విడాకులు కోరుతూ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఓ ముస్లిం మహిళ ఉత్తరం రాసింది. ఈ విషయంపై గవర్నర్‌ రాంనాయక్‌కు, తన భర్త పనిచేసే కార్మిక శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఉత్తరం రాసింది.

కొంతకాలంగా ఆమె ఇక్కడ ఓ కంప్యూటర్‌ కేంద్రాన్ని నడుపుతోంది. గత ఏడాది నవంబర్‌ 23న తనకు వివాహమైందని, ఆ సమయంలో రూ.25 లక్షల విలువ చేసే కారు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను కట్నకానుకలుగా ఇచ్చినట్లు చెప్పింది. తన భర్తకు ఇదివరకే పెళ్లి అయిన విషయం తెలుసుకొని ఆయనను నిలదీయడంతో తనపై అత్తింటివారు దాడి చేశారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement