
తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఏ హీరోయిన్ కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ నేడు ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు.

సాయి పల్లవి 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలో మెరిసింది.

సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది.

2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.

సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ‘మారి2’ ‘లవ్ స్టోరీ’‘శ్యామ్ సింగ్ రాయ్’ ‘గార్గి’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలున్నాయి.

శివకార్తికే నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.

నాగ చైతన్య 23వ సినిమా తండేల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.





















