
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులతో నీతా అంబానీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొన్నారు.

వ్యాపారవేత్త భరత్ జె మెహ్రాతోపాటు నీతా అంబానీ, కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీ మామ అజయ్ పిరమల్ వేడుకల్లో కనిపించారు.

వేడుకలో నీతా అంబానీ సొగసైన వెండి గౌనులో అద్భుతంగా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఆభరణాలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి.

ఆకాష్, అనంత్ అంబానీ సోదరులిద్దరూ స్టైలిష్ ఆల్ బ్లాక్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు.
