త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్‌ హీరోయిన్లు | vijay latest movie audio on aug 20 | Sakshi
Sakshi News home page

త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్‌ హీరోయిన్లు

Published Sat, Jul 22 2017 8:34 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్‌ హీరోయిన్లు

త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్‌ హీరోయిన్లు

అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు ఆనందాన్నిస్తుంది.

చెన్నై: అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు ఆనందాన్నిస్తుంది. తమిళ అగ్రహీరో విజయ్‌ తాజా సినిమా 'మెర్సల్‌' సంబంధించి పలు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.  విజయ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌లు నాయికలుగా నటిస్తున్నారు.

తెరి వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీతేనాండాల్‌ ఫిలింస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని విజయ్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.  వారికో సంతోషకరమైన వార్త ఏమిటంటే ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర ఆడియోను ఆగస్ట్‌ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా శుక్రవారం వెల్లడించాయి. సోనీ మ్యూజిక్‌ సంస్థ ఈ పాటల హక్కులను పొందింది. దీపావళి రేసులో బరిలోకి దిగేందుకు ఈ చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement