Celebrate
-
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
-
ఆ్రస్టేలియాలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబురాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎల్లలు దాటి వచ్చినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాసులు కాపాడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, తెలుగు పారిశ్రామికవేత్తలు తమ తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారమందించాలని కోరారు. -
అంబానీ ఫ్యామిలీ న్యూ ఇయిర్ వేడుకలు.. సన్నిహితులతో సందడి (ఫోటోలు)
-
దుల్కర్ సల్మాన్ - అమల్ సూఫియాల బంధానికి 13ఏళ్లు (ఫోటోలు)
-
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
YS జగన్ బర్త్ డే వేడుకలో అంబటి రాంబాబు
-
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్లైనర్ రాకెట్లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్కతా (పశ్చిమ బెంగాల్)కోల్కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
Cotton Day : పత్తి ఉత్పత్తుల ప్రాముఖ్యత తెలిపేందుకు..
పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు. ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు -
Translation Day: ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తూ..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.బైబిల్ను లాటిన్లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్ను లాటిన్లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్ఐటీ) ప్రారంభించింది.ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్పియర్, టాల్స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయ రగడ
-
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కర్నాటకలోని ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈరోజు (మంగళవారం) కూడా కొనసాగుతున్నాయి. యూపీలోని మధురలో నిన్న(సోమవారం) రాత్రి అత్యంత వేడుకగా శ్రీకృష్ణునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. Shri Krishna Matha, Udupi 🙏#KrishnaJanmashtami pic.twitter.com/IBmWwwCudS— Visit Udupi (@VisitUdupi) August 26, 2024ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో నేడు శ్రీకృష్ణ లీలోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ కృష్ణ భక్తులు ఇప్పటికే ఉడుపికి తరలివచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజున పలువురు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో ఆలయంలో కనువిందు చేశారు. అలాగే రోజంతా స్వామివారి సమక్షంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.#WATCH | Mathura, Uttar Pradesh: Aarti begins at Shri Krishna Janmasthan temple at the time of Shri Krishna Janma as the clock hits midnight pic.twitter.com/i80lWyaGb3— ANI (@ANI) August 26, 2024నేడు జరిగే శ్రీకృష్ణుని లీలోత్సవంలో బంగారు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మఠంలో భక్తులకు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే వివిధ పోటీలను నిర్వహించనున్నారు.#WATCH | Manipur | Shri Krishn Janmashtami being celebrated at Shree Shree Govindajee Temple, in Imphal pic.twitter.com/nQXk2aGK3b— ANI (@ANI) August 26, 2024ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి గోవిందరాజ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జన్మాష్టమి వేడులను నిర్వహిస్తున్నారు. -
రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!
దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. -
ఆ గ్రామంలో రెండు రోజుల పాటు రక్షాబంధన్
దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు. -
26న కార్గిల్కు ప్రధాని మోదీ.. భారత విజయ రజితోత్సవాలకు హాజరు
పాకిస్తాన్తో 1999లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. తాజాగా లధాక్ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా ప్రధాని పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాలను పరిశీలించారు.భారత విజయ రజితోత్సవాల సందర్భంగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్లో జూలై 24 నుంచి 26 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్ను సందర్శిస్తారని, కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ద్రాస్ హెలిప్యాడ్ వద్ద భద్రత, స్వాగతం, మోదీ కాన్వాయ్కు అవసరమైన ఏర్పాట్లు, స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించే విధానం తదితర కార్యక్రమాల సన్నాహాలపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని, ఆ తర్వాత షహీద్ మార్గ్(వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని ఆయన తెలిపారు. -
సంక్రాంతి సంబురాల్లో మెగా ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
-
వెకేషన్ కోసం బెస్ట్ ప్లేసులు ఇవే..
-
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
రాజకీయ విభేదాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే
ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు. రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్ పవార్కు అజిత్ పవార్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా? -
VarunLav Diwali Bash: పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి.. జంటగా సెలబ్రేట్ చేసుకున్న వరుణ్-లావణ్య (ఫోటోలు)
-
దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
దసరా సంబరాలు. ఊరు, వాడ, పల్లే, పట్టణం అనే తారతమ్యం లేకుండా అంబరాన్నంటాయి. భారత్లోని నలుమూల ప్రాంతాలు దసరా ఉత్సవాలతో మునిగితేలుతుంటే ఓ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది వ్యవహారమూ కాదండోయ్. వందేళ్లుగా దసరా వేడుకలు జరగడం లేదీ గ్రామంలో. పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటారు ఎక్కడకి వెళ్లరు. ఎందుకిలా? అనుకుంటున్నారా? మంచి కారణమే ఉంది. తెలిస్తే మీరూ బాధపడే అవకాశమూ ఉంది. ఆ గ్రామ ప్రజల మనసెంత గొప్పదో కదా అనుకోకుండానూ ఉండలేరు. ఆ గ్రామం పేరు గగోల్. ఉండేది ఉత్తర ప్రదేశ్లో. మీరట్ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనిదీ పల్లె. ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటిగడప దాటరు. నోరూ మెదపరు. మౌనంగా బాధను అనుభవిస్తున్నట్లు ఉంటారు. ఈ వింత పోకడలన్నీ ఎందుకంటే....ఎప్పుడో... 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని బ్రిటిష్ పాలకులు ఉరితీసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని... ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. వివరాలేమిటంటే.... భారతదేశ చరిత్ర ఓ ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటీష్ వలసవాద విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేసినప్పటికీ ఎందరికో స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చేలా చైతన్యపరిచింది. వారిలోని దేశభక్తిని మేల్కొల్పి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన గొప్ప ఘటం అది. ఐతే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని భారత్లో పలు చోట్ల బ్రిటీషర్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి. వీరిలో గగోల్ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. ఆ గగోల్ గ్రామం చుట్టపక్కల గ్రామాలైన మురాద్నగర్, నూర్నగర్, ప్రాంతవాసులు ఝండాసింగ్ సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో బ్రిటీష్ వాళ్లు ఆ గ్రామస్తులపై దాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మీరట్ నగరానికి చెందిన కొత్వాల్ బిషన్ సింగ్ సాయం తీసుకున్నారు. అతను ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఫలితం... ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు. కానీ గ్రామాలను ధ్వంసమైపోయాయి. దీంతో ఝుండా సింగ్ పారిపోక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతడు బ్రిటిష్ వారి చేతిలోనే హతమయ్యాడు. కానీ హింస అక్కడితో ఆగలేదు. ఝండాసింగ్ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు తొమ్మిది మందిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడమే కాకుండా.. వారికి మరణదండన కూడా విధించారు. 1857 దసరా రోజున ఆ తొమ్మిది మందిని ఉరితీశారు. ఆ వీరుల పేర్లు రామ్ సహాయ్, ఘసితా సింగ్, రమణ్ సింగ్, హర్జాస్ సింగ్, హిమ్మత్ సింగ్, కధేరా సింగ్, శిబ్బా సింగ్, బైరామ్, దర్బాసింగ్ తదితరులు. ఈ తొమ్మిదిమంది జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన మర్రి చెట్టు కింద సమాధులు నిర్మించారు గ్రామస్తులు. ఏటా దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు. ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు దాదాపు 156 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం కోసం పాటుపడి, ఆ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ మౌనం పాటిస్తున్న ఆ గ్రామ ప్రజలు నిజంగా వందనీయులు. ఆ గ్రామ ప్రజలకు దేశం పట్ల, స్వతంత్రం కోసం ప్రాణాలొదిలిని అమరవీరుల యందు కనబరుస్తున్న గౌరవానికి, ప్రేమకు ఫిదా కావల్సిందే కదూ. (చదవండి: ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..
చాలామంది తమ వివాహాన్ని చాలా డిఫెరెంట్గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు. పైగా ఆ పిచ్చితో ఎంతటి సాహాసానికైనా రెడీ అవుతున్నారు కూడా. అలానే ఇక్కడొ కొత్త జంట తమ వివాహ వేడుకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకోసం వారి చేసిన సాహసం వింటే వామ్మో! అనకుండ ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇక అంతే సంగతులు. ఇంతకీ వారేం చేశారంటే.. ప్రిసిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి రోజు ఎప్పటికీ తమకు గుర్తుండిపోయేలా స్వీట్ మెమరీలా ఉండాలని ఓ భయానక సాహాసానికి ఒడిగట్టారు. పెళ్లి అయిన తదనంతరమే ఈ సాహాసానికి దిగారు. వివాహ వేడుకకు విచ్చేసిన బంధువుల సమక్షంలోనే ఈ సాహసానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆ ఇద్దరూ స్కైడైవింగ్ చేస్తూ.. ఆనందంగా తమ వివాహ రోజుని జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమే ఆ జంట నిపుణుల పర్యవేక్షణలో కొండ అంచున నిలబడి దిగ్విజయంగా స్కైడైవింగ్ చేసేందుఉ రెడీ అయ్యారు. గుండెల పగిలే ఉత్కంఠ మధ్య ఆ దంపతులు గాల్లో చక్కర్లు కొడుతూ తమ వివాహాన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ జంట 'అతి' చేస్తున్నారని విమర్శించగా మరికొందరూ మాత్రం నేను నా పెళ్లి టైంలో ఇలాగే చేస్తా.. అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) (చదవండి: 'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!) -
జీ5 ఐదో వార్షికోత్సవం.. వేదికపై మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు
జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది రియల్ ఎస్టేట్ రికార్డులు.. 111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది. లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. చాలా ఏళ్లుగా పోరాటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సంబరాలు మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే.. -
కోడి పందేలను తిలకించిన రాంగోపాల్ వర్మ
-
శిల్పారామంలో సంక్రాంతి సందడి
-
ఘనంగా మావుళ్ళమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు
-
ఆ మూడు గ్రామాల్లో దసరా జరుపుకోరు...రావణుడే వారి దేవుడు
దసరా ఉత్సవాలను యావత్ భారతదేశం అంగ రంగ వైభవంగా జరుపుకుంటోంది. అలాగే దసరా అనగానే గుర్తుకొచ్చేది రావణ దహనం. ఈ విజయదశమి రోజునే రాముడు రావణుడిని చంపి విజయం సాధించినట్లుగా పురాణాల కథనం. అలాగే పాండవుల రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసం చేయాల్సి రావడంతో... జమ్మి చెట్టును పూజించి అక్కడే తమ ఆయుధాలను దాచినట్లు మహభారతగాథ తెలుపుతోంది. ఆనాటి నుంచి దసరా చివరి రోజు అనగా విజయదశమి రోజున రావణ దహనం చేయడం, జమ్మి చెట్టును పూజించడం వంటివి అనాదిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ మూడు గ్రామాల వారు దసరానే జరుపుకోరు, పైగా రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారట. అంతేగాదు వారికి రావణుడే ఆరాధ్య దేవుడు. ఇంతకీ ఏంటా గ్రామాలు? ఎందుకు చేసుకోరో తెలుసుకుందామా!. 'రావణ' పేరుతో గ్రామం ఉత్తరప్రేదేశ్లోని, బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాలు రావణ దహనం చేయరు, అలా చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రేదేశ్లోని బాగాపత్ జిల్లాలో బరాగావ్ గ్రామం ఉంది. ఆ గ్రామవాసులు రావణుడిని దైవంగా భావిస్తారు. ఈ గ్రామాన్ని "రావణుడు" అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం....రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు కథనం. ఐతే ఆ శక్తిని రావణుడు భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి గౌరి శంకర్ పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారు. రావణడు జన్మించిన గ్రామం అలాగే ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా బరాగావ్ గ్రామ వాసుల మాదిరిగానే దసరాను జరుపుకోరు. ఐతే ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఒప్పుకోరట. పురాణల ప్రకారం... విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్లో జరిగింది. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం 'మహంత్ని' రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామా నివాసి రామదాస్ చెబుతున్నారు. తమ గ్రామం రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతోందన్నారు. అలాగే రావణుడు తండ్రి విశ్రవస్ వల్ల తమ గ్రామానికి పేరు వచ్చిందని తాము విశ్వాసిస్తామని చెప్పారు. అందుకు గర్విస్తున్నామని కూడా చెబుతున్నారు. రావణుడంత తెలివి, భక్తి కావాలని.... మహారాష్ట్రాలోని అకోలా జిల్లాలోని సంగోలా గ్రామం రావణుడిని తమ ఆరాధ్యం దైవంగా కొలుస్తోంది. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము జీవనోపాధిని పొందుతున్నట్లు నమ్ముతారు. అంతేగాదు రావణుడి వల్లే తమ గ్రామం శాంతి సౌఖ్యాలతో ఉన్నట్లు గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 300 ఏళ్లుగా ఆ గ్రామంలో రావణుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నివాసితులు చెబుతున్నారు. పైగా రావణుడి అంత తెలివి, భక్తి పెంపొందాలని పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Dussehra 2022: పాలయమాం దేవీ!) -
ఆగస్టు 31ని పండగలా జరుపుకుంటున్న తాలిబన్లు... అంబరాన్నంటిన సంబరాలు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్. ఈ విధ్యంసకర దాడికి ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్ తన బలగాలను అప్గనిస్తాన్ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
పార్శీల ‘నవ్రోజ్’ నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్లాక్.. వీడియో వైరల్
Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Viral: టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, యాంకరింగ్తోపాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనసూయ. గ్లామరస్ ఫొటోలతోపాటు కుటుంబంతో ఆడిపాడే క్షణాలు పోస్ట్ల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది రంగమ్మత్త. తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో బీచ్లో సందడి చేసిన వీడియోను షేర్ చేసింది. అనసూయ, సుశాంక్ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్లాక్, రొమాంటిక్ ఫొజులతో ఈ వీడియో నిండిపోయింది. తమ 12వ వెడ్డింగ్ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది అనసూయ. ఈ వీడియో షేర్ చేస్తూ 'ప్రియమైన నిక్కూ.. మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్ నా పక్కనే ఉంటే చాలు ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అని రాసుకొచ్చింది. చదవండి: మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అనసూయ, సుశాంక్ల మధ్య పరిచయం ఏర్పడి 21 సంవత్సరాలు అయింది. 9 ఏళ్ల డేటింగ్ అనంతరం అనసూయ, సుశాంక్ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. -
100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?
Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్కి అతిపెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్. అది ఎలా అంటే.. ఒక బర్గర్, ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేసింది అలియా భట్. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్లో గురువారం (మార్చి 10) షేర్ చేసింది. ఈ పోస్ట్లో '100 కోట్ల మార్క్ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి, వేగన్ బర్గర్ + ఫ్రైతో అలియాకు శుభాకాంక్షలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అని క్యాప్షన్ రాసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
Celebrate Your Unique Talent Day: టాలెంట్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉండాలే కానీ మన క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు టాలెంట్, ప్రతిభ లేదా దిమాక్ ఇవి వుంటే చాలు మనకు మనమే తోపులం. మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్గా ఉండాలి. మనలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే అంటోంది సాక్షి. ఇది మీకు తెలుసా? టాలెంట్ అంటే ఒకప్పుడు బరువుకి మెజర్మెంట్గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్లో టాలెంట్ అంటే దాదాపు 55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట. -
లాస్ఏంజెల్స్లో ఆస్కార్ వేడుక
-
ఎలైట్.. ఎంజాయ్..
-
తలైవా అంటే.. అంతే మరి!
-
పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
పోలీసు చావుతో పండగ.. నాయకుడు అరెస్టు
ఫ్రాన్స్ : ఓ పోలీసు అధికారి వీర మరణాన్ని తనకు పండుగ మాదిరిగా ప్రచారం చేసిన రాజకీయ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్లోని రెన్నెస్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంతమంది పౌరులను బంధీలుగా పట్టుకున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు లెఫ్టినెంట్ కల్నల్ అర్నాడ్ బెల్ట్రామే అనే అధికారి ధైర్యంగా పోరాడాడు. అయితే, ప్రమాదవశాత్తు అతడు ఉగ్రవాది తుటాకు బలై వీరమరణం పొందాడు. అతడిని వీర జవానుగా అక్కడి వారంతా పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా స్టెపనే పౌసియర్ అనే లెఫ్ట్వింగ్ ఫ్రెంచ్ నాయకుడు మాత్రం ట్విటర్లో భిన్నంగా స్పందించి పోలీసులకు బుక్కయ్యాడు. ‘ఎప్పుడు ఓ పోలీసు అధికారి చనిపోయినా.. అన్యాయంగా పోలీసుల చేతిలో బలైన నా స్నేహితుడు రెమి ప్రైసీ గురించే ఆలోచిస్తాను.. ఈ సారి కల్నల్ వంతొచ్చింది. గొప్ప విషయం అందుకు మరింత అదనం. ఇది మరో ఓటు తగ్గడము మాత్రమే’ అంటూ హేళనగా ఆయన ట్విటర్లో కామెంట్ చేశారు. గతంలో స్టెపనే స్నేహితుడు రెమి ప్రైసీ పోలీసుల చేతిలో చనిపోయాడు. అతడు ఒక పర్యావరణ ఉద్యమకారుడు కాగా, 2014లో ఓ డ్యామ్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసే సమయంలో పోలీసులు ఫైరింగ్ చేసిన గ్రనేడ్ దాడిలో చనిపోయాడు. దీంతో తన మిత్రుడిని తలుచుకొని ప్రతి పోలీసు మరణం విని ఆనంద పడతానంటూ అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం
తాడేపల్లిగూడెం రూరల్ : గ్రామదేవతలు శనివారం సాయంత్రం ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులుగా అమ్మవారి ప్రతిరూపమైన గరగలను మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, దండగర్ర, ఎల్.అగ్రహారం గ్రామాల్లో ఊరేగించారు. శనివారం అమావాస్య కావడంతో అమ్మవార్లు ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినమైన ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం స్థానిక 6, 11 వార్డుల మధ్య వేంచేసియున్న దానేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 4వ వార్డు జీఎస్ఆర్ హైస్కూలు సమీపంలోని పుంతలో ముసలమ్మవారి ఊరేగింపు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆదివారం ఊరేగించనున్నారు. కనకవయ్యారమ్మ, వీర -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్బావ వేడుకలు
-
చెన్నైలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్బావ వేడుకలు
-
కడపలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్బావ వేడుకలు
-
తిరుపతిలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్బావ వేడుకలు
-
అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు
-
మార్కెట్లో టీచర్స్ డే ఎఫెక్ట్..!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లలో టీచర్స్ డే ఉత్సాహం నెలకొంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేషన్ రంగ షేర్లు లైమ్ లైట్లోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా లాభాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్వీ డెనిం అండ్ ఎక్స్పోర్ట్ షేర్లు 5 శాతం కరీర్ పాయింట్ 4 శాతం, ఎంటీఎడ్యుకేర్ 3.69 శాతం, లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు యూరోప్, ఆసియన్ మార్కెట్లు నష్టపోతున్నప్పటికీ దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నాటి భారీ నష్టాలనుంచి ఇవాళ రీ బౌండ్ అయ్యాయి. బ్యాంకింగ్, మీడియా రంగ షేర్ల లాభాల మద్దుతుతో సెన్సెక్స్ ఒక దశలో 100 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకంగా భావించే 9900కి పైన స్థిరంగా కొనసాగుతోంది. -
వందేళ్ల సంబురం
-
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి సందడి
-
ఆదిలాబాద్లో నాగోబా జాతర సందడి
-
ఢిల్లీలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ..
-
పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దివస్
-
సరిహద్దుల్లో జవాన్ల దీపావళి వేడుకలు
-
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్కిషోర్ఝా వరంగల్ : రూరల్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్కిషోర్ఝా ఒక ప్రకటనలో కోరారు. సోమవారం నుంచి జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఉత్సవ కమి టీ వారి పరిధిలోని స్థానిక పోలీస్స్టేష న్లకుతప్పకుండాసమాచారం అందించాలన్నారు. పట్టణాల్లో ఉత్సవ విగ్రహాలు ఇతరుల స్థలంలో పెడితే సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అనుమతులు తీసుకుని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు తీసుకోవాలని వివరించారు. విద్యుత్, మైక్ల పర్మిషన్లు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిం చారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మండపాల వద్ద ఉత్సవ కమిటీలు పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి విగ్రహానికి సంబంధించిన ఉత్సవ కమిటీల సెల్ నంబర్లు, సభ్యుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు, వాట్సాప్, కమాండ్ కంట్రోల్ నంబర్ 85009 27777కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఉత్సవ కమిటీలు మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. -
వందేళ్ల బామ్మ సెంచరీ బర్త్డే సెలబ్రేషన్స్
-
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్కు సన్నాహాలు
-
వన మహోత్సవానికి వైవీయూ సిద్ధం
వైవీయూ: ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వైవీయూలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వైవీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో పలు ప్రాంతాలను పరిశీలించి గుంతలు తవ్వడం, కలుపు మొక్కలు తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు, ప్రిన్సిపల్ ఆచార్య సత్యనారాయణరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆచార్య రాంప్రసాద్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ మధుసూధన్రెడ్డి సమావేశమై కార్యక్రమాన్ని విజయవంతం చేసే అంశంపై చర్చించారు. గతంలో నాటిన మొక్కలను జియోట్యాగింగ్కు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థి వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
సంబరాల్లో ఫేస్బుక్
సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ మెసెంజర్ శరవేగంగా దూసుకుపోతోంది. మూడేళ్ల క్రితం లాంచ్ అయిన మెసెంజర్ యాప్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. నెలకు సగటున వందకోట్ల (ఒక బిలియన్) యూజర్లతో మరో అతపెద్ద మైలురాయిని అధిగమించింది. లాంచింగ్ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఆదరణ అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజా ఈ యాప్ లో చేరిన నెటిజన్ల సంఖ్య ఒక బిలియన్ దాటడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈస్టర్ ఎగ్, బెలూన్ ఎమోజీలను యూజర్లకు పంపిస్తోంది. దీంతో ఈ యాప్ యూజర్ల స్మార్ట్ ఫోన్ నిండా బెలూన్లతో నింపేసి యూజర్లను ఆకట్టుకుంటోంది. గత జనవరి నుంచి 200 మిలియన్ల యూజర్లు పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. ఆధునిక సమాచార అత్యుత్తమ అనుభవాలను సృష్టించడంపై దృష్టి పెట్టినట్టు ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 17 మిలియన్లకు పైగా ఫోటోలు మెసెంజర్ ద్వారా షేర్ అవుతున్నట్టు వెల్లడించారు.మెసెంజర్ యొక్క కీ మార్కెట్లలో ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా అనే ఇతర యూరోపియన్ దేశాలు ఉన్నాయని చెప్పారు. కాగా ఫేస్ బుక్ స్వాధీనం చేసుకున్న వాట్సాప్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో 100 కోట్ల యూజర్లను అధిగమించింది. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలోఒకరు ఈయాప్ ను వాడుతున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హరితవన అభివృద్ధిలో ఖాకీలు!
ముంబై ప్రజలు ట్రీ ప్లాంటేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్క్లలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు సైతం భాగస్వాములయ్యారు. నగరంలో హరిత వనాన్ని అభివృద్ధి చేసి, కాలుష్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు పాలుపంచుకున్నారు. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 కోట్ల మొక్కలను నాటాలన్న తలంపుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో తమవంతు ప్రయత్నంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసులతోపాటు, స్థానిక రాజకీయ నాయకులు, ఎన్జీవో సంస్థలు, ప్రజలు సైతం భాగం పంచుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. హరిత వనాన్ని అభివృద్ధి చేసేందుకు పోలీసులు ట్విట్టర్ ను కూడ వాడుకున్నారు. ఆయా ప్రాంతాల పోలీస్టేషన్లలో మొక్కలు నాటుతూ తీసుకున్నఫోటోలను ప్రచారంలో భాగంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యోగా!
మైసూరుః అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. స్వామీ వివేకానంద యూత్ మూవ్ మెంట్ (ఎస్వీవైఎమ్) ఆధ్వర్యంలో మైసూరులోని మెట్ గల్లీ మురికి వాడలో ఉండే ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకోసం శనివారం ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూరులో ఎస్వీవైఎమ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. 15 సంవత్సరాల యోగా శిక్షణలో అనుభవం ఉన్న రామన్న.. వారికి యోగాలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి స్థానిక వీల్ రోటరీ క్లబ్ సారధ్యం వహించగా, కార్యక్రమంలో పాల్తొన్నవారికి హోటల్ గ్రాండ్ మెర్క్యూర్.. పండ్ల రసాలు, పానీయాలను ఉచితంగా అందించింది. శరీరానికి, మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు సహకరించే యోగాను ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉందని, యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి కూడ ఎంతో సహకరిస్తుందని కార్యక్రమ నిర్వాహకులు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రెండవ ప్రపంచ యోగా దినోత్సవాన్నిగతవారం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు వివిధ ఆసనాలతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. -
మోదీ పాలన రెండేళ్ళ పండుగ!
న్యూఢిల్లీః మోదీ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న వేడుకలతో ఇండియా గేట్ ప్రాంతం సందడిగా మారింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలనే ఇతివృత్తంగా కొనసాగిన 'మేరా దేశ్ బఢ్ రహా హై... ఆగే బఢ్ రహా హై...' అంటూ సాగిన గీతం ఆహూతులను అలరించింది. 'ఏక్ నయీ సుబహ్' పేరిట నిర్వహిస్తున్న ఐదు గంటల సుదీర్ఘ మెగా ఈవెంట్ లో భాగంగా ఎన్గీఏ పాలనలోని విజయాలు, పథకాలను కేంద్రం వివరిస్తుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతం కార్యకర్తలు, అభిమానులు, ప్రేక్షకులతో కోలాహలంగా మారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'ఏక్ నయీ సుబహ్' కార్యక్రమాలు మనోరంజకంగా కొనసాగుతున్నాయి. ఐదు గంటలపాటు ఏకథాటిగా కొనసాగే కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన బేటీ బచావో, బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలపై చిన్నారులతో ముచ్చటించారు. ఐదు గంటలపాటు జరిగే విజయోత్సవ కార్యక్రమాన్ని మొత్తం పది సెగ్మెంట్లుగా విభజించారు. వీటిలో రెండేళ్ళ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, నెరవేర్చిన హామీలు, పలు పథకాలపై చర్చించేందుకు కేటాయించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు, వారితో జరిపిన ఇంటర్వ్యూలు, పథకాలవల్ల లబ్ధిపొందినవారితో చర్చలు వంటి అనేక కార్యక్రమాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాజధాని ఢిల్లీకి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం కాక, దేశంలో కేంద్ర మంత్రులు ఉన్న షిల్లాంగ్, ముంబై, విజయవాడ, జైపూర్, కర్నాల్, అహ్మదాబాద్ నగరాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం కూడ నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ లోని మంత్రులు, పలువురు సినీ తారలు, హాజరయ్యారు. -
'సంబరాలకు వారికి అవకాశం ఉండదు'
కోల్కతా: ఇటీవల 'పనామా' వివాదంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తన్న ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. వివరాలు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీకి సంబరాలు చేసుకోవడానికి ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. ఈ కేసును నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని అన్నారు. కోల్కతాలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడుతూ... కేసు విచారణలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారనే కాంగ్రెస్ వాదనను ఖండించారు. ఇది అర్థంలేని ఆరోపణ అని కొట్టి పారేశారు. పనామా వివాదంపై బహుముఖ విచారణ జరుగుతోందని, దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఆదాయపన్ను ఎగ్గొడుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగానే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
జనవరి 1 నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు
-
లాలూ ఇంట ఛట్ సందడి
-
‘ఆరెంజ్ డే’
ఒకరిది చిక్కడపల్లి.. ఇంకొకరిది కూకట్పల్లి.. మరొకరిది నాంపల్లి.. వీరంతా హైదరాబాదీలే అయినా ఒకరి అడ్రస్ ఇంకొకరికి తెలియదు. చేసే ఉద్యోగాలు వేరు.. మనస్తత్వాలూ వేరు.. అయినా వీరందరూ ఏడాదికోసారి కలుస్తారు. సరదాగా కాసేపు మస్తీ మజా చేస్తారు. ఏ రిలేషన్ లేని వీరందరినీ కలిపింది వారి బైకులే. అవును మనసుపడి కొనుక్కున్న కేటీఎం స్పోర్ట్స్ బైకులే వీరి మధ్య అనుబంధాన్ని పెంచాయి. నిత్యం సిటీరోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ బైకువీరులు ఆరెంజ్ డేను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి కూకట్పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ ప్లేస్ వేదికైంది. స్పోర్ట్స్ బైక్ అనగానే యువతకు పట్టపగ్గాలు ఉండవు. యూత్లో ఉన్న ఈ క్రేజ్ చూసే బడా కంపెనీలు రోజుకో కొత్త మోడల్ బైకులను రోడ్డుమీదికి తెస్తున్నాయి. అత్యధిక సీసీ సామర్థ్యంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్లు యువతకు ఆనందాన్ని పంచడంతో పాటు.. కాస్త అటుఇటు అయితే ప్రమాదాల్లోనూ పడేస్తున్నాయి. బైక్ నడిపే తీరు సరిగా తెలియక కొందరు, మితిమీరిన వేగంతో ఇంకొందరు ప్రమాదాల స్పీడ్ బ్రేకర్స్ దాటలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయా బైక్ల కంపెనీలు ‘కస్టమర్ల సంక్షేమమే.. సంస్థకు మహాభాగ్యం’ అంటూ రైడింగ్పై అవగాహన కల్పిస్తున్నాయి. కేటీఎం కంపెనీ శనివారం నిర్వహించిన ‘ఆరెంజ్ డే’ ఈవెంట్ అటువంటిదే. రైడింగ్ గైడ్లైన్స్.. నగరవ్యాప్తంగా ఆర్సీ 200, 200 డ్యూక్ బైక్ కలిగిన వందలాది మంది వాహన చోదకులు ఒకేచోట చేరి బైక్ రైసింగ్ విన్యాసాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది. కొత్తగా బైక్ కొన్న వారికి ట్రాక్పై బైక్ ఎలా నడపాలి, ఏ లిమిట్లో ముందుకెళ్లాలి, మైలేజ్ వచ్చేందుకు ఎంత స్పీడ్లో వెళ్లాలి, రేసింగ్ పోటీల్లో బైక్ను నడిపించాల్సిన తీరు.. తదితర చిట్కాలను ఎక్స్పర్ట్స్ ప్రాక్టికల్గా చేసి చూపించారు. గాలిలో దూసుకె ళ్తూ వెంటనే బ్రేక్ వేసి బైక్ను ఆపిన తీరు వహ్వా అనిపించింది. అనుబంధాల వేదిక.. ‘కేటీఎం ఆర్సీ 200 బైక్ ఎంతో ఇష్టపడి తీసుకున్నాను. తొలినాళ్లలో బైక్ నడపడం కాస్త కష్టమయ్యేది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ సలహాలు విన్నాక రైడింగ్ ఈజీ అయ్యింది’ అంటూ బైకర్ రమేశ్ తన అనుభవాలు పంచుకున్నారు. మరో రైడర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరెంజ్ డే వల్ల మంచి స్నేహితులు దొరికారు. రైడింగ్ టిప్స్ పంచుకోవడమే కాదు.. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే స్థాయికి మా స్నేహం పెరిగింది’ అని సంతోషంగా తెలిపారు. ‘మా కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆరెంజ్ డే ఈవెంట్ ప్లాన్ చేశాం. ఇక్కడికి వచ్చిన రైడర్లంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోవడం ఆనందాన్నిస్తోంద’ని కేటీఎం ప్రతినిధి కార్తీక్ అన్నారు. మూడేళ్ల బంధం లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికాలలోనూ ఆరేంజ్ డేలు సక్సెస్ కావడంతోనూ ఆసియాలోనూ ఈ ట్రెండ్ను పరిచయం చేసింది కేటీఎం. ఇండియాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ‘ఆరెంజ్ డే’ నిర్వహిస్తోంది. ఇందులో బైక్ రేసింగ్లో కిటుకుల్ని ఎక్స్పర్ట్స్ చేత నేర్పుతోంది. 2013లో హైదరాబాద్లో తొలిసారి ఆరెంజ్ డే పరిచయమైంది. ఏటా ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా కూకట్పల్లిలో జరిగిన ఈ ఈవెంట్లో బైకర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు. -
నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు
-
సాక్షి రూ.లక్ష విజేత గాజువాక వాసి
విశాఖపట్నం: సాక్షి-ఎస్ఆర్ షాపింగ్మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పండుగ సంబరాలు 15 రోజు డ్రాలో లక్ష రూపాయల బహుమతి గాజువాక ఎస్ఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన గాజువాకకు చెందిన సత్యనారాయణను వరించింది. డైమండ్ పార్క్ గెలాక్సీ షోరూమ్లో బుధవారం సాయంత్రం ఎల్జీ ఏరియా మేనేజర్ ఎ.మహేష్, గెలాక్సీ ఎండీ కనుమూరి హరనాథరాజు డ్రా తీసి విజేతను ఎంపిక చేశారు. గెలాక్సీ షోరూమ్ కస్టమర్లతో కన్సోలేషన్ బహుమతులకు డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎల్జీ ఏరియా మేనేజర్ మాట్లాడుతూ నాలుగేళ్లగా సాక్షి నిర్వహిస్తున్న పండగ సంబరాలకు విశేష స్పందన వస్తుందన్నారు. ఫలితంగా గెలాక్సీ విక్రయాలు బాగా పెరిగాయని చెప్పారు. గెలాక్సీ కొనుగోలు దారులకు కూడా పలు బహుమతులు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సాక్షి యాడ్స్ ఏజీఎంలు బి.రంగనాథ్, వినోద్(హైదరాబాద్), అసిస్టెంట్ మేనేజర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కస్టమర్లు ఉత్సాహం చూపారు. సాక్షి పండగ సంబరాల్లో కస్టమర్లు ఉత్సాహం చూపారు. సాక్షి పండగ సంబరాల్లో కోస్పాన్సర్గా గెలాక్సీకి అవకాశం కల్పించడం సంతోషకరం. మా కస్టమర్లు అనేక బహుమతులు గెలుచుకున్నారు. 20 ఏళ్లుగా కస్టమర్లకు నమ్మకమైన సేవలందిస్తున్నాం. -కనుమూరి హరనాథరాజు, గెలాక్సీ ఎండీ -
పండుగ వచ్చేసింది..
సాక్షి- ఎస్ఆర్ షాపింగ్ మాల్ పండుగ సంబరాలు ప్రారంభం నేడు తొలి విజేతను ఎంపిక చేయనున్న కలెక్టర్ కొనుగోలుదారులకు లక్కీ చాన్స్ రోజూ రూ.లక్ష పొందే అవకాశం మరో అయిదుగురికి ప్రత్యేక బహుమతులు బంపర్ డ్రాలో నానో కారు ప్రత్యేక డ్రాలో 2 బైకులు విశాఖపట్నం సిటీ : కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పండుగ సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రూ.లక్ష విజేత ఎంపిక బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాల గురించి తెలిసి ఉత్తరాంధ్రలోని కొనుగోలుదారులంతా రూ. లక్ష గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. మొదటి రోజు విజేతను కలెక్టర్ ఎన్.యువరాజ్ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు జగదాంబ జంక్షన్లోని ఎస్ఆర్ షాపింగ్ మాల్లో నిర్వహించే డ్రా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విజేతలను ప్రకటించనున్నారు. ఏటా సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలకు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూడేళ్లుగా బహుమతులను సొంతం చేసుకున్న వందలాది మంది డిసెంబర్ నెల ఆరంభం నుంచే ఈ సంబ రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏటా 15 రోజుల పాటు నిర్వహించే ఈ సంబరాల్లో 15 మందిని రూ. లక్షాధికారులను చేయడంతో పాటు రోజుకు మరో అయిదుగురికి కన్సొలేషన్ బహుమతులు అందించనున్నారు. భలే క్రేజ్.. మూడేళ్లుగా విజయవంతగా పండుగ సంబరాలను నిర్వహించిన సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ నిర్వహణపై కొనుగోలుదారులకు పూర్తి విశ్వాసం ఉంది. నాల్గో ఏట కూడా అదే నమ్మకంతో రూ.లక్షతో పాటు అనేక బహుమతులు అందుకునేందుకు ఎదురుచూస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలిలా ఉన్నాయి.ముందుగా ప్రకటించిన సమయానికే ప్రముఖుల సమక్షంలో డ్రా తీసి విజేతలను అక్కడికక్కడే ప్రకటించి ఫోన్లో ఆ సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేయడం. ఆరా తీస్తున్న ప్రతి సారి ఆయా షోరూంను ప్రకటించి పండుగ వాతావరణంలో విజేతలను ఎంపిక చేయడం. విజేతలను ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే అందరికీ బహుమతులను అందజేయడం. రూ. లక్ష రాలేని వారికి విలువైన పలు బహుమతులు లభ్యం కావడంతో అంతా ఆసక్తి చూపుతున్నారు. రూ. లక్ష నగదుతో పాటు బైక్లు, కారు, ఇతర బహుమతులు లభ్యం కావడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన స్పాన్సర్గా ఎస్ఆర్ షాపింగ్మాల్ వ్యవహరిస్తుండగా, అందుకు సపోర్టెడ్గా వైభవ్ జ్యూవలర్స్, పవర్డ్గా సెల్పాయింట్తో పాటు కో- స్పాన్సర్స్గా గెలాక్సీ, బాయ్లండన్, వరుణ్ మారుతి, బీఈ షాపీ, వరుణ్బజాజ్, కళ్యాణి ఫ్యామిలీ షాపీ, శ్రీశ్రీనివాసా యమహా, క్రాంతి ప్రాపర్టీస్ వంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక డ్రాలో విజేతలైన వారికి శ్రీ శ్రీనివాసా యమహా వారు యమహా ఆల్ఫా బైక్, వరుణ్ బజాజ్ వారు డిస్కవరీ-100 బైక్లను అందిస్తున్నారు. బంపర్ ప్రైై జ్ గా టాటా నానో కారును శివశంకర మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఎంటీ లిమిటెడ్ వారు అందిస్తున్నారు. గిఫ్ట్ స్పాన్సర్లుగా టీఎంసీ, బీఈ షాపీ, గాయత్రీ హోం అప్లయెన్సెస్, సెల్కాన్ మొబైల్ వారు వ్యవహరిస్తున్నారు. కొనుగోలుదారులు ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకూ పైన తెలిపిన ఏ షాపులోనైనా కొనుగోలు చేసి పొందిన కూపన్ను డ్రా బాక్సులో వేయాలి. ఏరోజుకారోజు తీసే డ్రాలో గెలుపొంది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు. -
మెరిసే.. మురిసే..
డిస్క్ జాకీ రాకింగ్ వుూ్యజిక్తో హోరెత్తిస్తుంటే... కుర్రకారు అదిరిపోయే స్టెప్పులతో దువుు్మ లేపారు. ఆపై అమ్మయిల క్యాట్ వాక్లు.. అబ్బాయిల ట్రెండీ డ్రస్లు.. మొత్తానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డేను ఏడాదంతా గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకున్నారు. కోఠి.. హోటల్ సితారా రాయుల్లో జరిగిన ఈ వేడుకలో యుువత ఆనందం అంచులు తాకింది. - సుల్తాన్బజార్ -
ప్రత్యేక ప్రార్ధనలు చేసిన పఠాన్ బ్రదర్స్
-
రంగ్ దే బసంతి
-
ఎన్డీఎంసీకి శతవసంతాలు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు (ఎన్డీఎంసీ) సోమవారంతో నూరేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆధునీకరించిన కన్నాట్ప్లేస్ మార్కెట్ను పునఃప్రారంభించడంతోపాటు షాపింగ్, ఆహార ఉత్సవాలు నిర్వహిస్తారు. కన్నాట్ప్లేస్ ఆధునీకరణ పనులను పూర్తి చేయడానికి విధించుకున్న తుదిగడువులు ఇది వరకే పలుసార్లు మీరిపోయినా, ఈసారి మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఎన్నో ఆకాశహర్మ్యాలు, షాపింగ్సెంటర్లకు నిలయమైన కన్నాట్ప్లేస్ మార్కెట్ను ఈ నెల 30న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ప్రాంత ప్రజల వినోదం కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్డీఎంసీ చైర్పర్సన్ జలజ్ శ్రీవాత్సవ తెలిపారు. నగరం నడిబొడ్డున ఉండే కన్నాట్ప్లేస్ షాపింగ్, ఆహార ఉత్సవం, సంగీత విభావరి నిర్వహిస్తామని ప్రకటించారు. న్యూఢిల్లీ వ్యాపారుల సంఘం సహకారంతో సోమవారం నుంచి రెండువారాలపాటు షాపింగ్ ఉత్సవం నిర్వహిస్తామని వివరించారు. వినియోగదారులకు ఇందులో ఆఫ ర్లు, రాయితీలు లభిస్తాయని ఎన్డీఎంసీ వర్గాలు తెలిపాయి. దీనికితోడు ఎన్డీఎంసీ సమావేశమంది రంలో ఈ నెల 27న చలనచిత్రాల ప్రదర్శన కూడా నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల వంటకాలు అందుబాటులో ఉండే ఫుడ్ ఫెస్టివల్ 23 నుంచి 29 తేదీ వరకు కొనసాగుతుంది. పాతకార్ల ర్యాలీని 29న, రెండు రోజుల తరువాత పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎబిలిటీ అన్లిమిటెడ్ బృందం సంగీత విభావరిని జనవరి 2,3 తేదీల్లో ఆస్వాదించవచ్చు. కన్నాట్ప్లేస్ మార్కెట్ ప్రారంభోత్సవంలోనూ ప్రముఖ కళాకారులు, గాయకులతో ప్రదర్శనలు ఉంటాయి. సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్తో ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్డీఎంసీ అదికారి ఒకరు తెలిపారు. కన్నాట్ప్లేస్ పునరాభివృద్ధి దాదాపు పూర్తయిందని, కొన్ని ప్రాథమిక నిర్వహణ పనులను త్వరలోనే పూర్తిగా చేస్తామని వివరణ ఇచ్చారు. దీనికి కన్సల్టెంటుగా వ్యవహరించిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) నుంచి పనులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్డీఎంసీ ప్రకటించినప్పటికీ, ఈఐఎల్ ఇప్పటికీ మరమ్మతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ మార్కెట్ నిర్వహణను చూసేందుకు ఎన్డీఎంసీ ఇటీవలే హౌస్కీపింగ్ టెండర్లనూ ఆహ్వానించింది. అయితే మార్కెట్ ప్రారంభోత్సవానికి పిలవాల్సిన ముఖ్య అతిథిని ఎన్డీఎంసీ ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నెల 30న నిర్వహించే కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు. న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, సురిందర్ సింగ్ను ఆహ్వానించేది లేనిదీ ఎన్డీఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలను తమ కౌన్సిల్ సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్డీఎంసీ కేంద్ర హోంశాఖను కోరినా దాని నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇక ఈ శతాబ్ది ఉత్సవాల్లో ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ) కూడా పాలుపంచుకుంటోంది. -
దీపావళి పండుగను జరుపుకున్న అంధపాఠశాల విద్యార్ధులు
-
మేమంతా మీ వెంటే.. జగన్ విడుదలపై అమెరికాలో సంబరాలు
సెయింట్ లూయీస్లో భారీ ర్యాలీ వైఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తరలివచ్చిన అభిమానులు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దాదాపు 16 నెలల తర్వాత బెయిల్పై విడుదల కావడంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. సెయింట్ లూయీస్లో వైఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సంబరాలు జరిగాయి. అక్కడి స్థానిక మహత్మాగాంధీ సెంటర్లో వైఎస్ అభిమాని పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీశారు. అనంతరం వైఎస్సార్ యువసేన యూఎస్ఏ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సేయింట్ లూయీస్లో సభను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రƒ శేఖర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా ప్రసంగించారు. తాము ఆది నుంచి జగన్ వెంటే ఉంటున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం సాధించే వరకు మద్దతు ఇలాగే కొనసాగాలని గడికోట ఆకాక్షించారు. ఈ సభలో పలువురు సాఫ్టవేర్ ఉద్యోగులు మాట్లాడారు. సాఫ్టవేర్ నిపుణుడు షేక్ కబీర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కిరణ్ మలుపు, సి.రంగ , శ్రీకాంత్ జొన్నల తదితర ఉద్యోగులు వైఎస్సార్ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. ప్రముఖ వైద్యుడు గొండిపల్లి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక డాక్టర్గా వైఎస్ అందించిన సేవలను కొనియాడారు. జగన్లో వైఎస్లోని కమిట్మెంట్, అంకితభావం, శ్రమించేతత్వం, విజన్ ఉందన్నారు. వైఎస్సార్ యువసేన యూఎస్ఏ కమిటీ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఈ సంబరాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించబోయే విజయాలకు ముందస్తు సంకేతమన్నారు. స్థానిక వ్యాపారవేత్త చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కుటుంబానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాటిపర్తి, బి.దినేష్, రవి ఉప్పలపాటి, విజయనాగ ఇందుకూరి, రామకృష్ణ దగ్గుమతి, సాయి తారపరెడ్డి, శివరామరాజు, మురళిరాజు గొట్టిముక్కల, లింగారెడ్డి గన్నపనేని, శ్రీను దగ్గుమతి, వెంకట్ కాట్రగడ్డ, నంద పుప్పల, వంశీరెడ్డి మోపూరు, చందు తారపరెడ్డి, కిరణ్ మలుపూరు, రవికాంత్, విజయకుమార్రెడ్డి, వేదనపతిలతో పాటు వందలాది పాలుపంచుకున్నారు. మహిళలు, పిల్లలు, జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. -
విజయం: సెలెబ్రిటీలు మెచ్చిన చెఫ్!
పూజ వ్యాపారం 200 శాతం వృద్ధి సాధించింది. అక్కడ సగం ఉత్పత్తులు ముంబై టాప్ సెలబ్రిటీల ఇళ్లకే వెళ్లిపోతాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫుడ్ రైటింగ్, ఫుడ్ ఫొటోగ్రఫీ మీద కోర్సులతో స్టూడియో 15 అనే సంస్థను కూడా ఆరంభించే ప్రయత్నంలో ఉంది పూజ. మాంద్యం రానివ్వండి. అన్ని రంగాలూ కూలిపోనివ్వండి. ఉద్యోగాలు పోనివ్వండి! కానీ ఉపాధికి, ఆదాయానికి ఢోకా లేని అంశాలు రెండుంటాయి. ఒకటి వైద్యం, ఇంకోటి తిండి! కాకపోతే మొదటి రంగం అందరినీ ఎంచుకోదు. రెండో రంగాన్ని అందరూ ఎంచుకోరు! కానీ ముంబైకి చెందిన పూజ ఢింగ్రా... సామాన్యులకు ఆసక్తి లేని రంగాన్నే ఎంచుకుంది. వండి పెట్టే నైపుణ్యం కోసం దేశాలు తిరిగింది. ప్రయోగాలు చేసింది. చివరికి విజేతగా నిలిచింది. స్ఫూర్తినిచ్చే ఈ యువ వ్యాపారవేత్త విజయగాథను తెలుసుకుందాం రండి! వస్తువుకు లగ్జరీ ఉంటుంది. మరి తిండికి లగ్జరీ ఉంటుందా? ఉంటుంది. ముంబయిలోని ‘లీ 15 ప్యాటిసెరీ’కి వెళ్తే తెలుస్తుంది దీనికి సమాధానం. అసలా పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా... ఓ లగ్జరీ బేకరీ. అందులోని ఐటమ్స్కు యమా గిరాకీ. అందులోనూ మాకరాన్స్ (క్రీమ్ బిస్కెట్లు) గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తుంటారు. ఎందుకంత డిమాండ్? అది తెలుసుకోవాలంటే ఆ డిమాండును సృష్టించిన పూజ ఢింగ్రా గురించి తెలుసుకోవాలి. పూజ వాళ్లమ్మ కొన్నాళ్లు చాకొలేట్ వ్యాపారం చేసింది. నాన్న కూడా రెస్టారెంట్ నడిపేవారు. అందుకే ఆమెకు ఫుడ్ ఇండస్ట్రీ మీదే ఆసక్తి ఏర్పడింది. అయితే పనిని ఉపాధిలా కాకుండా వృత్తిలా చూసే గుణం ఆమెను విజేతగా నిలిపింది. డబ్బు అనేది ఆమెకు ‘బై ప్రొడక్ట్’గా వచ్చి పడింది. ఐతే ఈ స్థాయికి చేరే క్రమంలో పూజ తన రాతను తనే రాసుకుంది. ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులు పూజను న్యాయవాది కమ్మన్నారు. ఆ కోర్సులో చేరింది కూడా. కానీ వారం రోజులు గడిచాక తన గమ్యం ఇది కాదని ఆమెకర్థమైంది. లా పుస్తకాలు తలకు మించిన భారంలా కనిపించాయి. చెఫ్ కావాలని కోరుకుంది. ఆ కోరికనే తల్లిదండ్రుల ముందు పెట్టింది. అంతే, స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కించేశారు వాళ్లు. అక్కడ ఓ ప్రముఖ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీ కోర్సులో చేరింది. మొదట అక్కడి వారి మధ్య తనను తానో ఏలియన్లా భావించిన పూజ... మెల్లగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నించింది. ఆమె తొలి ఇంటర్న్షిప్ ఓ కుటుంబం నడుపుతోన్న రెస్టారెంట్లో. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనే. పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేయడంతో మొదలు.. పొద్దు పోయే వరకూ పనే పని. రెండో ఇంటర్న్షిప్ ఓ ఫైవ్స్టార్ హోటల్లో. అక్కడ ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం ఆమె పని. నామోషీ పడకుండా అన్ని పనులూ చేసింది. కోర్సు పూర్తయ్యేసరికి అంతర్జాతీయ డెలిగేట్స్ సెమినార్లు నిర్వహించే స్థాయికి చేరుకుంది. స్విస్ నుంచి తిరిగొచ్చాక ప్యారిస్ వెళ్లి అక్కడ మరో హాస్పిటాలిటీ కోర్సు చేసింది. తర్వాత ఏం చేయాలి? వ్యాపారంలోకి ఎలా దిగాలో తెలియక.. తన ఇంటి కిచెన్నే ప్రయోగశాలగా మార్చుకుంది పూజ. తాను నేర్చుకున్న వంటలు ఇక్కడ ప్రయత్నించబోతే.. అన్నీ దెబ్బకొట్టేశాయి. విదేశాల్లో దొరికే పదార్థాలు ఇక్కడ దొరకలేదు. దాంతో ఇక్కడ దొరికే పదార్థాలతో బేకరీ ఐటమ్స్ను తయారు చేయడం మొదలుపెట్టింది. తాను తయారు చేసిన పదార్థాలతో ఫుడ్ ఎగ్జిబిషన్లకు తిరిగింది. దాంతో ఆర్డర్లు వచ్చాయి. పూర్తిగా విశ్వాసం లభించాక ‘లీ 15 ప్యాటిసెరీ’ని ఆరంభించిందామె. కొన్నాళ్లకే ముంబయిలోని విశిష్టమైన బేకరీల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మరో రెండు శాఖలు కూడా వెలిశాయి. తనలా షెఫ్ కావాలనుకునేవారికి పాఠాలు కూడా చెబుతోంది పూజ. ఆమె క్లాసులకు వెళ్లాలనుకుంటే, www.le15.co.in/classes.php లో వివరాలున్నాయి. - ప్రకాష్ చిమ్మల