
మెగా ఫ్యామిలీ ఈసారి న్యూఇయర్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకున్నారు.

మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చుయరీలో సఫారీ చేశారు.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జంటతో పాటు నిహారిక కొణిదెల, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారు.

అక్కడి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు.

ఈ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు వాళ్లు ఫోటోలు దిగారు.

వీటిని లావణ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ త్రిపేశ్వర్ జంగల్.. జీవిత మనుగడకు సంబంధించిన సారాంశాన్ని నేర్పింది.

అడవిలో పులి కదులుతూ ఉంటే నేను కూడా నా దారిలో నిర్భయంగా ముందుకుసాగాలని తెలుసుకున్నాను.

ఒక ఆడపులిలా ఈ ఏడాదిలోకి నిర్భయంగా అడుగుపెడుతున్నా అని రాసుకొచ్చింది.
