కృష్ణా(మైలవరం): ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కేందు యత్నించి అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరంలో సోమవారం చోటుచేసుకుంది. బీసీ సంక్షేమ సంఘం మైలవరం నియోజకవర్గం అధ్యక్షుడు మన్నె సాంబశివరావు ఈ రోజు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపేందుకు యత్నించాడు.
దీంతో సిబ్బంది పోలీసులకు సమాచార మిచ్చారు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తు పై విడుదల చేశారు.
సెల్టవర్ ఎక్కిబోయి... అరెస్టు అయ్యాడు
Published Mon, Aug 10 2015 4:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement