Sobhita dhulipala
-
అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత
సక్సెస్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఆటంకాలు, అవమానాలు దాటుకుని వచ్చాకే విజయ ఫలాల్ని అందుకోగలరు. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ (Tollywood)లో కంటే బాలీవుడ్ (Bollywood)లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ముందు చేదు అనుభవాల్ని ఎదుర్కొందట. గతంలో తనే ఈ విషయాన్ని వెల్లడించింది. రాత్రి 11.30 గంటలకు ఫోన్శోభిత మాట్లాడుతూ.. ఒక బ్రాండ్ వాళ్లు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి ఆడిషన్కు పిలిచారు. నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. సర్లే అని వెళ్లాను. ఆడిషన్ పూర్తయింది. నన్ను సెలక్ట్ చేశామని తెలిపారు. యాడ్ షూటింగ్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదేదో థాయ్లాండ్, ఆస్ట్రేలియా కాకపోయినా గోవా అనగానే నేను ఎగ్జయిట్ అయ్యాను. గోవా వెళ్లాక మొదటిరోజు షూటింగ్ బానే జరిగింది. కానీ కెమెరాలో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి మిగిలింది తర్వాత షూట్ చేద్దామన్నారు. సెట్టవట్లే అని తీసేశారుతర్వాతి రోజు నేను సెట్కు వెళ్లగానే.. ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్కు సరిపోదు అని మాట్లాడుతున్నారు. కారణమేంటో తెలుసా? నేను కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నానని వద్దన్నారు. అంత ఆత్మస్థైరంతో కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్కు సెట్టవదని పక్కన పెట్టేశారు. నా ప్లేస్లో ఓ శునకాన్ని తీసుకున్నారు. కానీ ఒకరోజు పనిచేసినందుకు నాకు డబ్బులిచ్చారు అని చెప్పుకొచ్చింది. అది విన్న యాంకర్.. శోభితకు బదులు శునకాన్ని బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకోవడమేంటని నోరెళ్లబెట్టారు.సినిమా..రామన్ రాఘవన్ 2.0 సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది శోభిత. గూఢచారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్లో మూవీలోనూ యాక్ట్ చేసింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో దీపికా పదుకొణెకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. శోభిత 2024 డిసెంబర్ 4న హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది. View this post on Instagram A post shared by MTV (@toni.op55) చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా? -
అరుణాచల క్షేత్రంలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
-
తప్పెవరిదైనా సారీ చెప్పేదొకరే.. భార్య కోసం వంట చేసిపెడ్తున్న చై!?
టాలీవుడ్ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్స్టాగ్రామ్లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సారీ ఎవరు చెప్తారు?తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. నీకది లేదులే.. చై సెటైర్లుఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్ చాక్లెట్ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.అదే శోభిత హాబీశోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.చదవండి: బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా -
జిమ్లో నేషనల్ క్రష్ రష్మిక.. వింత డ్రెస్లో మిల్కీ బ్యూటీ!
వారణాసిలో అనసూయ ప్రత్యేక పూజలు..ప్రత్యేక ఇంటర్వ్యూ ఫోటోలు షేర్ చేసిన శోభిత ధూళిపాల..వైట్ గౌనులో మిల్కీ బ్యూటీ హోయలు..బ్లూ శారీలో మెరిసిపోతున్న జ్యోతి పూర్వాజ్..జిమ్లో రష్మిక మందన్నా కసరత్తులు.. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
నాగచైతన్య- శోభిత లవ్ స్టోరీ.. ఎలా, ఎక్కడ మొదలైందో తెలుసా? (ఫోటోలు)
-
శోభితలో నాకు బాగా నచ్చేదదే.. తన నుంచి నేర్చుకోవాలి: నాగచైతన్య
పెళ్లయ్యాక అదృష్టం కలిసొస్తుందంటారు. కిరణ్ అబ్బవరం.. రహస్యను పెళ్లి చేసుకున్నా 'క' మూవీతో బ్లాక్బస్టర్ కొట్టాడు. అటు నాగచైతన్య (Naga Chaitanya).. శోభిత (Sobhita Dhulipala)ను పెళ్లాడాక 'తండేల్'తో పెద్ద హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవకపోతే ఇంట్లో పరువు పోతుందని తెగ భయపడిపోయాడు. చివరకు విజయం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మధ్యే ఇద్దరూ మెక్సికోలో హనీమూన్కు కూడా వెళ్లొచ్చారు.అప్పటిదాకా చైను ఫాలో కాలేతాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. ఓసారి నేను సోషల్ మీడియాలో అభిమానులడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాను. అప్పుడో వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కినేని నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో అవడం లేదు? అని ప్రశ్నించారు. అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్ చెక్ చేశా.. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఉన్నాను. నచ్చినవాటి కోసం..అది చూసి కాస్త ఖుషీ అయ్యాను. వెంటనే నేనూ ఫాలో కొట్టాను. అప్పటినుంచి అతడి పోస్టులు రావడం.. ఒకరికొకరం మెసేజ్ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్లో తొలిసారి ఇద్దరం కలుసుకుని లంచ్ డేట్కు వెళ్లాం. తను చాలా సింపుల్గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. (చదవండి: సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్)శోభితలో బాగా నచ్చే అంశం అదే!జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. ఫోటోలో స్మైల్ ఇవ్వు అంటే..శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికీ పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే! నాకూ తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోల్లో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకలా ఉంటావ్, కాస్త నవ్వుతూ దిగొచ్చుగా అంటే నేను లోపల నవ్వుతున్నాను, కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్ వేస్తుంది అని చై చెప్పుకొచ్చాడు. చై-శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: తమన్ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత? -
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) -
అనసూయ గ్లామర్ డాల్.. భర్తతో రేసు ట్రాక్ పై శోభిత
తెల్లచీరలో అందాల దేవతలా మెరిసిపోతున్న అనసూయచీరలో గ్లామర్ ఒలకబోస్తున్న తెలుగు హీరోయిన్ అనన్యరేసు ట్రాక్ పై భర్తతో శోభిత ధూళిపాళ్ల హంగామామాల్దీవుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లిరోజు సెలబ్రేషన్స్స్టూడియో టూర్ వీడియో షేర్ చేసిన నయనతారజిమ్ లో తెగ కష్టపడుతున్న హాట్ బ్యూటీ జ్యోతి రాయ్బీచ్ ఒడ్డున 'దేవుళ్లు' చైల్డ్ ఆర్టిస్ గ్లామరస్ పోజులు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Architectural Digest India (@archdigestindia) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sanchana Natarajan (@sanchana.natarajan) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Akshay Amberkar (@akshay_26) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ
అక్కినేని కొత్త కోడలు శోభిత (Sobhita) గురించి కొత్తగా చెప్పేదేముంది. నటిగా ఇదివరకే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హీరో నాగచైతన్యని(Naga Chaitanya) పెళ్లాడిన తర్వాత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఎందుకంటే గతంలో చైతూ, హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే నాగచైతన్య నటుడిగానే కాకుండా రెస్టారెంట్, రేసు ట్రాక్ లాంటి వ్యాపకాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే ఇతడికి సోయూ అనే రెస్టారెంట్ ఉంది. అప్పుడప్పుడు రేసు ట్రాక్ పైనా రయ్ రయ్ మని దూసుకుపోతూ ఉంటాడు. తాజాగా అలా చెన్నైలో రేస్ సర్క్యూట్ కి వెళ్లాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)కాకపోతే ఈసారి ఒక్కడ కాదు, భార్య శోభితని కూడా తోడు తీసుకెళ్లాడు. ఆమెని కూడా కారులో కూర్చొనబెట్టి రేసులోకి దింపాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని శోభిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ పిక్స్ పై కామెంట్స్ పెడుతున్నారు.సినిమాల విషయానికొస్తే నాగచైతన్య.. ఈ మధ్యే 'తండేల్'తో (Thandel Movie) హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'విరూపాక్ష' దర్శకుడు తీస్తున్న హారర్ మూవీలో నటిస్తున్నాడు. శోభిత అయితే ఒకటి రెండు సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా?
నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. కొంతకాలంపాటు దాగుడుమూతలు ఆడారు. డేటింగ్ గురించి ప్రశ్నలొస్తే.. ప్రేమాగీమా ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.అతడిపై మనసు పారేసుకున్న శోభితఅప్పటికే నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదు. అతడి గురించే ప్రత్యేకంగా..అతడి ప్రవర్తన చూసి నాకు బాధేసేది. అప్పుడు వ్యాసరచన వంటి కొన్ని అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేశాను. అందులో టాప్ వస్తేనైనా నన్ను చూస్తాడేమోనని! కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి పట్టించుకోవడం మానేశాను. కొంచెం పరిపక్వత చెందాను.సినిమా..కాలేజీలో నాకు లవ్ ప్రపోజల్స్ వచ్చేవి. నేను కూడా కొన్ని లెటర్స్ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్ అస్సలు బాగుండేది కాదు అని పేర్కొంది. గూఢచారి, మేజర్, కల్కి 2898 ఏడీ సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్లో హీరోయిన్గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.చదవండి: సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్ -
సెట్లో అడుగుపెట్టిన అక్కినేనివారి కోడలు.. పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్ట్
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాల గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే చైతూతో పెళ్లి తర్వాత ఇటీవల తండేల్ మూవీ ఈవెంట్లో మెరిసింది అక్కినేని కోడలు. తాజాగా తన పెళ్లి తర్వాత తొలిసారిగా మూవీ సెట్లో అడుగుపెట్టింది శోభిత. తన నెక్ట్స్ ప్రాజెక్ట్లో షూటింగ్లో పాల్గొన్నారామె. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చైతూతో పెళ్లి తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అంతకుముందు బాలీవుడ్తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శోభిత ధూళిపాల. బాలీవుడ్లో 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్లో కనిపించింది. Here are some photos of #SobhitaDhulipala shooting for her next film. ✨#Celebs pic.twitter.com/PTAXN54Ab4— Filmfare (@filmfare) February 24, 2025 -
చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)
-
నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న వేళా విశేషం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో తండేల్ మూవీ సక్సెస్ మీట్ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దు 😂 - #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/XyLy2bXmO3— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2025 -
సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు. 'సమంతతో విడాకుల తర్వాత సోషల్మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా కూడా నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నేనూ చదవుతాను. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాం. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాం. ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాం. మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా.. అయితే, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి. అందుకే స్పందించలేదు. కానీ, కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు. ఆ సమయంలో ఈ టాపిక్ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.. మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు. కానీ, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్స్టాప్ పెట్టాలి. నా మీద నెగటివ్ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి. విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు. సమాజంలో చాలామంది లైఫ్లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్ను కాదు కదా.. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాం. మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.. చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు.నా లైఫ్లో నిజమైన హీరో ఆమె..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు. -
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. చైతూ భార్య శోభిత ధూళిపాల అలాంటి పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల థియేటర్లలో విడుదలైంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు.అయితే శోభిత తన భర్త సినిమా రిలీజ్కు ముందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా విడుదల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసని అన్నారు. ఈ లవ్ స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉందని శోభిత తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇకనైనా మీరు గడ్డం గీసుకుంటారు.. మొదటిసారి గడ్డం లేకుండా నీ ముఖం చూసే దర్శనభాగ్యం కలుగుతుంది సామీ అని ఆమె రాసింది.' అంటూ తెలుగులోనే రాసుకొచ్చింది.కాగా.. గతేడాది డిసెంబర్లో శోభిత ధూళిపా- నాగచైతన్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో శోభిత దూళిపాల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
మా పెళ్లి ప్లానింగ్ అంతా తనదే: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా కనిపించనుంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మన తండేల్ హీరో చైతూ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా వెడ్డింగ్ ప్లానింగ్ విషయంలో క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందన్నారు. శోభిత మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. మా పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమెనే డిజైన్ చేసిందని వెల్లడించారు. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనని నాగచైతన్య అన్నారు. -
శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య
లవ్స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా..వైజాగ్ తనకు స్పెషల్ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్ తనకు ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. (చదవండి: 93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)అదే మమ్మల్ని ఒకటిగా..వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్ -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్ఫ్లవర్ సింబల్ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్హౌస్లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
తెలంగాణ మహిళా కమిషన్కి జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభితలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు.అసలేం జరిగిందంటే?సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి(Venu Swamy).. అక్కినేని హీరో నాగచైతన్య-శోభితల వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ..వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. వారిద్దరు విడిపోతారంటూ జోస్యం చెప్పడంపై అక్కినేని అభిమానులతో పాటు మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమెన్ కమిషన్కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామికి నోటీసులు పంపించి వివరణ కోరింది. మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా కమిషన్ ముందే హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలుమహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో వేణుస్వామి తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.అంతేకాదు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు ఓ లేఖను అందజేశాడు. వేణు స్వామి క్షమాపణలు స్వీకరించిన మహిళా కమిషన్.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని హెచ్చరించింది. సమంత విషయంలోనూ..సెలబ్రేటీల పర్సనల్ విషయాలపై జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి ఫేమస్ అయ్యాడు. గతంలో సమంత విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నాగచైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పాడు. సమంత, చైతు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తరచూ సినీ ప్రముఖులపై జోతిష్యం చెప్పడంతో వేణుస్వామిపై విమర్శలు వచ్చాయి. -
డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్గా,ఫ్యాషన్ క్వీన్లా శోభిత ధూళిపాళ
నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తన ష్యాషన్ స్టైల్తో అందర్నీ మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో వివాహ వేడుకలలో సంప్రదాయ చీరలు, నగలతో అందంగా మురిపించిన శోభిత తాజాగా ఒక జ్యువెల్లరీ యాడ్లో మెరిసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని చెప్పకనే చెప్పింది.డీప్ గ్రీన్ ఫ్రాక్, డైమండ్ ఆభరణాలతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఫ్యాషన్ అండ్ స్టైల్కు పర్యాయపదంగా తన లుక్తో అభిమానులను ఫిదా చేసింది. రోహిత్ గాంధీ. రాహుల్ ఖన్నా కలెక్షన్లో డీప్ గ్రీన్ డ్రెస్ను ఎంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోషూట్ నెట్టింట వైరల్గా మారింది. స్క్వేర్ నెక్లైన్, షోల్టర్ స్ట్రాప్స్, అలాగే ముందు భాగంలో, వీ ఆకారంలో డీప్ నెక్లైన్కట్ డ్రెస్ను ఎంచుకుంది. ఇక నగల విషయానికి వస్తే మల్టీ-స్ట్రాండ్ చోకర్ నెక్లెస్ , వేలాడే చెవిపోగులు, గాజులు, రింగ్ ధరించింది. డైమండ్ ఆభరణాలు హైలైట్ అయ్యేలా, జుట్టును అందంగా ముడి వేసుకుంది. మరీ ముఖ్యంగా క్యాట్ ఐలైనర్ ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది.కాగా శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. అంతకుముందు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందర్నీఆశ్చర్యపరిచింది. తెలుగు సాంప్రదాయాలు, కట్టుబట్టు ఇష్టం అని చెప్పే శోభిత పసుపు కొట్టింది మొదలు, మూడు ముళ్ల వేడుక దాకా ప్రతి సందర్భంలోనూ తనదైన శైలితో శోభితా ఆకట్టుకుంది.అంతేకాదు వీరికి పెళ్లి తరువాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగను కూడా ఈ జంట ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది శోభితా . ఈ ఫోటోల్లో రెడ్ కలర్ గోల్డెన్ అంచు శారీలో అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
శోభిత-నాగచైతన్య జంట.. పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరో నాగచైతన్య గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయను పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు.పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు చైతూ, శోభిత. ఈ పొంగల్ వేడుక ఫోటోలను శోభిత ఇన్ స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంది. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా శోభిత సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.కాగా.. నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2022 నుంచి రిలేషన్లో ఉన్నారు. గతేడాది ఆగస్టు 8న ఈ జంట హైదరాబాద్లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత డిసెంబర్లో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తండేల్లో నాగ చైతన్య..ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. జూన్లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్ల్యాండ్లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
నాగ చైతన్య... శోభితా లవ్ స్టోరీ..
-
పెళ్లికి ముందు చైతూ-శోభిత ఇన్ని ట్రిప్స్ వేశారా? (ఫొటోలు)
-
బేబీ బంప్తో రాధిక.. ఇంకా పెళ్లి మూడ్లోనే శోభిత
జిమ్లో జుత్తుతో ఆటాడేస్తున్న మెగా కోడలు లావణ్యపెళ్లి మూడ్లో శోభిత.. వైజాగ్లో పార్టీ & సెలబ్రేషన్స్బేబీ బంప్ ఫొటోల్ని బయటపెట్టిన హీరోయిన్ రాధికా ఆప్టేపట్టుచీరలో పెళ్లి కూతురిలా కనిపిస్తున్న మాళవిక మోహనన్ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ డోస్.. చూస్తే అంతేభర్తతో క్యూట్ అండ్ స్వీట్గా బర్త్ డే విషెస్ చెప్పిన వరలక్ష్మిసంప్రదాయబద్ధమై లుక్లో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Ashish Shah (@ashishisshah) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Alaya F (@alayaf) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) View this post on Instagram A post shared by Lijomol Jose (@lijomol) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) -
అక్కినేని వారి కోడలు.. సబ్యసాచి లెహెంగాలో ఫోటో షూట్ చూశారా? (ఫొటోలు)
-
శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లవ్బర్డ్స్ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్గా మారింది.ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్మీడియా పోస్ట్లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. -
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
' ఆ విషయం నాకు మాత్రమే తెలుసు'.. శోభిత పెళ్లిని తలచుకుని సమంత ఎమోషనల్!
ఈనెల 4వ తేదీన టాలీవుడ్ హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహావేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేశ్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఈ పెళ్లి వేడుకలో శోభిత సిస్టర్ డాక్టర్ సమంత కూడా సందడి చేశారు. అక్క పెళ్లి దిగిన ఫోటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్.. అక్కా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా.. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.. అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు.. అత్యంత గౌరవప్రదమైన జంట అక్క- చైతూ అని నాకు తెలుసు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)కాగా.. శోభిత సిస్టర్ డాక్టర్ సమంత వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె 2022లోనే పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) -
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత రిసెప్షన్లో మెరిసిన చైతూ - శోభిత.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4— Filmfare (@filmfare) December 11, 2024 -
పెళ్లి తర్వాత అక్కినేనివారి కోడలు ఫోటోషూట్.. బంగారంలా మెరిసిపోతున్న శోభిత!
-
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిపెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్.. ఒక రేంజ్లో ఉందిగా!
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్మెంట్, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్మీడియాలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ మాస్ మాస్గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత. View this post on Instagram A post shared by Shraddha Mishra (@shraddhamishra8) కాగా గత వారం హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. -
జిమ్లో సెల్ఫీతో నభా నటేశ్.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ఫిట్!
వేకేషన్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ..జిమ్లో నభా నటేశ్ సెల్ఫీ కసరత్తులు..బంగారంలా మెరిసిపోతున్న అక్కినేనివారి కోడలు శోభిత..మరింత హాట్గా మిల్కీ బ్యూటీ తమన్నా లుక్స్..దుబాయ్లో ప్రియమణి ఫోటోషూట్..మతిపొగొట్టే అవుట్ఫిట్లో దేవర భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
శోభిత పెళ్లి ముచ్చట్లు : మహారాణిలా పెళ్లికూతురి లుక్స్ (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత
శోభిత... అక్కినేని ఇంటి కోడలైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని ఇటీవలే పెళ్లి చేసుకుంది. తర్వాత భర్త, మామతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడిని కూడా దర్శించుకుంది. గత కొన్నిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న శోభిత.. కాస్త తీరిక దొరకడంతో భర్త, పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)'చైతన్య.. నా జీవితంలోకి రావడం అదృష్టం. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా నాకు ఎంతో నచ్చేశాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేను నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. వంట విషయంలోనూ ప్రాక్టీస్ ఉంది. ఆవకాయ, ముద్దపప్పు చేయడమంటే చాలా ఇంట్రెస్ట్' అని శోభిత చెప్పుకొచ్చింది.నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్'.. రాబోయే ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ నెల నుంచి 'విరూపాక్ష' దర్శకుడు తీసే కొత్త సినిమాలోనూ చైతూ నటించబోతున్నాడు. శోభిత విషయానికొస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లు ఏవి లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పెళ్లి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తుందేమో!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
నాగ చైతన్య- శోభిత మాంగల్యం తంతునానేనా ఫోటోలు
-
మోస్ట్ పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
-
మల్లిఖార్జుని సన్నిధిలో నూతన దంపతులు చై- శోభిత (ఫోటోలు)
-
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్చాట్కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం
వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్ టాపిక్గా నిలిచాయి.సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ, నాగచైతన్య మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో శోభిత ఎమోషనల్ అయింది. మంగళసూత్రాలను తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు. ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి. అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున. ట్విటర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు, డియర్ శోభిత- మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. -
వైభవంగా నాగచైతన్య - శోభిత వివాహం..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
తాళికట్టే శుభవేళ.. శోభిత- నాగచైతన్య పెళ్లి వీడియో వైరల్!
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి ముగిసింది. వేదమంత్రాల సాక్షిగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు.తాజాగా శోభిత- నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. శోభిత మెడలో చైతూ తాళి కడుతున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నాగార్జునతో పాటు వెంకటేశ్ కూడా కనిపించారు. ఇది చూసిన ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. Once again Happy marriage life @chay_akkineni @sobhitaD 💐💐💐Happy for you #SoChay #Chayo #SoChayWedding pic.twitter.com/tLPP4xARqG— Яavindra (@Nag_chay_akhil) December 5, 2024 -
నాగచైతన్య- శోభిత పెళ్లి.. వైరల్గా మారిన సమంత పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్తో ఓ వీడియోను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది. -
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగచైతన్య- శోభిత ధూళిపాళ (ఫోటోలు)
-
నాగచైతన్య-శోభిత వివాహం.. నాగార్జున స్పెషల్ ట్వీట్
హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా ఉన్న ఈ జంట నేడు (డిసెంబర్ 4న) భార్యాభర్తలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8.13 గంటలకు చై.. శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, టి సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.నా మనసు సంతోషంతో నిండిపోయిందికుమారుడి వివాహం గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం.. కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. ఇది ప్రేమ, సాంప్రదాయం, ఐక్యత కలగలిపిన వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. శోభితను మా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఆల్రెడీ మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చావు అని రాసుకొచ్చాడు. Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024 చదవండి: ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు! -
నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం
అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. బుధవారం రాత్రి 8:13 గంటల ముహూర్తానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)నాగార్జున-లక్ష్మిల కుమారుడైన నాగచైతన్య.. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కుమార్తె అయిన శోభితతో ఏడడుగులు నడవబోతున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్) -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. సతీసమేతంగా హాజరు కానున్న ఐకాన్ స్టార్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. దీంతో ఈ గ్రాండ్ వెడ్డింగ్కు టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసమేతంగా హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కూడా చై వివాహా వేడుకలో సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఈనెల 4న అంటే బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరి పెళ్లి వేడుక జరగనుంది.కాగా.. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలవ్వగా శోభిత హల్దీ వేడుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మంగళస్నాన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్స్టాలో షేర్ చేశారు. -
పెళ్లి సందడి : పెళ్ళికూతురుగా మారిన శోభిత.. ఫోటోలు వైరల్
-
శోభిత ధూళిపాళ పెళ్లి దుస్తుల డిజైనర్ ఎవరో తెలుసా..?
పెళ్లిళ్ల సీజన్ ఒక్కసారిగా హాట్గా మారడానికి సిటీలో జరుగుతున్న హీరో అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాళల వివాహం ఓ రీజన్గా చెప్పొచ్చు. సిటీలో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న టాప్ సెలబ్రిటీల వివాహ వేడుక కావడంతో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. మరోవైపు వధూవరుల దుస్తుల డిజైన్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారా అని సిటీ ఫ్యాషన్ సర్కిల్ ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. శోభిత స్వయంగా తానే డిజైనర్గా మారినంత పనిచేసి మరీ తమ పెళ్లి దుస్తుల్ని శ్రద్ధగా రూపొందించుకోవడం విశేషం. తన పెళ్లి వేడుకల్లో ధరించే దుస్తుల కోసం శోభిత ఏ ఫ్యాషన్ డిజైనర్నీ సంప్రదించడం లేదట. తన పెళ్లి దుస్తుల కోసం, ఆమె తల్లితో కలిసి షాపింగ్ చేశారనీ, బంగారు జరీ వర్క్తో కూడిన కంజీవరం చీరను ఎంపిక చేసుకున్నారని, మరో చీరను ఆంధ్రప్రదేశ్లోని స్థానిక నేత పనివారి ద్వారా తయారు చేయించారని సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి పొందిన పొందూరు ఖాదీ చీరను కూడా ఆమె తీసుకున్నారట. ఈ దుస్తులను డిసెంబర్ 4న తన పెళ్లి వేడుకలో ఆమె ధరించనున్నారు.దానితో పాటే చైతన్య కోసం కూడా ఒక మ్యాచింగ్ జతను ఎంచుకున్నారట. గతంలో మోడల్గా ర్యాంప్పై మెరిసిన శోభితకు ఫ్యాషన్ రంగంతో సన్నిహితంగా మెలిగిన అనుభవం ఉంది. అయితే ఆమె తన సంప్రదాయ నిశ్చితార్థ వేడుక కోసం మనీష్ మల్హోత్రా చీరను ధరించారు. మరోవైపు పెళ్లి వేడుకల్లో.. డిజైనర్ ఆభరణాలకు బదులుగా.. శోభిత వారసత్వంగా వచ్చిన ఆభరణాలను ధరిస్తున్నారు. వేడుక సందర్భంగా తన తల్లి, అమ్మమ్మ నుంచి వారసత్వంగా పొందిన ఆభరణాలతో తనను తాను అలంకరించుకున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగాన్ని పంచుకున్నారు. -
కొత్త కోడలు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అమల అక్కినేని'
తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం.. సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు? అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి.. అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి. సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి.. అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ? అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి. -
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.రీసెంట్గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ధనుష్తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!) -
శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. పెళ్లికళ ఉట్టిపడుతోందిగా! (ఫోటోలు)
-
కాశీలో రాశీఖన్నా.. శోభిత మంగళ స్నానం
కాశీలో పుట్టినరోజుని జరుపుకొన్న రాశీఖన్నాపెళ్లికి ముందు జరిగే మంగళ స్నానంలో శోభితభర్తతో ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్టైట్ ఫిట్ డ్రస్సులో శ్రద్ధా దాస్ అందాల ఆరబోతకర్రసాము చేస్తూ ఫుల్ బిజీగా 'సలార్' శ్రియ రెడ్డిపెళ్లిలో తెగ హడావుడి చేస్తున్న యంగ్ బ్యూటీ సాన్వి మేఘనచీరలో క్యూట్ అండ్ స్వీట్గా బిగ్బాస్ పునర్నవిచుడీదార్లో నవ్వుతో చంపేస్తున్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kusha Kapila (@kushakapila) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Kani Kusruti (@kantari_kanmani) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shruti P Marathe (@shrumarathe) View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) -
నాగచైతన్య-శోభితల వయసు గురించి గూగుల్లో వెతుకుతున్న నెటిజన్స్
టాలీవుడ్ నటుడు నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల పెళ్లిపీటలు ఎక్కనున్నారు. డిసెంబర్ 4న వారి వివాహం ఘనంగా జరగనుంది. ఇదిలాఉండగా, వారిద్దరి వయసుకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతుంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా వారి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. తనకు కాబోయే భార్య జైనాబ్ రావ్జీ మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది. అఖిల్ కంటే జైనాబ్ వయసు ఎక్కువని సోషల్మీడియాలో ప్రచారంలో జరుగుతుంది. అయితే, ఇప్పుడు చైతూ, శోభిత వయస్సు వ్యత్యాసం గురించి సోషల్మీడియాలో చర్చించుకుంటున్నారు. వారి వయస్సుకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నవంబర్ 23, 1986లో జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు కాగా, 1992 మే 31న జన్మించిన శోభితా ధూళిపాళకు 32 ఏళ్లు. వీరిద్దరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. వారిద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ ప్రభావం చూపించకపోయినప్పటికి నెటిజన్లు మాత్రం వారి వివరాల గురించి ఈ మధ్య ఎక్కువ గూగుల్ చేస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నాగచైతన్య-శోభితల పెళ్లి జరగనుంది. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు వారిద్దరూ ఒకటి కానున్నారు. దివంగత నటులు నాగేశ్వరరావుకు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియో కావడంతో ఈ వేడుకను అక్కడే జరిపించాలని వారు ఫిక్స్ అయ్యారు. ఈ వివాహం కోసం కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఆహ్వానిస్తున్నట్లు నాగ్ ఇప్పటికే ప్రకటించారు. నాగచైతన్య-శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. -
చైతూ-శోభిత పెళ్లి సందడి..
-
పెళ్లి సందడి.. నాగ చైతన్య- శోభిత మంగళస్నానాలు (ఫోటోలు)
-
చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్
అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగాయి. నాగచైతన్య-శోభిత డిసెంబరు 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. హల్దీ (పసుపు దంచడం) ఇప్పుడు జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు రాజమౌళి లాంటి స్టార్స్ విచ్చేయనున్నారు. చైతూ-శోభిత.. ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిసిపోనున్నారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే) -
చైతూ-శోభిత పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఎవరెవరికి ఆహ్వానం!? (ఫొటోలు)
-
చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే
హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్గా జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
అక్కినేని వారి గ్రాండ్ వెడ్డింగ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.అయితే వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్కు ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. నాగ చైతన్య, శోభితాల వివాహ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించిన వార్తలను అక్కినేని ఫ్యామలీ ఇంకా ధృవీకరించలేదు.అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చైతూ- శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లిని సింపుల్గానే నిర్వహించాలని నాగ చైతన్య కోరినట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులను శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు. Naga Chaitanya - Sobhita Dhulipala wedding rights bagged by netflix for a whopping ₹50 cr. pic.twitter.com/w6P4x1i9ZK— Manobala Vijayabalan (@ManobalaV) November 26, 2024 -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్లోని న్యూయార్క్లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్లో నిలిచింది.శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!
మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్ వెడ్డింగ్ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార సైతం ఇదే ట్రెండ్ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. అన్నపూర్ణ స్టూడియోస్లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. -
అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..అయితే అన్నపూర్ణ స్టూడియోస్నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.కుటుంబ ఉమ్మడి నిర్ణయం..ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.తనతో బాగా కనెక్ట్ అయ్యా..శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. -
ఇద్దరు దిగ్గజాల ముద్దుల మనవడు.. త్వరలో మళ్లీ పెళ్లి.. చైతూ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
నాగచైతన్య- శోభితల పెళ్లి.. చైతూ కోరడం వల్లే అలా: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత- నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వచ్చేనెల 4వ తేదీన హైదరాబాద్లోనే వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు. పెళ్లి వేడుక చాలా సింపుల్గా చేయాలని చైతూ కోరినట్లు ఆయన వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ..'ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్గా చేయమని కోరాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మందిని పిలవాలని నిర్ణయించాం. స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారని' తెలిపారు.గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పినట్లు తెలిపారు. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నాగ్ అన్నారు. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించారు. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
కాబోయే భార్యతో స్పెషల్ ఈవెంట్కు నాగచైతన్య.. ఫోటోలు వైరల్!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఇటీవలే శోభిత తరఫు వారి పెళ్లి కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే రెండు ఫ్యామిలీస్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే శోభిత, నాగచైతన్య తాజాగా ఓ ఈవెంట్లో సందడి చేశారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ -2024) వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, అమల, హీరో సుశాంత్తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ప్రసారం చేయనున్నారు. ఇది వీక్షించేందుకు నాగార్జున సతీసమేతంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28 వరకు జరగనుంది. When style meets grace💫 Yuva Samrat @chay_akkineni and #SobhitaDhulipala are the true definition of red carpet royalty at #IFFI2024. #NagaChaitanya #SoChay pic.twitter.com/Jwpcym5r8j— Trends NagaChaitanya™ (@TrendsChaitu) November 21, 2024 Elegance and legacy come alive at #IFFI2024! Yuva Samrat #NagaChaitanya & #SobhitaDhulipala grace the red carpet ahead of the special screening of ANR's timeless masterpiece ♥️✨@chay_akkineni@sobhitaD#ANR100 #SoChay pic.twitter.com/gNKDJtjjfK— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 21, 2024 -
కాబోయే అక్కినేని కోడలు.. స్టన్నింగ్ ఫొటోషూట్
-
సరికొత్త ఫ్యాషన్తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. అల్లుడికి అత్తమామల కానుకలేవో తెలుసా? (ఫొటోలు)
-
అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!
అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది. -
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్లోని ఓ మంచి ప్యాలెస్లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. -
శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పెళ్లి పనులతో బిజీగా శోభిత..శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. -
వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై ఉన్న స్టే ఎత్తివేస్తూ.. చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్కు పూర్తి అధికారాలు ఉన్నాయని సోమవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంతరం వారి వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ ఇటీవల వేణుస్వామి జోస్యం చెప్పారు. నిశ్చితార్థం చేసుకున్నరోజునే.. నాగచైతన్య, శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. మరో మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేశారు. వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో వైరల్ కావటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు పాలయ్యారు.వేణుస్వామి జోస్యంపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 13న రాష్ట్ర మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో.. తనపై చర్యలు తీసుకునే అధికారం మహిళా కమిషన్కు లేదని వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. -
అఫీషియల్: నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత ధూళిపాళ్ల మెరిసింది. తమ కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున పరిచయం కూడా చేశారు.తాజాాగా వీరి పెళ్లి తేదీపై నాగార్జున కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై స్పందించారు. అదే రోజున వివాహం జరగనుందని అక్కినేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లి తేదీపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారా? లేదంటే కొత్త సంవత్సరంలో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందా? అని నెటిజన్స్తో పాటు అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్ శతజయంతి వేడుకల్లో శోభిత కనిపించడంతో మరోసారి పెళ్లి తేదీపై మరోసారి ఆరా తీశారు.పెళ్లి తేదీపై రూమర్స్...గత కొద్ది రోజులుగా ఈ జంట ఈ ఏడాది డిసెంబర్లోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. చై- శోభిత డిసెంబర్ మొదటి వారంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్లోనూ టాక్ వినిపించింది. వచ్చే డిసెంబరు 4న వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అందరూ అనుకున్నట్లుగానే పెళ్లి తేదీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది. (ఇది చదవండి: రామ్చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు )మొదలైన పెళ్లి పనులు..ఇటీవల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించింది. శోభిత ఇంట్లో తన తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండేల్తో చైతూ బిజీ..కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకారుల బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
సమంత హల్దీ ఫంక్షన్.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
నాడు సమంత సంగీత్ వేడుక.. సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల (ఫొటోలు)
-
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా?
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్, డిసెంబర్లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్లోని ప్యాలెస్ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభం (ఫోటోలు)
-
నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నాగార్జున వారసుడు నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం వేడుకగా కుటుంబ సమక్షంలో జరిగింది. అయితే, ఈ జోడీ కలసి ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈమేరకు శోభితా తన ఇన్స్టాలో ఫోటోలు పంచుకున్నారు. పసుపు దంచుతున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే, పెళ్లి వేడుక ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.ఆగష్టు 8న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటూ.. 8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది అని వారి నిశ్చితార్థం నాడు నాగార్జున తెలిపారు.అడివి శేష్ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్. ‘జోష్’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్’ వరకూ నాగచైతన్య కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో వేణుగోపాల్ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి హిందీ వెబ్ సిరీస్ల ద్వారానూ పాపులర్ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’లో ఓ లీడ్ రోల్లో నటించారు శోభిత. ‘మేజర్’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ‘మంకీ మ్యాన్’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
'ఆమెతో నటించడం అద్భుతం'.. శోభిత ధూళిపాళ్లపై నటుడు ప్రశంసలు!
టాలీవుడ్ హీరో నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా బాలీవుడ్లోనే రాణిస్తోంది. ఇటీవల లవ్-సితార మూవీతో ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఇందులో బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్తో జంటగా నటించింది. ప్రస్తుతం హానీమూన్ ఫోటోగ్రాఫర్ వెబ్ సిరీస్లో నటించిన రాజీవ్ సిద్ధార్థ్.. శోభితతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనతో కలిసి నటించడం ఓ మంచి అనుభవమని అన్నారు.రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆమెతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. వర్క్షాప్ మొదటి రోజు నుంచి సినిమా చివరి దాకా సమష్టింగా పనిచేశాం. శోభిత చాలా అద్భుతమైన సహనటి. మేమిద్దరం సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే శ్రద్ధ పెట్టాం. మా సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రతి సీన్ని మెప్పించేలా పని చేశాం. ఈ క్రెడిట్ అంతా మా దర్శకురాలు వందనా కటారియాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమెకు సినిమా అంటే ప్రాణం. ఈ చిత్రం సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ ఆమె విజన్ కోసం చాలా కష్టపడ్డారు.' అని చెప్పుకొచ్చారు.(ఇది చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)కాగా.. శోభిత ధూళిపాళ్లకు, హీరో నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరద్దరూ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నిశ్చితార్థం తర్వాత ఈ జంట తొలిసారి బయట కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కలిసి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం స్టైలిష్ లుక్స్తో జంటగా అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించి చైతూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్పై చీటింగ్ కేసు)గతంలో సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న చైతూ.. కొన్నాళ్ల పాటు సింగిల్గానే ఉన్నాడు. శోభితతో డేటింగ్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఏడాది ఎంగేజ్మెంట్ ఆ పుకార్లకు పుల్స్టాప్ పడినట్లయింది. బహుశా ఏదైనా యాడ్ షూట్ కోసమో ఏమో గానీ ఇద్దరు జంటగా కనిపించారు.చైతూ 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్, ఓటీటీ మూవీస్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. మరి వివాహం తర్వాత శోభిత యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా? లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
సమంతను అలా చూసి కళ్లు చెమ్మగిల్లాయి : శోభిత
శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని కోడలు కాబోతుంది. అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ ఆగస్ట్ 8న జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదంటూ కొట్టిపారేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి శోభిత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆమె ఏం మాట్లాడినా అది న్యూస్ అవుతోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి సమంత గురించి మాట్లాడింది. అది కాస్త నాగ చైతన్య మాజీ భార్య, హీరోయిన్ సమంత గురించే అన్నట్లుగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.సమంత నా సోల్మేట్శోభితా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చెల్లి సమంత అంటే చాలా ఇష్టమని చెప్పింది. ‘నా చెల్లి సమంత నా సోల్మేట్. ఈ మధ్యే తన పెళ్లి అయింది. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లిని చూసినప్పుడు ఆనందంతో కళ్లు చెమ్మ గిల్లాయి. తన పెళ్లి కారణంగానే నేను మా బంధువులనంతా కలుసుకున్నాను. కెరీర్లో బీజీగా ఉండడం కారణంగా ఇన్నాళ్లు వారిని దూరమైపోయాను. ఇకపై పర్సనల్ లైఫ్కి కూడా సమయం కేటాయిస్తాను’ అని శోభితా చెప్పుకొచ్చింది.చిన్నప్పటి కోరిక అదిఅదే ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి కోరిక ఏంటో కూడా శోభితా చెప్పింది. ‘నాకు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. అదే అమ్మ కావడం. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉంది’అని శోభిత చెప్పుకొచ్చింది. ఇక కాబోయే భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతు.. చైతు చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్గా ఉంటాడు. అతనిలో ఉన్న ఈ లక్షణాలు నాకు చాలా ఇష్టం’అని చెప్పుకొచ్చింది. -
పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్
అక్కినేని కాబోయే కోడలు శోభిత.. హిందీలో సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం హీరో నాగచైతన్యతో ఈమెకు నిశ్చితార్థం జరగ్గా.. త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండొచ్చని అంటున్నారు. అయితే పెళ్లికి ముందే పిల్లల గురించి, వాళ్లకు ఏం చెప్పాలో శోభిత డిసైడ్ అయిపోయింది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)తెలుగులో 'మేజర్', 'గూఢచారి' సినిమాలు చేసిన శోభిత.. ఇతర భాషల్లో మాత్రం చాలా చిత్రాల్లో నటించింది. అలా తమిళంలో చేసిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. మణిరత్నం తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. తాజాగా ఐఫా వేడుకలో బోలెడన్ని అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం రిలీజై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాలోని యాక్టర్స్ అందరూ అవెంజర్స్ అని పొగిడేస్తూ పోస్ట్ పెట్టింది.'వీళ్లందరూ అవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను' అని శోభిత మూవీ టీమ్తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఇదలా ఉంచితే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'పొన్నియిన్ సెల్వన్'. ఇదే పేరుతో సినిమా తీశారు. ఇందులో త్రిషకి తోడుగా ఉండే పాత్రలో శోభిత నటించింది.(ఇదీ చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
చైతో ఎంగేజ్మెంట్.. ప్లాన్ చేసుకోలేదంటూ శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ గురించి శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరగాలని ఎప్పుడూ కలలు కనలేదు, దానికోసం ఎటువంటి ప్రణాళికలూ రచించలేదు. మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనుకున్నానంతే! నాకైతే పర్ఫెక్ట్అనుకున్నట్లుగానే సన్నిహితుల సమక్షంలో ప్రశాంతంగా, సింపుల్గా, సూపర్గా జరిగింది. అప్పుడు సంతోషంతో నా మనసు ఉప్పొంగిపోయింది. కాబట్టి ఇది సింపుల్గా జరిగిందని చెప్పలేను. నా వరకు పర్ఫెక్ట్ అని మాత్రమే అనగలను. పెళ్లి చేసుకోవాలి, పిల్లలుండాలని నేనెప్పుడూ అనుకునేదాన్ని. మాతృత్వం అంటే నాకెంతో ఇష్టం. నేను నా తల్లిదండ్రులను, సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తాను. ఇవన్నీ ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటాను' అని శోభిత చెప్పుకొచ్చింది.సినిమా..కాగా చైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ ఆగస్టు 9న జరిగింది. చై ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శోభిత విషయానికి వస్తే ఈమె 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ విజేతగా నిలిచింది. రామన్ రాఘవన్ 2.ఓ, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ చిత్రాలతో బాలీవుడ్లో గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చీరలో శోభిత ధూళిపాళ.. ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ.. (ఫోటోలు)
-
ఎంగేజ్మెంట్ రింగ్, స్టైలిష్ చీరలో శోభితా స్టన్నింగ్ లుక్ : ‘చే’ రియాక్షన్
ప్రముఖ నటి, మోడల్ శోభిత దూళిపాళ్ల అందం, స్టయిలిష్ మరోసారి తన ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. త్వరలో తన డ్రీమ్ బోయ్ నాగ చైతన్యను పెళ్లాడబోతున్న శోభిత తన తాజా ఫోటోషూట్కు సంబంధించిన అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. నారింజ, నలుపు రంగుల మిశ్రమంల ఉన్న ప్రింటెడ్ చీరను ధరించింది. హెయిర్ స్టయిల్ కూడా స్పెషల్గా నిలిచింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది.ఈ ఫోటోలను చూసిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా విస్మయం చెందడం విశేషం. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సానుకూల మెసేజ్లతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసించారు. తమ అభిమాన హీరో నాగ చైతన్యకి పర్ఫెక్ట్ సెట్ అవుతారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్కు శోభిత కాబోయే భర్త నాగ చైతన్య లైక్ కొట్టాడు.ఇన్ స్టాలో గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. ఆగస్ట్ 27న నిశ్చితార్థం పూర్తి చేసుకున్న శోభిత, చైతన్య జంట వచ్చే ఏడాది మార్చిలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారని తెలుస్తోంది. కాగా పెళ్లి గ్రాండ్గా చేసుకుంటారా, లేక సింపుల్ గానా? అని ఇటీవల ప్రశ్నించినపుడు, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం, సింపుల్గా పెళ్లి చేసుకోవడమే తనకిష్టమని చైతూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
కాబోయే అక్కినేని కోడలు.. స్టన్నింగ్ లుక్స్ చూశారా? (ఫొటోలు)
-
చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాతా.. మారిపోయిన శోభిత ఇమేజ్...
-
ఐటం సాంగ్లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.ఐటం సాంగ్ ఆఫర్అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!చదవండి: ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి -
చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే?
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్లో జరిగే అవకాశం ఉందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. -
ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్గా నిలిచారామె.అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు. -
చైతూ- శోభిత ఎంగేజ్మెంట్.. వాలైంటెన్స్ డే వీడియో వైరల్!
అక్కినేని హీరో నాగాచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈనెల 8న హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.అయితే చైతూ, శోభితకు అందరిలా కాకుండా కాస్తా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే జంటకు నాగచైతన్య సినిమాకు సంబంధించిన వీడియోతో స్పెషల్గా విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ వీడియో నాగ చైతన్య వాలైంటైన్స్ డే సందర్భంగా షేర్ చేశారు. హీరోయిన్ సాయిపల్లవితో తండేల్ డైలాగ్ చెబుతూ వాలైంటైన్స్ డే రోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే చైతూ ప్రస్తుతం తండేల్ మూవీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. #TFNReels: A beginning of infinite love.. Yuvasamrat @Chay_akkineni & @sobhitaD ❤️♾️Wishing you both endless joy and a beautiful journey together!! 💞#NagaChaitanya #SobhitaDhulipala #TeluguFilmNagar pic.twitter.com/LR9HGGYsCU— Telugu FilmNagar (@telugufilmnagar) August 10, 2024 -
అక్కినేని ఫ్యామిలీతో కలిసిపోయిన శోభిత.. ఎంగేజ్మెంట్ లేటెస్ట్ (ఫొటోలు)
-
చైతూతో ఎంగేజ్మెంట్.. శోభిత ఎమోషనల్ పోస్ట్!
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు.తాజాగా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.సంతోషంగా ఉందన్నా నాగార్జుననాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
అసలు వీరిద్దరి మధ్య లవ్ స్టోరి ఎప్పుడు స్టార్ట్ అయింది?
-
ట్రిపుల్ ఎయిట్...ఎంగేజ్డ్
‘‘నా తనయుడు నాగచైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళ్లతో ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటల 42 నిమిషాలకు జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటున్నాను.8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది.. శోభితా, నాగచైతన్య’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేసి, నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్లోని అక్కినేని నాగార్జున ఇంట్లో జరిగింది. కాగా చైతన్య–శోభిత ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అడివి శేష్ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్. ‘జోష్’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్’ వరకూ నాగచైతన్య కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో వేణుగోపాల్ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి హిందీ వెబ్ సిరీస్ల ద్వారానూ పాపులర్ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’లో ఓ లీడ్ రోల్లో నటించారు శోభిత. ‘మేజర్’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ‘మంకీ మ్యాన్’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. -
హాలీవుడ్ రేంజ్కు కాబోయే అక్కినేని కోడలు..! (ఫొటోలు)
-
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగార్జున
-
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం (ఫోటోలు)
-
శోభితను నాగార్జున ఇలా అనేశాడేంటి? పాత వీడియో వైరల్
హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అన్నట్లు పలుమార్లు వీరు కలిసున్న ఫోటోలు నెట్టింట లీకయ్యాయి కూడా! ప్రేమించి, పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులిచ్చిన తర్వాత చై.. శోభితకు దగ్గరయ్యాడని, త్వరలోనే వివాహబంధంలోనూ అడుగుపెట్టనున్నారన్నది గాసిప్రాయుళ్లు చెప్తున్న మాట.చై ఇంట్లో ఎంగేజ్మెంట్చివరకు అదే నిజమైంది. చై-శోభితల నిశ్చితార్థం జరిగింది. నేడు ఈ ప్రేమ జంట ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలో శోభిత గురించి నాగార్జున స్టేజీపై మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. చాలా బాగుందిఅందులో నాగ్.. 'శోభిత ధూళిపాళ చాలా బాగుంది. ఈ మాట నేను అనకూడదు కానీ.. తను చాలా హాట్! తనలో అందరినీ అట్రాక్ట్ చేసే శక్తి ఉంది' అని పేర్కొన్నాడు. 2018లో గూఢచారి సక్సెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత వీడియో ఇప్పుడు వైరలవుతుండటంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా అనేశాడేంటి?'సమంత- చై కలిసున్నప్పుడు నాగార్జున ఇలా మాట్లాడాడు. అయినా ఒక యంగ్ హీరోయిన్ గురించి అట్రాక్టివ్ అని చెప్పుంటే సరిపోయేదిగా', 'అప్పుడు ఆమె నటి.. కానీ ఇప్పుడు కాబోయే కోడలు..' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా 2017లో సామ్-చై పెళ్లి చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు. -
నేడు నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం?
-
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం..? (ఫోటోలు)
-
'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?
'కల్కి 2898' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. సినిమాలో లీడ్ రోల్స్ చేసిన వాళ్లు నలుగురైతే.. అతిథి పాత్రల్లో మాత్రం లెక్కలేనంత మంది కనిపించారు. వీళ్లందరితో పాటు మరో తెలుగు హీరోయిన్ శోభిత కూడా ఇందులో భాగమైందనే విషయం మీకు తెలుసా? మరి మీరు ఏమైనా గమనించారా? ఇంతకీ ఎక్కడ ఉందో తెలుసా?(ఇదీ చదవండి: Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తే.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా ఇలా బోలెడు మంది స్టార్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రల్లో కనిపించారు. వీళ్లతో పాటే నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ శోభిత కూడా ఈ మూవీలో భాగమేనట. దీపికా పదుకొణె పాత్రకు తెలుగులో ఈమెనే డబ్బింగ్ చెప్పిందట.తొలుత తన పాత్ర కోసం దీపికనే డబ్బింగ్ చెప్పుకొంది. ట్రైలర్లోనూ ఆమె గొంతు వినిపించింది. కాకపోతే ఆ డబ్బింగ్ చూసి విమర్శలు వచ్చాయి. దీంతో మూవీలో దీపిక పాత్రకు శోభితతో డబ్బింగ్ చెప్పించారట. అలా 'కల్కి'లో కూడా శోభిత కూడా భాగమైందని అంటున్నారు. ఇదిలా ఉండగా శోభిత-నాగచైతన్య రిలేషన్ గురించి గత కొన్నాళ్ల నుంచి రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకునేలా లేరు!(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్!) -
కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్పై వివిధ రకాల డిజైనర్వేర్లతో మెరిశారు. అక్కడున్న వారందర్నీ తమ స్టన్నింగ్ లుక్తో మైమరిపించారు. అందాల సుందరీ, బాలీవుడ్ నటి ఐశ్వర్యారయ చక్కటి డిజైనర్ గౌనుతో అలరించిగా, మిగతా సెలబ్రిటీలో తమదైన శైలిలో మిస్మరైజ్ చేశారు.ఇక సూపర్ మోడల్, మాజీ మిస్ ఎర్త్ ఇండియా, బాలీవుడ్ నటి శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే శోభితా తొలిసారిగా ఈ రెడ్కార్పెట్పై మెరిశారు. ఆమె ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో అధ్భతంగా కనిపించారు. శోభిత నమ్రత జోషిపురా జంప్సూట్ ధరించి రెడ్కార్పెట్పై ర్యాంప్ వాక్ చేసింది. ఆమె అత్యుత్తమ స్టైల్ని ఎంపిక చేసుకుని మరీ ఈ వేడుకలో మెరిశారు. మిరుమిట్లు గొలిపే ఊదారంగు డ్రస్లో ఆకర్షణీయంగా కనిపించారు. దానిపై ఉన్న సీక్విన్ వర్క్ శోభితా లుక్ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. వీ నెక్ డ్రస్కి తగ్గట్టుగా ఉంగరాల జుట్టుతో గ్లామరస్గా కనిపించింది శోభిత. అయితే ఆమె ధరించి డిజైనర్వేర్ ప్రధాన ఆకర్షణగాక కనిపించినప్పటికీ..ఇది గతంలో అతియ శెట్టి ధరించిన డిజైనర్వేర్కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతియా 2023లో లాక్మే ఫ్యాషన్ వీక్లో ఇదే నమ్రత జోషిపురా జంప్సూట్ డిజైనర్వేర్ని ధరించింది. రెండు కలర్లు కొంచెం వేరుగానీ డిజైన్ దగ్గరగా దగ్గరగా ఒకేలా ఉండటం విశేషం. ఇక శోభితా సెలక్ట్ చేసుకున్న ఈ డిజైనర్ వేర్ ధర ఏకంగా రూ. 1.8 లక్షలు ధర పలుకుతుందట. View this post on Instagram A post shared by A Fashionista's Diary (@afashionistasdiaries) (చదవండి: ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!) -
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
తెలుగుమ్మాయి శోభిత ధూళిపాళ టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు ఏకంగా హాలీవుడ్లోనూ ఆఫర్ అందుకుని అక్కడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ మధ్య వెకేషన్కు వెళ్లగా.. తెలుగు హీరో నాగచైతన్య కూడా తన వెంటే ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసిందీ బ్యూటీ. 'ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ దట్స్ ఓకే' అని రాసుకొచ్చింది. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దానర్థం.కప్ ఆఫ్ చాయ్/చైసాధారణంగా కప్ ఆఫ్ టీ అంటారు. కానీ శోభిత కప్ ఆఫ్ చాయ్ అని పేర్కొంది. దీంతో కొందరు నెటిజన్లు చైతన్యను ప్రస్తావిస్తూనే చై అని రాసిందని అభిప్రాయపడుతున్నారు. టీకి బదులుగా చాయ్/ చై అని రాయడం దేనికో అని కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ పోస్ట్కు స్పందిస్తూ.. నేను కూడా నా విషయంలో అలాగే ఫీలవుతుంటాను అని రాసుకొచ్చాడు.కెరీర్శోభిత కెరీర్ విషయానికి వస్తే.. గూడచారి, మేజర్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. రామన్ రాఘవన్ 2.0, పొన్నియన్ సెల్వన్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించింది. మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సితార అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) చదవండి: 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు -
కాల్ గర్ల్గా నటించడం గౌరవంగా ఉందన్న శోభిత (ఫోటోలు)
-
ఆలోచనల అలల్లో.. శోభిత గ్లామర్ చూడాల్సిందే! (ఫోటోలు)
-
‘ఎస్ఎక్స్డబ్ల్యు’ లో ‘మంకీ మేన్’.. తెలుగు అమ్మాయిపై ప్రశంసలు
పట్టుమని పదే సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్ట్కి హాలీవుడ్ చాన్స్ వస్తే... పట్టరానంత ఆనందం కలుగుతుంది. హాలీవుడ్ చిత్రం ‘మంకీ మేన్’కి అవకాశం వచ్చినప్పుడు తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళకు అలాంటి ఆనందమే దక్కింది. పైగా ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ నటుడు దేవ్ పటేల్ డైరెక్టర్ కావడం, హనుమంతుని పురాణం స్ఫూర్తిగా రూపొందడంతో మంచి అవకాశంగా భావిస్తున్నారు శోభిత. ఇటీవల యూఎస్లోని ఆస్టిన్లో జరిగే ప్రతిష్టాత్మక ‘ఎస్ఎక్స్డబ్ల్యు’ (సౌత్ బై సౌత్వెస్ట్)లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ ప్రీమియర్కి హాజరైన శోభితా ధూళిపాళ మాట్లాడుతూ – ‘‘ఈ వరల్డ్ ప్రీమియర్లో మా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అరుపులు, చప్పట్లతో నినాదాలు చేశారు. స్టాండింగ్ ఒవేషన్తోనూ ప్రశంసించారు. దేవ్ పటేల్కి డైరెక్టర్గా ఇది ఫస్ట్ మూవీ. హాలీవుడ్లో నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో నాది పెద్ద భాగం కానప్పటికీ, వేరే భాషలో నటించడం, అది కూడా దేవ్ పటేల్ విజన్లో నేను భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఇక పలువురు హాలీవుడ్ తారలతో పాటు విపిన్ శర్మ, అశ్వినీ కల్సేఖర్, మకరంద్ దేశ్పాండే వంటి భారతీయ తారలు నటించిన ‘మంకీ మేన్’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. -
Sobhita Dhulipala Photos: సమ్మర్లో మరింత హీటెక్కిస్తున్న శోభిత ధూళిపాళ అందాలు (ఫోటోలు)
-
సోకులతో సెగలు రేపుతున్న ఐశ్వర్య.. అలాంటి క్రేజీ లుక్తో శోభిత!
వైట్ అండ్ వైట్ డ్రస్లో కీర్తి సురేశ్ క్యూట్నెస్ ముఖం చూపించకుండా ఫన్నీ పోస్ట్ పెట్టిన రష్మిక బాడీకి అతుక్కుపోయే డ్రస్తో మెంటలెక్కిస్తున్న ఐశ్వర్య కుర్చీపై కూర్చుని అలాంటి పోజులిచ్చిన హీరోయిన్ శోభిత బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న ముద్దుగుమ్మ రిచా పనయ్ సూపర్ హీరోల కోటు గురించి ప్రియమణి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తమిళ యంగ్ హీరోయిన్ చీరకట్టు పోజులు.. మరింత క్యూట్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
తల్లినవ్వాలని ఉంది.. అందుకోసం ఎదురుచూస్తున్నా: శోభిత
తెలుగమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించింది శోభిత ధూళిపాళ. తన తొలి సినిమా రామన్ రాఘవ్ 2.0 (హిందీ మూవీ). గూఢచారి సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మేజర్ మూవీతో బ్లాక్బస్టర్ అందుకుంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీ ప్రాజెక్టులతో మరింత ఫేమస్ అయింది. మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లతో బాలీవుడ్లోనే ఎక్కువ క్లిక్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. అలాగే సితార అనే హిందీ చిత్రం చేస్తోంది. పెద్ద లక్ష్యాలు లేవు తాజాగా ఆమె జీవితానికి అసలైన అర్థం ఏంటన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. శోభిత మాట్లాడుతూ.. 'జీవితానికి ఓ లక్ష్యం ఉంటుందని నేననుకోవడం లేదు. ఒక తీరం నుంచి మరొక తీరానికి వెళ్తూ ఉండాలి. మనం ఏం చేసినా దాన్ని ఆనందంతో చేయాలి. నాకంటూ పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కాబట్టి ఏదో పొగొట్టుకున్నదానిలా ఉండలేను. కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే అన్నింటికీ డిస్కనెక్ట్ అవుతుంటాను. అమ్మ అన్న పిలుపుకోసం వెయిటింగ్ జీవితంలో నేను ఏం కోరుకుంటున్నానంటే.. మాతృత్వం. నిజంగా దాన్ని ఎప్పుడు అనుభవిస్తానో కానీ అదొక అద్భుతంగా ఫీలవుతాను. అమ్మనవ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం ఎంత బాగుంటుందో.. అందుకోసం నేను ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా శోభిత, నాగచైతన్య ప్రేమలో ఉన్నారంటూ తరచూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! గతంలో ఈ రూమర్స్పై స్పందించిన శోభిత.. అసలేమీ తెలియకుండా ఏదో ఒకటి వాగేవాళ్లకు నేను సమాధానమివ్వాల్సిన పని లేదు. నేను ఏ తప్పూ చేయనప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు' అని చెప్పింది. చదవండి: నయనతార కోసం ఇంటి చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసిన హీరో -
స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
స్టన్నింగ్ బ్యూటీ.. సూపర్ యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ.. తెలుగు, హిందీ.. సిల్వర్ స్క్రీన్, వెబ్ స్క్రీన్ అనే తేడా లేకుండా దూసుకుపోతోంది. వినూత్నమైన ఆలోచనలతో వైవిధ్యమైన కథలు రాసేవారి కోసం ఓ స్టూడియోను ప్రారంభించింది. ఆమె కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్ఫామ్ మీద చెబుతున్నాం అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. ఫీచర్ ఫిల్మ్ అయినా వెబ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోను. అంటోంది. ఆ వెర్సటాలిటీని ఫ్యాషన్లోనూ చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. తోరానీ ఈ బ్రాండ్ స్థాపకుడు కరణ్ తోరానీ. స్వస్థలం భోపాల్లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాల్లోని చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత ‘తొరానీ’కి రూపమిచ్చాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ లభ్యం. ఓరా జ్యూలరీ 1888లో ముంబైలోని హ్యూస్ రోడ్లో ప్రారంభమై.. నేడు 38 నగరాల్లో 84 స్టోర్స్తో పాటు 5 గ్లోబల్ డిజైన్ సెంటర్లతో అంతర్జాతీయ బ్రాండ్గా రూపుదిద్దుకుంది. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీలకు ఫేవరెట్ ఈ బ్రాండ్ అనీ పేరుంది. డిజైన్ను బట్టే ధర. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు.కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్ఫామ్ మీద చెబుతున్నాం అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. ఫీచర్ ఫిల్మ్ అయినా వెబ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోను. (చదవండి: 'అఖండ' హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!) -
విచిత్రమైన గెటప్లో మృణాల్.. టెంప్ట్ చేస్తున్న నేహా
బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న దిశా పటానీ జిగేలు డ్రస్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకుర్ కలర్ కలర్ ఔట్ఫిట్లో శోభిత దూళిపాళ్ల ఆరెంజ్ దుస్తుల్లో అదరగొట్టేస్తున్న నేహాశెట్టి సిల్క్ డ్రస్లో సెగలు రేపుతున్న ప్రగ్యా స్మైలీ ఫేస్తో సమంత.. పింక్ టాప్తో వైట్ డ్రస్ తో తెగ నవ్వేస్తున్న రకుల్ ప్రీత్ Beach vibes with #DishaPatani. 🏖️🤍 pic.twitter.com/jPJ0HH4exW — Filmfare (@filmfare) August 17, 2023 View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Sobhita Dhulipala Latest Photos: వింటర్ డ్రెస్సుల్లో హీటెక్కించిన శోభితా (ఫొటోలు)
-
'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?
తారా ఖన్నా మళ్లీ వచ్చేస్తోంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తారాఖన్నాగా నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. ఈ సిరీస్లో శోభిత నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 2019 మార్చి 8న అమెజాన్ ప్రైమ్లో విడుదలైందీ సిరీస్. నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అద్భుతమైన ట్విస్ట్తో మేకర్స్ ఈ సిరీస్ను ముగించగా రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా మేడ్ ఇన్ హెవెన్ 2 స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించారు. ఆగస్టు 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండో సీజన్ ప్రసారం కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. 'మొత్తానికి అధికారికంగా విడుదల తేదీ చెప్పేశాం.. షాదీ బిజినెస్ చూసేందుకు మరోసారి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్టర్ను అభిమానులతో పంచుకుంది శోభిత ధూళిపాళ. ఈ గుడ్న్యూస్ విని అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. 'హమ్మయ్య.. ఆగస్టు 10 లీవ్ తీసుకుని అయినా చూసేస్తా', 'దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాం.. దేవుడా ఇప్పటికి కనికరించావా?', 'పట్టరాని సంతోషంతో ఏడుపు తన్నుకొస్తుందేంటి?' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి సీజన్లో ఉన్న శోభిత, అర్జున్, కల్కి కొచ్లిన్, జిమ్ సారబ్, శశాంక్ అరోరా, శివంగి రాస్తోగి సహా తదితరులు సీక్వెల్లోనూ నటించారు. ఇష్వాక్ సింగ్, త్రినేత్ర వంటి కొత్తముఖాలు కూడా సీక్వెల్లో కనిపిస్తాయి. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) చదవండి: పక్షవాతంతో మంచానపడ్డ నటి.. బికినీ ఫోటోలు షేర్ చేసి విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన నటి -
బ్లూ శారీలో ఐశ్వర్య రాజేశ్.. మరింత బోల్ట్గా సీతారామం బ్యూటీ పోజులు!
►బ్లాక్ డ్రెస్లో టాక్సీవాలా భామ ప్రియాంక జువాల్కర్ పోజులు! ►బ్లూ శారీలో కవ్విస్తోన్న ఐశ్వర్య రాజేశ్! ►మరింత బోల్డ్ లుక్లో ది నైట్ మేనేజర్ నటి శోభిత ధూలిపాల! ►షూట్ ధరించిన యాంకర్ సుమ కనకాల! ► బ్లాక్ డ్రెస్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) -
'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్తో తమన్నాను మించిపోయిందిగా..!
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శోభిత రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలోనూ నటించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్లపై దృష్టిపెట్టింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్-2'. ఈ సిరీస్ ఈనెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజైంది. (ఇది చదవండి: షూటింగ్లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!) అయితే ఈ వెబ్ సిరీస్లో శోభిత మరింత బోల్డ్గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది మరికొందరు రొమాంటిక్ సీన్స్లో శోభిత.. తమన్నాను మించి పోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. గతంలో శోభిత ధూళిపాల.. అక్కినేని నాగ చైతన్య డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ బ్రిటన్కు చెందిన సిరీస్ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోడీ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, తిలోటమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) View this post on Instagram A post shared by SPARK EDITS and MEMES💥 (@priya_sparkedits) -
సమంత, నాగచైతన్యలపై శోభిత ధూళిపాళ ఆసక్తికర వ్యాఖ్యలు
నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరు చుట్టేసి వస్తుందంటారు. ఇక్కడ నిజం, అబద్ధం అన్నదాన్ని పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో మాత్రం పుకార్లు పుంఖానుపుంఖానులుగా వైరలవుతుంటాయి. ఇద్దరు కలిసి కనిపిస్తే స్నేహం అనడానికి బదులు ప్రేమ అనేస్తారు, కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు గర్భిణి అనేస్తారు. సెలబ్రిటీ కపుల్స్ జంటగా కాకుండా సింగిల్గా ఫంక్షన్కు హాజరైతే విడాకులు తీసుకుంటున్నారేమో అనేస్తారు. సోషల్ మీడియాలో అంతలా జడ్జ్ చేస్తున్నారు. మీరనుకునేది నిజం కాదురా బాబూ అని సెలబ్రిటీలు నెత్తీనోరూ మొత్తుకున్నా కళ్లతో కనిపించేదే నిజం అని వాదిస్తున్నారు నెటిజన్లు. కొన్నిసార్లు నెటిజన్ల అభిప్రాయమే నిజమైందనుకోండి. మొహమాటానికి ప్రేమ,గీమా లేదన్నా చివర్లో పెళ్లికి రెడీ అయిన జంటలు చాలానే ఉన్నాయి. ఇకపోతే గతకొంతకాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం రూమర్ అని గతంలోనే కొట్టిపారేసిన శోభిత తాజాగా మాజీ దంపతులు నాగచైతన్య, సమంతల గురించి మాట్లాడింది. 'సమంత కెరీర్ జర్నీ చాలా కూల్గా అనిపిస్తుంది. ఒకసారి ఆమె చేసిన సినిమాలు చూసినట్లైతే తను ప్రాజెక్టులను డీల్ చేసే విధానం బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'అతడు చాలా సైలెంట్గా ఉంటాడు. ఎంతో ఒద్దికగా ఉంటాడు. అతడి స్వభావాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!' అని పేర్కొంది. కాగా చైసామ్ 2021 అక్టోబర్లో విడిపోయిన సంగతి తెలిసిందే! చదవండి: ప్రముఖ నటుడి సోదరి మృతి.. ఆమె మరణాన్ని తట్టుకోలేక అదే రోజు.. -
పదేపదే అందంగా లేనని చెప్తుంటే నేను కూడా అదే..: శోభిత
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తెలుగులో తప్ప మిగతా భాషల్లో దూసుకుపోతోంది. రామన్ రాఘవ్ 2.0 అనే హిందీ సినిమాతో వెండితెరపై తన ప్రయాణాన్ని ఆరంభించిన ఈమె గూఢచారితో తెలుగు తెరపై వికసించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ శోభిత మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత మేజర్ సినిమాతో తెలుగు తెరపై కనిపించిందీ బ్యూటీ. మధ్యలో హిందీ, మలయాళ చిత్రాలు చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో మంకీ మ్యాన్ అనే సినిమా కూడా చేస్తోంది. తాజాగా ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆటంకాలను గూర్చి చెప్పుకొచ్చింది. 'ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చావంటే యుద్ధం చేయాల్సిందే! నాకు ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. నాకు ఇప్పటికీ గుర్తు.. వాణిజ్య ప్రకటనల ఆడిషన్స్కు వెళ్లినప్పుడు చాలాసార్లు అందంగా లేనని ముఖం మీదే చెప్పి తిరస్కరించేవారు. నేను కూడా అద్దంలో నన్ను నేను చూసుకుని కాస్తంత అందంగా కూడా లేనని అనుకునేదాన్ని. అయినప్పటికీ ఏదో ఒక కమర్షియల్ డైరెక్టకర్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడని ఎప్పుడూ ఊహల్లో తేలిపోలేదు. నాకు తెలిసిందల్లా ఆడిషన్స్కు వెళ్లడం, 100% ఎఫర్ట్ పెట్టడం!' అని చెప్పుకొచ్చింది శోభిత. కాగా ఈ తెలుగందం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో నటించింది. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్యే ద నైట్ మేనేజర్ అనే సిరీస్తో అలరించింది. చదవండి: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: నటుడు -
సమ్మర్లో మరింత హీటెక్కిస్తున్న శోభిత ధూళిపాళ అందాలు (ఫోటోలు)
-
చైతో డేటింగ్ అంటూ రూమర్స్.. స్పందించిన శోభిత ధూళిపాళ
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటారు అభిమానులు. ఈ క్రమంలో తారల లవ్, డేటింగ్, పెళ్లి, విడాకులు వంటి విషయాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇద్దరు సెలబ్రిటీలు బయట కలిసి కనిపించారంటే చాలు వారిది స్నేహమా? ప్రేమా? అని డౌటానుమానాలు వ్యక్తం చేస్తారు. వారు దానిపై క్లారిటీ ఇచ్చేంతవరకు వారిని లవ్ బర్డ్స్గానే పరిగణిస్తారు. ఈ క్రమంలో నాగచైతన్య- శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తరచూ తెరపైకి వస్తునే ఉన్నాయి. ఓసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్కు మరింత బలం చేకూరింది. సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితతో ప్రేమలో పడ్డాడని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. తాజాగా తనపై వచ్చే రూమర్లపై శోభిత ధూళిపాళ స్పందించింది. 'నేను మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్లో ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాను. ఇందులో ఏఆర్ రెహమాన్ పాటలకు డ్యాన్స్ చేయడం అద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన పని లేదు. ఆ రూమర్తో నాకసలు సంబంధమే లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు అర్జంటుగా వెళ్లి క్లారిటీ ఇచ్చేయాలని ఎందుకనిపిస్తుంది. ఏ తప్పూ చేయనప్పుడు కంగారుపడాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను' అని చెప్పుకొచ్చింది శోభిత. చదవండి: వంద సినిమాలు చేశా, సంపాదించినదంతా పోగొట్టుకున్నా: కమెడియన్ -
Sobhita Dhulipala Photos: చీరలో శోభిత వయ్యారాలు.. ఫొటోలు
నటి శోభిత ధూళిపాళ ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తోందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు ఇటీవల లండన్లో వీరిద్దరు లంచ్ డేట్కు వెళ్లిన ఫొటో బయటకు వచ్చింది అప్పటి నుంచి శోభిత ధూళిపాళకు సంబంధించిన ఏ వార్త అయిన ఇండస్ట్రీలో హాట్టాపిక్ మారింది తెలుగు అమ్మాయి అయిన శోభిత గుఢాచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది హాలీవుడ్లోనూ ‘మంకీ మ్యాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటించింది భాషతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో అలరిస్తోంది అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తరచూ తన హాట్హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతిపొగోడుతుంది తాజాగా శారీలో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి -
పెళ్లిలో సమంతతో దిగిన ఫోటో నా ఫేవరెట్: శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ పేరు గత నాలుగైదు రోజులుగా మార్మోగిపోతోంది. సోదరి సమంత పెళ్లిలో తెగ హల్చల్ చేస్తున్న శోభిత అందుకు సంబంధించిన ఫోటోలను, మధుర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో సమంత పెళ్లిలో శోభిత హల్చల్ అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మే కనిపిస్తోంది. మెహందీ, హల్దీ, పెళ్లి ఫోటోలు షేర్ చేసిన శోభిత తాజాగా మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఇదే చివరిది.. ఢిల్లీలో జరిగిన రిసెప్షన్లో నేను కట్టుకున్న చీర ఇదే! నాకు టైఫాయిడ్ మళ్లీ వచ్చేలా కనిపిస్తోంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా మూడు రకాల పానీలతో పానీపూరి తిన్నాను. ఇకపోతే నేను షేర్ చేసినవాటిలో రెండు ఫోటోలు నా ఫేవరెట్. ఒకటి సమంత క్యూట్గా నవ్వుతోంది. రెండోది.. నాలో తారా ఖన్నా (మేడ్ ఇన్ హెవన్ వెబ్సిరీస్లో శోభిత ధూళిపాళ పోషించిన పాత్ర) వైబ్స్ కనిపిస్తున్నాయి. కాదంటారా? నేను చేతిలో సమంత పర్సు పట్టుకున్నాను, కానీ అందులో ఏం లేదు అని రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా గూఢచారి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
Samantha: సామ్ అంతమాట అనేసిందా?
సమంత- నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా వీరికి పేరుంది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. తమ దారులు వేరంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే చై-సామ్లు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లండన్లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ డేట్కు వెళ్లడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత నాగచైతన్య డేటింగ్ రూమర్స్పై స్పందించినట్లు వార్తలు వచ్చాయి.'ఎవరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది' అంటూ సామ్ పేర్కొన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ మాటలు తాను అనలేదంటూ స్వయంగా సామ్ ట్వీట్ చేసింది. కాగా 2017లో ప్రేమపెళ్లి చేసుకున్న చై-సామ్లు 2021లో విడాకులు తీసుకున్నారు. -
సమంతను తొలిసారి పెళ్లిమండపంలో చూసి ఏడ్చేశా: శోభిత
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో డేటింగ్ చేస్తుందంటూ ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల లండన్లోని ఓ రెస్టారెంట్లో చైతో కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. సమంతకు విడాకులిచ్చిన తర్వాత చై.. శోభితకు దగ్గరయ్యాడంటూ వీరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై అటు చైతూ కానీ, ఇటు శోభిత కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇకపోతే తాజాగా శోభిత ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టులు షేర్ చేసింది. 'మెహందీ ఫంక్షన్.. ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే తొలిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇంకా రెడీ అవకుండా నాకు తోడుగా ఉంది. నేను తారా ఖన్నా(మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్లో శోభిత నటించిన పాత్ర)లా మారిపోయి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నా. అందుకే ముస్తాబవడానికి సమయం లేకుండా పోయింది. కానీ పెళ్లిమండపంలో సమంతను మొదటిసారి చూడగానే ఏడుపాగలేదు. ఇక్కడ మెహందీ పెట్టడం కుదరలేదు కానీ లంచ్ మాత్రం అద్భుతంగా ఉంది' అంటూ పెళ్లి మండపంలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. మరో పోస్ట్లో 'సంగీత్ వేడుక.. నా సోదరికి డ్యాన్స్ మీదున్న పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంధువులు, సోదరులు, స్నేహితులు, వాళ్ల స్నేహితులు.. ఇలా అందరూ వచ్చేశారు. ఆటలు, పాటలు, మధ్యమధ్యలో ర్యాగింగ్.. సమయం చూస్తుండగానే ఉదయం నాలుగైంది. పార్టీ అయిపోయినా కూడా మా సందడి మాత్రం అలాగే కొనసాగింది. ఇది ఒక స్వచ్ఛమైన వేడుక, ఎన్నటికీ మర్చిపోలేనిది. సంగీత్ మేము, మా ఫ్రెండ్స్ అంతా వడచెన్నైలోని సంధానత పాటకు డ్యాన్స్ చేశాం' అని రాసుకొచ్చింది. దీనికి సంగీత్ ఫోటోలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇది వెబ్సిరీస్ షూటింగా? లేదంటే నిజంగానే ఎవరి పెళ్లైనా జరిగిందా? అని కామెంట్లు చేస్తున్నారు. శోభిత ట్యాగ్ చేసిన సమంత అకౌంట్ వివరాలు చూస్తుంటే ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె పెళ్లి విశేషాలనే శోభిత షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Karan Gill (@karan_dance) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) -
ముంబై ఎయిర్ పోర్ట్లో శోభిత ధూళిపాళ సందడి
-
గూఢచారి హీరోయిన్ తో నాగ చైతన్య లవ్ ?
-
లండన్లో హీరోయిన్తో చైతూ.. మరోసారి డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటి శోభిత దూళిపాళ్లతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ నడిచింది. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చైతూకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తాజాగా నాగ చైతన్య లండన్లోని ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ కూడా ఉండడంతో వైరల్గా మారింది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుమార్లు గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. లండన్లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్లో నాగ చైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో శోభిత ధూళిపాళ టేబుల్ దగ్గర కనిపించడం అభిమానుల్లో మరింత అయితే గతేడాది నవంబర్లో లండన్ వెకేషన్కు వెళ్లిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలిసి ఉన్న ఫోటో ఆన్లైన్లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. గతంలో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఈ విషయంపై చైతూను ప్రశ్నించగా నవ్వుతూ వెళ్లిపోయారు. కాగా.. ఇటీవలే హైదరాబాద్లోని కొత్తగా ఓ ఇంటికి షిఫ్ట్ అయ్యారు నాగ చైతన్య. అయితే వీరిద్దరిపై రిలేషన్పై ఎవరూ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Surender Mohan (@chefsurendermohan) -
నేను అందంగా లేనని మొహం మీదే అన్నారు.. కానీ: శోభిత
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఆమె హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్ లైఫ్తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో కనిపించింది. తాజాగా గతంలో ఎదురైనా ఓ సంఘటనను గుర్తు చేసుకుంది శోభిత. మొదట మోడల్గా పని చేస్తున్న రోజుల్లో ఆడిషన్స్కు వెళ్తే ఎవ్వరూ కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపింది. ఓ ప్రముఖ కంపెనీ తనను బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికి రావన్నారని.. కానీ ఆ తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని చెప్పుకొచ్చింది శోభిత. శోభిత మాట్లాడుతూ.. 'నేను అందంగా లేనని ఓ కంపెనీ వాళ్లు అన్నారు. నేను కూడా వెంటనే అవును అని ఒప్పుకున్నా. నా 20 ఏళ్ల వయసులో ఓ షాంపు కంపెనీకి వాణిజ్య ప్రకటన కోసం వెళ్లా. ఆ సమయంలో తనను బ్యాక్ గ్రౌండ్ మోడల్గా కూడా పనికి రావు అన్నారు. కొంతకాలం తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేసింది శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఆమె నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ రెండో భాగం ఈ ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పచ్చిపాలు, శనగపిండి.. ఇంకా ఆముదం నూనె.. ఇదే నా బ్యూటీ సీక్రెట్!
Sobhita dhulipala- Beauty Tips: మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగందం శోభితా ధూళిపాళ. 2013 నాటి పోటీల్లో అందాల రాణి కిరీటం కైవసం చేసుకున్న ఆమె.. సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు. నా బ్యూటీ సీక్రెట్ అదే ఇక అందంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్న శోభితా.. తన చర్మ సౌందర్యానికి గల కారణాలు వెల్లడించారు. అమ్మ చెప్పిన చిట్కాలే తన ముఖం కాంతులీనడానికి కారణం అంటున్నారు. ‘అప్పుడప్పుడు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. రెగ్యులర్గా ఫ్రూట్ పల్ప్తో మసాజ్ చేసుకుంటాను. అలాగే పచ్చిపాలను క్లెన్సింగ్కి ఉపయోగిస్తాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకుంటాను. ఆముదం నూనెనేమో కనుబొమలకు బ్రష్ చేస్తాను.. ఇవండీ నా బ్యూటీ సీక్రెట్స్!’ అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ దాకా.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో నటిగా నిరూపించుకున్న ఆమె.. ‘మంకీమేన్’తో హాలీవుడ్లోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ సిరీస్తో బిజీగా ఉన్నారు. చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ ప్రత్యేకత అదే! -
హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న శోభిత ధూళిపాల.. ఫోటో వైరల్
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శోభిత రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్ లైఫ్తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్లో ఉందంటూ వార్తలు గుప్పమంటున్నాయి. మొన్నటికి మొన్న దుబాయ్లో పెళ్లంటూ కొన్ని వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసి చివరికి అది ఓ యాడ్ కోసమంటూ తేల్చేసింది. ఇలా వరుసగా వార్తల్లో నిలుస్తున్న శోభిత తాజాగా హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్. ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నట్లు శోభిత స్వయంగా ఫోటోను షేర్చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన హీరోయిన్!
మేజర్, గూఢచారి సినిమాలతో అలరించిన నటి శోభిత ధూళిపాల. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న శోభిత ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓ వ్యక్తితో చేతిలో చెయ్యేసి పెళ్లి కూతురిలా అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా శోభిత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అని క్యాప్షన్ ఇవ్వడంతో నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందా అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇవి పెళ్లికి సంబంధించి ఓ యాడ్ షూట్లో భాగంగా తీసిన ఫోటోలట. ఈ క్రమంలో శోభిత అభిమాని ఒకరు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
శోభిత ధూళిపాళ కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ రేంజ్ అలాంటిది మరి!
ఎప్పుడో గానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు. ‘గూఢచారి’ చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాదు హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. శోభిత హాలీవుడ్ స్క్రీన్ పరిచయానికి ఆమె యూనిక్ స్టయిలే కారణం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆ స్టయిల్ ఏంటో చూద్దాం... తరుణ్ తహిలియానీ.... తరుణ్ తహిలియానీ .. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్. భార్య శైలజా సాల్ తహిలియానీతో కలసి 1987లో మల్టీ–డిజైనర్ బోటిక్ స్థాపించాడు. తర్వాత 1990లో తహిలియానీ డిజైన్ స్టూడియో కూడా ప్రారంభించాడు. భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి అతని డిజైన్స్! ముఖ్యంగా సంప్రదాయ సౌందర్యాన్ని ఆధునిక డిజైన్స్తో సమ్మిళితం చేయడం అతని సిగ్నేచర్ స్టయిల్. పెళ్లి దుస్తులకు పెట్టింది పేరు. ఈ మధ్యనే ఈవెంట్ డిజైనింగ్నూ ప్రారంభించాడు. అయితే తహిలియానీ డిజైన్స్ను సామాన్యులు అందుకోవడం అసాధ్యమే. ఆన్ లైన్లో లభ్యం. ఆమ్రపాలి జ్యూయెలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు ఈ ఇద్దరూ. ఆమ్రపాలి.. ట్రైబల్ డిజైన్స్కు ప్రసిద్ధి. చాలా మంది సెలబ్రిటీస్కి ఇది ఫేవరేట్ బ్రాండ్. ఆన్లైన్లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: తరుణ్ తహిలియానీ ధర: రూ. 4,79,900 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ దుస్తులను వెస్టర్న్ లుక్లో.. అంటే సౌకర్యంగా ఉండేలా వేసుకోవడమే నాకు నచ్చే.. నేను మెచ్చే స్టయిల్. నిజానికి దుస్తులకంటే ఆభరణాల ఫ్యాషన్ పైనే నాకు ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా కమర్బంధ్(వడ్డాణం) అన్నా డైమండ్స్ అన్నా చాలా ఇష్టం. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నానో దాన్నిబట్టి ఉంటుంది నా ఫ్యాషన్ స్టయిల్! – శోభిత ధూళిపాళ -దీపిక కొండి చదవండి: Gota Work: గోటా పట్టి.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! -
ఆ హీరోయిన్తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై
అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగా ఉంచుతాడు. అందుకే సోషల్ మీడియా, మీడియా ముందుకు చాలా అరుదుగా వస్తాడు. వృత్తిపరమైన విషయాలనే పంచుకునే చై వ్యక్తిగత జీవితంపై ఇటీవల రూమర్లు వస్తున్న సంగతి తెలిసింది. హీరోయిన్ సమంతతో విడాకులు అనంతరం నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్తో చైతన్య డేటింగ్ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న రూమర్లు, హీరోయిన్తో ప్రేమాయణం వంటి వార్తలపై స్పందించాడు చై. చదవండి: స్టార్ హీరోకి ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! నాగ చైన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన చైకి హీరోయిన్తో డేటింగ్ రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా అతడు స్పందిస్తూ.. ‘ఈ మధ్య నాపై రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం ఏదోక పుకార్లు బయటకు వస్తుంది. వాటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి అసలు సంబంధమే లేని పుకార్లు సృష్టిస్తున్నారు. అసలు అవి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ప్రారంభంలో వాటిని చూసి నవ్వుకునే వాడిని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు’ అంటూ పరోక్షంగా తాను ఏ హీరోయిన్తో ప్రేమలో లేనని స్పష్టం చేశాడు. చదవండి: డ్రెస్సింగ్పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు కాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. ఇటీవల ఈ పుకార్పై స్పందించిన శోభితా ఆ వార్తలను కొట్టిపారేసియగా.. తాజాగా చై సైతం ఖండిచాడు. దీంతో ఇకనైనా ఇలాంటి వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి. ఇకపోతే లాల్ సింగ్ చద్దాతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చై బాలరాజు అనే ఆర్మీ యువకుడి పాత్ర పోషిస్తున్నాడు. -
నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్పై శోభిత రియాక్షన్ ఇదే!
సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలే కాదు, వారి వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తారలు ఎవరితోనైనా కొంచెం క్లోజ్గా కనిపించినా వారితో డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టుకొస్తాయి. కొందరు తారలు వీటిపై స్పందించి క్లారిటీ ఇస్తే, మరికొందరేమో దాన్నసలు ఖాతరే చేయరు. ఈ క్రమంలో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇకపోతే నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అటు చై కానీ ఇటు శోభిత కానీ స్పందించనేలేదు. అయితే ఈ రూమర్లకు మేజర్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో శోభిత మధ్య వేలును చూపిస్తూ తన కోపాన్ని వెల్లగక్కింది. తన మీద లేనిపోని పుకార్లు సృష్టించిన వారికి ఈ వీడియోతో శోభిత గట్టి సమాధానం చెప్పిందంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు మాత్రం శోభిత స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్కడా ఈ వీడియో పోస్ట్ చేయలేదని, ఇదేదో పాత వీడియో అయి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. శోభిత ధూళిపాళ ఇటీవలే మేజర్ చిత్రంతో అలరించింది. అటు నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’, 'లాల్ సింగ్ చద్దా' సినిమాలు, 'దూత' వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానున్నాయి. To everyone who made a mess A reply can't better than this 💥💥 pic.twitter.com/alHr0qb0gV — Arisetty Prasad (@PrasadAGVR) June 24, 2022 చదవండి: నాలుక కట్ చేసుకో.. బండ్ల గణేశ్కు పూరీ జగన్నాథ్ వార్నింగ్?! నా ప్రియుడికి నచ్చట్లే, అందుకే ఎక్స్పోజింగ్ మానేశా: నటి -
నాగ చైతన్యను వెంటాడుతున్న గాసిప్స్.. అంత ఈజీ కాదట!
నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కేవలం కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే తన ఫోకస్ను డిస్ట్రాక్ట్ చేసే విధంగా తరచూ తన పర్సనల్ లైఫ్పై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.ఒకసారి ఒక హీరోయిన్తో డేటింగ్ అంటే.. మరోసారి మరో కథానాయికతో పెళ్లంటూ చైతూని రూమర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. శోభిత ధూళిపాళ(గూఢచారి, మేజర్ ఫేం)తో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరు ప్రస్తుతం డీప్ లవ్లో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు గత నెల శోభిత బర్త్ డేను చై గ్రాండ్ గా నిర్వహించాడట. ఇలా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ రూమర్ స్టోరీలో నిజమెంత అనేది తెలియాలంటే చై నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (చదవండి: ఆ హీరోయిన్తో నాగచైతన్య డేటింగ్.. స్పందించిన సమంత, ట్వీట్ వైరల్) గతంలో కూడా చైపై ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. శోభిత కంటే ముందు మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్తో చై ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. అయితే చైతూ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్తో సినిమా మూవీ స్టార్ట్ చేయనున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ కూడా నాగ చైతన్యను స్టోరీ వినిపించినట్లు వార్తలు వినిపించాయి. ఇలా కేరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. ఇప్పటికిప్పుడు మళ్లీ న్యూ రిలేషన్ను స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -
సోషల్ మీడియా కథనాలపై సమంత ఫైర్