happy birthday
-
Happy Birthday: అనుపమ పరమేశ్వరన్ బర్త్డే స్పెషల్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్
-
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
అనుష్క బర్త్ డే.. ఆ తప్పు చేయకపోయింటే ఈ పాటికి ఎక్కడో! (ఫొటోలు)
-
రికార్డుల రారాజు.. సచిన్ను మైమరిపించిన విరాటుడు
ప్రపంచ క్రికెట్లో అతడొక కింగ్. అతడికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. తండ్రి ఆశయం కోసం ఎంతటి సవాలునైనా ఎదిరించగల సాహసి. ప్రాణంలా ప్రేమించిన తండ్రి మరణం బాధిస్తున్నా.. ఆటగాడిగా తన విధిని నిర్వర్తించిన అంకితభావం గల వ్యక్తి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే అతడు బరిలోకి దిగనంతవరకే.. అతడు మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకుంటూ వరల్డ్ క్రికెట్పై తనదైన ముద్ర వేసుకున్న ధీరుడు అతడు. క్రికెట్ దేవుడు సచిన్ను మరిపించేలా పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది.కొండంత లక్ష్యాన్ని కూడా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. వరల్డ్క్రికెట్లో ఫిట్నెస్కు మారుపేరు అతడు. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. "విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు". ఇది సచిన్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేసినప్పుడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెసిన వాఖ్య ఇది. ఇది నిజంగా అక్షర సత్యం. కోహ్లి నేడు తన 36వ పుట్టిన రోజు జరుపునకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.👉: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన కోహ్లి మొత్తంగా 50 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై సెంచరీ నమోదు చేసిన విరాట్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉండేది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకున్నారు. కానీ సచిన్ రికార్డు బద్దలు కొట్టి కోహ్లి చరిత్రకెక్కాడు. తన ఆటతో సచిన్ను కూడా ఫిదా చేసి.. క్రికెట్ దేవుడినే మైమరిపించాడు.👉: వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2023 ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. కోహ్లి కేవలం 278వ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్(321) పేరిటే ఉండేది.👉: మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. ఇప్పటివరకు 538 మ్యాచ్లు ఆడిన కోహ్లి 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కింగ్ కోహ్లి సొంతం చేసుకున్నాడు.👉: వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో కోహ్లి ఏకంగా 765 పరుగులు చేసి ఈ ఫీట్ను సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివకు 125 మ్యాచ్లు ఆడిన కోహ్లి 39 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ కూడా సరిగ్గా 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కేవలం 96 ఇన్నింగ్స్లలోనే కోహ్లిఈ ఫీట్ నమోదు చేశాడు. -
లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా:సారా టెండుల్కర్ (ఫొటోలు)
-
హ్యారీకి రాజకుటుంబం.. పుట్టినరోజు శుభాకాంక్షలు
బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. – లండన్ -
మదర్ థెరిసా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్డే.. ఇండియన్ పాలిటిక్స్లో రా.గా.(ఫొటోలు)
-
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్డే (ఫోటోలు)
-
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
-
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్డే గిఫ్ట్గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్డే విషెస్.. ఎవరికో తెలుసా?
ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్డే విషెస్ చెప్పారు. కాగ్నిజెంట్ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్లోని చైన్నైలో కాగ్నిజెంట్ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్.రవికుమార్ సీఈవోగా ఉన్నారు. కాగ్నిజెంట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు. -
Birthday Special: హీరో వరుణ్ తేజ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
Namrata Shirodkar Photos: ఫ్రెండ్స్తో కలిసి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్న నమ్రత శిరోద్కర్ (ఫోటోలు)
-
Deepika Padukone: రెడ్ డ్రెస్ లో సొగసులు ఆరబోసిన అందాల తార దీపికా
-
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
Birthday Special: సీఎం వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
600 కేజీల భారీ కేక్ను కట్ చేసిన ఎమ్మెల్సీ రఘురామ్, మంత్రి మేరుగ
-
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
-
Niharika Konidela Photos: నిహారిక కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Sameera Reddy Birthday: పింక్ సూట్ లో ముద్దొచ్చే ఫోజులతో అదరగొట్టిందిగా
-
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
హీరోయిన్ నయనతార బర్త్ డే స్సెషల్ (ఫోటోలు)
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్డే ఫోటోలు
-
Birthday Special: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందాల తార టబు
-
ఇర్ఫాన్ పఠాన్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?
ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం. 1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు. దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు. నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్గా భారీ మొత్తంలోనే సంపాదించాడు. నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్లో కూడా నటించాడు. -
Birthday Special: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
Manisha Koirala Birthday 2023: 90'sలో కోట్ల మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
Sridevi Birthday Special Pics : దివంగత నటి శ్రీదేవి బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
చిరు, రజిని మధ్యలో మహేష్… బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే
-
HBDMaheshBabu: మహేష్బాబు నెట్వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్కి అనేక బ్లాక్బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ బ్యాక్యార్డ్లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్తో పాటు మోహన్లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Devi Sri Prasad : మ్యూజిక్తో మ్యాజిక్ చేసే రాక్ స్టార్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
పుట్టినరోజున పేదపిల్లలకు సితార పాప సైకిళ్ల పంపిణీ (ఫొటోలు)
-
పుట్టినరోజు నాడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్కప్లో టీమిండియాను ఫైనల్ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన నాట్వెస్ట్ వన్డే సిరీస్ను గెలిచిన సందర్భంలో లార్డ్స్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు. ‘సౌరభ్ గంగూలీ మాస్టర్క్లాస్’ పేరుతో యాప్ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్లైన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు. ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా. 'సౌరభ్ గంగూలీ మాస్టర్క్లాస్' అనే యాప్ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్ప్లస్ (ఎడ్టెక్ స్టార్టప్)కు ధన్యవాదాలు. నేను, క్లాస్ప్లస్ కలిసి ఆన్లైన్ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 16+ years of international cricket and countless matches later… on this 51st bday, I sum up my learnings for you. They are now yours! Announcing “Sourav Ganguly Masterclass”, an app that has my first-ever online course on leadership - https://t.co/fX0dM4NVTb Thanks to… pic.twitter.com/Dek5fBzBM5 — Sourav Ganguly (@SGanguly99) July 8, 2023 -
Sourav Ganguly Rare Pics : సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Sourav Ganguly Dona Roy Love Story: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. వివాదాలను లెక్క చేయకుండా భారత క్రికెట్లో సంచలన మార్పులకు కారణమైన దాదా వ్యక్తిగత జీవితం గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డోనా రాయ్తో అతడి ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.. చిన్ననాటి నుంచే పరిచయం గంగూలీ చిన్నపుడు ఎక్కువగా ఫుట్బాల్ ఆడేవాడు. స్నేహితులతో కలిసి గ్రౌండ్కు వెళ్లే దారిలోనే డోనా ఇల్లు ఉండేది. అలా ఓసారి ఆమెను చూసిన దాదా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ కూడా ఆడే గంగూలీ కావాలనే రెండు మూడుసార్లు షటిల్కాక్ను డోనా ఇంట్లో పడేశాడు. అలా తమకు సంబంధించిన వస్తువును తిరిగి తెచ్చుకునే సాకుతో డోనాతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. అప్పటి నుంచి గంగూలీ- డోనా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో తొలిసారి అలా ప్రేమ పక్షులు తొలిసారి కోల్కతాలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో కలుసుకున్నారు. నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ఫుల్లుగా లాగించేశారు. ఆ తర్వాత నుంచి అక్కడే తరచుగా కలుసుకునేవారు డోనా- గంగూలీ. స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కుటుంబాల మధ్య గొడవ సౌరవ్ గంగూలీ- డోనా రాయ్ కుటుంబాల మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి. దీంతో ఇరు కుటుంబాలు ఉప్పు-నిప్పుగా ఉండేవి. అయితే, ఇవేమీ ఈ లవ్బర్డ్స్పై ప్రభావం చూపలేదు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాంతం కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అప్పటికి జీవితంలో సెటిల్ కాలేదు కాబట్టి తమ రిలేషన్షిప్ను సీక్రెట్గానే ఉంచారు. అప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్తో అరంగేట్రం చేసిన గంగూలీ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డోనాను వివాహమాడాలని ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుడి నివాసంలో రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అంతా సజావుగానే సాగింది. ఒకరి చేయి ఒకరు వీడలేదు అయితే, తమ పెళ్లి విషయాన్ని చాలా కాలం వరకు సీక్రెట్గానే ఉంచిన గంగూలీ- డోనా.. ఒకానొక రోజు నిజం బయటపడటంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ.. ఒకరి చేయి ఒకరు వీడలేదు. తమ నిజమైన ప్రేమతో పెద్దల మనసు గెలిచి కథను సుఖాంతం చేసుకున్నారు. ఇక 1997లో పెళ్లి చేసుకున్న డోనా- సౌరవ్ గంగూలీ జంటకు 2001లో కూతురు జన్మించింది. ఆమెకు సనాగా నామకరణం చేశారు. ఇక టీమిండియా స్టార్గా గంగూలీ, ఒడిస్సీ డ్యాన్సర్గా డోనా తమ కెరీర్లో విజయవంతమైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఒక్కటిగా కొనసాగుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీమిండియాతో సిరీస్కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
బర్త్డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్లైన్స్తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఓపెనర్గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్మన్గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
'30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక ధోని బర్త్డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి "ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం. అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు. చదవండి: MS Dhoni: ధోని బర్త్డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్బాల్లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్కప్ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్టైమ్ గ్రేట్గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్గా. అయితే తొలి మ్యాచ్లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్టైమ్ గ్రేట్గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్ల్లో 32 గోల్స్.. ఓవరాల్గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్లాడి 807 గోల్స్తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
హ్యాపీబర్త్డే రాహుల్ గాంధీ.. అరుదైన చిత్రాలు చూశారా?
-
హ్యాపీబర్త్డే రాహుల్ గాంధీ.. అరుదైన చిత్రాలు చూశారా?
-
‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల బర్త్డే స్పెషల్..(ఫోటోలు)
-
సాయి పల్లవి బర్త్డే.. నటనే కాదు నవ్వుతోనూ అట్రాక్ట్ చేస్తున్న హైబ్రిడ్ పిల్ల (ఫొటోలు)
-
#HBD Sachin: సచిన్ క్రికెట్కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే!
సచిన్ను క్రికెట్కు దేవుడంటారు. ఎందుకంటే క్రికెట్ అనే విశ్వమతంలో ఆ దేవుడు చేసిన అద్భుతాలు అలాంటివి. మరి ఆ దేవుడికి అభిమానులనే భక్తులు ఉండడం సహజమే కదా. అందులో ప్రియ భక్తులు వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉంటారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో.. సచిన్కు సుధీర్ సుకుమార్ చౌదరీ అలాగ!. గుండెల నిండా సచిన్ను నింపేసుకున్న సుధీర్.. ఆయన మ్యాచ్ ఆడే సమయంలో మువ్వన్నెల రంగును ఒళ్లంతా పూసుకుని.. చేతిలో జెండాతో ప్రేక్షకుల గ్యాలరీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేవలం సచిన్ కోసమే వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన సుధీర్ గురించి.. ఇవాళ్టి సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుంటూ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏప్రిల్ 24న(సోమవారం) సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్లో లెక్కకు మించి సాధించిన రికార్డులు ఎన్నో. వంద సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అందుకే సచిన్ అభిమానించేవారు కోట్లలో ఉండేవారు. కానీ ఆ కోట్లాది మంది అభిమానుల్లో కొందరు ప్రత్యేకంగా కనిపించేవారు. ఆ కొందరిలోనూ మరింత ప్రత్యేకంగా కనిపించాడు సుదీర్ కుమార్ చౌదరీ. 👉 శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని ఛాతిపై సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పూని టీమిండియా ఎక్కడ మ్యాచ్లు ఆడితే అక్కడికి ఒక సైకిల్పైనే వెళ్లి మ్యాచ్లను చూసేవాడు. అలా సచిన్ ఆటను.. టీమిండియా మ్యాచ్లను చూడడం కోసం దేశం మొత్తం తిరిగిన ఘనత అతని సొంతం. మరి సుదీర్ కుమార్ జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరం ఆరేళ్ల వయసులోనే సచిన్కు వీరాభిమాని.. 👉 ఆరేళ్ల వయసులోనే సచిన్కు వీరాభిమానిగా మారిపోయిన సుదీర్ కుమార్ చౌదరీ 1982లో బిహార్లోని ముజఫర్పుర్లో కడు పేదరిక కుటుంబంలో పుట్టాడు. ఆరేళ్ల వయసులో సచిన్పై ఇష్టం పెంచుకున్న సుధీర్ 14 ఏళ్ల వయసులో తన చదువును వదిలేశాడు. నిరుద్యోగి అయిన అతను కొన్నాళ్లు పాల కంపెనీలో చిరుద్యోగిగా పనిచేశాడు. ఆ తర్వాత టీటీసీ ట్రైనింగ్ తీసుకొని కొంతకాలం టీచర్గా పనిచేశాడు. కానీ ఇవేవి అతనికి ఆత్మసంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 👉 సచిన్పై ఉన్న అభిమానం అతని పెళ్లి వాయిదా వేసుకునే వరకు వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ అలా బతకడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. తీరు మార్చుకోకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని సుధీర్ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకి వచ్చేశాడు. తన జీవితం క్రికెట్ మ్యాచ్లకే అంకితమని తీర్మానం చేసుకున్న సుధీర్.. పబ్లిక్ సపోర్ట్తో వచ్చిన డబ్బులతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్లను చూసేవాడు. 👉2003 అక్టోబర్ 28న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సచిన్ ఆటను చూడడం కోసం సుదీర్ పెద్ద సాహసమే చేశాడు. దాదాపు 21 రోజుల పాటు ముజఫర్పుర్ నుంచి మ్యాచ్ జరిగిన ముంబైకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారానే తొలిసారి సుదీర్ కుమార్ చేతిలో భారత జెండాను పట్టుకొని రెపరెపలాడించడం మొదలుపెట్టాడు. ఇక 2010 వరకు దాదాపు 150 మ్యాచ్లు వీక్షించడం విశేషం. ఉపఖండపు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో భారత్ ఆడిన సిరీస్లకు సైకిల్పైనే వెళ్లడం ఆటపై అతనికున్న అభిమానిన్ని చూపిస్తోంది. సచిన్ను మెప్పించిన అభిమాని.. పోలీసుల క్షమాపణ 👉2010లో కాన్పూర్ వేదికగా టీమిండియా మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. అయితే ప్రాక్టీస్సెషన్ సమయంలో సచిన్తో కరచాలనం చేయడానికి సుదీర్ కుమార్ ప్రయత్నించాడు. కానీ పోలీసులు సుదీర్ పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ఇది గమనించిన సచిన్ టెండూల్కర్ నేరుగా పోలీసుల వద్దకు చేరుకొని.. అతను నా వీరాభిమాని.. అతను నాకు ఫ్యాన్ కాదు.. నేనే అతని ఫ్యాన్ను అని చెప్పాడు. 👉 దిగ్గజం సచిన్ ఆ మాట అనడంతోనే పోలీసులు సుదీర్ కుమార్ను క్షమాపణ కోరారు. అలా క్రికెట్ దేవుడిని మెప్పించిన ఘనత సుదీర్ కుమార్కే దక్కింది. ఈ సంఘటన తర్వాత సుధీర్ కుమార్ అభిమానానికి పడిపోయిన బీసీసీఐ.. అప్పటినుంచి టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు అతని టికెట్కు స్పాన్సర్ చేయడం మొదలుపెట్టింది. 👉 2011 వన్డే వరల్డ్కప్.. మరిచిపోలేని క్షణం సుదీర్ కుమార్ జీవితంలో 2011, ఏప్రిల్ 2.. మరిచిపోలేని క్షణాలు. ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన రోజు కావడంతో యావత్ భారతావని పులకించిపోయింది. భారత్ డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు మొదలయ్యాయి. ఆ సమయంలో సచిన్ సుదీర్ చౌదరీని డ్రెస్సింగ్ రూమ్కు ఆహ్వానించాడు. జహీర్ ఖాన్ చేతుల మీదుగా వరల్డ్కప్ ట్రోఫీ అందుకున్న సుదీర్.. సచిన్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. 👉 తన అభిమాన క్రికెటర్ అలా పిలిచి కప్ చేతిలో పెట్టడంతో ఎమోషనల్ అయిన సుదీర్ను సచిన్ హగ్ చేసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. వరల్డ్కప్ ట్రోఫీతో భారత్.. భారత్ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక అద్బుత ఘట్టమని చెప్పొచ్చు. తనను అంతగా ప్రేమించిన ఒక అభిమాని సంతోషపెట్టిన సచిన్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది. 👉ఇక సచిన్ తన రిటైర్మెంట్ రోజున సుదీర్ చౌదరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నా 24 ఏళ్ల కెరీర్లో 14 ఏళ్ల పాటు నాపై అభిమానంతో ప్రతీ మ్యాచ్కు హాజరై టీమిండియాను ఆశీర్వదించిన సుదీర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాంటి అభిమాని నాకుండడం గర్వకారణం అని చెప్పుకొచ్చాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ల పాటు ధోని అభిమానిగా మారిన సుదీర్ పలు మ్యాచ్లకు అతని జెర్సీ నెంబర్ ముద్రించుకొని వచ్చాడు. కానీ ఈ మధ్యన సుదీర్ కుమార్ చౌదరీ పెద్దగా కనిపించడం లేదు. అలా సచిన్ ఉన్నంతకాలం అతని ఆటను చూస్తూ సంతోషపడిన సుదీర్.. భారత్ క్రికెట్లో ఎప్పటికి గుర్తుండిపోయే అభిమానిగా మిగిలిపోవడం ఖాయం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పార్టీ లేదా పుష్ప? నెట్టింట వైరల్గా మారిన బన్నీ-తారక్ల చాటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ల మధ్య జరిగిన సరదా చిట్చాట్ ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే పుష్ప టీజర్, ఫస్ట్లుక్ పోస్టర్తో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. తాజాగా నిన్న(ఏప్రిల్8)న ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే బన్నీ అనే హాష్ టాగ్ ట్రెండింగ్లో ఉంది. ఇక అల్లు అర్జున్ 41వ బర్త్డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ను అందించగా, ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్గా మారింది. 'హ్యాపీ బర్త్డే బావా.ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా'.. అంటూ తారక్ అల్లు అర్జున్కు విషెస్ చెప్పగా.. ఆయన కూడా 'థాంక్యూ వెరీ మచ్ బావ.. హగ్స్' అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. దీనికి మళ్లీ తారక్ స్పందిస్తూ.. 'ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్ప?'(పుష్పలోని డైలాగ్)అంటూ తనదైన స్టైల్లో అడగ్గా.. దీనికి బన్నీ వస్తున్నా(NTR 30లోని డైలాగ్)అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. మొత్తంగా వీరిద్దరి మధ్య కొనసాగిన ట్విటర్ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరోలు అయ్యిండి కూడా బావా అంటూ సరదాగా పిలచుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ట్విటర్లో బావ అనే పదం ట్రెండింగ్లోకి వచ్చింది. తారక్-బన్నీల ట్వీట్స్ను రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !! — Jr NTR (@tarak9999) April 8, 2023 Only hugs? Party Leda Pushpa? 🤣 — Jr NTR (@tarak9999) April 8, 2023 Vasthunna !! 😉 — Allu Arjun (@alluarjun) April 8, 2023 -
Allu Arjun Birthday Photos Gallery: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
Happy Birthday Brahmanandam: బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
ఏపీ: ఊరువాడా జననేత పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
మీ పేరు నిలబెడతాం.. థ్యాంక్స్ మామయ్య
-
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం : సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్న రైతు
-
యువీ కెరీర్ను మలుపు తిప్పిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్లు
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(డిసెంబర్ 12న) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యువీ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై). పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న యువరాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఐసీసీ మేజర్ టోర్నీలైన 2007 టి20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్లు అతని ఖాతాలో ఉన్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్కు పెట్టింది పేరైన యువీలో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. 2000 అక్టోబర్ నెలలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. అయితే ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నప్పటికి ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు ఇన్నింగ్స్లు మాత్రం అతని కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. 69 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్(నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్) నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లో నెంబర్వన్ స్థానంలో ఉంటుంది. యువరాజ్ కెరీర్నే కాదు టీమిండియా గతినే మార్చేసింది.. ఈ మ్యాచ్. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు యువరాజ్ సింగ్. మరో ఎండ్లో మహ్మద్ కైఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. అతని ఇన్నింగ్స్కు ముచ్చటపడిన కైఫ్ ఆ బాధ్యతలను తాను తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ ఇదే. 139 వర్సెస్ ఆస్ట్రేలియా, 2004 2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేసిన యువీ కెరీర్లో ఇది రెండో బెస్ట్ అని చెప్పొచ్చు. అతని ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ను గెలుచుకుంది. 58 వర్సెస్ ఇంగ్లండ్, 2007 టి20 ప్రపంచకప్ యువీ కెరీర్లో మూడో టర్నింగ్ పాయింట్.. 2007 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్తో గొడవ యువరాజ్లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యువరాజ్ టి20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యువీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్ను అందుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 57 వర్సెస్ ఆస్ట్రేలియా(2011 వన్డే వరల్డ్కప్) 2011 వన్డే వరల్డ్కప్లో యువరాజ్ ఆల్రౌండర్గా కీలకపాత్ర పోషించాడు. జట్టులో ఒక ఆల్రౌండర్ ఉంటే ఎంత బలమో యువీ చేసి చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టపడుతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో ఓపికగా ఆడని యువీ టీమిండియాకు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. మ్యాచ్లో 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్గా నిలిచాడు. 150 వర్సెస్ ఇంగ్లండ్, 2017 కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ఎంఎస్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. To celebrate Yuvraj Singh's birthday, tell us your favourite memory of his ✨ pic.twitter.com/bCcSuqQbHq — ICC (@ICC) December 12, 2020 చదవండి: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు -
ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో!
ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిపోయింది. ఒకవేళ దక్కినా అది చిన్న జట్లతో ఆడేటప్పుడు మాత్రమే. అయినా ఏం బాధపడలేదు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నాడు. అతనే వికెట్ కీపర్ సంజూ శాంసన్. టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యం అనంతరం ఇప్పుడు సంజూ శాంసన్ లాంటి క్రికెట్ర్లు టీమిండియాకు అత్యవసరం. కాగా ఇవాళ(నవంబర్ 11న) సంజూ శాంసన్ పుట్టిన రోజు. తాజాగా టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో వెనుదిరగడంతో విమర్శలతో పాటు ట్రోల్స్ మొదలయ్యాయి. ఐపీఎల్కు మాత్రమే పనికొచ్చే కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్ లాంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినా బాగుండు అని అభిమానులు పేర్కొన్నారు. ఇవాళ ఐపీఎల్ను బ్యాన్ చేయాలి అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అదే ఐపీఎల్ నుంచి వెలుగులోకి వచ్చినవారిలో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ఐసీసీ టోర్నీ కోసం భారత జట్టు ప్రకటించిన ప్రతిసారి.. సంజూ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకునేవారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ సెమీస్ లో ఓడిపోవడంతో మనోడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే టీమిండియాలో ఉన్న రాజకీయాలు కూడా సంజూకు అవకాశాలు సరిగ్గా రాకపోవడానికి ఒక కారణమయ్యాయి. ఇక ఢిల్లీలో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సంజూ.. తన ఆటను డెవలప్ చేసుకునేందుకు సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిపోయాడు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అంటే 2012లో అద్భుతమైన బ్యాటింగ్ తో అండర్-19 ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీలో అదిరిపోయే బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా 2015లో జింబాబ్వే జట్టుపై టీ20 అరంగేట్రం చేశాడు. కానీ జట్టులో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంసన్ది అదే పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో సంజూ శాంసన్ నిలకడగా రాణిస్తున్నాడు. అందుకు ఉదాహరణ ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్తో సిరీస్. ఈ సిరీస్లో రెండో టి20 మ్యాచ్లో శాంసన్ 42 బంతుల్లోనే 77 పరుగులు చేసి తొలి టి20 హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాదు అదే మ్యాచ్లో దీపక్ హుడాతో కలిసి రెండో వికెట్కు 176 పరుగులు జోడించాడు. టీమిండియా తరపున టి20ల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదే మ్యాచ్లో దీపక్ హుడా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంగ్లండ్తో టి20 సిరీస్కు ఎంపికయినప్పటికి తుది జట్టలో చోటు దక్కలేదు. ఆ తర్వాత వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడాడు. అక్కడ తొలి వన్డే హాఫ్ సెంచరీ సాధించడమే గాక శ్రేయాస్ అయ్యర్తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్లో కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శాంసన్ అప్పుడు కూడా బ్యాట్తో మెరిశాడు. దీని తర్వాత జింబాబ్వేతో వన్డే సిరీస్లో భాగంగా శాంసన్ రెండో వన్డేలో 43 పరుగులు నాటౌట్గా నిలవడంతో కీపర్ మూడ క్యాచ్లు అందుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు ఎంపికయ్యాడు. ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డేలో 86 పరుగులతో నాటౌట్ నిలిచి సత్తా చాటాడు. అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సంజూ శాంసన్కు టి20 ప్రపచంకప్లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మళ్లీ అవే రాజకీయాల కారణంగా సంజూకు చోటు దక్కలేదు. దీంతో అభిమానులు బీసీసీఐపై గరమయ్యారు. ఫామ్లో ఉన్న ఆటగాడిని కనీసం స్టాండ్ బై ప్లేయర్గానైనా ఎంపిక చేస్తే బాగుండేదని.. కనీసం ఆ అర్హత కూడా శాంసన్కు లేదా అంటూ ఫ్యాన్స్ బీసీసీఐకి చురకలంటిచారు. ఇక ఐపీఎల్లో ఎక్కువగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ 138 మ్యాచ్ల్లో 3526 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. ఇదంతా పక్కనబెడితే.. నవంబరు 11న తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై అయినా సంజూ శాంసన్ ప్రతిభను గుర్తించి టీమిండియాలో విరివిగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి Happy Birthday Sanju Samson.. From Sanju's birthday celebration ❤️🤩#SamsonDay #SanjuSamson #HappyBirthdaySanjuSamson pic.twitter.com/z8LsRK0YDp — Sanju Samson Fans Page (@SanjuSamsonFP) November 10, 2022 Happy Birthday @IamSanjuSamson, the talent you possess is priceless & a true inspiration to the young generation out there. Wishing you success and happiness always brother 🤗 pic.twitter.com/q5BdvatPFS — Suresh Raina🇮🇳 (@ImRaina) November 11, 2022 Here's wishing @IamSanjuSamson a very happy birthday. 🎂 👏#TeamIndia pic.twitter.com/ys4C2QmLij — BCCI (@BCCI) November 11, 2022 చదవండి: 'ఒక్కడిని ఏం చేయగలను.. ఓటమి బాగా హర్ట్ చేసింది' -
సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు.. దటీజ్ కమల్
టీనేజ్లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్ షాపులో పని చేశాడు కమల్హాసన్. గ్రూప్ డాన్సర్గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్హాసన్ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో. ‘మీ పక్కన కాస్తంత చోటివ్వండి’ అంటాడు కమల్హాసన్ ‘సాగర సంగమం’లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్గా ఉంటూ స్టార్ అయినవాడు కమల్హాసన్. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది. నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించినవారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు. బాల్యంలో ఉన్న ఈజ్ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్హాసన్. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ‘ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా’ అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్ మొదటి లైన్ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యుయాన్సెస్ అంటారు దీనిని. కళ అంటేనే అది. ‘సాగర సంగమం’ సూపర్ డూపర్ హిట్ అయ్యాక కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ తీశారు. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్ కూడా ‘ఈ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేద్దాం’ అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్ ‘సార్... ఈ పాటకు నేను డాన్స్ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు’ అన్నారట. అదీ కమల్. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్ వేసిన వచ్చీ రాని స్టెప్స్ను లోకం మురిసిపోయి చూసింది. కమల్ చార్లీ చాప్లిన్ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. ‘డాన్స్మాస్టర్’లో స్వయంగా చాప్లిన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్ విలియమ్స్ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు. మంచి నటుడు బ్లాటింగ్ పేపర్ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. ‘గాడ్ఫాదర్’ను మోడల్గా పెట్టుకుని మణిరత్నం ‘నాయకుడు’ తీశాడు. గాడ్ఫాదర్లో మార్లెన్ బ్రాండో చేసింది గొప్పదే. ‘నాయకుడు’లో కమల్ చేసింది కూడా గొప్పే. కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్ చేసింది ఒక సిలబస్. కమల్ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్లు రాని రోజుల్లోనే ‘సత్యమే శివం’ వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం. కమల్ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్స్టార్. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. ‘మరో చరిత్ర’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’ కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్ నటుడైన దిలీప్ కుమార్ కామిక్ టైమింగ్ అద్భుతం. అమితాబ్ కామెడీకి తిరుగు లేదు. కమల్ కామెడీ చేసి ‘పుష్పక విమానం’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘ముంబై ఎక్స్ప్రెస్’, ‘తెనాలి’... లిస్టు పెద్దది. ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్ అయిన కోవై సరళతో ‘సతీ లీలావతి’ చేసి హిట్ కొట్టాడు కమల్. సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్ ఫ్లాప్స్ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్గా, క్రియేటివ్గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో ‘విక్రమ్’ వంటి హిట్ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్డే.(నవంబర్ 7న కమల్హాసన్ బర్త్డే) -
కింగ్ కోహ్లి 12 ఏళ్ల ట్వీట్ వైరల్..
టీమిండియా రన్మెషిన్.. కింగ్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లి ఇప్పటికీ పరుగుల వరదను కొనసాగిస్తూనే ఉన్నాడు. మధ్యలో మూడేళ్ల పాటు సెంచరీ లేకపోయినప్పటికి ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా తనపై వచ్చిన విమర్శలను బ్యాట్తోనే తిప్పికొట్టడం అతనికే సాధ్యమైంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్లో టీమిండియా తరపున లీడింగ్ రన్స్కోరర్గా ఉన్న కోహ్లి జట్టుకు కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2022లో తిరిగి ఫామ్ను అందుకున్న కోహ్లి బర్త్డే సందర్భంగా 12 ఏళ్ల పాత ట్వీట్ తాజాగా మరోసారి వైరల్ అయింది. 2010 మార్చి 16న కోహ్లి ట్వీట్ చేసే సమయానికి అతను టీమిండియా తరపున కేవలం 23 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 23 మ్యాచ్లాడి 847 పరుగులు చేసిన విరాట్ ఖాతాలో అప్పటికి రెండు సెంచరీలు, ఆరు ఫిప్టీలు ఉన్నాయి. ఆ సమయంలో కోహ్లి తన ట్విటర్లో ఒక మాట అన్నాడు. ''ఎప్పటికైనా టీమిండియా తరపున వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నా.. ఏదో ఒకరోజు అది నెరవేరుతుంది'' అంటూ రాసుకొచ్చాడు. ఇది పోస్టు చేసిన కొద్ది రోజులకు టి20ల్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2011లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడడంతో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కట్చేస్తే ఇవాళ అన్ని ఫార్మాట్లలో వందకు పైగా మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు, 71 సెంచరీలు, 92 అర్థసెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. Looking forward to scoring lots of runs for my Team.. — Virat Kohli (@imVkohli) March 16, 2010 చదవండి: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు.. -
Virushka: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!
Virat Kohli- Anushka Sharma Love Story: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది.. ‘‘థాంక్ గాడ్.. నువ్వు ఈ భూమ్మీద పుట్టావు కాబట్టి సరిపోయింది.. లేదంటే నాకసలు ఏం తోచేదే కాదు.. నువ్వు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు.. నీ రూపమే కాదు.. మనసు కూడా ఎంతో అందమైనది’’ అంటూ ఆమెపై ప్రేమను కురిపిస్తాడు అతడు.. దేవుడు తనకిచ్చిన గొప్ప కానుకకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొంటాడు.. ఆమె ఒక్కమాటలో.. ‘‘నువ్వే సర్వస్వం.. నీపై నా ప్రేమ అపరిమితం’’ అంటుంది. ఎల్లవేళలా అతడికి తోడుగా ఉంటుంది.. ఆమె అనుష్క శర్మ.. అతడు విరాట్ కోహ్లి.. వారి ప్రేమ కథే ఇది! చూపులు కలిసిన శుభవేళ కోహ్లి అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం.. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా తమ కమర్షియల్ యాడ్లో అతడిని నటింపజేసింది ఓ షాంపూ కంపెనీ. 2013 నాటి ఆ యాడ్లో కోహ్లికి జోడీగా అనుష్క శర్మ. స్వతహాగా నటి కాబట్టి చాలా క్యాజువల్గానే సెట్లోకి వచ్చిందామె. కానీ కోహ్లికి కొత్త కాబట్టి కాస్త కంగారుగా ఉన్నాడు. పొడవాటి హీల్స్ వేసుకుని తన కంటే ఎత్తుగా కన్పిస్తున్న అనుష్కను చూసి.. ‘‘ఇంతకంటే పొడుగైన హీల్స్ దొరకలేదా’’ అంటూ ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె కాస్త చిరాగ్గా ఏంటీ అని ఎదురు ప్రశ్నించడంతో.. ‘‘లేదు లేదు నేను జోక్ చేశానంతే’’ అంటూ తప్పించుకున్నాడు. కానీ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ఆమె వ్యక్తిత్వానికి ఫిదా కాకుండా మాత్రం ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా మాటలు కలిశాయి. అవును ప్రేమలో ఉన్నాం అడపాదడపా బయట కలిసి కనిపించేవారు.. ఇటు క్రికెట్.. అటు సినిమా వర్గాల్లో చర్చ.. ఇంతకీ వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా? లేదంటే మూణ్నాళ్ల ముచ్చటగానే వీరి బంధం ముగుస్తుందా? అంటూ చెవులు కొరుక్కున్నారు. అనవసరంగా గాసిప్ రాయుళ్లకు మరీ ఎక్కువ పని కల్పించడం ఎందుకని విరాట్- కోహ్లి తమ గురించి తామే స్వయంగా బయట ప్రపంచానికి తెలిసేలా ఓ ప్రకటన చేశారు. ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అందరు యువతీ యువకుల్లాగే మేమూ రిలేషన్షిప్లో ఉన్నాం’’ అని తమ బంధాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా 2014 నవంబరులో ఓ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు జంటగా హాజరయ్యారు. ఫ్లైయింగ్ కిస్తో.. అదే ఏడాది శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్ విరాట్ చరిత్ర సృష్టించాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చింది అనుష్క.. స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత బ్యాట్ను ముద్దాడి స్టాండ్స్లో ఉన్న నిచ్చెలికి ఫ్లైయింగ్ కిస్ విసిరాడు కోహ్లి. అతడి ప్రతిభకు మెచ్చుకోలుగా.. ప్రేమకు బదులుగా లేచి నిల్చుని చిరునవ్వులు చిందించింది అనుష్క. కానీ కొంతమంది ఆకతాయిలు వారి ప్రేమను అపహాస్యం చేసే విధంగా.. అనుష్కను దారుణంగా నిందిస్తూ ట్రోల్ చేశారు. అయితే, కోహ్లి ఆమెకు అండగా నిలబడ్డాడు. తనలో సానుకూల దృక్పథం పెంపొందడానికి కారణం ఆమేనంటూ ప్రేమను చాటుకున్నాడు. ఎంగేజ్మెంట్.. పెళ్లి 2016లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన కథనాలను ఇద్దరూ ఖండించారు. దీంతో విరుష్క ఫ్యాన్స్లో గందరగోళం నెలకొంది. అయితే వారి అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు కోహ్లి. 2017లో అనుష్కతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ నీతో ఉన్న ప్రతిరోజూ వాలైంటైన్ డేనే అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. అదే ఏడాది డిసెంబరులో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేసుకుందీ స్టార్ జంట. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు విరుష్క. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో కుమార్తె వామిక జన్మించింది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా.. ఎన్హెచ్ 10 సినిమాతో నిర్మాతగా మారింది అనుష్క. ఆ సినిమాలో ఆమెదే లీడ్ రోల్. అనూహ్య పరిస్థితుల్లో అన్యాయంగా తన భర్తను, ఓ ప్రేమజంటను పొట్టనబెట్టుకున్న దుర్మార్గులకు శిక్ష విధించిన ఆధునిక స్త్రీగా ఆమె నటన అమోఘం. సినిమా చూసి మరోసారి ఫిదా అయ్యాడు కోహ్లి. నా అనుష్క నన్ను గర్వపడేలా చేసిందంటూ కితాబులిచ్చాడు. అనుష్క కూడా అంతే.. తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఎల్లప్పుడూ భర్త వెంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన కెరీర్లో ఎత్తుపళ్లాలు.. ముఖ్యంగా గత మూడేళ్లలో నిలకడలేమి ఫామ్, కెప్టెన్సీ కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమర్శల పాలైన కోహ్లికి ఆమె ధైర్యాన్నిచ్చింది. తిరిగి ఫామ్ పొందడం, ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కోహ్లి.. తన సెంచరీని అనుష్కకు అంకితమిస్తూ.. తన జీవితంలో ఆమె పాత్ర, ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పాడు. ఇలా ఈ స్టార్ జంట ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ యువ జంటకు ఆదర్శంగా ఉంటోంది. (నవంబరు 5 కోహ్లి పుట్టినరోజు సందర్భంగా) - సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Virat Kohli Birthday Special: 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు..
విరాట్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని తట్టుకొని నిలబడేవాడు జీవితంలో గొప్పవాడు అవుతాడు. కోహ్లికి అందుకు చక్కటి ఉదాహరణ. కోహ్లి 33 నుంచి 34వ పడిలోకి అడుగుపెట్టే కాలంలో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇంతకముందు చాలా ఎదురుదెబ్బలు తగిలినప్పటికి అవన్నీ అతని బ్యాటింగ్ మూలంగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ గతేడాది మాత్రం కోహ్లి కెరీర్ను పాతాళంలో పడేసింది. ఒకవైపు కెప్టెన్సీ నుంచి తొలగింపు అనుకుంటే.. మరోవైపు పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక జట్టు నుంచి కోహ్లిని తీసేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే బౌన్స్ బ్యాక్ అయిన తీరు.. ఇవాళ టి20 ప్రపంచకప్లో కోహ్లి ఆడుతున్న తీరు చూడముచ్చటగా ఉంది. అయితే కోహ్లి కెరీర్లో చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్లు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏది అని చెప్పడం కష్టమే. కానీ మాకు తెలిసినంతవరకు ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు ఇన్నింగ్స్లు మాత్రం కోహ్లి కెరీర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకంటే అతను ఫామ్లో ఉన్నప్పుడు పరుగులు సాధిస్తే పెద్ద విషయం కాదు. జట్టు కష్టాల్లో ఉన,్నప్పుడు లేదంటే తాను ఫామ్ కోల్పోయి తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన ఇన్నింగ్స్లు అతని విలువను చూపిస్తాయని అంటారు. అందుకే కోహ్లి కెరీర్లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు ఏంటంటే.. 2016 ఆసియా కప్లో పాకిస్తాన్పై 49 పరుగులు ► 2016 ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా విజయంలో కోహ్లిదే కీలకపాత్ర. 84 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా మహ్మద్ ఆమిర్ దెబ్బకు 8 పరుగులకే మూడు వికెట్లు తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాటింగ్లో చూపిన తెగువ మరిచిపోలేనిది. కత్తుల్లా దూసుకొస్తున్న బంతులను ఓపికగా ఆడుతూ 51 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఆరోజు ఆడకపోయుంటే టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ కోహ్లి ఇచ్చిన ఉత్సాహంతో యువరాజ్(14 నాటౌట్), ఎంఎస్ ధోని(7 నాటౌట్) టీమిండియాను గెలిపించారు. 82 పరుగులు నాటౌట్ Vs పాకిస్తాన్, 2022 టి20 ప్రపంచకప్ ► టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ విరాట్ కోహ్లి కెరీర్లోనే కాదు.. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటిగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఇన్నింగ్స్తోనే కోహ్లిని GOATగా అభివర్ణించడం మొదలుపెట్టారు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్లో ఆఖర్లో కోహ్లి కొట్టిన రెండు సిక్సర్లు ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచాయి. మెల్బోర్న్ గ్రౌండ్లో 90 వేల మంది సమక్షంలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్లముందు ఉంది. టీమిండియాను గెలిపించిన తర్వాత కోహ్లి ఆకాశంలోకి చూస్తూ కన్నీటి పర్యంతం అవడం అతని మనసులో ఎన్నాళ్ల నుంచి ఎంత బాధ దాగుందనేది అర్థమయింది. 122 పరుగులు నాటౌట్ Vs అఫ్గానిస్తాన్, ఆసియా కప్ 2022 ► అఫ్గానిస్తాన్తో మ్యాచ్ వరకు కోహ్లిపై విమర్శలు దారుణంగా వచ్చాయి. కోహ్లి పని అయిపోయిందని.. తనను పక్కనబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొనడం కోహ్లి అభిమానులతో పాటు సగటు వ్యక్తిని బాధపడేలా చేసింది. కానీ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు నాటౌట్గా నిలిచాడు. దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 71వ సెంచరీ సాధించాడు. ఎంత కాదన్నా కోహ్లి కెరీర్లో మాత్రం ఈ ఇన్నింగ్స్ ది బెస్ట్గా నిలిచిపోతుంది. 79 Vs పాకిస్తాన్, 2019 వన్డే వరల్డ్కప్ ► 2019 వన్డే వరల్డ్కప్లో కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. వరుసగా ఐదు హాప్ సెంచరీలతో దుమ్మురేపాడు. అందులో భాగంగానే పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి రోహిత్ శర్మకు సపోర్ట్ ఇస్తూ ఆడిన 79 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ మరిచిపోలేము. ఈ మ్యాచ్లో రోహిత్ 140 పరుగులతో విధ్వంసం సృష్టించినప్పటికి కోహ్లి సుడిగాలి ఇన్నింగ్స్ ఫ్యాన్స్కు బాగా అలరించింది. 94 Vs వెస్టిండీస్, 2019 ► 2019లో వెస్టిండీస్తో మ్యాచ్లో కోహ్లి 94 పరుగులు ఇన్నింగ్స్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. 208 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా తడబడిన సమయంలో కోహ్లి ఆదుకున్నాడు. విజయానికి 119 పరుగులు అవసరమైన దశలో 94 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. చదవండి: 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
Virat Kohli Photos: కింగ్ కోహ్లి (ఫొటోలు)
-
'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం
విరాట్ కోహ్లి.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లి.. ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలియదు కానీ.. కోహ్లి లాంటి శిఖరం మాత్రం ఎన్నటికి కరగడు. వయస్సు పెరిగేకొద్ది తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తనని విమర్శించిన నోళ్లే ఇవాళ మెచ్చుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా తరపున కోహ్లి టాప్ స్కోరర్గా ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న కోహ్లి.. మరోసారి టి20 ప్రపంచకప్ అందించాలని ఉవ్విళ్లురుతున్నాడు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడేవాడు గొప్ప వ్యక్తి అవుతాడు అని తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. తనను GOAT అని పిలుస్తున్నా వాళ్లకు అలా పిలవొద్దని.. అందుకు నేను అర్హుడిని కాదంటూ పేర్కొని తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడు GOATగానే ఉంటావు కోహ్లి. క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు పొందిన కోహ్లి ఇవాళ 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లికి Happy Birthday. 15 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు కోహ్లి.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్కి కెప్టెన్గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరీర్ ని మలుపుతిప్పింది. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో వంద పరుగులు సాధించిన తర్వాత, కోహ్లి టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు.సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్డే క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కోహ్లి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తన ప్రతిభ చాటుతూ ఎంఎస్ ధోని తరువాత భారత క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అతని సారధ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేదన్న అపవాదు తప్ప కెప్టెన్గా ఎన్నో సాధించాడు. 2019 వన్డే వరల్డ్కప్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు టి20 వరల్డ్కప్లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (40 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్... బీసీసీఐతో విభేదాలతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గతేడాది టి20 ప్రపంచకప్లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ పదవులు కూడా ఊడిపోయాయి. దీనికి తోడూ ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి బ్యాట్ ఒక్కసారిగా మూగపోయింది. దాదాపు కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇక కోహ్లి పని అయిపోయింది అన్న తరుణంలో బౌన్స్ బ్యాక్ అయిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆసియా కప్లో అఫ్గానిస్తాన్పై సెంచరీతో మెరిసినప్పటికి చిన్న జట్టు కదా ఇది మాములే అనుకున్నారు. కానీ కోహ్లి కెరీర్ ఇక్కడి నుంచి మరో మలుపు తీసుకుంది. తాను ఫామ్లోకి వచ్చానంటే నమ్మనివాళ్లు నమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు కోహ్లి. అందుకు సాక్ష్యం టి20 వరల్డ్కప్ 2022. ఈసారి కప్ గెలవడానికే ఆడుతున్నాడా అన్నట్లుగా కోహ్లి ఇన్నింగ్స్లు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచకప్లో టీమిండియా తరపున లీడింగ్ రన్స్కోరర్గా ఉన్న కోహ్లి విలువ గురించి చెప్పడానికి పాకిస్థాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లి. హారిస్ రవూఫ్ బౌలింగ్ లో ఆఖర్లో కొట్టిన రెండు సిక్సర్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాలు తెగే టెన్షన్ లో కూడా ఎంతో కూల్ గా టీమిండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకే సాధ్యమవుతుంది. ఇక, ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే పేరు విరాట్ కోహ్లి. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతీ దేశం కలలు కంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్లో ఆఫ్ఘాన్పై టీ20 సెంచరీ బాది... మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. ఈ దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్తో ఐసీసీ ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు గెలిచాడు... 2016 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. Hobart saw one of the great ODI centuries back in 2012 as Virat Kohli - who turns 3️⃣4️⃣ today - produced a truly remarkable innings 🤯 pic.twitter.com/CJBKdnEop0 — cricket.com.au (@cricketcomau) November 5, 2022 ✅ The sixth-highest run-scorer in international cricket ✅ 71 internationals 💯s, joint-second with Ricky Ponting ✅ India's most successful Test captain ✅ Most runs in T20Is and T20 World Cups #OnThisDay A happy 34th birthday to Virat Kohli, a modern batting giant ✨🎉 pic.twitter.com/bYW3q4zGr2 — ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2022 Happy Birthday Virat Kohli on the big screen.#ViratKohli𓃵 #HappyBirthdayViratKohli pic.twitter.com/jIFxMNslSe — Virat Kohli Fan Club (@Trend_VKohli) November 4, 2022 చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు.. -
అమలా పాల్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్..
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇవాళ(అక్టోబర్ 11న) 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. టీమిండియాతో కలిసి పాండ్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే పుట్టినరోజునాడే హార్దిక్ పాండ్యా ఎమెషనల్ అయ్యాడు. అందుకు కారణం తన కొడుకు అగస్త్యను మిస్ అవడమేనట. బర్త్డే వేడుకలు ఫ్యామిలీ సమక్షంలో జరగనందుకు కాస్త బాధ ఉందని.. అయితే దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టేస్తానని పేర్కొన్నాడు. కాగా ట్విటర్ వేదికగా తన కొడుకు అగస్త్యతో ఉన్న అనుబంధాన్ని హార్దిక్ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ''నా పుట్టినరోజున అగస్త్యను చాలా మిస్సవుతున్నా.. వాడు నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టి20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీమిండియా నిఖార్సయిన ఆల్రౌండర్గా ఎదిగిన పాండ్యా..టి20 ప్రపంచకప్లో కీలకపాత్ర పోషించనున్నాడు. జట్టులో ఐదో బౌలర్ రోల్తో పాటు చివర్లో దినేష్కార్తీక్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేసే బాధ్యత హార్దిక్ పాండ్యాపైన ఉంది. వెన్నునొప్పి, ఫేలవ ఫామ్తో టీమిండియాలో స్థానం కోల్పోయిన పాండ్యా సర్జరీ తర్వాత ఐపీఎల్ 2022లో రీఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ వ్యవహరించి తొలి సీజన్లోనే ఆ జట్టును ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా నడిపించడంతో పాటు ఆల్రౌండర్గానూ రాణించాడు. Missing my boy a little bit more on my birthday ❤️ The best gift I've received 😘🥰🤗 pic.twitter.com/So6ddl4d4q — hardik pandya (@hardikpandya7) October 11, 2022 -
'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు'
టీమిండియాలోకి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు వచ్చి వెళ్లారు. కొందరు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంతమంది మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్రికెట్ను అమితంగా అభిమానించే మన దేశంలో టాప్ క్లాస్ బౌలర్లుగా వెలుగొందిన వారిలో స్పిన్నర్లే ఎక్కువ. స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించినప్పటికి ఒక తరానికి ఒక్కో ఫాస్ట్ బౌలర్ భారత్ పేస్ దళాన్ని నడిపించారు. 1970,80వ దశకంలో కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆల్రౌండర్.. ఇక 90వ దశకంలో జగవల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి పేసర్లు టీమిండియాను నడిపించారు. ఇక మిలీనియం ఆరంభంలో టీమిండియాలోకి కొత్త బౌలర్ వచ్చాడు. మొదట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి గంగూలీ అండతో వరుసగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు టీమిండియా బౌలింగ్లో పెద్దన్న పాత్ర పోషించాడు. అతనే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. క్రికెట్పై ఉన్న అభిరుచి అతన్ని ఇంజనీర్ నుంచి క్రికెటర్గా మార్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మాజీ లెఫ్టార్మ్ పేసర్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని జట్టు 2011 వన్డే వరల్డ్కప్ ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. యువతకు రోల్ మోడల్, ఫాస్ట్ బౌలర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో తనదైన ముద్ర వేశాడు. భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. ఇవాళ(అక్టోబర్ 8న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంజనీర్ నుంచి క్రికెటర్గా.. జహీర్ ఖాన్ క్రికెటర్ గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జహీర్ 1978 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని శ్రీరాంపూర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అతను టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. తన ప్రారంభ విద్యను శ్రీరాంపూర్లోని హింద్ సేవా మండల్ న్యూ మరాఠీ ప్రాథమిక పాఠశాలలో.. ఆ తర్వాత కేజే సోమయ్య సెకండరీ పాఠశాలలో చదివాడు. తదనంతరం జహీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. జహీర్కు క్రికెట్పై ఉన్న మక్కువ చూసి అతని తండ్రి ఫాస్ట్ బౌలర్గా మారమని సలహా ఇచ్చాడు. ''దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్గా తయారయ్యి టీమిండియాకు సేవలందించు అని జహీర్ తండ్రి పేర్కొన్నాడు. తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకున్న జహీర్ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జహీర్ 'జకాస్' అయ్యాడు.. జహీర్ ఖాన్ను క్రికెటర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో అతని తండ్రి ముంబైకి తీసుకొచ్చాడు. ఇక్కడే జహీర్ ఖాన్ 'జాక్' పేరుతో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. జింఖానా క్లబ్తో జరిగిన మ్యాచ్లో జహీర్ ఏడు వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడే జహీర్ ఖాన్ MRF పేస్ ఫౌండేషన్కు చెందిన టీఏ శేఖర్ దృష్టిలో పడ్డాడు. తన వెంట జహీర్ను చెన్నైకి తీసుకెళ్లాడు. జహీర్ ఫస్ట్ క్లాస్, ఆపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టగలిగాడు. 2011 ప్రపంచ కప్ హీరోగా.. అలాగే, 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్ను గెలవడానికి జహీర్ ఖాన్ కూడా ప్రధాన కారణం. 2011 ప్రపంచకప్లో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్లో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో జహీర్ పేరిట మొత్తం 44 వికెట్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో జహీర్ 610 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లు..వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టిన జహీర్ 17 టి20లు ఆడి 17 వికెట్లు తీశాడు. ✅ The second-highest wicket-taker in international cricket among Indian pace bowlers ✅ India's joint-highest wicket-taker in ODI World Cups#OnThisDay A happy 44th birthday to Zaheer Khan, the pace spearhead who starred in 🇮🇳's 2011 World Cup triumph 🥳 — ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2022 3⃣0⃣9⃣ international games 👍 6⃣1⃣0⃣ international wickets 👌 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆 Birthday wishes to the former #TeamIndia speedster @ImZaheer. 🎂 👏 pic.twitter.com/a2ta0LtgWg — BCCI (@BCCI) October 8, 2022 Celebrating Zaheer Khan's birthday 🎊 He was the joint-highest wicket-taker in the 2011 @cricketworldcup, picking up 21 in nine matches at 18.76 👏 WATCH his every wicket from the tournament 📽️ #BowlersMonth pic.twitter.com/Xifpd8UYna — ICC (@ICC) October 7, 2020