
'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు'
లలిత్ మోదీ వివాదంలో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినందున ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు వసుంధర రాజెకు లేదని కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్ అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అటు సుష్మా స్వరాజ్, ఇటు వసుంధర రాజె.. ఇద్దరి పైనా మండిపడ్డారు. సుష్మా స్వరాజ్ తన కేంద్ర మంత్రి పదవికి, వసుంధర రాజె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నేరస్థుడికి బీజేపీ మద్దతు పలుకుతోందని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.