
నాగచైతన్య- శోభిత దంపతులు మంచి మనసు చాటుకున్నారు.

క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులిచ్చారు.

క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కు వచ్చే పిల్లలకు, వాని కుటుంబాలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తోంది సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్.

తాజాగా ఈ సెంటర్కు వెళ్లిన చై దంపతులు పిల్లలతో కబుర్లాడటంతో పాటు వారితో కలిసి డ్యాన్స్ కూడా చేశారు.

అలాగే కొన్ని బహుమతులను సైతం పంచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇది చూసిన జనాలు వీరి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు.




