Cancer
-
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్తో కాదు క్యాన్సర్తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్తో చనిపోయాడనే లెటర్తో పాటు అంబులెన్స్ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మలయాళ మెగాస్టార్పై రూమర్స్.. స్పందించిన టీమ్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై ఆయన టీమ్ స్పందించింది. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన స్టార్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో రాస్తూ.. 'ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్" అని స్పష్టం చేశారు.కాగా.. మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. -
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్ విజేత డీజే డేనియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. పోలీసు ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా చేయాలని డైరెక్టర్ సీన్ కరన్ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు. -
ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్కుమార్
కన్నడ స్టార్ శివరాజ్కుమార్ (Shivarajkumar)కు సినిమాలపై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకనే.. ఓ పక్క క్యాన్సర్తో బాధపడుతున్నా సరే ఇటు షూటింగ్స్ వదల్లేదు. అటు కీమోథెరపీ చేయించుకుంటూనే ఇటు షూటింగ్లో పాల్గొన్నాడు. చికిత్సలో భాగంగా ఇటీవలే అమెరికాలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.ఇంకేం చేయగలను?నిజాయితీగా చెప్పాలంటే.. నాకు క్యాన్సర్ (Bladder Cancer) సోకిందన్న విషయం తెలియగానే భయపడ్డాను. కానీ దాన్ని ఎదుర్కోవడం తప్ప ఇంకేం చేయగలను? అయితే నేను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయగలనా? లేదా? అన్నదే నా ముందున్న పెద్ద ప్రశ్న! సినిమాలు చేస్తూ డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ అనే రియాలిటీ షోకు హాజరవుతూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుందని తెలుసు. దీనివల్ల నా సినిమా లుక్ దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాను. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్చికిత్స తీసుకుంటూ షూటింగ్స్కు వెళ్లడం వల్ల త్వరగా అలిసిపోయిన ఫీలింగ్ వచ్చేది. అందులోనూ కీమోథెరపీ తర్వాత సెట్లో అడుగుపెట్టినప్పుడు నా ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే 45 సినిమాలో క్లైమాక్స్ షూట్ కూడా పూర్తి చేశాం. అందులో నా పర్ఫామెన్స్ చూసి మీరు కచ్చితంగా షాకవుతారు. శివన్నా ఎలా చేయగలిగాడు? అని ఆశ్చర్యపోతారు. ఇకపోతే ఆ భగవంతుడే నన్ను ఈ క్యాన్సర్ గండం నుంచి గట్టెక్కించాడు.అప్పటినుంచే తిరిగి షూటింగ్స్లో..మార్చి 3 నుంచి నా తర్వాతి సినిమాల షూటింగ్స్లో పాల్గొంటాను. రామ్చరణ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాను. మార్చి 5న హైదరాబాద్లో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్కు హాజరు కానున్నాను అని చెప్పుకొచ్చాడు. శివరాజ్కుమార్ చివరగా భైరతి రణగల్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన 45 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ సామ్ రియాక్షన్ -
ప్లాస్టిక్ కవర్పై ఇడ్లీ చాలా డెడ్లీ
రంగు కలిపిన బొంబై మిఠాయి తింటే ఉదరకోశ రోగాలు, క్యాన్సర్ రావచ్చునని గతంలో సర్కారు హెచ్చరించింది. అదే రంగు కలిపిన చికెన్ పకోడా, గోబీ ఆరగిస్తే కూడా జబ్బులు తప్పవని హెచ్చరించి రంగులను నిషేధించింది. ఇప్పుడు ఇడ్లీలకు అలర్ట్ జారీ అయ్యింది. ప్లాస్టిక్ కవర్లు వేసి వండిన ఇడ్లీలను తినరాదని, క్యాన్సర్ ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాల్సిందే.బనశంకరి : ప్రతి ఇంటా, హోటల్లో ఇడ్లీలు చేస్తారు, కడుపారా ఆరగించి ఆకలి తీర్చుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇడ్లీ తగిన ఆహారం. కానీ వండే సమయంలో తప్పుడు విధానాల వల్ల క్యాన్సర్కు గురి కావచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ఇదే విషయం చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు.. ప్రమాదం ఇడ్లీలను వండడానికి కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ పేపర్లు ఉపయోగిస్తారు, ప్లాస్టిక్లో క్యాన్సర్ కారకాలు చేరడం వల్ల ఆ ఇడ్లీలను తినడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ నివేదికలు ప్రభుత్వం చేతికి రెండురోజుల్లో అందుతాయని మంత్రి దినేశ్ చెప్పారు. ఇటీవలి కాలంలో ఇడ్లీల తయారీలో, వడ్డించడంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికమైంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్స్లో, క్యాంటీన్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ కవర్లను వాడరాదని నిషేధం విధించామన్నారు. మరో రెండురోజుల్లో అధికారిక ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు, పెద్ద పెద్ద హోటల్స్లో ఇడ్లీ తయారీలో, పార్శిల్ కట్టడంలో ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. దీనిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. అందులోనే ఇడ్లీ తయారీదారులకు సలహాలు, సూచనలు ఉంటాయన్నారు. నమూనాల పరీక్షల్లో వెల్లడిరాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది బెంగళూరుతో పాటు పలు జిల్లాల నుంచి ఇడ్లీల్లో ప్లాస్టిక్ కవర్లు వాడే చోట్ల నుంచి 500 శాంపిల్స్ను పరిశీలించారు. ఇందులో 35 నివేదికలు సాధారణం కాగా పలు నివేదికల్లో క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయి. ఇడ్లీలు సులభంగా ఊడి రావడానికి ప్లాస్టిక్ పేపర్ పరిచి దానిపై ఇడ్లీ పిండి వేసి వేడి చేస్తారు. నిజానికి అక్కడ తెల్ల నూలు బట్టను వాడాలి. ప్లాస్టిక్ కవర్ అధిక వేడిమి వల్ల ప్రమాదకర రసాయాలను విడుదల చేస్తుంది. అవి కాస్తా ఇడ్లీల్లోకి, ఆపై శరీరంలోకి చేరుతాయి. దీంతో క్యాన్సర్, గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలు తలెత్తుతాయి. -
ఇండియాలో క్యాన్సర్ విస్ఫోటం
దేశంలో క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా క్యాన్సర్ బారినపడుతున్నట్లు తెలియజేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని హెచ్చరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికను లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ–2022 అంచనాల ఆధారంగా గణాంకాలు రూపొందించారు. ఇందుకోసం 36 రకాల క్యాన్సర్లు, నాలుగు రకాల వయసు గ్రూప్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. → క్యాన్సర్ సంబంధిత మరణాల్లో చైనాది మొదటిస్థానం కాగా ఇండియాది రెండోస్థానం. → ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు. → పురుషులు, మహిళల్లో లంగ్ క్యాన్సర్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. → భారత్లో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు తక్కువగా కనిపిస్తోంది. → యువతీ యువకుల కంటే వృద్ధులకు క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉంది. → ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుంది. తద్వారా క్యాన్సర్ రేటు సైతం పెరగనుంది. → మధ్య వయసు్కలు, వృద్ధులతో పోలిస్తే చిన్నారులు, యువతకు క్యాన్సర్ ముప్పు అంతగా లేదు. → మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలు ప్రతిఏటా 1.2 శాతం నుంచి 4.4 శాతం పెరుగుతున్నాయి. పురుషుల్లో ఇది 1.2 శాతం నుంచి 2.4 శాతంగా ఉంది. → 2022 నుంచి 2050 వరకు క్యాన్సర్ సంబంధిత మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. → దేశంలో 2012 నుంచి 2022 వరకు క్యాన్సర్ కేసులు 36 శాతం పెరిగాయి. 2012లో 10.1 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 13.8 లక్షల కేసులు నమోదయ్యాయి. → అదే సమయంలో క్యాన్సర్ సంబంధిత మరణాలు 30.3 శాతం పెరిగాయి. 2021లో 6.8 లక్షల మంది, 2022లో 8.9 లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతిచెందారు. → క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఏకంగా 70% మంది మధ్య వయస్కులు, వృద్ధులే ఉంటున్నారు. → క్యాన్సర్ నియంత్రణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోందని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్యాన్సర్ రోగులకు వరం.. యశోదలో అందుబాటులోకి ఆ కొత్త చికిత్స
-
చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)
-
భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్
కేన్సర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహిళలను ప్రభావితం చేసే కేన్సర్లను ఎదుర్కోవడానికి టీకా ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని, 9-16 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు టీకాలు తీసుకోవడానికి అర్హులని కేంద్ర మంత్రిప్రకటించారు. ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందన్నారు.దేశంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది, ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు కేంద్రంమంత్రి తెలిపారు.. 30 ఏండ్ల పైబడిన మహిళలకు ఆ సుపత్రిల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేన్సర్ను ముందుగానే గుర్తించడానికి డే కేర్ కేన్సర్ కేంద్రాలను నెలకొల్పుతామని కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. . ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలున్నాయని.. ప్రజలు వాటిని వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పెంచుతోందని ఆయన అన్నారు. కాగా మన దేశంలో మహిళల్లో రొమ్ము కేన్సర్ బాగా కనిపిస్తోంది. అదే పురుషుల్లో అయితే ఊపిరితిత్తుల అత్యధికంగా విస్తరిస్తోంది. చిన్నపిల్లలో లింఫోయిడ్ లుకేమియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. స్త్రీ జననేంద్రియ కేన్సర్లో ప్రధానంగా ఐదు కాలుఉన్నాయి. గర్భాశయ ముఖద్వార, అండాశయ, గర్భాశయ, యోని అండ్ వల్వార్. ఆరవది చాలా అరుదైనది ఫెలోపియన్ ట్యూబ్ కేన్సర్ . చదవండి: ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్మార్ట్ -
విశాఖపట్నం బీచ్రోడ్డులో పింక్ శారీ వాక్ సినీనటి గౌతమి సందడి (ఫొటోలు)
-
సార్కోమాను ఎదుర్కోలేమా!
దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్కూ, టెండన్స్కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్ కనెక్టివ్ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్టైప్స్ ఉంటాయి. ఈ కేన్సర్ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్టైప్స్గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్ సార్కోమా’. రిస్క్ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)... ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం... హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్ క్లోరైడ్ లేదా డయాక్సిన్స్ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా బాధితులు ఎక్కువ. ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్’ వంటి సిండ్రోములు, జెనెటిక్ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. నిర్ధారణ... సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్ ఉపకరణాలు సహాయపడతాయి. మృదు కణజాలంలో (సాఫ్ట్ టిష్యూల్లో) వచ్చే కేన్సర్ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, రేడియోషన్ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్ అయిన అలారా (ఏజ్ లో ఏజ్ రీజనబ్లీ అచీవబుల్) టెక్నిక్తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. ఇక పెట్–సీటీ, రేడియోమిక్స్ వంటి అధునాతన టెక్నిక్స్తో అవి హానికరం కాని బినైన్ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్ స్పేరింగ్ సర్జరీస్), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్ స్పెసిఫిక్ ఇం΄్లాంట్స్)తో... ఆ తొలగించిన చోట ఇంప్లాంట్స్ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్లిప్పుడు అందుబాటులో అత్యంత ఆధునికమైన ప్రోటాన్ థెరపీ, ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా చేసే రేడియోథెరపీ. రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. ఇవేకాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్–టీ సెల్ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. --డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్, మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
బడ్జెట్లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టుక్యాన్సర్పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు. -
కొత్త ‘వెపన్స్’తో కేన్సర్పై ‘వార్’
ప్రస్తుతం మానవాళిని వణికిస్తోన్న అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. దీనికి సంబంధించిన చికిత్సలతో పాటు కొత్త కొత్త కేన్సర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 4) కేన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు అందిస్తున్న కొన్ని కొత్త చికిత్సా విధానాలు ఒకసారి చూద్దాం.అందుబాటులోకి అత్యాధునిక చికిత్సలు..ఓ వైపు కేన్సర్ వ్యాధి విజృంభణతో పాటు మరోవైపు ఆ వ్యాధి చికిత్సకు సంబంధించి అనేక కొత్త కొత్త పద్ధతులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని కేన్సర్లకు సంబంధించి ఇటీవల ట్రీట్మెంట్ అడ్వాన్స్ చికిత్సా విధానాలు బాగా ఎక్కువయ్యాయి. రోగుల క్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు ఆయా చికిత్సలను మేం అందిపుచ్చుకోవాల్సిందే.. అనుసరించాల్సిందే. ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ ఎక్కువ ఉపయోగించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్కు సంబంధించి సెంటినల్ లింఫ్ మోడ్ బయాప్సీ అనే కాన్సెప్ట్ ఒకటి. దీని ద్వారా సంక భాగంలో సర్జరీ అసవరాన్ని నివారించవచ్చు. ఇదే విధంగా రేడియేషన్స్లో కూడా కేవలం కేన్సర్ సోకిన ప్రదేశంలోని గడ్డ వరకే రేడియేషన్ చేసే టెక్నిక్స్ వచ్చాయి. దీని వల్ల సైడ్ అఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా రీ కన్స్ట్రక్షన్స్... అంటే సర్జరీ తర్వాత కాస్మెటిక్ సర్జరీ బాగా ఎక్కువైంది. కొంత మంది పేషెంట్స్కి బ్రెస్ట్ కేన్సర్కి రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నాం. థైరాయిడ్ కేన్సర్ చికిత్సలో ‘స్కార్ లెస్ నెక్ సర్జరీ విత్ రోబోటిక్’ వంటివి వచ్చాయి. అంటే మెడ మీద మచ్చ లేకుండానే సర్జరీ చేసే ఛాన్సుంది.ఇక పాంక్రియాటిక్ కేన్సర్ చికిత్సలో రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది దీని వల్ల అతి తక్కువగా లేదా అసలు ఐసీయూలో ఉండాల్సిన అవసరం లేకుండా, అలాగే హాస్పిటల్లో ఉండాల్సిన సమయం బాగా తగ్గించేస్తూ రికవరీ త్వరగా అవుతుంది. అలాగే హైటెక్ అనే కొత్త కాన్సెప్ట్ను కూడా అండాశయ కేన్సర్లకు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగిస్తున్నారు. అవయవాన్ని కాపాడుతూ కేన్సర్ చికిత్స చేసే ఆర్గాన్ కన్సర్వేషన్ కూడా కొత్తగా వచ్చిందే. వ్యాధి రాక ముందే పోగొట్టవచ్చు...అంతేకాకుండా కేన్సర్ చికిత్సలో జెనెటిక్ రీసెర్చ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల కేన్సర్ని రాక ముందుగానే గుర్తించి తగిన చికిత్స ఇవ్వొచ్చు తద్వారా . కేన్సర్ డెవలప్ రాకుండానే సర్జరీ చేసేస్తారు. అదే విధంగా పెట్ స్కాన్ లాగే పెట్ ఎంఆర్ అనే కొత్త డయాగ్నసిస్ కూడా ఒకటి.–డా.మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్రోబొటిక్ సర్జన్, కిమ్స్ ఆసుపత్రి. -
World Cancer Day: క్యాన్సర్ను జయించిన క్రికెట్ యోధులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్తో బాధ పడ్డాడు.ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.జెఫ్రీ బాయ్కాట్: ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్కాట్ గొంతు క్యాన్సర్పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్ను జయించాక బాయ్కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్కాట్ వయసు 84 ఏళ్లు. -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
కేన్సర్ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!
సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా సంన్నకుటుంబాల వాళ్లు కేన్సర్ బారినపడి జయించడం అనేది వేరు. ఎందుకంటే అత్యాధునిక వైద్యం పొందే ఆర్థిక స్థోమత వారికి ఉంటుంది. ఆ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చులు తట్టుకోగలరు. కేవలం వాళ్లు ధైర్యంగా చికిత్స చేయించుకుంటే చాలు. అదే సామాన్యుడు.. అందులోనూ ఓ మధ్య తరగతివాడు ఇలాంటి కేన్సర్ బారినపడితే అతడి పరిస్థితి తలకిందులైపోవడం లేదా కుటుంబమే రోడ్డున పడిపోతుంది. ఇక్కడ అలానే ఓ మధ్యతరగతికి చెందిన భార్యభర్తలిద్దరూ కేన్సర్ బారిన పడ్డారు. అయితే వారిద్దరూ కేన్సర్ని జయించి ఏకంగా లక్షల టర్నోవర్ చేసేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారెవరంటే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరానికి చెందిన దంపతులు లవీనా జైన్(Laveena Jain), ఆమె భర్త ఓ ప్రైవేటు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి కేన్సర్(cancer) మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది. భార్యభర్తలిద్దరూ 2010లో కేన్సర్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం అంటే తలకు మించిన భారమే. అందులోనూ ఇరువురు కేన్సర్ బారినపడ్డారు. లవీనాకు రొమ్ము కేన్సర్(Breast Cancer), ఆమె భర్తకు నోటి కేన్సర్(Mouth Cancer)..ఇలా ఇద్దరికి అయ్యే చికిత్సా ఖర్చులు, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీంటిని ఎలా నిర్వహించాలన్న ప్రశ్నలే ఆ దంపతులను వేధించాయి. ఏదో రకంగా ఇద్దరం దీన్నుంచి బయటపడితే పిల్లలని చూసుగోలమన్నా నిశ్చయానికి వచ్చి స్నేహితులు, తెలిసిన వాళ్లు బంధువుల దగ్గర అందినకాడికి అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకున్నారు. నిజానికి అవి తీర్చగలుగుతామా అన్న ఆలోచన లేకుండానే ఆ దంపతులు ముందు ఈ మహమ్మారిపై గెలవాలన్న సంకల్పంతో పోరాడారు. అలా ఇద్దరు కఠినమైన కీమోథెరపీ, రేడియోథెరపీలు చేయించుకుని కోలుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆర్థిక కష్టాలు మాములుగా మొదలవ్వలేదు. కుటుంబాన్ని ఎలా నడపాలన్నిది అర్థం కాలేదు. ఆ వ్యాధి నుంచి బయటపడ్డామంటే..మరోవైపు తినడానికే గుప్పుడు బియ్యం లేని గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఆ మహ్మమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలు తాళ్లలేక చనిపోవాలన్నంత నరకయాతన అనుభవించారు. అయితే లవీనా కేన్సర్ నుంచి కోలుకుని మాములు స్థితికి వచ్చింది గానీ ఆమె భర్తకి మాత్రం నోటి కేన్సర్ కారణంగా మాట రావడానికి టైం పడుతుందని చెప్పారు వైద్యులు. మరోవైపు చుట్టుముడుతున్న ఈ కష్టాల మధ్య ఆ దంపతులు తమ ఇంటిని అమ్మక తప్పలేదు. అలాంటి పరిస్థితిలో లవీనాకు తన చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న పాకనైపుణ్యం గుర్తొచ్చింది. సరదాగా నేర్చుకున్న ఆహార సంరక్షణ కోర్సు ఇలా ఉపయోగపడుతుందని లవీనా ఊహించలేదు. ఆ కోర్సులో భాగంగా మురబ్బా, ఊరగాయలు, జామ్లు తయారు చేయడం నేర్చుకున్న కళే తనకు ఆధారం అని భావించింది లవీనా. సరిగ్గా ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార సంరక్షణకు సంబంధించిన వందరోజుల ఉపాధి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. వెంటనే లవీనా అందులో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకుంది. అయితే వ్యాపారం పెట్టేందుకు ఆమె వద్ద కేవలం రూ. 1500/-లు మాత్రమే ఉన్నాయి. దాంతోనే 'లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్' అనే పచ్చళ్ల ఫుడ్స్టార్టప్ని ప్రారంభించింది. లవీనా స్వయంగా ఇంట్లో తయారు చేసే స్క్వాష్, జామ్లు, ఊరగాయలు విక్రయించేది. అయితే విక్రయాలు అంత ఈజీగా జరగలేదు. తయారుచేయడమే ఈజీ వాటిని ప్రజల వద్దకు చేరేలా చేయడమే అత్యంత కష్టమని తెలిసిందామెకు. అసలు వ్యాపార కిటుకేంటో తెలియక ఎన్నో ఇక్కట్లు పడింది. ఎలా ప్రజలకు తన వ్యాపారం గురించి తెలిపి విక్రయాలు ఊపందుకునేలా చేయాలన్నది ఆమెకు ఓ పెద్ద టాస్క్లా మారింది. అయితే స్థానిక కిట్టి పార్టీల ద్వారా తన వ్యాపారం గురించి ప్రచారం చేసుకోవడం..శ్యాంపుల్ బాటిల్స్ ఇవ్వడం వంటివి చేయడంతో అమ్మకాలు మొదలయ్యాయి. అలా ఒకరినుంచి ఒకరికి ఆమె చేసే పచ్చళ్లు, జామ్ల గురించి తెలియడం మొదలై వ్యాపారం ఊపందుకుని లాభాలు రావడం మొదలైంది. ఆ లాభాలతో అప్పులు తీర్చడం మొదలు పెట్టడమే గాక కుటుంబ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండేలా చేసింది. అయితే ఈ బతుకుపోరాటం కారణంగా ఆమె కొడుకు డ్రీమ్ పక్కన పెట్టి తన వ్యాపారం ప్రచారంలో పాలుపంచుకోక తప్పలేదు. అతడే తనకు చేదుడు వాదోడుగా ఉండి వ్యాపారాన్ని చూసుకోవడంతోనే తన వ్యాపారం ఇంతలా విస్తరించిందని అంటోంది లవీనా. ప్రస్తుతం ఆమె వ్యాపారం రూ. 34 లక్షల టర్నోవర్తో దూసుకుపోతోంది. ఇక ఆమె కుమారుడు కిన్షుక్ (30) మాట్లాడుతూ..సీఏ చేయాలనేది తన డ్రీమ్ అని కానీ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా చేయలేకపోయానని చెప్పాడు. తమ కుంటుంబాన్ని ఆదుకోవడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మా అమ్మ ప్రయత్నానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. తమ వ్యాపారం గురించి ఇంటి ఇంటికి తిరుగుతున్నప్పుడు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ..వ్యాపారం నిర్వహించడం అంత ఈజీ కాదని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు. తాను ప్రజల్లోకి తమ పచ్చళ్ల వ్యాపారం ఎలా తీసుకెళ్లగలను, వారితో చెప్పడం ఎలా అని బాధపడుతుంటే తన తండ్రి మాట్లాడలేని స్థితిలో కూడా సైగలతో ఓ బస్సు ఎక్కినప్పుడు ప్రయాణికుడితో మాటలు ఎలా కలుపుతావో అలానే అనుకుని మాట్లాడు చాలు అన్నారు. ఆ ఒక్క మాట తనను ఎంతగానో ప్రేరేపించి.. ఎన్నో ఆర్డర్లు అందుకునేలా చేసిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు కిన్షుక్. ఈ కథ ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే.. గివ్ అప్ ఇవ్వకూడదని, అచంచలమైన సంకల్పం, ఆశతో పోరాడితే గెలుపు తలుపు తప్పక తెరుచుకుంటుందనడానికి ఈ 50 ఏళ్ల కేన్సర్ వారియర్ లవీనా జైన్ కథే ఉదాహరణ. (చదవండి: కేన్సర్ని ముందే పసిగట్టే స్ర్రీనింగ్ పరీక్షలేమిటి..? ఎప్పుడు చేయించాలంటే..) -
కేన్సర్ని జయించిన స్టార్లు వీరే..!
-
బెదరక, చెదరక క్యాన్సర్ను జయించిన సినీ స్టార్స్
క్యాన్సర్ను జయించాలంటే అంత సులువు కాదని చెబుతారు.. కానీ, వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు కుటుంబం, స్నేహితుల సపోర్ట్ ఆపై సరైన వైద్యం ఉంటే తప్పకుండా క్యాన్సర్పై విజయం సాధిస్తారు. సినిమా ప్రపంచంలో ఎందరో ఈ జబ్బు బారిన పడిన నటీనటులు పెద్ద పోరాటమే చేసి గెలుపొందారు. వారు ఉండేది గ్లామర్ ఫీల్డ్ అయినా.. దాచకుండా తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేశారు. వైద్యం చాలా ఆధునికం అయ్యింది. భయం లేదు. గెలుపు ఉంది. క్యాన్సర్పై పోరాడాలి. గెలవాలి అంటూ చాలామంది పిలుపునిచ్చారు.సోనాలి బెంద్రె‘మనం అస్సలు ఊహించని విషయాలతో జీవితం మన మీద ఒక మలుపును విసురుతుంది’ అని నటి సోనాలి బెంద్రె 2018లో ట్విటర్లో రాసింది. అప్పటికే ఆమెకు ‘హైగ్రేడ్ క్యాన్సర్’ బయటపడింది. ఆమెకు క్యాన్సర్ ఉందన్న విషయం అనుకోకుండా బయటపడింది. తరచుగా పొత్తికడుపులో నొప్పి రావడం, కడుపులో ఇబ్బందిగా ఉండటంతో సొనాలీ బింద్రే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో క్యాన్సర్ అని తేలింది. అయితే, వెంటనే తన కుటుంబం, మిత్రులు బిలబిలమంటూ ఏడుస్తూనే తన పక్కన చేరారని ఆమె పేర్కొంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెడదామని చెప్పడంతో ఆమె న్యూయార్క్లో చికిత్స తీసుకుంది. తాను ఇప్పుడు క్యాన్సర్ను జయించి మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది. క్యాన్సర్ బారిన పడినవారు ఆధునిక పద్ధతులు వాడుకునేందుకు వీలుగా ధైర్యంగా ఉండటంతో పాటు కుంగిపోకుండా చాలా బలంతో పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.కిరణ్ ఖేర్2021 ఏప్రిల్లో నటి కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. కాని ఆమె భయపడలేదు. క్యాన్సర్ను ఎదుర్కొనడానికి ట్రీట్మెంట్కు సహకరించాలనుకుంది. భర్త అనుపమ్ ఖేర్ ‘ఆమెకు ఏమీ కాదు. ఆమె ఆరోగ్యం పొందుతుంది’ అని ధైర్యం చెప్పాడు. ముంబైలో కిరణ్ ఖేర్కు వైద్యం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జ్గా తిరిగి వచ్చి కూచుని క్యాన్సర్ దారి క్యాన్సర్దే మన పని మన పనే అన్నట్టుగా స్ఫూర్తినిస్తోంది. ఆమె ఇప్పటికీ చికిత్స పొందుతూనే తనపని తాను చేసుకుంటుంది. నఫీసా అలీమరో సీనియర్ నటి నఫీసా అలీ కూడా చర్మ సంబంధ క్యాన్సర్ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆమె కుంగిపోక పోరాడింది. కీమో థెరపీ తీసుకుని ఆమె క్యాన్సర్ను జయించింది. కీమో థెరపీ చేయించుకుంటూ నవ్వుతూ ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే శిరోజాలను ముండనం చేసుకున్న ఫొటో కూడా. ఇవన్నీ క్యాన్సర్ను అన్ని జబ్బుల్లాగే చూడటానికి స్ఫూర్తినిస్తున్నాయి.మనిషా కోయిరాలాఇక మనిషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడటం పెద్ద సంచలనం అయ్యింది. అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఆమె కూడా ఇది తనకు అశనిపాతంగా భావించింది. అయినప్పటికీ క్యాన్సర్ మీద పోరాడి గెలవాలని నిశ్చయించుకుందామె. న్యూయార్క్లో ఉండి వైద్యం తీసుకుంది. సుదీర్ఘకాలం వైద్యం కొనసాగినా బెదరక, చెదరక క్యాన్సర్ను జయించింది. తిరిగి సినిమాల్లో నటిస్తూ ఉంది కూడా.ముంతాజ్ ఒకప్పటి స్టార్ నటి, ‘ఆప్ కీ కసమ్’, ‘ఆయినా’ సినిమాల హీరోయిన్ ముంతాజ్ తన 54వ ఏట 2000 సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ‘చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు. క్యాన్సర్ ఎంత..’ అనే స్ఫూర్తితో పోరాడి గెలిచింది. ఇప్పుడు ఆమె వయసు 74. హాయిగా ఉంది.హంసా నందినిమన తెలుగు నటి హంసా నందిని కూడా క్యాన్సర్పై గట్టి పోరాటం చేసి గెలిచింది. 2021లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిని ఆమె 16 సార్లు కీమోథెరఫి చేయించుకుంది. మిర్చి, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆందరికీ హంసానందిని చేరువైంది. అయితే, తన చిన్నతనంలోనే ఆమె అమ్మగారు క్యాన్సర్తో కన్నుమూశారు. ఆ భయాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె పెద్ద పోరాటమే చేసింది.గౌతమి 35 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడిన నటి గౌతమి కూడా దాన్ని జయించింది. ప్రస్తుతం ఇదే మహమ్మారిపై ఆమె అనేక కార్యక్రమాలతో మహిళలకు అవగాహన కల్పిస్తుంది. అందుకోసం ‘Life Again Foundation (LAF)’ అనే సంస్థను కూడా ఆమె ఏర్పాటుచేసింది. మొదట రొమ్ములో కణితిని గుర్తించి దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవడంతో.. అది రొమ్ము క్యాన్సర్ అని తేలిందని ఆమె తెలిపింది. క్యాన్సర్ వల్ల కొన్నేళ్ల పాటు గడ్డు జీవితాన్ని అనుభవించానని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, లంపెక్టమీ, కీమోథెరపీ చికిత్సలతో పాటు ధైర్యం, ఓపిక, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగానని చెప్పింది. ఫైనల్గా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని ఆమె తెలిపింది.మమతా మోహన్ దాస్యమదొంగ సినిమాతో టాలీవుడ్కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్ దాస్.. ఆమె క్యాన్సర్ బారిన పడి.. ఆ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో అవగాహన ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లోకి కూడా రాలేదని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకుముందు రూపం మళ్లీ రాదని ఆమే పేర్కొన్నారు. పోరాడుతే తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకాన్ని గుర్తు పెట్టుకోవలని సూచించారు. ఇలా క్యాన్సర్పై పోరాడి గెలిచిన వారిలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్,అనురాగ్ బసు ,తాహిరా కశ్యప్ కూడా ఉన్నారు. -
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఎంత తక్కువైనా రిస్కే!శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఏ రకమైనా హానికరమే!కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.హెచ్చరికలు మేలు చేస్తాయా?ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి. అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు
మనిషి పుట్టుకకు ప్రధాన అవయవమైన గర్భాశయమే పుండుగా మారుతోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా లోలోపలే ఇబ్బంది పెడుతోంది. అనంతరం క్యాన్సర్గా మారి అమ్మనే కబలిస్తోంది. ప్రాథమిక దశలో దీనిని గుర్తిస్తే ప్రాణాలతో బయట పడవచ్చు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత గుర్తిస్తే మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధిపై అవగాహన లేక చాలా మంది మహిళలు తమలోపల క్యాన్సర్ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను వైద్యపరిభాషలో సెర్వికల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్గా, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్గా వైద్యులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యుల వద్దకు ప్రతిరోజూ 120 నుంచి 150 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కర్నూలులో ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి కీమోథెరపీ, 40 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నిత్యం 150 నుంచి 200 మంది ఇన్పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెర్వికల్ క్యాన్సర్) బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉంటుందని వైద్యుల అంచనా. పేదరోగులకు అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఉచితంగా వైద్యం అందుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధానంగా హ్యూ మన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) కారణంగా వస్తుంది. ఇదే గాక తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడ ం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు. ఈ క్యాన్సర్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా వస్తోంది. నివారణ చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 ఏళ్ల వయస్సులోపు హెచ్పీవీ వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70 శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు జనవరి మాసాన్ని సర్వికల్ క్యాన్సర్ అవగాహన మాసంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ⇒ రుతుక్రమంలో సమస్యలు.. యోని నుంచి రక్తస్రావం ⇒ లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ⇒పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ⇒ యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ⇒ మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి వివాహమైన మహిళలు ఏటా గర్భాశయ ముఖద్వారంలో పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ మేరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీనికి తోడు కౌమారదశ బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80 శాతం వరకు ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా మహిళలకు హెచ్పీవీ వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారుతుంది. – డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలుప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజీ విభాగానికి గైనిక్ సమస్యలతో వచ్చే ప్రతి వంద మంది మహిళల్లో ఇద్దరు, ముగ్గురికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటోంది. ఓపీకి వచ్చే వారికి పాప్స్మియర్ పరీక్షను చేస్తున్నాం. ఇందులో అసాధారణంగా కనిపించే వారికి కాల్పోస్కోపి టెస్ట్ ద్వారా బయాప్సీ తీసి పంపిస్తున్నాం. అందులో క్యాన్సర్గా నిర్ధారణ అయితే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా లక్షణాలు ఉన్నా లేకపోయినా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ను ముందుగానే గుర్తించి వారికి చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ పి.స్నేహ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
కాఫీ.. టీతో క్యాన్సర్కు చెక్...!
తల, మెడ క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా ఏడో అత్యంత సాధారణ క్యాన్సర్గా వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, రోజూ నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగిన వారిలో ఈ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఫర్ రివ్యూడ్ జర్నల్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ కన్సార్టియంతో అనుసంధానమైన శాస్త్రవేత్తలు సుమారు 14 అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ...’ అన్నాడో సినీ రచయిత. చాలామందికి తమ దైనందిన జీవితం కాఫీతో మొదలవుతుంది. కొందరికి ఉదయం కాఫీ/టీ తాగకపోతే అసలు ఏ పనీ జరగదు. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కొందరు కాఫీ, టీ తాగడం మంచిది కాదని చెబుతున్నా... అమెరికన్ కాన్సర్ సొసైటీ మాత్రం కాఫీ, టీలు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని చెబుతోంది. – ఏపీ సెంట్రల్ డెస్క్పరిశోధన ఇలా...సుమారు 25వేల మందికిపైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కాఫీ/టీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా తల, మెడ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు రోజు/వారం/నెల/సంవత్సరానికి.... కెఫెన్ లేని కాఫీ, టీని తీసుకోగా వచ్చిన డేటా ఫలితాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.ఇదీ డేటా..తల, మెడ క్యాన్సర్తో బాధపడుతున్న 9,548 మంది, క్యాన్సర్ లేని 15,783మందిపై పరిశోధనలు చేయగా... కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ 4 కప్పులు కంటే ఎక్కువ కెఫెన్ ఉన్న కాఫీ తాగే వ్యక్తుల్లో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే నోటికుహరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 30% తక్కువని, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం 22% తక్కువని తేలింది.ఇక రోజూ 3–4 కప్పుల కెఫెన్ ఎక్కువ ఉన్న కాఫీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ (గొంతు దిగువన ఉండే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం తక్కువని తేలింది. అలాగే కెఫెన్ లేని కాఫీ తాగడం వల్ల నోటి కుహర క్యాన్సర్ వచ్చే అవకాశాలు 25% తక్కువని, టీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ 29% తక్కువ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాగా, 1 కప్పు లేదా అంతకంటే తక్కువ టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9% తక్కువని, హైపోఫారింజియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందంటున్నారు. ఇలా ఉంటే, అధిక కాఫీ వినియోగం పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించడంలో మేలు చేసినా, ఇందుకు మరింత పరిశోధన అవసరమని నివేదికలో పేర్కొన్నారు. క్యాన్సర్ తగ్గించుకునేందుకు కాఫీ, టీలు తాగడం మాత్రమే పరిష్కారం కాదనీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామాలు, వైద్యపరీక్షలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. -
స్టార్ హీరోను కలిసిన సీఎం..
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.తాజాగా శివరాజ్ కుమార్ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శివరాజ్ కుమార్ను కలిసిన సీఎం..శివరాజ్ కుమార్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. -
యాపిల్ వాచ్తో క్యాన్సరా? కోర్టులో వ్యాజ్యం
ఐఫోన్తో సహా యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇక అత్యంత ప్రీమియం యాపిల్ వ్యాచ్ల (Apple Watch) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాచ్ల విషయంలోనే యాపిల్ ఇప్పుడు యూఎస్లో వ్యాజ్యాన్ని (Lawsuit) ఎదుర్కొంటోంది. ఇది వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్తో (cancer) సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోపించింది.హానికర రసాయనాలువివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్లపై (వాచ్ బెల్ట్) చేసిన అధ్యయనం ఫలితంగా ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో 15 వాచ్ బ్యాండ్ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన “ఓషన్”, “నైక్ స్పోర్ట్”, సాధారణ “స్పోర్ట్” వాచ్ బ్యాండ్లు అధిక స్థాయిలో పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను (PFAS) కలిగి ఉన్నాయని డైలీ మెయిల్ నివేదిక అధ్యయనాన్ని ఉదహరించింది.ఈ హానికర పదార్థాలను ‘ఎప్పటికీ నిలిచిపోయే రసాయనాలు’గా పేర్కొంటారు. ఎందుకంటే ఈ రసాయనాలు పర్యావరణంలో, మానవ శరీరంలో చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావాలను కొనసాగిస్తాయి. వీటితో కలిగే అనారోగ్య దుష్పరిణామాలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్, అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి.యాపిల్ వాదన ఇదీ..కాగా తమ వాచ్ బ్యాండ్లు 'ఫ్లోరోఎలాస్టోమర్' అనే సింథటిక్ రబ్బరు నుండి తయారవుతాయాయని, ఇది ఫ్లోరిన్ కలిగి ఉంటుంది కానీ హానికరమైన పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలు మాత్రం ఉండవని యాపిల్ సంస్థ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ఫ్లోరోఎలాస్టోమర్ సురక్షితమైనదని, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పరీక్షించినట్లు కూడా చెబుతోంది.అయితే యాపిల్ తమ వాచ్లకు వినియోగించే ఫ్లోరోఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్లు ఆరోగ్య ప్రమాదాలకు దోహదపడే ఇతర పదార్థాలతో పాటు పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిందని వ్యాజ్యంలో ఆరోపించారు.హృదయ స్పందన రేటు, నడక, నిద్ర వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్-ట్రాకింగ్ ఉపకరణాలుగా కూడా విస్తృతంగా అమ్ముడుపోతున్న ఈ స్మార్ట్వాచ్లే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళనకరం. -
కేన్సర్ కాటు..? వద్దు కుంగుబాటు
కేన్సర్ బాధితుల ఎదుట రెండు సవాళ్లు ఉంటాయి. మనోబలంతో కేన్సర్ను ఎదుర్కోవడం మొదటిదైతే... ఇక రెండోది... కేన్సర్ చికిత్స కారణంగా తమలో ఉండే విపరీతమైన నీరసం, తీవ్రమైన నిస్సత్తువలను అధిగమించడం.ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్లలో ఈ నీరసం, నిస్సత్తువ చాలా ఎక్కువ. తమకు కేన్సర్ వచ్చిందని తెలియగానే బాధితులు కుంగిపోతారు. ఆపైన ఏ పనీ చేయనివ్వని తమ నీరసం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. వాళ్లలో కలిగే ఈ నీరసాన్ని ‘కేన్సర్ ఫెటీగ్’గా చెబుతారు. రూన్సర్పై తమ పోరాటానికి తోడు ఈ నీరసం, నిస్సత్తువలపై పోరాటమే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ‘కేన్సర్ ఫెటీగ్’ ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.కేన్సర్కు చికిత్స తీసుకుంటున్న చాలామంది తమలోని నీరసం, బలహీనతల కారణంగా రోజువారీ పనులను సమర్థంగా చేసుకోలేరు. దాంతో జీవితం చాలా నిస్సారం గా అనిపించడం, జీవితాన్ని ఆస్వాదించలేక΄ోవడంతో కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతారు. ఈ నీరసాలూ, నిస్సత్తువలకు అనేక అంశాలు కారణమవుతాయి. కొంత కృషి చేస్తే దీన్ని అధిగమించడం అంత కష్టం కాదు. కానీ తమ జబ్బు, కుంగుబాటు కారణంగా తామీ ‘ఫెటీగ్’ను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారు. కాస్తంత కృషితోనే నీరసాలను జయించడం అంత కష్టమేమీ కాదు. తొలుత ఈ ‘ఫెటీగ్’కు కారణమయ్యే అంశాలేమిటో చూద్దాం...కారణాలు... రక్తహీనత (అనీమియా) : కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువలకు ‘అనీమియా’ ఓ ముఖ్యమైన కారణం. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో, అందునా మరీ ముఖ్యంగా బ్లడ్క్యాన్సర్ బాధితుల్లో ఎముక మూలుగ దెబ్బతినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తీ, వాటి సంఖ్యా తగ్గుతాయి. ఈ ఎర్రరక్తకణాలే శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అందజేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవి తగ్గడంతో దేహంలోని కణాలకు అవసరమైన ΄ోషకాలూ, ఆక్సిజన్ కూడా తగ్గి బాధితుల్లో నీరసం కనిపిస్తుంది. విషాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లకపోవడం: ఎర్రరక్తకణాలు దేహంలోని కణాలకు ఆక్సిజన్ను అందించడంతో పాటు జీవక్రియల కారణంగా అక్కడ ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపదార్థాల (టాక్సిన్స్)ను బయటకు పంపడానికి సహాయపడతాయి. అయితే ఎర్రరక్తకణాలు తగ్గడంతో బయటకు విసర్జితం కావాల్సిన విషపదార్థాలూ పోవాల్సినంతగా బయటకు వెళ్లవు. దేహంలో ఉండిపోయిన ఈ టాక్సిన్స్... ఇతర జీవక్రియలకూ అంతరాయం కలిగిస్తుంటాయి. ఫలితంగా బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడి వాళ్లు తీవ్రమైన అలసటతో ఉన్నట్లుగా కనిపిస్తుంటారు.చికిత్సల కారణంగా: చాలా సందర్భాల్లో బాధితులు తీసుకునే కీమో, రేడియోథెరపీ వంటి చికిత్సల వల్ల, అలాగే బోన్ మ్యారో క్యాన్సర్ బాధితులకు అందించే మందుల కారణంగా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ మందులు నిజానికి క్యాన్సర్ కణాలను నశింపజేయల్సి ఉంటుంది. కానీ ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన కణాలనూ ఎంతోకొంత దెబ్బతీస్తుంటాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని నశించిపోవడంతో కేన్సర్ బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. ఇక కీమో తీసుకుంటున్నవారిలో దేహం చాలా వేడిగా ఉన్నట్లు అనిపించడం, ఒంట్లోంచి వేడి బయటకు వస్తున్న ఫీలింగ్తో నిద్రాభంగం అవుతుండటం, నిద్రలో అంతరాయాలు, ఆకలి తగ్గినట్లుగా ఉండటంతో సరిగా భోజనం తీసుకోక΄ోవడం వంటి అంశాలు కూడా నీరసం, నిస్సత్తువ (ఫెటీగ్)కు కారణమవుతాయి.ఫెటీగ్ను అధిగమించడమిలా... తినాలని మనస్కరించక΄ోయినా వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, మెల్లమెల్లగా వ్యాయామాలకు ఉపక్రమించి, క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం... మనసు ఇచ్చగించకపోయినప్పటికీ ఇలాంటివి క్రమం తప్పకుండా చేస్తూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తే ‘కేన్సర్ ఫెటీగ్’ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. ఇలాంటి వ్యాయామాలతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాల స్రావాల వల్ల సంతోషం పెరగడం, దాంతో క్రమంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్: క్యాన్సర్ బాధితులు ఆహారం సరిగా తీసుకోక΄ోవడంతో బరువు కోల్పోయి... సన్నబడతారు. ఆకలి లేక΄ోవడం, కుంగుబాటు (డిప్రెషన్), మందుల వల్ల కలిగే వికారం వంటివి వారిని సరిగా తిననివ్వవు. దాంతో దేహానికి అవసరమైన పోషకాలు అందక΄ోవడంతో సన్నబడి నీరసించిపోతారు. బాధితుల నోటికి రుచిగా ఉండేలాంటి ఆహారాల తయారీ, అవసరమైన పోషకాలు అందడానికి తీసుకోవాల్సిన పదార్థాల వంటివి తెలుసుకోడానికి ‘న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్’ను సంప్రదించాలి. విశ్రాంతి : రోజులో తగినంత చురుగ్గా ఉండటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. ఈ విశ్రాంతి తమ శక్తిసామర్థ్యాలను మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రీయాశీలం కావడానికి ఉపయోగపడుతుందని బాధితులు గ్రహించాలి. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్): ఎప్పుడూ వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవడం, హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడటం, ఫ్రెండ్స్తో మాట్లాడుతుండటం, సమయాన్ని సరదాగా గడపడం వంటి వాటితో జబ్బునుంచి దృష్టిమళ్లించగలిగితే ఇది కూడా ఫెటీగ్ను అధిగమించడానికి తోడ్పడుతుంది. కంటి నిండా నిద్ర : క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి నిద్రపట్టడం కష్టమై తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో మరింత నిస్సత్తువగా అనిపిస్తుంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియల ద్వారా బాధితులు ఈ సమస్యను అధిగ మించవచ్చు. అలాగే కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను తగ్గించడం కూడా మంచిదే. చిన్నపాటి కునుకు తీయడం, మధ్యాహ్నం కాసేపు ఓ పవర్న్యాప్ వంటి వాటితోపాటు వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లతో నిద్ర సమస్యను తేలిగ్గానే అధిగమించవచ్చు. అలాగే మంచి నిద్ర కోసం చీకటిగా ఉండే గది (డార్క్ రూమ్) లో నిద్ర΄ోవడంతో గాఢంగా నిద్రపట్టి నిద్ర సమస్యలు దూరమయ్యే అవకాశముంది. అప్పటికీ నిద్రపట్టనివాళ్లలో డాక్టర్లు ‘మెలటోనిన్’ సప్లిమెంట్లు ఇవ్వడం వంటి (ముఖ్యంగా కీమోధెరపీ తీసుకునే బాధితులకు) జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మందులు: బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉన్నప్పుడు కారణాలను బట్టి డాక్టర్లు వారికి కొన్ని మందుల్ని సూచిస్తారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర సప్లిమెంట్లు, మానసిక సమస్యలను బట్టి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు. కేన్సర్ ఫెటీగ్తో బాధపడుతున్నవారు పై సూచనలు పాటిస్తే తమంతట తామే సమస్యలను అధిగమించవచ్చు. కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. కేన్సర్ ఫెటీగ్ అధిమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం.డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
కేన్సర్ నుంచి బయటపడ్డాను: కేట్ మిడిల్టన్
లండన్: తాను కేన్సర్ను జయించానని బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రకటించారు. తనకు కేన్సర్ చికిత్స అందించిన లండన్లోని రాయల్ మార్స్డెన్ ఆసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. గత ఏడాది కాలంగా తనను సేవలందించిన నేషనల్ హెల్త్ సర్విస్ (ఎన్హెచ్ఎస్) సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కాలంగా విలియం, నాతో కలిసి నిశ్శబ్దంగా నడిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక రోగిగా ఈ కాలంలో నేను అసాధారణమైన సంరక్షణ, సలహాలు పొందాను. ఎంతో ఉపశమనం పొందాను. కేన్సర్ను అనుభవించినవారికే ఇది తులుస్తుంది. ఇప్పుడు కోలుకోవడంపై దృష్టి పెట్టాను. ఈ సంవత్సరం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’’అని కేట్ ప్రకటించారు. మార్చిలో తాను కేన్సర్కు కీమో థెరపీ చికిత్స చేయించుకున్నట్లు కేట్ వెల్లడించారు. గత గురువారం 43వ పుట్టిన రోజు జరుపుకొన్న కేట్.. ‘‘అద్భుతమైన భార్య, తల్లి. గత ఏడాది కాలంగా మీరు చూపించిన బలం అమోఘం’’అని ప్రిన్స్ విలియం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కేన్సర్ ఆసుపత్రిగా రాయల్ మార్స్డెన్ను 1851లో ప్రారంభించారు. దీనికి బ్రిటన్ రాజవంశీయులు దాతలుగా ఉన్నారు. దీనికి 2007 నుంచి ప్రిన్స్ విలియం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో వేల్స్ యువరాణి అయిన అతని తల్లి డయానా ఈ పాత్రను నిర్వహించారు. -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్కు కేన్సర్కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
మందు బాబులు జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్ విషయాలు
మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిపుణులు. దీని కారణంగా పలు అనారోగ్యాల బారినపడతామని చెబుతుంటారు. ముఖ్యంగా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తుంటారు. కానీ ఇది ఆల్కహాల్ సేవించడం వల్లే వస్తుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆల్కహాల్కి కేన్సర్కి లింక్అప్ ఉందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు అధ్యయనాలను ఉదహరిస్తూ సవివరంగా తెలిపారు యూఎస్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి. అంతేగాదు మద్యపానం సేవిస్తే.. కేన్సర్ తప్పదనే ఓ హెచ్చరిక లాంటి లేబుల్ ఉండాలని వాదిస్తున్నారు. ఎలా కారణమంటే..ఆల్కహాల్ కేన్సర్కు ఎలా కారణమవుతుందో నాలుగు కారణాలను వివరించారు. మొదటిది శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నమైప్పుడు డీఎన్ఏతో విభేదించి కణాలను దెబ్బతీస్తుంది. కణితులు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని చాలామంది వైద్యులు అంగీకరించారు. రెండోది ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము కేన్సర్కు మార్గం సుగమం చేస్తుందని కొత్త పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎలా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూడోది ఇటలీ, యుఎస్, ఫ్రాన్స్, స్వీడన్, ఇరాన్ పరిశోధకుల బృందం దాదాపు 4 లక్షలకు పైగా కేన్సర్ కేసులను పరిశీలించగా..సుమారు 572 అధ్యయనాల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తాగేవారు, తాగనివారిగా విభజించి మరీ అంచనా వేశారు. ఆ పరిశోధనలో నోటి, గొంతు, అన్నవాహిక, కొలొరెక్టమ్, కాలేయం, స్వరపేటిక, రొమ్ము తదితర కేన్సర్లకు మద్యపానంతో సంబంధం ఉందని తేలింది. నాలుగు..అధిక మద్యపానం సేవించిన వారికి మెడ, తలకు సంబంధించిన కేన్సర్ వస్తుందని సుమారు 26 పరిశోధనలో వెల్లడయ్యింది. చివరిగా మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. 26 సంవత్సరాల కాలంలో 195 దేశాలలో సంభవించిన మద్యపాన సంబంధిత మరణాలపై 2018 ప్రపంచ నివేదికలో మద్యపానం సేవించడం సురక్షితం కాదని తేలింది. ఇది ఏడు రకాల కేన్సర్ల బారినపడేందుకు కారణమవుతుందని వివరించారు సర్జన్ వివేక్ మూర్తి. ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురితమయ్యింది. అయితే ఈ అధ్యయనం మద్యం అతిగా సేవించే వారికి, మితంగా తీసుకునే వారి మధ్య తేడాలను వివరించలేదు. ఈ పరిశోధనపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఎందుకంటే..మధ్యధరా ప్రాంతంలో ఉండేవారు రోజూ వైన్ తాగుతారని, అదివారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుందనేది వాదన. అలాగే మితంగా మద్యం సేవించేవారే గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు. -
మద్యపానం క్యాన్సర్కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మద్యపానం కారణంగా అనారోగ్యం బారినపడి మరణించినవారు కూడా ఉన్నారు. దీనికితోడు మద్యపానం కొన్నిరకాల క్యాన్సర్లకు కారణమవుతుందని కూడా వెల్లడయ్యింది. తాజాగా మద్యపానానికి సంబంధించిన ఒక ప్రకటన అమెరికాలో కలకలం రేపుతోంది.మద్యపానం క్యాన్సర్కు ప్రధాన కారణమని, అమెరికన్ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్కు కారకం’ అని ముద్రించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదించారు. ఈ దరిమిలా అమెరికన్, యూరోపియన్ మద్యం తయారీదారుల షేర్లు అమాంతం పడిపోయాయి. మద్యం సేవించడం మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(Dr. Vivek Murthy) కనుగొన్నారు.మద్యపానం కారణంగా ఏటా సుమారు 20 వేల మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని, ఆల్కహాల్కు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం గురించి అమెరికన్లు తెలుసుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి పేర్కొన్నారు. గత దశాబ్దంలో అమెరికాలో నమోదైన సుమారు పది లక్షల క్యాన్సర్ కేసులకు మద్యం సేవించడం ప్రధాన కారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కంపెనీల వైన్, బీర్ బాటిళ్లపై ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక లేబుల్స్ ఉన్నాయన్నారు. గర్భిణులు మద్యం సేవించడం వల్ల వారికి పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ మూర్తి హెచ్చరించారు.కాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆల్కహాల్ బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరమంటూ ముద్రిస్తున్నాయి. దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్(Cancer) సంబంధిత హెచ్చరికను ముద్రిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లోనే ఆల్కహాల్ అనేది కాన్సర్కు కారకమని నిర్ధారించింది. క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేలా ఏ ఆల్కహాల్ కూడా ఉండదని పేర్కొంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకుల బృందం ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు దేశాలు మాత్రమే ఆల్కహాల్పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్నయని పేర్కొంది. క్యాన్సర్ హెచ్చరికలు చాలా అరుదుగా ఉంటున్నాయని ఆ బృందం తెలిపింది.దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్కు సంబంధించిన హెచ్చరిక కనిపిస్తుంది. 2016లో దక్షిణ కొరియా(South Korea) ఈ హెచ్చరికల లేబుల్ ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఐర్లాండ్లోనూ మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలు కనిపిస్తాయి. ఈ హెచ్చరికలను తప్పనిసరి చేసిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. నార్వే ఇప్పటికే ఆల్కహాల్ వినియోగాన్ని చాలావరకూ నియంత్రించింది. ఇప్పుడు మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలను ముద్రింపజేయాలనే ప్రతిపాదన చేసింది. ఇదేవిధంగా ‘ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్కు కారణమవుతాయి’ లాంటి హెచ్చరికలను మద్యం బాటిళ్లపై ముద్రించాలని థాయిలాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని మద్యం పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.కెనడా ఆల్కహాల్పై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేయనప్పటికీ, 2022లో కెనడియన్ పార్లమెంట్లో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. కెనడాలోని పరిశోధకుల బృందం 2017లో క్యాన్సర్ను హెచ్చరిక లేబుల్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆల్కహాల్ ట్రేడ్ గ్రూపుల ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని విరమింపజేయాలని కోరింది. ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్ను తీర్థరాజం అని ఎందుకంటారు? -
టాలీవుడ్లో విషాదం.. క్యాన్సర్తో పోరాడుతూ డైరెక్టర్ కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్లో ఉంటున్న ఆమె గురువారం కన్నుమూశారు. క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన అపర్ణ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అపర్ణ మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) నటి, రచయితగా రాణించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించారు. పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే పెళ్లికూతురు పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. -
క్యాన్సర్ నుంచి కోలుకున్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తా: శివరాజ్ కుమార్
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడికి వెళ్లేముందు అభిమానులకు సందేశం ఇచ్చారు. త్వరలోనే తిరిగి వస్తానన ఫ్యాన్స్తో చెప్పారు.ఇటీవల నాన్నకు క్యాన్సర్కు సంబంధించిన సర్జరీ పూర్తయిందని ఆయన కూతురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శివరాజ్ కుమార్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అభిమానులతో నాన్న మాట్లాడతారని పేర్కొంది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.తాజాగా శివరాజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని శివరాజ్ కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..'క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటా. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ పూర్తి చేశా. ఈ ప్రయాణంలో వైద్యులు అందించిన సహకారం మర్చిపోలేను' అని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. అంతేకాకుండా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. #ShivarajKumar spoke after his surgery, explaining what had happened and expressing gratitude to all those who helped him to win this situation pic.twitter.com/NU41k5mLUD— Yogitha RJ (@iamyogitharj) January 1, 2025 -
అమెరికాలో శివరాజ్కుమార్.. క్యాన్సర్కు శస్త్రచికిత్స పూర్తి
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూత్రాశయ క్యాన్సర్కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.ప్రస్తుతం శివరాజ్కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్కుమార్కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤ Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024 It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times. Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024 -
భర్తకు కన్నీటి నివాళి : బోరున విలపించిన ఇన్ప్లూయెన్సర్ సృజన సుబేది
క్యాన్సర్తో పోరాడి ఓడిపోయిన నేపాల్కు చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ బిబేక్ పంగేని అంత్యక్రియలు న్యూయార్క్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అతని భార్య సృజన సుబేది బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. ధైర్యంగా ఉండు మిత్రమా అంటూ నెటిజన్లు సృజనకు ధైర్యం చెబుతున్నారు.2022లో పంగేని క్యాన్సర్ను గుర్తిచారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సృజన కంటిరెప్పలా కాపాడుకుంది. అన్నివేళలా అతనికి తోడుగా ఉంటూ, ధైర్యం చెబుతూ కన్నతల్లి కంటే మిన్నగా సేవలందించింది. చివరికి ఆమె ప్రేమ ఓడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో పీహెచ్డీ విద్యార్థి అయిన బిబెక్ పంగేని సుదీర్ఘ పోరాటం తర్వాత (డిసెంబరు19న) తనువు చాలించారు.Last Farewell Of Bibek Pangeni In New York. #bibekpangeni #sirjanasubedi pic.twitter.com/Wzpjdff1cP— Neha Gurung (@nehaGurung1692) December 22, 2024మూడో దశ గ్లియోమాతో పోరాడుతున్న భర్త చికిత్సకు చికిత్స సమయంలో ధైర్యంగా నిలబడింది.ఎ లాగైన తన భర్తను కాపాడుకోవాలని తాపత్రయప పడింది. తన మొత్తం సమయాన్ని వెచ్చించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేసేది. తాను ధైర్యంగా ఉండటమే కాదు భర్తకు ప్రేమను పంచుతూ తనలాంటి వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. సోషల్మీడియాలో వీరి రీల్స్, వీడియోలు నెటిజనుల హృదయాలను కూడా కదిలించేవి. అతను తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఎవరి ప్రార్థనలు ఫలించలేదు. -
క్యాన్సర్కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!
వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్గా మారనుంది. క్యాన్సర్ జబ్బు నయం చేసే వ్యాక్సిన్ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్కు జనరల్ డైరెక్టర్ అయిన అండ్రే కప్రిన్ ప్రకటించారు.చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలా పని చేస్తుందంటే.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అంటే..RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్ఎన్ఏ పీస్ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.ఏఐ పాత్ర కూడా.. కాగా, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ వ్యాక్సిన్ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
గంటలకొద్దీ కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?
ప్రస్తుతం చాలావరకు డెస్క్ జాబ్లే. అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. శారీరక శ్రమ లేని ఇలాంటి ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కవని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలా గంటలకొద్ది కూర్చొవడం అనేది ధూమపానం సేవించినంత హానికరం అని, దీనివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇదేంటి కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?. అసలు ఈ రెండింటికి లింక్ అప్ ఏమిటి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.డెస్క్ జాబ్లు చేసేవారు, టీవీ బాగా చూసేవారు, పుస్తకాలు బాగా చదివేవారు, వీడియో గేమ్లు ఆడేవారు.. గంటలతరబడి కూర్చునే ఉంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేసినా ..ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయమేనని చెబుతున్నారు నిపుణులు. అవి కాస్త కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, అండాశయాలు లేదా ఎండోమెట్రియల్ వంటి కేన్సర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఎలా అంటే..మానవులు నిటారుగా నిలబడితేనే హృదయనాళ వ్యవస్థ, ప్రేగు కదలికలు, కీళ్లు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే శారీరకంగా చురుకుగా ఉండటమే గాక మొత్తం శక్తిస్థాయిలు సమంగా ఉండి.. బాడీకి కావాల్సిన బలాన్ని అందిస్తాయని అన్నారు. స్థిరంగా లేదా నిశ్చలంగా ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం లేదా వీడియో గేమ్లు ఆడటం అనేది స్థూలకాయానికి దారితీసి.. కేన్సర్ ప్రమాదాన్నిపెంచే అవకాశం ఉందని అన్నారు. నడిస్తే కేన్సర్ ప్రమాదం తగ్గుతుందా..?వ్యాయామాలు చేయడం మంచిదే గానీ అదీ ఓ క్రమపద్ధతిలో చేయాలి. పెద్దలు కనీసం ప్రతివారం సుమారు 150 నిమిషాల పాటు శారీరక శ్రమపొందేలా తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలని చెప్పారు. ఎక్కువ వ్యాయామాలు చేస్తున్నాం కదా అని.. రోజులో దాదాపు ఎనిమిది గంటలు కూర్చొంటే పెద్దగా ఫలితం ఉండందంటున్నారు. ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..పనిప్రదేశంలో మీ వర్క్కి అంతరాయం కలగకుండా కూర్చోనే చేసే చిన్నచిన్న వ్యాయామాలు చేయండి. సాధ్యమైనంత వరకు మీకు కావాల్సిన ప్రతీది మీరే స్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకునే యత్నం చేయండి. ఆపీస్ బాయ్పై ఆధారపడటం మానేయండి. కొన్ని కార్యాలయాల్లో స్టాండింగ్ , ట్రెడ్మిల్ డెస్క్ల వంటి సామాగ్రి ఉంటుంది. కాబట్టి వాటిని మధ్యమధ్య విరామాల్లో వినయోగించుకోండి. అలాగే ఇంటిని చక్కబెట్టే పనులను కూడా కూర్చోవడానికి బదులుగా నిలుచుని సౌకర్యవంతంగా చేసుకునే యత్నం చేయండి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. ఇలాంటి చిట్కాలతో అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోండి. స్క్రీన్ సమయాన్ని కూడా తగ్గించండి..పరిశోధన ప్రకారం..25 ఏళ్ల తర్వాత టెలివిజన్ లేదా స్క్రీన్ని చూసే ప్రతిగంట మీ ఆయుర్దాయాన్ని సుమారు 22 నిమిషాలకు తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎందువల్ల అంటే.. కూర్చొని టీవీ లేదా ఫోన్ చూస్తుంటే సమయమే తెలీదు. అదీగాక తెలియకుండానే గంటలకొద్దీ కూర్చుంటారు ఆయా వ్యక్తులు. దీన్ని అధిగమించాలంటే సింపుల్గా స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడమే బెటర్ అని అంటున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
కేన్సర్లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. రక్తంలో డీఎన్ఏ మిథైలేషన్ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్స్పాట్ ప్రోగ్రామ్ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!) -
నిమ్మరసం, పచ్చిపసుపుతో క్యాన్సర్కు చెక్? సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా? -
క్యాన్సర్కు కొత్త మందు.. డాక్టర్ రెడ్డీస్ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. పీడీ–1 ఔషధం అయిన టోరిపాలిమాబ్ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్ వెల్లడించింది. భారత్లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్ చికిత్స విధానం. ఇది క్యాన్సర్ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్ కావడం విశేషం.ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్సకై యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. టోరిపాలిమాబ్ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది. -
దండెత్తిన క్యాన్సర్పై ధ్యానమే సైన్యంగా...
నేను మూడుసార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో బ్రెయిన్ క్యాన్సర్. 2024లో మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.చిన్నప్పటి నుంచి సవాళ్లేనల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్గా పని చేశారు. 1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్ క్యాన్సర్ని జయించాను’ అని చెప్పారు నిర్మల. మరో రెండుసార్లు దాడిక్యాన్సర్ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్ క్యాన్సర్ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్ నేచర్ క్యూర్’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి. నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె. -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
ఆ బ్రెడ్తో కొలెస్ట్రాల్, కొలొరెక్టల్ కేన్సర్కి చెక్..!
బ్రెడ్ని చాలామంది స్నాక్స్ రూపంలోనో లేదా బ్రేక్ఫాస్ట్గానో తీసుకుంటుంటారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు చెప్పడంతో కొందరూ ప్రత్యామ్నాయంగా గోధుమలతో చేసిన బ్రెడ్ని ఎంచుకుంటున్నారు. అయినప్పటకీ పరిమితంగానే తినమని నిపుణులు సూచించడం జరిగింది. అయితే బ్రెడ్ అంటే.. ఇష్టపడే ఔత్సాహికులు ఇలాంటి బ్రెడ్ని బేషుగ్గా తినొచ్చని నిపుణులే స్వయంగా చెప్పారు. పైగా ఆ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.ఈ బ్రెడ్పై పరిశోధన చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉటుందని తెలిపారు. స్పెయిన్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..ఆ దేశంలోని ప్రజలు ఏడాదికి సగటున 27.35 కిలోల బ్రెడ్ని తింటారట. వారికి ఈ బలవర్ధకమైన బ్రెడ్ని అందివ్వగా వారంతా బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ బ్రెడ్ కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. దీని పేరు "రై బ్రెడ్"."రై బ్రెడ్" అనేది కేవలం రై ధాన్యంతో చేసిన రొట్టె. రై ఒక మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొద్ది మొత్తంలో ఇతర పిండిలతో కలిపి తయారు చేయడంతో రుచి చాలా డిఫెరెంట్గా ఉంటుంది. దీన్ని మొలాసిస్, కోకో పౌడర్ వంటి చేర్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కలిగే లాభాలు..దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్గా పిలిచే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ధమనుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగి హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కణితులు పెరగకుండా సంరక్షిస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు రవాణాను వేగవంతం చేసేలా మల ఫ్రీక్వెన్సీని పెంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఫెరులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు రక్తప్రవాహంలోని చక్కెర, ఇన్సులిన్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ను 14 శాతం వరకు తగ్గిస్తుంది.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: 6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రొమ్ము క్యాన్సర్కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
డాక్టర్పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
నోటి దుర్వాసనా? కేన్సర్ కావచ్చు!
సాక్షి, హైదరాబాద్: నోటి దుర్వాసన దీర్ఘకాలంపాటు ఉంటే గ్యాస్ట్రిక్ కేన్సర్ సోకిందేమోనని అనుమానించాలని ఏఐజీ ఆస్పత్రులు చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. హెలికోబ్యాక్టర్ పైలోరి (హెచ్.పైలోరి) ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రిలో నూతనంగా స్థాపించిన బ్యారీ మార్షల్ సెంటర్ ఫర్ హెచ్ పైలోరీని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్తో కలిసి నాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని హెచ్.పైలోరీ స్ట్రెయిన్స్కు ప్రత్యేకమైన జన్యు లక్షణాలు ఉన్నాయని, దీంతో ఇన్ఫెక్షన్లపై ప్రత్యేక పరిశోధనలు అవసరమని అన్నారు. హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడమే కాకుండా, అది సోకకుండా నిరోధించడమే లక్ష్యంగా బ్యారీ మార్షల్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిశోధనల్లో ప్రొఫెసర్ మార్షల్ పాల్గొనడం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో హెచ్.పైలోరీ విషయంలో కొత్త ప్రమాణాలు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. హెచ్.పైలోరీ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వెంటనే బయటపడవని, ఎండోస్కోపీతో మాత్రమే దీనిని గుర్తించొచ్చని వివరించారు. దీర్ఘకాలంపాటు నోటి దుర్వాసన వస్తే ఈ బ్యాక్టీరియా సోకిందని అనుమానించవచ్చని, అలాంటి వారు ఎండోస్కోపీ చేయించుకుంటే దీన్ని గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 60% మందిలో హెచ్ పైలోరీ భారత్లో హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్లు 50% నుంచి 60% మందిలో ఉన్నాయని ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ చెప్పారు. ఈ బ్యాక్టీరియా కారణంగా దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. మధుమేహంతో వచ్చే సమస్యల కన్నా దాదాపు 10 రెట్లు హెచ్. పైలోరీ వల్ల వస్తాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బ్యాక్టీరియాను కేన్సర్ కారకంగా వర్గీకరించిందని, దీన్నిబట్టే దీని తీవ్రత తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగానే దేశంలో ఉదర సంబంధ కేన్సర్ శాతం పెరిగిందని, దీన్ని లక్ష్యంగా చేసుకుని పరిశోధనలు జరగడం చాలా ముఖ్యమని సూచించారు. -
క్యాన్సర్ను జయించొచ్చు
క్యాన్సర్(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.గుర్తించడం ఎలా?మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.కారకాలుసిగిరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది.మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలుతాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్నాన్కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. -
నర్గీస్ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్తో పోరాడి గెలిచారు.మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్లో ఉందని తెలిసింది. న్యూయార్క్లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ' అని అన్నారు. -
నలిగిపోతున్ననాలుగో సింహం
పోలీస్ అధికారులు విధులకు ఒకవేళంటూ ఉండదు. లా అండ్ ఆర్డర్లో ఉండే సిబ్బందికి ఉరుకులుపరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల దర్యాప్తు, కోర్టులకు హాజరుకావడం..ఉన్నతాధికారుల సమీక్షలకు వెళ్లడం..ఇలా బహుళ డ్యూటీలు చేస్తుండాలి. ఏఆర్, టీజీఎస్పీ సిబ్బంది విధుల్లోనూ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, వీఐపీల బందోబస్తులంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. ఇలా శారీరకంగా, మానసికంగానూ శ్రమ ఎక్కువే. ఈ ప్రభావం అంతా పోలీసుల ఆరోగ్యంపై వివిధ జబ్బుల రూపంలో చూపుతోంది. బీపీ, షుగర్తో మొదలై క్రమంగా పలు ప్రమాదకర జబ్బులకు దారితీస్తోంది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు ఆరోగ్య భద్రత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..6,347 మంది కేన్సర్ చికిత్స తీసుకున్నారు. రెండో స్థానంలో కిడ్నీ రోగులు ఉన్నారు. 4,922 మంది నెఫ్రాలజీ చికి త్స తీసుకున్నారు. యూరాలజీ సమస్యలతోనూ ఎక్కువ మందే బాధపడుతున్నారు. గుండె జబ్బుల కారణంగా 2,875 మంది ఆస్పత్రులపాలయ్యారు. మానసిక ఒత్తిడిసైతం అధికంగానే ఉంటోంది. కొన్నిసార్లు బీపీ పెరగడంతో న్యూరో సమస్యలు వస్తున్నాయి. న్యూరాలజీకి సంబంధించి 1,937 మంది చికిత్స పొందారు. వేతనం నుంచి కార్పస్ ఫండ్కు నిధులు ఆరోగ్య భద్రత కార్పస్ ఫండ్ కోసంకానిస్టేబుల్ నుంచి ఎస్సై ర్యాంకు వరకుకేటగిరీ–1 కింద నెలకు రూ.200 చొప్పున,ఇన్స్పెక్టర్ నుంచి డీజీపీ ర్యాంకు వరకుకేటగిరీ–2 కింద అధికారుల వేతనంలో నెలకు రూ.250 చొప్పున జమ చేస్తున్నారు. ఇలా పోలీస్శాఖలోని 68 వేల మంది సిబ్బంది నుంచి ఈ కార్పస్ ఫండ్ నిధులు జమ అవుతుంటాయి. కేన్సర్..లేదంటే కిడ్నీ సమస్యలతో పోలీసుల సతమతంసాక్షి, హైదరాబాద్: కేన్సర్..లేదంటే కిడ్నీ జబ్బుల బారిన పడే పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..ఈ విషయం స్పష్టమవుతోంది. పోలీస్శాఖలోని దాదాపు 40 శాతం మందికిపైగా సిబ్బందికి బీపీ, షుగర్ రావడం సర్వసాధారణంగా మారింది. పనిఒత్తిడి, సమయం తప్పిన ఆహారంతోనూ అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పోలీస్ అధికారులు, సిబ్బంది..వారి కుటుంబీలకు ఆరోగ్య భద్రత పథకం కింద పలు నెట్వర్క్ ఆస్పత్రులలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది కలిపి మొత్తం 1,04,014 మంది పలు రోగాలకు చికిత్సలు పొందారు. వీరి వైద్యం కోసం రూ.446.3 కోట్లు ఖర్చు చేశారు. పోలీస్ సిబ్బంది తల్లిదండ్రుల్లో 45,923 మంది చికిత్సకు రూ.318.03 కోట్లు ఖర్చు చేశారు. వైద్యంతోపాటు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీస్శాఖ నుంచి ఆరోగ్య భద్రత కింద ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓపీ పేషెంట్లకు సబ్సిడీ ధరలకే వైద్య పరీక్షలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రకాల డయాగ్నొస్టిక్ సెంటర్లతో ఆరోగ్య భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆరోగ్య భద్రత కింద లబ్దిదారుల సంఖ్యతోపాటు వైద్యఖర్చులు పెరగడంతో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం నుంచి రావా ల్సిన రీయింబర్స్మెంట్ నిధులు సైతం పేరుకుపోతున్నాయి. 2021 నుంచి రీయింబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదు. దాదాపు రూ.200 కోట్ల వరకు ఆరోగ్య భద్రత నిధులు పెండింగ్ ఉండగా.. ఇటీవలే 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రీయింబర్స్మెంట్ నిధుల పెండింగ్ కారణంగా కొన్ని సార్లు ఆస్పత్రులు వైద్యం అందించేందుకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటూ సిబ్బందికి సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవీ జబ్బులకు ప్రధాన కారణాలు» పోలీస్ అంటే 24 గంటలపాటువిధి నిర్వహణ తప్పని ఉద్యోగం.పోలీస్స్టేషన్లలో శాంతిభద్రతల విధులు మొదలు ఏ ప్రత్యేక బలగంలో ఉన్నా.. ఒత్తిడి తప్పనిసరి అవుతోంది. » ఎండ, వాన, చలి,దుమ్మూధూళి, కాలుష్యంఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం సైతం జబ్బులకు కారణమవుతోంది. » బందోబస్తు విధుల్లో ఉన్నా.. ట్రాఫిక్ విధుల్లో ఉన్నా..గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి. » ఆహార నియమాలవిషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఉన్నా.. తీసుకునేలా పరిస్థితులు లేకపోవడం సైతం అనారోగ్యానికి కారణం అవుతోంది. » శాంతిభద్రతల విధుల్లో ఒక్కోసారి తగినంత విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితులుఉండడం సైతం శారీరకశ్రమను పెంచుతోంది. -
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడంతో అది సైజ్లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
కోరలు చాస్తున్నక్యాన్సర్
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా హెచ్చరించింది. ముఖ్యంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్ విజృంభణపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 12.8 శాతం పెరుగుదల 2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగాకు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీటి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ దేశాల్లో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడైంది.మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్లు ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్ టెస్ట్ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు. మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్కు పాప్స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో క్యాన్సర్ బయటపడినా చికిత్స చేయొచ్చు. – డాక్టర్ జె.విజయకృష్ణ, క్లినికల్ అంకాలజిస్ట్, విజయవాడ -
వెన్ను నొప్పి కేన్సర్కు దారితీస్తుందా..?
ఈ రోజుల్లో వెన్ను నొప్పి అత్యంత సర్వసాధారణం. కంప్యూటర్ల ముందు గంటలకొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలు కావడంతో ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇవి ఎక్కువైపోయాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కాల్షియం లోపం వల్లనో లేక కూర్చొనే భంగిమ తేడా వల్లనో అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే తేడా వచ్చి ప్రాణాంతకంగా మారిపోతున్న కేసులు కోకొల్లలు. ఇవాళ ప్రపంచ వెనుముక దినోత్సవం పురుస్కరించుకుని అసలు ఇలాంటి సమస్యని ఎలా గుర్తించగలం? అందుకు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటో సవివరంగా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా..!.వెన్నుముక సమస్యలు లేదా తరచుగా వెన్నునొప్పి వేధిస్తుంటే తక్షణమే వైద్యుని సంప్రదించి ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి స్కానింగ్లు తప్పనిసరిగా తీయించుకోవాలి.అలాగు వీటి తోపాటు పెట్ సీటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు వెన్నుముక కణితులు వెన్నుపాము వెలుపల ఉన్నాయా..? దాని లోపలే ఉన్నాయా అనేది నిర్థారించాల్సి ఉంటుంది. వెన్నుముక కేన్సర్ లక్షణాలు..వెనుముకలోనే కేన్సర్ కణితులు ఉన్నట్లయితే ఎముక నిర్మాణ విస్తరించడం లేదా బలహీనపడటం జరుగుతుంది. అలాగే వెన్నుముక నరాలు కుదింపుకు గురై నొప్పి కలిగించొచ్చు.వెన్నుముక అస్థిరత వంటి కారణంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి క్రమంగా ప్రారంభమై కాలక్రమేణ తీవ్రమవుతుంది. విశ్రాంతితో సెట్ కాదు. పైగా రాత్రి సమయాల్లో మరింత తీవ్రమవుతుంది. అలాగే ఎగువ లేదా దిగువ భాగంలో షాక్లాంటి నొప్పిన కలిగిస్తాయి. కండరాల బలహీనతతిమ్మిరిజలదరింపుఉష్ణోగ్రత సంచలనంమూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణ కోల్పోవడంలైంగికంగా బలహీనం కావడంనడవడంలోనూ సమస్యఎలా నిర్థారిస్తారంటే..వెనుముక కణితిని నిర్థారించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక కదలికలు గురించి తెలుసుకోవడానికి నరాల ద్వారా పరీక్ష చేసి గుర్తిస్తారు. వీటి తోపాటు కొన్ని ఇతర పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.రక్త పరీక్షలువెన్నెముక అమరికలుమూత్ర పరీక్షలుమాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా ఎంఆర్ఐమాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ లేదా ఎంఆర్ఎస్సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా స్పెక్ట్యాంజియోగ్రఫీమాగ్నెటెన్సెఫలోగ్రఫీకణజాల బయాప్సీలు(చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
యూత్ఫుల్గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..?
వయసు పెరగడమన్నది అందరిలోనూ చాలా సహజంగా జరిగిపోతుంటుంది. చాలాకాలం పాటు యూత్ఫుల్గా కనిపించడం అందరూ కోరుకునేదే. అంతేగానీ... వయసు పెరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు వయసుపరంగా చాలా పెద్దవారైనా... చాలా యూత్ఫుల్గా కనిపిస్తారు. వయసు చెప్పగానే ఆశ్చర్యపోయేంత యౌవనంతో ఉంటారు. ఇలా వయసు తగ్గి యౌవ్వనంతో కనిపించడంతో పాటు, కేన్సర్ను కూడా నివారించే ఆహారాన్ని కాదనుకునేవారెవరు? అలా వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడంతోపాటు కేన్సర్ను నివారించే పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, వాటితో ఉండే ఇతర ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వయసు పెరగడంతో శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకు చర్మం కాస్త వదులైపోడం, కళ్ల కింద, నుదుటి మీద గీతల వంటివి. ఇలా వచ్చే మార్పులనే ఏజింగ్తో వచ్చే మార్పులంటారు. కొన్ని రకాల ఆహారాలతో ఈ ఏజింగ్ ప్రక్రియ వేగవంతవుతుంది.ఉదాహరణకు ఎక్కువ తీపి ఉండే పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ఫుడ్ తీసుకునేవారిలో ఏజింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఏజింగ్కూ, అలాగే కొందరిలో కేన్సర్కు దారితీసే ఫ్రీ–ర్యాడికల్స్ అనే పదార్థాలు కారణం. ఈ ఫ్రీ–ర్యాడికల్స్ను సమర్థంగా అరికట్టేవే యాంటీఆక్సిడెంట్స్. దేహంలో ప్రతినిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేటప్పుడు కొన్ని కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్ అన్నవి దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా గణనీయంగా దెబ్బతింటుంది.యాంటీ ఆక్సిడెంట్స్ అంటే...? ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్తో చర్య జరిపి, కణాలపై వాటి ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఫ్రీ–ర్యాడికల్స్లో ఉండే పదార్థాలు కణాల్లోని రసాయనాలతో ఆక్సిడేషన్ చర్య జరపడం ద్వారా కణాన్ని దెబ్బతీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రీ–ర్యాడికల్స్ను అడ్డుకుని ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు ఆక్సిడేషన్ కానివ్వకుండా ఆపుతాయి. అలా ఫ్రీర్యాడికల్స్ను నిర్వీర్యం చేస్తాయి. అంటే ర్యాడికల్స్ ద్వారా జరిగే ఆక్సిడేషన్ను తటస్థీకరణ (న్యూట్రలైజ్) చేస్తాయి. అందువల్ల ఫ్రీ–రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆగిపోతాయి. దాంతో ఫ్రీ–రాడికల్స్ కణాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదు. మామూలు కణం కేన్సర్ కణంగా మారడమూ ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్ కారణంగా కణంలో ఆక్సీకరణ జరగకుండా ఆపేస్తాయి కాబట్టే ఆహార పదార్థాల్లోని ఆ పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు.యాంటీ ఆక్సిడెంట్స్తో లాభాలివి.. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జీవక్రియల ద్వారా కణంలో జరిగే విధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని) ఆపేస్తాయి. సెల్ డ్యామేజ్ తగ్గడం వల్ల కణం చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెల్ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం, అత్యధిక శారీరక శ్రమ, అల్ట్రావయొలెట్ కాంతి వల్ల జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ–ర్యాడికల్ వల్ల జరిగే అనర్థాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. దాంతో చాలాకాలంపాటు యౌవనంగా కనిపిస్తారు. ఫ్రీ–రాడికల్స్ ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అప్పుడా మామూలు కణం కాస్తా... కేన్సర్ కణంగా మారిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. పోషకాల్లోని రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్... వాటితో ప్రయోజనాలుబీటా–కెరోటిన్ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇవి పసుప్పచ్చ, నారింజరంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయల్లో, ఆకుకూరల్లో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్ మెంబ్రేన్)ను సురక్షితంగా కాపాడతాయి. దాంతో ఆ పొరను ఛేదించి ఏ హానికరమైన కాలుష్యాలూ కణంలోకి చేరలేవు. అందుకే పైన పేర్కొన్న రంగు పండ్లు తింటే క్యాన్సర్ నుంచి రక్షణతో పాటు కణం చాలాకాలం పాటు ఆరోగ్యంగా, యౌవనంతో ఉంటుంది. లైకోపిన్ అనే ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్ ఉండే ఆహారాల్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. పుచ్చకాయలోనూ ఎక్కువే. లైకోపిన్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు కేన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్ను నివారించడంలో లైకోపిన్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అల్లిసిన్ అనే చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లిసిన్ రక్తంలోని కొలెస్టరాల్నూ తగ్గిస్తుంది. ఇది వెల్లుల్లి, ఉల్లిలో ఎక్కువగా ఉంటుంది.ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్ యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్లలో పుష్కలంగా ఉంటాయి. అవి అనేక రకాల కేన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. యాంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్ నివారిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్. వాటికి ఫ్రీ–రాడికల్స్ను న్యూట్రలైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. అందుకే వాటిల్లో సహజసిద్ధమైన క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువ. పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్–సి కూడా చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్–ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్స్. చివరగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక పక్కన మంచి యౌవ్వనాన్ని చాలాకాలం పాటు కాపాడుకోవడమే కాకుండా... ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారించినట్టూ అవుతుంది. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్లో చేరి మైండ్ఫుల్నెస్ టెక్నిక్లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్ అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు. అందుకోసం ఏం చేయాలంటే..ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి. అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి. అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!) -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
క్యాన్సర్కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్లో తెల్లరక్తకణాలు నార్మల్గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
World Rose Day 2024: క్యాన్సర్ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం -
క్వీన్ ఆఫ్ నట్స్ .. షుగర్, కేన్సర్ రానివ్వవు..
సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే మకడమియ తోటల సాగు మనకు బాగా కొత్త. ప్రోటీసీ కుటుంబం. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్వీన్ ఆఫ్ ద నట్స్ అని పేరొచ్చింది. మకడమియ చెట్టు గింజలను క్వీన్స్లాండ్ నట్స్ లేదా ఆస్ట్రేలియన్ నట్స్ అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకూలం. గుండె జబ్బులు, కేన్సర్, షుగర్ రానివ్వకుండా చూసే ఈ అద్భుత పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..మకడమియ దీర్ఘకాలిక పంట. గుబురుగా పెరిగే చెట్టుకు కాచే గుండ్రటి మకడమియ కాయల నుంచి వొలిచిన గింజలను తింటారు. ఈ గింజలు చూడడానికి పెద్ద శనగల మాదిరిగా ఉంటాయి. గుండ్రటి కాయలోని మరొక ΄÷రలో ఈ గింజ దాక్కొని ఉంటుంది. మకడమియ చెట్లలో ఏడు జాతులున్నాయి. వాణిజ్యపరంగా సాగుకు అనువైనవి రెండు మాత్రమే. మకడమియ ఇంటెగ్రిఫోలియ (దీని కాయ పెంకు గుల్లగా ఉంటుంది), మకడమియ టెట్రాఫిల్లా (దీని కాయ పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది). మిగతా రకాల గింజలు విషపూరితాలు, తినటానికి పనికిరావు.కిలో గింజల ధర రూ. 1,175మకడమియ పంట ఆస్ట్రేలియా, హవాయి, సౌతాఫ్రికా, మలావి, బ్రెజిల్, ఫిజి, కాలిఫోర్నియ (అమెరికా)లో ఎక్కువగా సాగువుతున్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కొందరు రైతులు ఈ చెట్ల సాగును ఈ మధ్యనే ప్రారంభించారు. 2017 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,544 టన్నుల మకడమియ కాయల వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచే 70% దిగుబడి వస్తోంది. డిమాండ్కు తగిన మకడమియ గింజల లభ్యత మార్కెట్లో లేదు. ఈ గింజల ఖరీదు కిలోకు 14 అమెరికన్ డాలర్లు. అంటే.. రూ. 1,175. ఇంత ఖరీదైన పంట కాబట్టే మకడమియ తోటల సాగుపై మన దేశంలోనూ రైతులు ఆసక్తి చూపుతున్నారు.12 అడుగుల ఎత్తుమకడమియ ఉష్ణమండల పంట. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉంటుంది. అశోకా చెట్ల ఆకుల మాదిరిగా దీని ఆకులు ఉంటాయి. ఎత్తు 2–12 మీటర్లు, కొమ్మలు 5–10 మీటర్ల వరకు పెరగుతాయి. తెల్లటి పూలు గుత్తులుగా (8–10 సెం.మీ. పోడవున) వస్తాయి. శీతాకాలం మధ్యలో పూత ్ర΄ారంభమవుతుంది. గుత్తికి 100కిపైగా పూలు ఉన్నా 2 నుంచి 10 కాయలు మాత్రమే వస్తాయి. స్వపరాగ సంపర్కం జరిగే పంట ఇది. కృత్రిమంగా పోలినేషన్ చేస్తే దిగుబడి పెరుగుతుంది. మకడమియ కాయ పైన ఉండే మందపాటి తీసేస్తే గట్టి గుళ్లు బయటపడతాయి. వాటిని పగులగొడితే మధ్యలో గింజలు ఉంటాయి. లేత పసుపు రంగులో మెత్తగా ఉండే గింజలు తియ్యగా ఉంటాయి. పూత వచ్చిన 7–8 నెలల్లో కాయలు కోతకొస్తాయి. 13 –31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దీనికి సూటబుల్. వార్షిక వర్ష΄ాతం 125 సెం.మీ. చాలు. నీరు నిలవని సారవంతమైన లోమీ సాయిల్ (ఇసుక, బంకమన్ను, సేంద్రియ పదార్థం కలిసిన ఎర్ర ఒండ్రు భూములు) అనుకూలం. విత్తనాల ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కలు పెంచవచ్చు. నాటిన తర్వాత 4–5 ఏళ్లలో కాపు ప్రారంభమై.. 50–75 ఏళ్ల ΄ాటు కాయల దిగుబడినివ్వటం ఈ చెట్ల ప్రత్యేకత.ఆరోగ్యదాయక పోషకాల గనిఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మోనో అన్శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ గింజలు తిన్న వారి రక్తంలో టోటల్, ఎల్డిఎల్ కొలస్ట్రాల్ తగ్గింది. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తినిస్తాయి. గింజలకే కాదు దాని పైన రలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు లేదా రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ లేదు. బి–సిటోస్టెరాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్ ఆసిడ్ (18:1), పాల్మిటోలీక్ ఆసిడ్ (16:1) వంటి మోనో అన్శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం (గుండె రక్షణకు ఇది ముఖ్యం) వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి–కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్ (విటమిన్ బి–6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్–ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టం నుంచి డిఎన్ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ పంటకు అంత క్రేజ్!గుండె ఆరోగ్యానికి మేలు..షుగర్, కేన్సర్ రానివ్వవు..👉మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 👉 మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గిస్తాయి. 👉 ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ∙జీర్ణ శక్తిని పెంచుతాయి. 👉 కేన్సర్ నిరోధక శక్తినిస్తాయి.👉 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 👉 చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. 👉 ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 👉 మానసిక వత్తిడి నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 👉 రక్తహీనత రాకుండా చూస్తాయి. 👉 మధుమేహం రాకుండా చూస్తాయి. -
క్యాన్సర్ కేర్ వంటిల్లూ పుట్టిల్లే!
క్యాన్సర్ రావడానికి కొన్ని పద్ధతుల్లో వంట కూడా కారణమవుతుంది. ఉదాహరణకు ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడకూడదనేది అందరికీ తెలిసిన విషయం. అలా మాటిమాటికీ నూనెను వేడి చేయడం వల్ల అందులో క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఏర్పడతాయి. అందుకే అలా వాడకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా వంట విషయంలో క్యాన్సర్కు కారణమయ్యే అంశాలేమిటీ... వంటలో చేయకూడనివేమిటీ, చేయాల్సినవేమిటో తెలుసుకుందాం. 7 వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడకూడదు. 7 కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారం క్యాన్సర్ కారకమయ్యే అవకాశముంది. అందుకే వేట మాంసం (రెడ్ మీట్) వద్దని నిపుణుల సలహా. రెడ్ మీట్ ఎక్కువగా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువ. రెడ్ మీట్తో ΄్యాంక్రియాటిక్, ్ర΄ోస్టేట్, ΄÷ట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో ΄ోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం కొందరు అధ్యయనవేత్తల పరిశీలనలో తేలిన విషయం. అయితే మాంసాహార ప్రియులకు న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే... మాంసాహార ప్రియులు రెడ్మీట్కు బదులు వైట్ మీట్ అంటే కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు తినడం మంచిది. చేపలైతే ΄ోషకాహారపరంగా కూడా మంచివి. అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ను నివారిస్తాయి కూడా. 7 క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా కీలకమే. ముఖ్యమే. ఒక వంటకాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో వండటం కొన్నిసార్లు క్యాన్సర్ కారకాలైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమివ్వవచ్చు. ఉదా: మాంసాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ (వేపుడు) ఐటమ్స్గా చేస్తుంటే అందులోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ అనే రసాయనాలుగా మారవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. 7 విదేశీ తరహాలో ఇప్పుడు మనదేశంలోనూ స్మోక్డ్ ఫుడ్ తినడం మామూలుగా మారింది. స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలేలా మంట మీద వండిన ఆహారపదార్థాల్లోంచి వెలువడే ‘΄ాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్స్) అనే రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే ఈ పద్ధతుల్లో వడటం సరికాదు.7 ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోడానికి వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఉదాహరణకు ఆహారాల నిల్వకు ఉప్పు వాడటం అనాదిగా వస్తున్న పద్ధతి. అయితే ఉప్పులో చాలాకాలం పాటు ఊరిన పదార్థాల వల్ల పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతిని, అది ఇన్ఫ్లమేషన్కు గురికావచ్చు. అలా కడుపు లోపలి రకాలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోవడంతో కడుపులో ఒరుసుకు΄ోయిన లైనింగ్ రకాలు నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటప్పుడు కడుపులో ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మజీవి ఉంటే అది ఆ ్రపాంతాల్లో పుండ్లు (స్టమక్ అల్సర్స్) వచ్చేలా చేస్తుంది. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, సాల్టెట్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్ను చాలా పరిమితంగా తీసుకోవాలన్నది వైద్యనిపుణుల సలహా. ఆహారంలో ఉప్పు పెరుగుతున్నకొద్దీ్ద హైబీపీ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గ్రాములకు మించి ఉప్పు వాడటం సరికాదు. -
బ్రో... ఫిఫ్టీ దాటారా? 'ప్రో'స్టేటస్’ చూసుకోండి!
పురుషుల్లో వచ్చే అత్యంత సాధారణమైన కేన్సర్లలో ప్రోస్టేట్ కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వచ్చే కేన్సర్లలో దీనిది రెండోస్థానం. వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి, ప్రస్తుతం లభిస్తున్న అధునాతనమైన చికిత్స పద్ధతుల ద్వారా వైద్యం చేయించగలిగినట్లయితే చాలా మంచి ఫలితాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు నెలను ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన మాసంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ప్రోస్టేట్ కేన్సర్పై అవగాహన కోసం ఈ కథనం. ప్రోస్టేట్ గ్రంథిని తెలుగులో పురుష గ్రంథి అని పిలుస్తారు. ఇది మూత్రకోశం (యూరినరీ బ్లాడర్)కు దిగువన ఉండి, అక్కడ మొదలైన మూత్రనాళం (యురెథ్రా) ఈ గ్రంథిలోంచే బయటకు వచ్చి, పురుషాంగం ద్వారా వెలుపలకు వస్తుంది. మూత్రనాళం చుట్టూ ప్రోస్టేట్ గ్రంథి ఉండటంతో మూత్రకోశం నుంచి మూత్రాన్ని బయటకు రాకుండా అది నిలువరిస్తుంది. కేవలం మూత్ర విసర్జన సమయంలో మాత్రమే ఇది తెరచుకుంటుంది. ఇది చేసే మరో ముఖ్యమైన పనేమిటంటే... ఇది స్రవించే స్రావం పురుషుల వీర్యకణాలకు పోషకపదార్థంగా పనిచేస్తుంది.ప్రోస్టేట్ కేన్సర్ అంటే...? ప్రోస్టేట్ గ్రంథి కణాలలోని జన్యువుల్లో మ్యూటేషన్ జరిగినప్పుడు అది కేన్సర్కు దారితీస్తుంది. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారణ చేసి చికిత్స చేయించకపోతే, ఈ కేన్సరే ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే... హార్మోన్ల అసమతౌల్యత వల్ల 50 ఏళ్లు పైబడిన కొందరిలో ఈ గ్రంథి పరిమాణం పెరగవచ్చు. దీన్నే బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని పిలుస్తారు. ఇది కేన్సర్ కాదు.ప్రమాద సూచికలు ఏమిటి? ఈ కేన్సర్లో ప్రోస్టేట్ పరిమాణం పెరగడం వల్ల మూత్రవిసర్జన సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు... ∙మూత్రధార సన్నబడటం, ముక్కాల్సి రావడం రాత్రుళ్లు మాటిమాటికీ నిద్రలేచి మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం మూత్రవిసర్జన తర్వాత కొంత లోపలే మిగిలిపోవడం అప్పుడప్పుడూ మూత్రంలో రక్తం కనిపించడం. ఒకవేళ కేన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు ఎముకల్లో నొప్పులు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాల విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది... తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రెండో అంశమేమి టంటే... ఇవే లక్షణాలు హానికరం కాని బినైన్ ఎన్లార్ట్మెంట్లోనూ కనిపించవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్? వయసు పెరుగుతుండటం: పెరిగే వయసు ఒక నివారించలేని ముప్పు. నాలుగింట మూడొంతుల మందిలో 65 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపిస్తుంది. వంశపారంపర్యంగా: కుటుంబాల్లో ఎవరైనా ప్రోస్టేట్ కేన్సర్ బారిన పడితే... వారి సంతానానికి / సోదరులకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ. మెటబాలిక్ సిండ్రోమ్: సిండ్రోమ్ అంటే వివిధ రకాల శారీరక రుగ్మతల సమాహారం. అంటే... హై బ్లడ్ ప్రెషర్, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం, నియంత్రణ లేని మధుమేహం... ఈ అంశాల సమాహారం వేరువేరు కేన్సర్లతో పాటు ప్రోస్టేట్ కేన్సర్కూ కారణమయ్యే అవకాశాలు ఎక్కువ. పొగతాగడం: ఇది పరోక్షంగా ప్రోస్టేట్ కేన్సర్ రిస్క్ను అధికం చేస్తుంది. నిర్ధారణ ఎలా? యాభై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్తగా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. దీని నిర్ధారణ కోసం యూరాలజిస్టులు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) అనే రక్తపరీక్ష చేయిస్తారు. ఆ విలువ ఉండాల్సిన దానికంటే పెరిగినట్లయితే ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత ఎమ్మారై, పెట్స్కాన్ అనే పరీక్షలతో క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో అంశాన్ని తెలుసుకుంటారు. చికిత్స : కేన్సర్ కేవలం ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటే, శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. దాంతో వ్యాధి పూర్తిగా మటుమాయమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సాంకేతికత ద్వారా ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. దీన్ని ‘రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. రోబోటిక్ శస్త్రచికిత్సలో పెద్ద గాట్లు అవసరం లేకుండా, కేవలం చిన్న చిన్న రంధ్రాలతో అధునాతమైన పరికరాల ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీనివల్ల రక్తస్రావం, నొప్పి తక్కువ, కోలుకోవడమూ వేగంగా జరుగుతుంది. ప్రోస్టేట్ చుట్టూ ఉండే చిన్న చిన్న నరాలకు ఎలాంటి దెబ్బా తగలకుండా ఆపరేషన్ చేయవచ్చు. ఈ నరాలు అంగస్తంభనకు అవసరమవుతాయి. ఈ పద్ధతిని ‘నర్వ్ స్పేరింగ్ ప్రోస్టెక్టమీ’ అంటారు. ఎవరైనా శస్త్రచికిత్స వద్దనుకున్నా లేదా వారికి ఫిట్నెస్ లేకపొయినా రేడియోథెరపీ మంచి ప్రత్యామ్నాయం. దురదృష్టవశాత్తూ ఈ జబ్బును లేట్ స్టేజెస్లో కనుగొన్నట్లయితే... అంటే కేన్సర్ ఇతర అవయవాలకు తాకినప్పుడు వారిలోని టెస్టోస్టెరాన్ హార్మోన్ను తగ్గించడం ద్వారా ఈ కేన్సర్ను తగ్గించవచ్చు. దీన్ని ‘హార్మోన్ థెరపీ’ అంటారు దీనికి అదనంగా ఇప్పుడు ఎబిరటారోన్ లేదా ఎంజాలుటమైడ్ వంటి అధునాతనమైన మందులూ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియోన్యూక్లైడ్ థెరపీ ఉన్నాయి. నివారణ ఎలా? ప్రోస్టేట్ కేన్సర్కు నివారణ అంటూ ఏమీ లేదు. అయితే దీనికి కచ్చితమైన చికిత్స పొందవచ్చు. కొంతవరకు జీవనసరళిలో మార్పులూ, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా కొంత నివారణ సాధ్యమవుతూ ఉండవచ్చు. ఉదాహరణకు ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, అలాగే శరీర బరువును నియంత్రించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో కొంతవరకు నియంత్రించవచ్చు.డా. రాజేశ్ కుమార్ రెడ్డి అడపాల, కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్ (చదవండి: పిక్కకు ఓ లెక్కుంది..! హార్ట్ పంపింగ్లో కింగ్..!) -
మా అబ్బాయిని బ్రతికించండి
-
పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత
లిమా (పెరూ): పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి బుధవారం రాజధాని లిమాలో కన్నుమూశారు. దీర్ఘ కాలంగా క్యాన్సర్తో పోరాడి మరణించారని ఆయన కుమార్తె కీకో ఫుజిమొరి ‘ఎక్స్’లో ప్రకటించారు. విద్యావేత్త నుంచి పెరూ రాజకీయాల్లోకి మెరుపులా వచ్చిన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయి, ఆ తరువాత జైలు పాలై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. 2026 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కీకో ప్రకటించడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పెరూ స్వాతంత్య్ర దినం 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమాలో ఫుజిమొరి జని్మంచారు. ఈయన కు టుంబం జపాన్ నుంచి వలస వచ్చింది. గణిత శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ అయిన ఫుజిమొరి 1990 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనెవరికీ తెలియదు. తన ప్రచార ర్యాలీల్లో ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వామపక్షాల భారీ మద్దతుతో ప్రఖ్యాత రచయిత మారియో వర్గాస్ లోసాను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానన్న హామీతో అధికారంలోకి వచి్చన ఫుజిమొరి రెండో వారంలోనే నిత్యావసరాలపై సబ్సిడీలను ఎత్తివేయడం ‘ఫుజీ–షాక్’గా పేరుగాంచింది. డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాణిజ్య సుంకాలను తగ్గించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పెరూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. లాటిన్ అమెరికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి పునాదులు వేశాయి. ఇక స్వేచ్ఛా–మార్కెట్ సంస్కరణలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం రాజ్యాంగాన్ని పునర్నిరి్మంచారు. వ్యతిరేకత.. అణచివేత.. కేసులు.. 1992లో పార్లమెంట్పైకి యుద్ధ ట్యాంకులను ఉపయోగించడంతో పెరూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పదేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు కూడా ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చాయి. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం అమలు చేశారు. 2000లో మూడోసారి గెలిచిన తరువాత ఫుజిమొరి ఉన్నత సలహాదారు, గూఢచారి చీఫ్ వ్లాదిమిరో మాంటెసినోస్ రాజకీయ నాయకులకు లంచం ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫుజిమొరి తన పూరీ్వకుల జపాన్కు పారిపోయారు. టోక్యో నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఆయన.. ఆ తరువాత జపాన్ సెనేటర్ పదవికి పోటీపడి ఓడిపోయారు. షైనింగ్ పాత్ మిలిటెంట్ల అణచివేతకు ఆదేశించారనే ఆరోపణలతో ఫుజిమొరిపై పలు కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల జైలు శిక్ష 2005లో పెరూకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2007లో చిలీ వచి్చన ఆయన్ను అక్కడి అధికారులు 2009లో పెరూకు అప్పగించారు. పలు కేసుల్లో దోషిగా 25 ఏళ్ల జైలుపాలయ్యారు. తరచూ అనారోగ్యం పాలవ్వడంతో క్షమాభిక్ష కోసం అప్పీలు చేశారు. అయితే జైలు నుంచి బయటకు రావడానికి అదో ఎత్తుగడగా ప్రత్యర్థులు తోసిపుచ్చారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి 2017లో ఫుజిమొరికి క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని నెలల తరువాత కుజిన్స్కీ అభిశంసనకు గురయ్యారు. పెరూ న్యాయస్థానం ఫుజిమొరి క్షమాభిక్షను రద్దు చేసి, ప్రత్యేక జైలుకు పంపింది. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయనకు 2023లో కోర్టు క్షమాభిక్షను పునరుద్ధరించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మొదటి భార్య సుసానాతో విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత ఆయన కుమార్తె కీకోను ప్రథమ మహిళగా నియమించారు. ఆమె మూడుసార్లు పెరూ అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. కుమారుడు కెంజో కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. -
కవలలకు జన్మనిచ్చిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు
ఇండోర్(మధ్యప్రదేశ్): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటీ తెలిపారు. ‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు. ‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు. మైయెలాయిడ్ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. -
చిన్నారి అంతులేని ధైర్యం : కన్నీటి పర్యంతమైన పోలీస్ ఆఫీసర్
చిన్న వయసులో అరుదైన కేన్సర్తో పోరాడుతూ తన కల నెరవేర్చుకోవాలని ఆశపడింది టెక్సాస్కు చెందిన ఆరేళ్ల చిన్నారి అబిగైల్ అరియాస్. ఆరేళ్ల వయసులో ఏళ్ల గౌరవ పోలీసు అధికారిగా ప్రమాణం చేస్తూ అక్కడున్నవారందరి గుండెల్ని బరువెక్కించింది. అంతేకాదు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న టెక్సాస్లోని ఫ్రీ పోర్ట్ అధికారి కంటతడి పెట్టిన వీడియో సంచలనంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే.2012, జూన్ 28న రూబెన్ , ఇలీన్ అరియాస్లకు అబిగైల్ అరియాస్ జన్మించింది. అబిగైల్కు ఏతాన్కు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఎంతో సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో 2017లో, అరియాస్కు ఫోర్త్ స్టేజ్ విల్మ్స్ ట్యూమర్ అనే అరుదైన కిడ్నీ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇలాంటి కేన్సర్లో పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. చికిత్సలో భాగంగా ఆ చిన్నారి ఒకటీ రెండూ కాదు, ఏకంగా 90 రౌండ్ల కీమోథెరపీలను, దాని సైడ్ ఎఫెక్ట్స్ను ధైర్యంగా కనిపించింది. కానీ ఆరు నెలలకే కేన్సర్మళ్లీ తిరగ బెట్టింది. 2018లో ఊపిరితిత్తులకు పాకింది. చివరకు ఈ మహమ్మారి ముందు అబిగైల్ అరియాస్ ధైర్యం ఓడిపోయింది. 2019, నవంబరులో ఆమె కన్నుమూసింది. కానీ చనిపోయే సమయంలో కూడా అంతే నిబ్బరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. చాలా చిన్నవయసులో అంతటి నిబ్బరాన్నిచూపించిన ఆమె మరణంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గఅయితే చనిపోవడానికి ముందు తన కలను సాకారం చేసుకునే క్రమంలో 2019 ఫిబ్రవరిలో అబిగైల్ ఫిబ్రవరిలో గౌరవ ఫ్రీపోర్ట్ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసింది. అద్భుతమైన చిరువ్వుతో మొత్తం డిపార్ట్మెంట్నే ఆకట్టుకుంది. ముఖ్యంగా పోలీస్ యూనిఫాం ధరించి అరియాస్ 758 పోలీస్ఆఫీసర్గా ధైర్యంగా తన సంఘాన్ని రక్షిస్తానని ,సేవ చేస్తానని వాగ్దానం చేసింది. ఈ సందర్భంగా ఫ్రీపోర్ట్ పోలీస్ చీఫ్ రేమండ్ గారివే కన్నీటి పర్యంతమైనారు. ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా పదిలపర్చుకున్నారు.A police chief in Texas was brought to tears when he swore in a 6-year-old girl as an honorary officer. She has an incurable cancer, and wants to become a cop so she can fight the "bad guys in her body" 💖 pic.twitter.com/Muc2moj0l6— Kevin W. (@Brink_Thinker) August 29, 2024 ఆమె మనోధైర్యం, జీవితం పట్ల ఆమెకున్న స్ఫూర్తి ఫ్రీపోర్ట్ నుంచి అమెరికాలోని పోలీసు డిపార్ట్మెంట్లకు దాకా చేరింది. ఆమె కోసం ప్రార్థనలు చేశారు. పాటలు పాడారు. వరల్డ్ సిరీస్ గేమ్ 1కి ముందు ఆమె హ్యూస్టన్ ఆస్ట్రోస్ స్టార్ జోస్ అల్టువేని కలుసుకుంది. ఆమె చనిపోయిన తరువాత పోలీస్ చీఫ్ రేమండ్ గారివే సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆఫీసర్ 758 కేన్సర్ ఫైడ్ పౌండేషన్ కేన్సర్తో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తీర్చేందుకు కృషి చేస్తోంది. -
28 ఏళ్లకే క్యాన్సర్
సాక్షి, అమరావతి: మానవ మనుగడకు ఆధారమైన వాయువు పరుగులు పెడుతున్న ప్రస్తుత పారిశ్రామిక యుగంలో స్వచ్ఛతను కోల్పోతోంది. ఆయుష్షును పెంచాల్సిన స్థితి నుంచి ఆయువు తీసే దశకు చేరింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ధూమపానమే ఇందుకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ జీవితంలో ఎన్నడూ ధూమపానం చేయని వ్యక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో దీని బారిన పడుతున్నారని, దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్కు చెందిన నిపుణులు, పరిశోధకులు ఊపిరితిత్తుల క్యాన్సర్పై చేపట్టిన అధ్యయనాన్ని ఇటీవల లాన్సెట్ ఈ–క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం పాశ్యాత్య దేశాల కంటే పదేళ్ల ముందే భారత్లో ధూమపానం అలవాటు లేని వారిపై ఈ జబ్బు ప్రభావం చూపుతోంది. ఏపీలో ఏటా 70 వేలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. 2025 నాటికి గణనీయంగా పెరుగుదల దేశంలో వ్యాధి సంభవించే రేటు 1990లో ఒక లక్ష జనాభాకు 6.62 శాతం ఉండగా 2019 నాటికి 7.7 శాతానికి చేరింది. 2025 నాటికి పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు ప్రజల జీవనం వాయుకాలుష్య కారకాల మధ్యే సాగడంతో దేశంలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. కాలుష్య దేశంగా భారత్ అధ్యయనంలో వైద్య నిపుణులు 2022లో ప్రపంచ వాయు నాణ్యత నివేదికను ఉటంకించారు. ⇒ ఈ నివేదిక ప్రకారం క్యూబిక్ మీటర్కు సగటున 53.3 మైక్రోగ్రాముల పీఎం 2.5 సాంద్రతతో భారత్ ఎనిమిదో అత్యంత వాయు కాలుష్య దేశంగా నిలిచింది. ⇒ 2023లో మూడవ అత్యంత వాయు కాలుష్య దేశంగా ఆవిర్భవించింది. ⇒ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 భారత్లోనే ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో స్పష్టం చేసింది. ఇంటా, బయట జాగ్రత్తలు పాటించాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాల్లో కాలుష్యం ఒకటి. పొల్యూషన్ను ఇండోర్, అవుట్డోర్ అని రెండు విధాలుగా పరిగణించాలి. అవుట్ డోర్ పొల్యూషన్కు ఎక్కువగా పురుషులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే డీజిల్, పెట్రోల్ అన్బార్న్ ఉద్గారాలు గాలిలో కలుస్తుంటాయి, వీటితో పాటు సల్ఫర్ డయాక్సైడ్, ఇతర ఉద్గారాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి గాలిలో ఉంటాయి. వీటిని పీల్చడం ఆరోగ్యానికి హానికరం. ప్రస్తుత రోజుల్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు, ఇతర కారణాలతో ఎక్కువ సేపు నిల్చోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో మాస్క్ వాడటం తప్పనిసరి. అదే విధంగా వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇక ఇంట్లో వంటింటి నుంచి వెలువడే పొగ నుంచి మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వంటింటిలోకి గాలీ, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా ఎయిర్ ఎక్స్ట్రాక్టర్లను అమర్చుకోవడం ఉత్తమం. – డాక్టర్ రఘు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, గుంటూరు -
టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!
మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. నిమిషాలు కరిగిపోతున్నాయంటూ బాధపడుతోంది. అంతేగాదు తనతో గడిపే కొత్త వ్యక్తులు ఉంటే రండి అంటూ తనతో స్పెండ్ చేసే సమయాన్ని వేలం పాట వేస్తుంది. ఏంటిదీ అనుకుంటున్నారా..?. నయం చేయలేని ఈ వ్యాధి తనను మింగేసేలోపే జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా వ్యక్తులతో గడపాలని కోరుకుంటోంది. ఆమె ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..!అసలేం జరిగిందంటే..32 ఏళ్ల ఎమిలీ లాహే అత్యంత అరుదైన నట్ కార్సినోమాతో బాధపడుతోంది. ఈ కేన్సర్ శరీరంలో మెడ, తల, ఊపరితిత్తుల్లో ఎక్కడైన రావొచ్చు. ఇది చికిత్సకు లొంగని కేన్సర్. అందువల్లే దీన్ని టెర్మినల్ కేన్సర్ అంటారు. అంటే తగినంతగా చికిత్స చేయలేని వ్యాధి అని అర్థం. ఆయుర్దాయం లేదని లేదా ఎక్కువ రోజుల మనుగడ సాధించని పరిస్థితి టెర్మినల్ కేన్సర్ అంటారు. దీంతో తనకు ప్రతి క్షణం విలువైనవి అంటోంది లాహే. మనిషి సాధారణంగా వర్తమానం తప్పించి భూత, భవిష్యత్తుల గురించి ఆలోచింస్తుంటాడు. కానీ ఈ వ్యాధి సదా వర్తమానంలో ఉండకపోతే క్షణాలు ఆవిరిపోతాయనే ఒక పాఠాన్నినేర్పిందని చెబుతోంది. అందుకే తన చివరి క్షణాలను కూడా ఆనందంగా జీవించాలని భావిస్తోంది. అందుకే ఆ క్షణాలను కొత్త వ్యక్తులతో గడిపేందుకు ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం తనకు అత్యంత అమూల్యమైనదని చెబుతోంది. కన్నీళ్ల తెప్పిస్తున్న లాహే మాటలన్ని అక్షర సత్యం. జీవితం క్షణభంగురం అని చెప్పకనే చెబుతోంది. అందుకు ఇప్పుడే చనిపోతాం అనుకుని జీవిస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రవర్తిస్తారేమో!. నిజానికి లాహే ఈ వ్యాధి నిర్ధారణ కాకమునుపు వరకు ప్రతి రోజు ఐదు నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తేది. మంచి జీవనశైలిని అనుసరించేది. అసలు తను ఇలాంటి వ్యాధి బారిన పడతానని భావించలేదు కూడా. తాను మొదట్లో దీర్ఘకాలిక సైనసైటిస్, తలనొప్పిని అనుభవించింది. ఆ తర్వాత చూపుని కోల్పోవడం వంటి లక్షణాలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇది కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలకు స్పందించదు. దీంతో జన్యు సంబంధిత ప్రయోగాత్మక చికిత్స చేయాలనుకున్నారు వైద్యులు. అందుకు ప్రభుత్వ మద్దతు లభించడంలో ఎదురైనా అలసత్వం ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేలా చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటోంది. ఇక్కడ కేన్సర్ తమ ప్రియమైన వారిని ఎన్నటికీ దూరం చేయలేదు. ఎందుకంటే..? వారితో గడిపే అమూల్యమైన క్షణాలు గొప్ప జ్ఞాపకాలని అందిస్తాయని భావోద్వేగంగా చెబుతోంది లాహే. . ఇక్కడ లాహే ఉద్వేగభరితమైన అనుభవం కేన్సర్ వ్యాధులపై మరింతగా పరిశోధనలు చేసే ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది. కాగా, ఆస్ట్రేలియా ఆరోగ్య సంస్థ ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50% మాత్రేమ కానీ 2010కి వచ్చేటప్పటికీ 70%గా ఉంది. చెప్పాలంటే రోగ నిర్థారణ తర్వాత బాధితులు ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. అంతేగాదు ఆస్ట్రేలియన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అరుదైన కేన్సర్లని నయం చేసేలా కొంగొత్త పరిశోధనలకు మద్దతు ఇస్తుండటం గమనార్హం. (చదవండి: దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!) -
పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్ని ఎలా గుర్తించాలి..?
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో మరణించాడు. గైక్వాడ్ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. వాటిలో 2 సెంచరీలతో కలిపి మొత్తం 2,254 పరుగులు చేశాడు. అతను 1983లో పాకిస్తాన్పై 201 పరుగులు చేశాడు. అయితే గైక్వాడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అసలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఏంటీ..? ఎందువల్ల వస్తుంది..? అంటే..ఇది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. ఇక్కడ మాజీ గైక్వాడ్ తన అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు ధైర్యంగా పోరాడుతూ లండన్లో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. బ్లడ్ కేన్సర్ అంటే..కేన్సర్ అంటే కణాల నియంత్రణ లేని పెరుగుదల. అదే విధంగా, బ్లడ్ కేన్సర్ అంటే రక్త కణాల అనియంత్రిత పెరుగుదల. రక్త కేన్సర్ హెమటోలాజిక్ కేన్సర్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ, రక్త కణాల వంటి రక్తం-ఏర్పడే కణజాలాలలో (ప్రాధమిక, ద్వితీయ లింఫోయిడ్ అవయవాలు) ప్రారంభమవుతుంది.ఎలా ప్రభావితం చేస్తుందంటే..రక్త కణాల విధులు,ఉత్పత్తిలు బ్లడ్ కేన్సర్ ద్వారా ప్రభావితమవుతాయి. చాలా వరకు కేన్సర్లు రక్తం ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి అంటే ఎముక మజ్జ నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియ అసాధారణ రకం కణాల పెరుగుదల ద్వారా చెదిరిపోతుంది. ఈ కేన్సర్ రక్త కణాలు రక్త నష్టాన్ని నివారించడం, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడం మొదలైన ప్రాథమిక విధులను నిర్వహించకుండా రక్తాన్ని ఆపుతాయి.లుకేమియా సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది.లింఫోమా సాధారణంగా 16 నుంచి 24 ఏళ్ల వయసు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారితో పోలిస్తే 31% మంది పురుషులు లుకేమియాతో బాధపడుతున్నారు.ఈ కేన్సర్లో రకాలు..మైలోమా: ఎముక మజ్జలో మొదలై ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే కేన్సర్లింఫోమా: ఇది ఎముక మజ్జను కలిగి ఉన్న శోషరస వ్యవస్థకు సంబంధించిన కేన్సర్లుకేమియా:ఇది పిల్లలు,యుక్తవయస్కులలో వచ్చే అత్యంత సాధారణ రక్త కేన్సర్ఎందువల్ల అంటే..దీనికి డీఎన్ఏ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీఎన్ఏ రక్తకణాలు ఎప్పుడూ విభజించాలి, లేదా గుణించాలి లేదా ఎప్పుడు చనిపోవాలనేది చెబుతుంది. ఇక్కడ డీఎన్ఏ సూచనలు ఆధారంగా శరీరం అసాధారణమైన రక్త కణాలను అబివృద్ధి చేస్తుంది. ఇవి సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి,గుణించబడతాయి. అలాగే ఒక్కోసారి సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. దీంతో సాధారణ కణాలు గుమిగూడి ఎముక మజ్జలో స్థలాన్ని గుత్తాధిపత్యం చేసే అసాధారణ కణాల సముహంలోకి సాధారణ రక్త కణాలు పోతాయి. అందువల్ల ఎముక మజ్జ సాధారణ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జన్యుమార్పిడి మూడు రకాలు కేన్సర్లకు కారణమవుతుంది. సంకేతాలు, లక్షణాలుబ్లడ్ కేన్సర్ని బట్టి లక్షణాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు రకాల బ్లడ్ కేన్సర్లో కామన్గా కనిపించే సంకేతాలు ఏంటంటే..అలసట తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా నిరంతర అధిక జ్వరంరాత్రి చెమటలతో తడిచిపోవడంఅసాధారణ రక్తస్రావం లేదా గాయాలుఊహించని విధంగా బరువు తగ్గడంరోగనిరోధక వ్యవస్థపై ప్రభావం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లువాపు శోషరస కణుపులు లేదా విస్తరించిన కాలేయం లేదా ప్లీహముఎముక నొప్పిఈ లక్షణాలన్నీ కొన్ని వారాలకు మించి శరీరంలో ఉంటే తక్షణమే వైద్యుడుని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: రియల్ లైఫ్ వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే 14 కిలోలు..!) -
క్యాన్సర్తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
తనే నిజ జీవితంలో ఒక సూపర్ పవర్: బుల్లితెర నటి ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. హీనా ఖాన్కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.హీనా ఖాన్ తన ఇన్స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.కాగా.. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.అన్షుమన్ గైక్వాడ్కు బ్లడ్ క్యాన్సర్కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.బీసీసీఐ సాయం చేయాలిబీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.ట్రస్టు ఏర్పాటు చేయాలిమా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!టీమిండియా హెడ్ కోచ్గానూ కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
సిగరెట్ సగం దమ్ములాగి వదిలేస్తున్నారా? అయితే ..!
సిగరెట్ అస్సలు ముట్టనివాళ్లతో పోలిస్తే... సగం సగం లేదా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే వారిలో 64 శాతం మందికి మామూలుగా పోగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు యూఎస్లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన అధ్యయనవేత్తలు. ఆ అధ్యయనంలోని వివరాల ప్రకారం కొద్ది కొద్దిగా పఫ్ పీల్చినప్పటికీ వాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే 12 రెట్లు ఎక్కువని తేలింది.అంతేకాకుండా కొద్దిపాటి మోతాదులోనైనా పోగ పీల్చేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు రెండున్నర రెట్లు అధికమని తేలింది. యాభై తొమ్మిది నుంచి ఎనభై రెండేళ్ల వరకు వయసున్న మొత్తం మూడు లక్షల మందిపై ఓ అధ్యయనం నిర్వహించాక వాటి ఫలితాలను బట్టి ఈ అంశాలు వెల్లడయ్యాయి. -
ఇవి తిందాం.. ఉత్సాహంగా ఉందాం!
నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ అవేమిటో చూద్దామా?టొమాటో... దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.బెర్రీస్... అన్ని రకాల బెర్రీస్... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.యోగర్ట్ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది.బీన్స్....ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.గ్రీన్ టీ... ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.ఆకుకూరలు... ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పోటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. అందుకే తిందాం... ఉత్సాహంగా ఉందాం. -
షాకింగ్ రిపోర్ట్: పానీ పూరీతో కేన్సర్ వస్తుందా?
శివాజీనగర: ఆరోగ్యానికి హానికరమంటూ రాష్ట్రంలో రంగులు వాడి చేసే గోబి మంచూరియా, బొంబై మిఠాయి, చికెన్ కబాబ్లను సర్కారు నిషేధించడం తెలిసిందే. పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని, త్వరలో చర్యలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ జాబితాలో అరబ్ దేశాల వంటకమైన చికెన్ షావర్మా కూడా చేరనుంది. ఆహార భద్రత, వైద్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన పలు షావర్మా నమూనాలలో అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఈస్ట్లు బయటపడ్డాయి. కాబట్టి వాటి విక్రయాలను నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.17 నమూనాలను పరీక్షించగాకొంతకాలంగా బెంగళూరు, మంగళూరు వంటి నగరాలలో షావర్మా షాపులు వెలిశాయి. చికెన్ను పెద్ద గోపురం మాదిరిగా ఏర్పాటు చేసి వేడి చేసి ముక్కలుగా కత్తిరించి, చపాతీలో చుట్టి ఇస్తారు. దీనిని సేవించి అస్వస్థతకు గురైన కేసులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్లలో శాంపిల్స్ను సేకరించగా, 8 శాంపిల్స్లో బ్యాక్టీరియా, ఈస్ట్లు బయటపడ్డాయి. దీంతో షావర్మా అసురక్షితం అని నిర్ధారించారు. ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచితే బ్యాక్టీరియాలు, ఈస్ట్లు ఏర్పడతాయి. కేరళలో షావర్మా తిని పలువురు చనిపోయారు కూడా. షావర్మ వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐలో నమోదు చేసుకోవాలని నిబంధన ఉంది. షాపులో ఆ రిజిస్ట్రేషన్ పత్రం పెట్టకపోతే అమ్మకాన్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించినట్లు ఓ అధికారి తెలిపారు. -
క్యాన్సర్తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్ భర్త సూసైడ్
గువహతి: భార్య క్యాన్సర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన మంగళవారం(జూన్18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య క్యాన్సర్తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. -
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. చికిత్స అందించే విధానాల్లో నూతన ప్రక్రియలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్కు చెందిన వైద్యులు మరో అద్భుతం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగికి 40 కి.మీ. దూరం నుంచి టెలీసర్జరీ టెక్నిక్ ద్వారా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో, రోగికి కోత పెట్టడం నుంచి కణితిని తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వరకు మొత్తం ప్రక్రియ పూర్తయింది. డార్క్ గ్లాసెస్ ధరించి, రోబోట్ను ఆపరేట్ చేస్తూ, వైద్యులు రోగి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ ప్రభావిత కణాలను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వారంలో బాధితుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.వైద్యుల బృందం గురుగ్రామ్లోని ఎస్ఎన్ ఇన్నోవేషన్లో ఉండగా, 52 ఏళ్ల రోగి ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చికిత్స అందుకున్నాడు. ఆపరేషన్ సమయంలో ఇంటర్నెట్తో పాటు సాంకేతికతకు అంతరాయం ఏర్పడకుండా వైద్యప్రక్రియ విజయవంతంగా జరిగింది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, జెనిటో-యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ రావల్తో పాటు అతని వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.ఈ సందర్భంగా డాక్టర్ రావల్ మాట్లాడుతూ దేశంలోని ఏ మూలన ఉన్న రోగులకైనా టెలిసర్జరీ ద్వారా చికిత్స సాధ్యమవుతుందన్నారు. ఆపరేషన్ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాను ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్లు భావిస్తూ, పేషెంట్ ఎదురుగా పడుకుండగా మానిటర్లో చూస్తూ చికిత్స చేశానన్నారు. సాధారణ ఆపరేషన్లో రోగి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్లో త్రీడీ నాణ్యతతో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.ఈ ఆపరేషన్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా జరిగింది. దీనికి ఐదు సన్నని రోబోటిక్ చేతులు ఉన్నాయి. దీనికి త్రీడీ హెచ్డీ సెట్ అనుసంధానమై ఉంది. ఇది సర్జన్కు మరింత స్పష్టమైన దృశ్యం కనిపించేలా చేస్తుంది.ఈ పద్ధతిలో రోగి చిన్నపాటి కోతకు గురవుతాడు. రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ సోకిన అవయవం లేదా కణం తొలగించిన తర్వాత, కుట్లు వేస్తారు.ఈ పద్ధతిలో రోగి సంప్రదాయ శస్త్రచికిత్సా విధానం కంటే త్వరగా కోలుకుంటాడు. బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యుల దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. -
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
యాంటీ కేన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్న 5 సూపర్ ఫుడ్స్ఇవే!
ప్రపంచంలో జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు. ఇదే మాటలను ఉటంకిస్తూ ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. సింథానీ ఎక్స్లో ఒక ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. యాంటి కేన్సర్, యాంటీ డయాబటిక్ సూపర్ఫుడ్స్ గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు.షిటేక్ మష్రూమ్స్ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.నాటో లేదా నానబెట్టిన సోయా బీన్స్ సీవీడ్ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.5 Anti-Cancer, anti-diabetic, super foods that explain Japanese longevity. pic.twitter.com/Owicj1OFsO— Barbara Oneill (@BarbaraOneillAU) June 14, 2024ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు. -
కేన్సర్ను జయించే టీ పార్టీలు
ముంబైలో విజి వెంకటేశ్ నిర్వహించే టీ పార్టీలకు నలుగురూ ఉత్సాహంగా వస్తారు. కారణం– కొన్ని కబుర్లు నడుస్తాయి. దాంతోపాటు కేన్సర్ను నివారించే జీవన విధానం తెలుస్తుంది. కేన్సర్ బాధితులకు అండగా నిలిచే వీలూ దొరుకుతుంది. 71 ఏళ్ల విజి వెంకటేశ్ గత రెండు దశాబ్దాలుగా కేన్సర్పై చైతన్యం కలిగిస్తోంది. విజి వేంకటేశ్ కృషి....‘కేన్సర్ అంటే ఇంకా జనంలో భయం పోలేదు. మాట్లాడటానికి జంకుతారు. టీ అందరికీ ఇష్టం. తాగుతూ కబుర్లు చెప్పుకున్నంత సాధారణంగా కేన్సర్ గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, బాధితులకు చేయదగ్గ సాయాన్ని గుర్తు చేయడం గురించే నేను టీ పార్టీలు– చాయ్ ఫర్ కేన్సర్ నిర్వహిస్తున్నాను’ అని తెలిపారు విజి వెంకటేశ్. ముంబైకి చెందిన 72 ఏళ్ల ఈ సేవా కార్యకర్త దక్షిణ ఆసియాలో కేన్సర్ బాధితుల సహాయానికి పని చేస్తున్న ‘ది మ్యాక్స్ ఫౌండేషన్’కు ప్రధాన బాధ్యతలు నిర్వరిస్తోంది. ‘మేము చాలా హాస్పిటల్స్తో మాట్లాడాము. దిగువ ఆదాయ వర్గాల్లో కేన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఛారిటబుల్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కాని సమస్య ఏమిటంటే... ఆ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి దారి ఖర్చులు వారి వద్ద ఉండవు. మందులు కొనుక్కోవడానికి, తగిన ΄ûష్టికాహారం తినడానికి వీలుండదు. అలాంటి వారికి సహాయం అందించడమే నా లక్ష్యం. అందుకు టీ పార్టీలకు స్నేహితులను పిలుస్తాను. వారి సహాయం కోరుతాను’ అంది విజి వెంకటేశ్.కార్మికులను చూసి...విజి వెంకటేశ్ ముందు ఒక సాధారణ కార్యకర్తగానే సేవా రంగంలోకి వచ్చింది. ముంబైలోని కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ కోసం నాలుగు చందాలు వసూలు చేసి పెట్టడం ఆమె పని. చిన్న చిన్న వాడల్లోకి వెళ్లి చందాలు అడిగితే వాళ్లు తమ దగ్గర ఉన్నదాంట్లో ఇరవై రూపాయలో, ముప్పై రూపాయలో ఇచ్చేవారు. మరోవైపు వారంతా కార్మికులు కనుక ధూమపానం వల్ల, ఇతర అలవాట్ల వల్ల ఎక్కువగా కేన్సర్ బారిన పడటం విజి గమనించింది. ‘ఒక కేన్సర్ పేషెంట్తో టెస్ట్లు చేయించుకుని, మందులు తీసుకోవచ్చు కదా అనంటే అతను దాని బదులు నా పిల్లలకు పాలు కొనివ్వగలిగితే నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. ఆ జవాబు నన్ను కదిలించింది. ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవితాంతం సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను’ అని తెలిపింది విజి.చాయ్ పార్టీ 4 లక్షలువిజి తన టీ పార్టీలకు స్నేహితులను, బంధువులను పిలుస్తుంది. ఆమె సంస్థ, కృషి గురించి విన్న అపరిచితులు కూడా వచ్చి టీ పార్టీలో కూచుంటారు. కేన్సర్ అవగాహన కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు సరదా పాటలు, మాటలు నడుస్తాయి. చివరలో విజి దిగువ ఆదాయ వర్గాల కేన్సర్ బాధితుల కోసం చందాలు కోరుతుంది. ‘ప్రతి టీ పార్టీలో కూడా విశేష స్పందన వస్తుంది. అప్పటికప్పుడు వారికి తోచింది ఇస్తారు. ఒకోసారి 4 లక్షల రూపాయల వరకూ వస్తాయి. అక్కడ ఉన్నవారు వేరే ఫ్రెండ్స్కు కాల్ చేసి మరీ డబ్బులు వేయిస్తారు’ అని తెలిపింది విజి.18 వేల మందికివిజి తన సంస్థ ద్వారా ముంబై, మహరాష్ట్రలోని 18 వేల మంది కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తోంది. వారి చికిత్సకు, మందులకు, పరీక్షలకు డబ్బు ఏర్పాటు చేస్తుంది. ఒకోసారి కుటుంబ పరిస్థితి కూడా గమనించాల్సి ఉంటుంది. ‘తగిన వైద్యం అందితే చాలామటుకు కేన్సర్ నుంచి బయటపడొచ్చు. ఆ వైద్యం అందే పరిస్థితుల కోసం మనందరం తలా ఒక చేయి వేయాలి’ అందామె.ప్రస్తుతం దేశంలో 30 చోట్ల విజి సంస్థ కోసం టీపార్టీలు జరుగుతున్నాయి. మిగిలినప్రాంతాల్లో కూడా ఇలాంటివి నిర్వహించి నిధులు కేన్సర్ బాధితులకు అందేలా చేయొచ్చు. -
సీఎం కేజ్రీవాల్కు క్యాన్సర్? అవే లక్షణాలు?
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. పీఈటీ, సిటీ స్కాన్ తదితర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తన మధ్యంతర బెయిల్ను ఒక వారం పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్లో వివరించారు.అరవింద్ కేజ్రీవాల్లో కనిపిస్తున్న లక్షణాలు తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్ని కూడా సూచిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. దీని తరువాత లోక్సభ ఎన్నికల ప్రచారానికి జూన్ ఒకటి వరకు ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మే 10న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 2న కోర్టుకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది.బిజినెస్ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఆప్ నేత అతిషి మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేజ్రీవాల్ ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నసమయంలో అతని బరువు ఏడు కిలోలు మేరకు తగ్గింది. అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది ఆందోళన కలిగించే అంశమని, కస్టడీ నుంచి బయటకు వచ్చాక, వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజీవాల్ తిరిగి బరువు పెరగడం లేదని అతిషి తెలిపారు.ఢిల్లీ సీఎంకు జరిపిన వైద్య పరీక్షల్లో అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందని అతిషి చెప్పారు. అధిక కీటోన్ స్థాయిలతో పాటు ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్తో పాటు కిడ్నీ వ్యాధులకు సంకేతమని ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ పీఈటీ స్కాన్తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని అతిషి వివరించారు. -
బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!
క్రానిక్ మైలోయిడ్ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్ఎల్). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్ బోన్మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్లోని నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు. ఆయన చెబుతున్న విశేషాలివి...సీఎంఎల్ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.కొన్ని సందర్భాల్లో సీఎంఎల్ ని ’మంచి క్యాన్సర్’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్ నిర్వహణలో ముఖ్యమైనవి.సీఎంఎల్ రోగుల కోసం కొన్ని సూచనలు...నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సీఎంఎల్ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం. సీఎంఎల్ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.సపోర్ట్ నెట్వర్క్లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్ గ్రూప్ల ద్వారా ఇతర సీఎంఎల్ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్ చికిత్సలో భాగమైన టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్స్ , రోగులకు ఫలితాలు జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.కౌన్సిలింగ్ చాలా ముఖ్యం...‘నేను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా నిర్ధారణ తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్ అందించడం చాలా ముఖ్యంప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..) -
తాగుడుకు బానిసైన టాలీవుడ్ హీరోయిన్.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)
-
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్లో హిట్ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్గా అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది. ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది. -
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్ (ఎన్టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.2015 నుంచి 2022 మధ్యఎన్టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఎలాంటి ప్రయోజనం లేదనితాజా అధ్యయనంపై ఎన్హెచ్టీఎస్ఏ (యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు. ఇదొక్కటే పరిష్కారంగ్రీన్ సైన్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. -
బేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్ట్లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ స్త్రీల అండాశయ క్యాన్సర్కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్ చాప్టర్ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. -
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
‘భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు..’
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్ఏఎస్ఎఫ్ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు తెలిపారు.ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..రామయ్య అడ్వాన్స్డ్ టెస్టింగ్ ల్యాబ్స్లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. -
భయపడొద్దమ్మా.. నేనున్నా..
అత్తిలి: క్యాన్సర్తో బాధపడుతున్న ఓ చిన్నారి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ వెంకయ్య కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా కోనాల ఆంజనేయులు, కామాక్షి దంపతులు తమ కుమార్తె దానేశ్వరిని తీసుకువచ్చి సీఎం జగన్ను కలిశారు. తమ కుమార్తె కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోందంటూ కన్నీరుపెట్టుకున్నారు. వైద్యం కోసం చాలా ఖర్చు చేశామని.. అయినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే ఆదుకోవాలి జగనన్నా అంటూ విలపించారు. సీఎం జగన్ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను ప్రభుత్వం భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు. దీంతో ఆంజనేయులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. దేవుడిలా వచ్చి ఆదుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్జనులను బాగా కదిలించింది. -
కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?
పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్పీజీ గ్యాస్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్పై వంటలు చేయడం మొదలయ్యింది. ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!) -
గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్
తానిక ఎక్కువ రోజులు బతకనని ఆమెకు తెలుసు .అందుకే లెజెండరీ స్టార్ షానెన్ డోహెర్టీ షానెన్ డోహెర్టీ గుండెలు పిండే విషాదాన్ని షేర్ చేసింది. ‘‘లెట్స్ బి క్లియర్" అనే పోడ్కాస్ట్లో తన జీవితానికి సంబంధించిన కీలక అప్డేట్ను పంచుకుంది. కేన్సర్ చికిత్సలో భాగంగా . "కేన్సర్ ఇన్ఫ్యూషన్" అనే కొత్త చికిత్స గురించి కూడా మాట్లాడింది. ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అయినా కూడా తన చనిపోయిన తర్వాత తన తల్లి రోసా డోహెర్టీకి అండగా నిలబడేలా, ఆమెకు భారం కాకుండా ఉండేలా, తనను ప్రేమించిన వారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు వెల్లడించింది. ఫోర్త్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న షానెన్కు ఇపుడది మెదడు, ఎముకలకు కూడా వ్యాపించింది. దీంతో తనకిక త్వరలోనే చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించేందుకు సిద్ధపడుతోంది. అంతేకాదు...తల్లిని ఆదు కోవాల్సిన తను ముందే చనిపోతే, ఆమె ఒంటరిదైపోతుందనీ,అందుకే ఆస్తులను అమ్మి తల్లికివ్వాలని , తద్వారా తన మరణం తర్వాత ఆమెకు ఆర్థికంగా ఆదుకునేలా ఉండాలని చూస్తోంది.తన కెంతో ఇష్టంగా సేకరించుకున్న వస్తువులను విక్రయిస్తోంది.ఇదే సరైంది అని భావిస్తోంది. కేన్సర్తో పోరాడుతున్నప్పటికీ, డోహెర్టీ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడుగులువేస్తోంది.భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని నిశ్చయించుకుంది. ఆఖరికి అంత్యక్రియల ఏర్పాట్లను ప్లాన్ చేసుకుంటోంది. కేన్సర్ తన జీవితాన్ని మార్చసిందనీ, నిజంగా జీవితాన్ని, తన ప్రాధాన్యతలను మార్చేసిందని తెలిపింది అందుకే ఏళ్లుగా సేకరించిన పురాతన వస్తువులు, ఇతర వస్తువులను విక్రయించడమో లేదా విరాళంగా ఇవ్వడమో చేస్తోంది. "ప్రస్తుతానికి నా ప్రాధాన్యత నా తల్లి - నేను ఆమె కంటే ముందే చనిపోతే అది ఆమెకు కష్టమని నాకు తెలుసు" ఇది ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, అందుకే ఆమకోసం ఏదైనా చేయాలని నిర్ణయించాను అని తెలిపింది. అలాగే షానెన్ ఆమె సంపాదించిన డబ్బుతో తన తల్లిని సెలవులకు తీసుకెళ్లేందుకు ఆమెను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కాగా షానెన్ డోహెర్టీ బాల్యం నుండి నటిస్తోంది. 1981లో తన పదేళ్ల వయసులో "ఫాదర్ మర్ఫీ" అనే టీవీ షోలో గెస్ట్ స్టార్గా తన కెరీర్ను ప్రారంభించింది. టీనేజ్ డ్రామా బెవర్లీ హిల్స్, 90210 , చార్మ్డ్ టీవీ సీరియల్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.1983 లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ 18 ఎపిసోడ్లలో జెన్నీ వైల్డర్గా నటించిన ప్రశంసలు పొందింది. అనేక అవార్డులను గెల్చుకుంది. 2015లో డోహెర్టీకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పట్లో కేన్సర్తగ్గినా మళ్లీ వచ్చిందని ఆమె 2017లో వెల్లడించింది. 2020లో మరింత విస్తరించిందని తెలిపింది. 2023 నవంబర్ 29 న పీపుల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెదడుకు, ఎముకలకు కూడా పాకిందని తెలిపింది. -
క్యాన్సర్ బారిన సుశీల్ కుమార్ మోదీ!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్వయంగా తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానూ, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. లోక్సభలో భాగల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, సభలోని లా అండ్ జస్టిస్ కమిటీకి ఛైర్మన్గానూ వ్యవహరించారు. తాను ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్నానని సుశీల్ కుమార్ మోదీ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు. पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा । PM को सब कुछ बता दिया है । देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित | — Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024 -
బాధంతా నీ ఒక్కదానిదే కాదమ్మా..నేనూ నీతోనే : కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కేన్సర్ పేషెంట్ల చికిత్స చాలా క్లిష్టం. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఎత్తు అయితే, కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ను భరించడం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే మామూలు వారు ఈ ఆలోచన భరించడమే కష్టం. కానీ కేన్సర్ సోకిన వారు కచ్చితంగా ఫేస్ చేయాలి. అనేక శారీరక బాధలను భరించాలి. ధైర్యంగా నిలడాల్సిందే. ముఖ్యంగా ఎంత పెద్ద జుట్టు అయినా, కుచ్చులుగా కుచ్చులుగా ఊడిపోతోంది. బోడిగుండు అయిపోతుంది. వీటి అన్నింటినీ తట్టుకోని బైటపడాలంటే చాలా మానసిక స్థయిర్యం కావాలి. ఈ మొత్తం ప్రక్రియలో చికిత్సం అందించే వైద్యులు, నర్సులుతో, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందించే సపోర్ట్ చాలా కీలకం. దీనికి సంబంధించిన ఒకటి ట్విటర్లో ఒకటి నెటిజన్ల కంట తడి పెట్టిస్తోంది. (సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!) ముఖ్యంగా కీమోథెరపీ తరువాత జుట్టు ఊడిపోతున్న క్రమంలో చాలామంది రోగులు ముందుగానే తమ హెడ్ షేవ్ చేసుకుంటా ఉంటారు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడి తల్లి తన జుట్టును మొత్తం తీసివేయించుకనేందుకు పార్లర్కు వెళ్లింది. అంతా సిద్దమైన తరువాత ఆమె కుమార్తె వచ్చి అనూహ్యంగా హెయిర్కటింగ్ టూల్ను తీసుకొని తన జుట్టును కట్ చేసుకుటుంది. దీన్ని గమనించిన తల్లి కన్నీంటి పర్యంతమవుతుంది. ‘‘నేను నీతోనే.. అమ్మా... నువ్వు ఒంటరివి కాదు’’ అన్నట్టు తల్లిని హత్తుకుంటుంది. ట్విటర్లో షేర్ అయిన ఈ వీడియో మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. (అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది) “Mom, you don’t have to go through this alone”🥺❤️ pic.twitter.com/fsdTasZAWt — non aesthetic things (@PicturesFoIder) March 29, 2024 -
పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్లు ఆడి స్ట్రీమర్గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్స్ట్రీమ్లో వీడియో గేమ్లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
కేట్ మిడిల్టన్కు క్యాన్సర్
లండన్: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (42) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. పొత్తికడుపు ఆపరేషన్ తర్వాత జనవరి నుంచి మీడియా ముందుకు రాని మిడిల్డన్ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికార్లు చేస్తుండటం తెలిసిందే. క్యాన్సర్కు కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కేట్ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఏప్రిల్ దాకా విధులకు దూరంగా ఉండనున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే. -
Kate Middleton: నేను కేన్సర్తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
గోబీ మంచూరియాపై నిషేధం?
యశవంతపుర: గోబీ రైస్, గోబీ మంచూరియాను కొందరు ఇష్టంగా తింటారు. ఇందులో పిల్లలు ఎక్కువగా ఉంటారు. అయితే విషపూరితంగాను, క్యాన్సర్ అంశాలు ఎక్కువగా ఉన్న బొంబయి మిఠాయి, గోబి మంచూరియాని నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేధిక ఆధారంగా కాటన్ క్యాండి, గోబిల విక్రయాలను నిలుపుదల చేయాలని భావిస్తోంది. గోబి బాగా రంగుతో కనిపించడానికి, రుచి వచ్చేందుకు కృత్రిమ రంగులు, రసాయనాలు కలుపుతున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఆరోగ్యశాఖ సర్కారుకు తెలిపింది. దీని ఆధారంగా ఈ నెల 11 ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. -
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్లు, టెస్ట్లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్నాథ్ చెప్పుకొచ్చారు. -
సడెన్గా విమాన ప్రయాణం క్యాన్సిల్ : పాపం ఆ జంట!
ఓ జంట సరదాగా గడిపేందుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అనుకోని విధంగా భయానక వ్యాధి బారినపడటం సడెన్గా తిరిగొచ్చాయల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అయితే సదరు విమానయాన సంస్థ ఆ జంట నుంచి నిర్థాక్షిణ్యంగా లక్షల్లో చార్జీలు వసూలు చేసింది. వారి పరిస్థితి ఇది అని వేడుకున్న ససేమిరా అంది విమానాయన సంస్థ. పాపం ఆ దంపతులుకు ఆ వ్యాధి వచ్చినందుకు బాధపడాలో లేక ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అయ్యినందుకు బాధపడాలో తెలియని స్థితి ఎదురయ్యింది. ఈ చేదు ఘటన న్యూయార్క్ దంపతులకు ఎదురయ్యింది. జనవరిలో టోడ్(60) ప్యాట్రిసియా కెరెక్స్(70) దంపతులు జనరిలో న్యూయార్క్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజలాండ్లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ వరకు అక్కడే ఆక్లాండ్లోనే గడపాలని అనుకున్నారు. అయితే ఆరువారాలకే ప్యాట్రిసియా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు పిత్తాశయం క్యాన్సర్ ఉందని నిర్థారణ అయ్యింది. నాలుగు నెలల కంటే ఎక్కువ బతకదన్నా విషాదవార్త ఆ దంపతులను నిలువున కుంగదీసింది. పైగా వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయాలని ఫ్యామిలీ డాక్టర్ కూడా సూచించడంతో తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది ఆ జంట. అందుకోసమని తాము ముందుగా బుక్ చేసిన విమాన టికెట్లను క్యాన్సిల్ చేసి రీ షెడ్యూల్ చేయామని సదరు విమానయాన సంస్థను కోరారు. అయితే సదరు విమానాయన సంస్థ రిటర్న్ టికెట్లు ధర ఏకంగా రూ. 18 లక్షలు దాక అవుతుందని స్పష్టం చేసింది. షాక్కి గురయ్యిన ఆ దంపతులు తమ పరిస్థితిని వివరించి వేడుకున్నారు. టోడ్ తన భార్య అనారోగ్య పరిస్థితి కారణంగా తమ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నామని విమానాయన అధికారులకు తెలిపారు. ఇంతటి విషాదంలో ఇంతలా ఆర్థిక భారం మోపొద్దని ఎంతలా అభ్యర్థించినా సదరు విమానయాన అధికారులు అంగీకరించ లేదు. అయినా ఒక కస్టమర్ అనారోగ్య రీత్యా లేదా అనుకోని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఉండే కస్టమర్ ఎమర్జెన్సీ పాలసీని వర్తింపచేయొచ్చు. అయితే అధికారులు ఆ పాలసీని ఫాలో అవ్వకపోగా వేరే విమాన టికెట్లు బుక్ చేయాలంటే కనీసం రూ. 6.5 లక్షలు చెల్లించక తప్పదని తెగేసి చెప్పేసింది ఎయిర్ న్యూజిలాండ్. పాపం ఆ దంపతులు హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా అంతమొత్తం చెల్లించి వెనక్కి వచ్చేశారు. అసలు న్యూజిలాండ్ వాసులు ఇంత కఠినంగా వ్యవహిరస్తారని మాకు తెలియదు అన్నారు ఆ దంపతులు. ఇది న్యూజిలాండ్ స్థాయికి తగని పని అని ఆవేదనగా చెప్పారు ఆ దంపతులు. ఇలాంటి విపత్కర స్థితిలో ఇంతలా వసూలు చేయడం అనేది ఏవిధంగా చూసిన సరైనది కాదన్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలుసుకున్న ఎయిర్ న్యూజిలాండ్ వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పింది. వేరే విమాన టిక్కెట్లు బుక్ చేసేందుకు అయ్యిన అదనుపు టిక్కెట్లు ఖర్చులను కూడా వాససు ఇస్తామని స్పష్టం చేసింది. నిజానికి ఒక కస్టమర్కి ఏదైన విపత్కర పరిస్థితి ఎదురయ్యితే చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసి మరోక విమానంలో ప్రయాణించేలా చేసే వెసులబాటు ఉందని చెప్పడమే గాక ఆ దంపతులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాని పేర్కొంది. పైగా మరోసారి క్షమాపణలు చెప్పింది ఎయిర్ న్యూజిలాండ్. బస్, ట్రెయిన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు పోయినా అంత భయం అనిపించదు కానీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుందిగానీ లేదంటే ఖర్చులు తడిసిమోపడవ్వడం గ్యారంటీ. (చదవండి: బట్టతలపై జుట్టు పెరిగెలా చెయ్యొచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత
మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా కన్నుమూసింది. కేన్సర్తో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆమె 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 22న ఆసుపత్రి చేరిన రింకీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస తీసుకుంది. రింకీ చక్మా మరణాన్ని సోషల్మీడియా ద్వారా ప్రకటించిన మిస్ఇండియా ఆర్గనైజేషన్ సంతాపాన్ని తెలిపింది. 2022 నుండి రింకీ రొమ్ము కేన్సర్తో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో తగ్గినట్టే తగ్గి, మహమ్మారి మళ్లీ విజృంభించింది. ఊపిరితిత్తులు, తలకు బాగా వ్యాపించింది. ఫలితంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సంబంధిత ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి, సెలవంటూ వెళ్లిపోయింది. View this post on Instagram A post shared by Rinky Chakma (@rinkychakma_official) గత నెలలో, రింకీ తన ఇన్స్టాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. “నాకు మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్ (2022లో బ్రెస్ట్ క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపరేషన్ అది నా ఊపిరితిత్తులలోకి , ఇప్పుడు నా తలలో (మెదడు కణితి) చేరింది. ఇపుడు బ్రైన్ సర్జరీ ఇంకా పెండింగ్లో ఉంది, ఇప్పటికే ఇది బాడీలో చాలావరకు వ్యాపించింది. 30శాతం ఆశలే ఉన్నాయి’’ ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స నడుస్తోందంటూ తన బాధను ఫ్యాన్స్తో పంచుకుంది. అంతేకాదు రెండేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం.. దాచుకున్న సొమ్మంతా కరిగిపోయింది. డొనేషన్స్ తీసుకుంటున్నాఅంటూ ఆర్థిక సహాయాన్ని అర్థించారు. కానీ అంతలోనే వి ఆమె కన్నుమూయడం విషాదం. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. -
ప్రాణాంతక కేన్సర్తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..
ఓ మహిళ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన కేన్సర్తో భాధపడుతూ మరణం అంచుల వద్ద ఉంది. ఆ టైంలో ఆమె చివరి మాటలుగా రాసుకొచ్చిన పోస్ట్ ఎంత భావోద్వేగంగా ఉందంటే..చదువుతుంటే కంటతడి పెట్టకుండ ఉండలేం. కళ్ల ముందు మరణం చేరువలో ఉన్నా.. ఆమె తనలాంటి వాళ్లు ఎలా ఉండాలో వివరించింది. జీవిత సాఫల్యం అంటే ఏంటో వివరించింది. ప్రాణాలను పొట్టనబెట్టుకునే క్యాన్సర్ల విషయంలో అవగాహన పెంచుకుని చికిత్సలు తీసుకోవాలని కూడా చెప్పింది. ప్రాణం ఉండదు అనే టైంలో ఇంత బరువైన మాటలు రావాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా!. ఆ పోస్ట్లో ఆమె ఏం రాసిందంటే.. యూకేకి చెందిన డేనియోల్లా మరణించడానికి కొన్ని రోజుల ముందు భావోద్వేగానికి గురిచేసే పోస్టు పెట్టింది. ఆ పోస్టు ప్రతి ఒక్కరి మనుసును కదిలిస్తుంది. ఆ పోస్టులో..తాను నయంకానీ చోలాంగియోకార్సినోమా అనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఎలా వచ్చిందనేది కూడా తెలియదు. నా చేతుల్లో జీవితం లేదని తెలిసిపోయింది. తన పిత్త వాహికలో క్యాన్సర్ మొదలవ్వడంతో ఇదివరకటిలా హాయిగా జీవితం సాగలేదు. వచ్చే సంవత్సరాల్లో అయినా ఈ భయానక వ్యాధిపై పరిశోధనలు జరుగుతాయని ఆశిస్తున్నా. తద్వారా నాలాంటి చాలామందిని మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా కాపాడొచ్చు. మనం ఈ వ్యాధిని అదుపు చేయలేకపోయినా స్పందించే విధానంలో దమ్ముంటే ఏ వ్యాధి అయినా తోకముడవాల్సిందే. జీవితాన్ని కోల్పోతున్నామని నిరాశ చెందకూడదు. బతికే ప్రతీ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించే సమయం అని గుర్తు పెట్టుకోవాలి. ఇక నీకు ప్రతి నిమిషం అమూల్యం అనే విషయం తెలుస్తుంది. చావు చివరి నిమిషంలో నీలో ఉన్న అచంచలమైన ధైర్యం, శక్తి తన్నుకుంటూ బయటకు రావాలి . ఆ చావే నిన్ను కబళిస్తున్నందుకు కంటతడి పెట్టేలా చావుదెబ్బ తీయాలి. తాను ఆ మార్గాన్నే ఎంచుకున్నానని చెప్పింది. అందుకోసం తానుబాధకు బదులుగా ప్రతీ క్షణం ఆస్వాదించేందుకు యత్నించా. రోమాంటిక్ ఉండేలా జీవితాన్ని మార్చుకున్నా. ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతికాను. సంతోషాన్నిచ్చే ప్రతి పని చేశా. చివరి వరకు ఆనందంగా ఉన్నా. అలాగే నాలా ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడే వాళ్లు మీ ఆనందాన్ని దూరం చేసుకునేలా ఆఖరి నిమిషాలు బాధగ అస్సలు గడపొద్దు. ఇక తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ.." తాను ఆనందంగా జీవించానని, అలాగే మీరు కూడా మీ ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. మీకు ఇష్టమైనవి చేయండి. మనం విడిపోయినప్పటికీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఇప్పటి వరకు అన్ని విధాలుగానాకు మద్దుతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అన్ని విధాలు ఆనందంగా జీవించేందుకు అర్హులు. అందువల్ల హాయిగా జీవితాన్ని గడపండి అంటూ తన భాగస్వామికి దైర్యాన్ని నూరుపోస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది" డేనియోల్లా. దీంతో నెటిజన్లు "చాలా శక్తిమంతమైన పోస్ట్ ఇది, చివిరి నిమిషంలో కూడా స్పూర్తిని నింపేలా పోస్టు పెట్టారు ఎందరో క్యాన్సర్ రోగులకు ప్రేరణనిచ్చే పోస్టు ఇది. ఆమె మరణించినప్పటికీ ఈ పోస్ట్లోని అక్షరాల రూపంలో మన ముందే ఉంటుందామె". అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. (చదవండి: షమీకి మడమ సర్జరీ: అసలేంటీ సర్జరీ? రికవరీకి ఎందుకంత టైం?) -
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్తో ముందుగా కేన్సర్ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
క్యాన్సర్ని కనిపెట్టే డివైజ్.. అద్భుతం చేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
చూడటానికి మొబైల్ఫోన్లా కనిపించే ఈ పరికరం క్యాన్సర్ను కనిపెడుతుంది. అమెరికాలోని మ్యాకో కార్పొరేషన్ నిపుణులు ఈ పరికరాన్ని ‘డెర్మా సెన్సర్’ పేరుతో రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన ఈ పరికరం మూడు రకాల స్కిన్ క్యాన్సర్లను కచ్చితంగా గుర్తించగలదు. మెలనోమా, బేసల్ సెల్ కార్సినోమా, స్క్వేమస్ సెల్ కార్సినోమా రకాల క్యాన్సర్లను గుర్తించడంలో ఈ పరికరం గ్రహించిన స్పెక్ట్రోస్కోపిక్ ఇమేజరీని ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్ విశ్లేషించి, చర్మంపై తలెత్తిన మార్పులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. జనరల్ ఫిజీషియన్లకు, డెర్మటాలజిస్టులకు ఉపయోగపడేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దారు. ఇది చర్మ క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. -
క్యాన్సర్ బాధితులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంకు చెందిన వంకాయల శ్రీనివాస్ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవించేవారు. ఆయనకు భార్య సాయిపద్మశ్రీ, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2022 డిసెంబర్లో సాయిపద్మశ్రీ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారినపడింది. దీంతో శ్రీనివాస్ వైద్య పరీక్షలు చేయించగా ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. వైద్యులు చికిత్స కోసం ఏదైనా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే అప్పటికే వ్యాపారంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన శ్రీనివాస్కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి అండగా నిలిచింది. తెలిసిన వాళ్లు చెప్పడంతో శ్రీనివాస్ తన భార్యను విజయవాడలోని ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రి హెచ్సీజీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే వైద్యులు వైద్య పరీక్షలన్నీ చేసి సాయిపద్మశ్రీకి చికిత్సను అందించారు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పూర్తి కావడంతో ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. ఆరోగ్యశ్రీ వల్లే తన భార్య ప్రాణాలతో బయటపడిందని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. .. ఇది ఒక్క శ్రీనివాస్ ఆనందమే కాదు.. రాష్ట్రంలో ఎంతోమంది ఆరోగ్యశ్రీ తమ ప్రాణాలను కాపాడిందని చెబుతున్నారు. గతంలో ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఆశలు వదులుకోవాల్సిందే. రూ.లక్షల ఖర్చయ్యే వైద్యాన్ని తలుచుకుని బాధిత కుటుంబాలు భీతిల్లేవి. ఇల్లు, వాకిలి తెగనమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్యాన్సర్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. బాధితులు తమ చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే పనిలేకుండానే మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తోంది. 3.03 లక్షల క్యాన్సర్ బాధితులకు ఉచిత వైద్యం టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పెరిగాయి. లుకేమియా బాధితులకు నిర్వహించే రూ.10 లక్షలు, ఆ పై ఖర్చయ్యే బోన్మారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను సైతం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి ఈ పథకం కింద 3,03,899 మంది క్యాన్సర్ బాధితులకు 10,43,556 ప్రొసీజర్స్లో ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,165.74 కోట్లు ఖర్చు చేసింది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. క్యాన్సర్కే కాదు.. ఒక్క క్యాన్సర్కే కాకుండా హృద్రోగాలు, కిడ్నీ, లివర్.. ఇలా వివిధ రకాల బాధితులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి ఉచితంగా అందుతున్నాయి. టీడీపీ హయాంలో క్యాన్సర్, గుండె జబ్బు, తదితర పెద్ద రోగాల బారినపడితే పేదలు తమ తల తాకట్టు పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితులను మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రొసీజర్లను 3,257కు, వైద్యం ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.12,150 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసింది. ఉచిత వైద్య సేవలే కాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగులకు విశ్రాంత భృతిగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకు 22.88 లక్షల మందికి రూ.1,366 కోట్ల సాయాన్ని అందించింది. ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. మాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాం. బస్టాండ్లో స్టాల్ నడిపేవాడిని. 2021లో నాకు క్యాన్సర్ సోకింది. కరోనా, ఇతర కారణాలతో వ్యాపారాలు సాగని దుస్థితిలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే పనిలేకుండానే పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. – పి.మధుసూదనరావు, విజయవాడ నా ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోంది నేను లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నా. క్యాన్సర్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని హెచ్సీజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుతోంది. వైద్యం, మందులకు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. – ఎన్.రాంబాబు, విజయవాడ రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు అన్ని రకాల క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు ఉన్నాయి. అర్హులైన నిరుపేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. చికిత్సల భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. – డి.కె. బాలాజీ, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
కృతజ్ఞతలు తెలిపిన బ్రిటన్ కింగ్ చార్లెస్-3
లండన్: బ్రిటన్ కింగ్ చార్లెస్-3కి ఇటీవల క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే చార్లెస్-3 ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ఆకాక్షించారు. కాన్సర్ నిర్ధారణ అయిన తొలిసారి చార్లెస్-3 స్పందించారు. ‘ఇటీవలి కాలంలో నా ఆరోగ్యం బాగుండాలని ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సందేశాలు పంపారు. వారు పంపిన అన్ని సందేశాలు నాకు చేరాయి. వారందరికీ నా ఆరోగ్యంపై చూపిన ప్రేమకు హృదయాపూర్వకమైన కృతజ్ఞతలు. క్యాన్సర్ బారినపడినవారికి తెలుసు.. అభిమానం, ప్రేమ చూపించేవారి దయతో కూడిన పార్థనలు, ఆలోచనలే తమకు గొప్ప ఓదార్పు, ప్రోత్సాహం’ అని కింగ్ చార్లెస్-3 ఓ ప్రకటనలో తెలిపారు. ‘మెడికల్ ప్రొఫెషనల్స్, క్యానర్స్ చారిటీలు చూపిన అంకితభవం మరువలేనిది. నేను స్వయంగా వారి సేవలు పొందాను. అందుకే వారి మీద ఆరాధనభావం మరింత పెరిగింది’ అని ను రాజు చార్లెస్-3 ప్రశంసించారు. సోమవారం 75 ఏళ్లు ఉన్న రాజు చార్లెస్కు కాన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్హం ప్యాలేస్ ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. చార్లెస్-3.. బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం చేసిన 18 నెలలో కాన్సర్ గురికావటం గమనార్హం. ఆయన కాన్సర్ సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది. చదవండి: కింగ్ చార్లెస్కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..? -
గిరిజనులకు ఆధునిక కేన్సర్ పరీక్షలు
ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా కుసుమి తెహశీల్ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో (పహాడ్పూర్, ఉపర్బేడా) కేన్సర్ స్క్రీనింగ్, సికిల్సెల్ అనీమియా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. గ్లోబల్ గ్రేస్ హెల్త్ (జీజీహెచ్) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం చేపట్టామని, ఎస్ఎల్ఎస్ ట్రస్ట్, సికిల్ సెల్కు సంబంధించిన పరికరాలను తయారు చేసే సంస్థ కూడా తన వంతు సహకారం అందించిందని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఉచిత పరీక్షలు ఫిబ్రవరి ఇరవయ్యవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకూ కొనసాగుతాయని, మారుమూల ప్రాంతాల్లోని వారికీ ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యం ఈ విధంగా నెరవేరుతోందని వారు వివరించారు. పహాడ్పూర్ గ్రామం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో సుమారు 5800 మంది జనావాసమున్న పదకొండు గ్రామాలున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. కేన్సర్పై పోరుకు ముందస్తు నిర్దారణ చాలా కీలకమని ఫౌండేషన్ విశ్వసిస్తోందని, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించాలన్న ఆశయంతో తాము పనిచేస్తున్నామని వివరించింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందడం కష్టమవుతున్న పరిస్థితుల్లో ఇతర సంస్థల సహకారంతో తాము చేపట్టిన ఈ కార్యక్రమం కేన్సర్, సికిల్సెల్ అనీమియా పరీక్షల్లోని వివక్షను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రెండు వ్యాధులను ఎంత తొందరగా గుర్తిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధుల ముందుగానే గుర్తించడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎల్ఎస్ ట్రస్ట్ సికిల్సెల్ అనీమియా ఎక్విప్మెంట్ కంపెనీ, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన... కేన్సర్, సికిల్ సెల్ అనీమియా పరీక్షలను అందరికి మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సామాజిక, భౌగోళిక అంతరాలను దాటుకుని అందరికీ ఈ పరీక్షలు అందేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉచిత స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ కేన్సర్పై అవగాహన పెరుగుతుందని, తద్వారా తమ ఆరోగ్య ప్రాథమ్యాలను నిర్ణయించుకునే సాధికారత వారికి లభిస్తుందని డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు వివరించారు. -
కింగ్ చార్లెస్కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్తో బాధపడుతున్న బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్ఫోర్స్కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్నెస్గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. వివరాల ప్రకారం.. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బకింగ్హం ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్ ఛార్టెస్ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. కాగా, క్యాన్సర్కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. A statement from Buckingham Palace: https://t.co/zmYuaWBKw6 📷 Samir Hussein pic.twitter.com/xypBLHHQJb — The Royal Family (@RoyalFamily) February 5, 2024 మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు. దేశాధినేతల స్పందన.. ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Wishing His Majesty a full and speedy recovery. I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv — Rishi Sunak (@RishiSunak) February 5, 2024 -
క్యాన్సర్ని జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఏ మూవీ ఇండస్ట్రీ తీసుకున్నా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా అదరగొట్టేస్తుంటారు. అలా హిందీలో బడా స్టార్స్తో పాటు ఆయుష్మాన్ ఖురానా లాంటి యువ కథానాయకులు కూడా హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇతడు పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ఈ హీరో.. క్యాన్సర్ని జయించిన తన భార్యపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: క్లీంకారకు కేర్ టేకర్గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..) ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో వరస హిట్లు కొడుతున్న ఆయుష్మాన్.. తహిరా కశ్యప్ అనే అమ్మాయిని కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమించాడు. 2008లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2018లో ఆయుష్మాన్ భార్యకి రొమ్ము క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. సరైన చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం ఆయుష్మాన్ భార్య తహిరా కశ్యప్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇది జరిగి చాలా కాలమైపోయింది. అయితే ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తన భార్య గురించి ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. 'నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా' అని ఆమె క్యాన్సర్ ఎదురించీ గెలిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అలానే ఈమెకు సర్జరీ జరిగిన తర్వాత తీసిన ఓ ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. (ఇదీ చదవండి: 14 ఏళ్ల వయసు.. ఆరోజు జరిగింది ఇప్పటికీ మర్చిపోలేను: హీరోయిన్) View this post on Instagram A post shared by Ayushmann Khurrana (@ayushmannk) -
World Cancer Day Feb-4 : 'జీన్' సైలెన్సింగ్ ఎడిటింగ్!
'మనం ఏదైనా రాస్తుంటాం. లేదా సినిమా కోసం రీల్స్ తీస్తుంటాం. తీరా రాశాక లేదా తీశాక అది అంత సరిగా లేదని లేదా కోరుకున్నట్లుగా రాలేదనీ లేదా తీసిన సమాచారం అవసరం లేదనిపిస్తుంది. అప్పుడు మనం చేసే పని ‘ఎడిటింగ్’! అలాగే.. మన ప్రతి ఒక్కరి జీవితంలో.. మన అవయవ నిర్మాణం, వికాసం, ఆరోగ్యచరిత్ర.. వీటన్నింటికీ మూలం ఈ రాత లేదా రీల్స్ రూపంతో పోలిక గల జన్యువులు. ఎక్కడైనా పదాలు తప్పుగా వస్తే వాటిని సవరించినట్లుగా, సినిమాలో రీల్స్ తప్పుగా వస్తే వాటిని సరి చేసినట్టుగానే.. ఈ జన్యు పొరబాట్లనూ సరి చేసే ప్రక్రియే ‘జీన్ ఎడిటింగ్’. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలతో జన్యులోపాలతో వచ్చే క్యాన్సర్లనూ లేదా జబ్బులను పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ అత్యంత కొత్త చికిత్స విధానాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.' మన దేహం మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం మధ్యలోని న్యూక్లియస్లో క్రోమోజోములుంటాయి. ఈ క్రోమోజోములన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలతో కలగలసిన జన్యువులతో నిర్మితమై ఉంటాయి. మన దేహం తాలూకు అన్ని జీవక్రియలూ వాటి మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అంటే జీవకణంలో జరిగే మొత్తం ప్రాసెసింగ్కు ఈ ఆర్ఎన్ఏలు దోహదపడుతుంటాయి. అవి చేసే పనులను బట్టి ఎమ్ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీ ఆర్ఎన్ఏ అనే రకాలతో ప్రోటీన్ల రూపకల్పనకు సహాయపడుతుంటాయి. ఈ ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తేడాలు జరిగినప్పుడు అవి వ్యాధుల రూపంలో.. ప్రధానంగా క్యాన్సర్లుగా బయటపడతాయి. జన్యులోపాలతో వ్యాధులు ఎలాగంటే.. కొన్ని మన జన్యువుల మూలస్థానాల్లో పొరబాటు జరిగినప్పుడు.. అది ఓ జబ్బు రూపంలో అందునా క్యాన్సర్ల రూపంలో ఎలా బయటపడతాయో చూద్దాం. ఉదాహరణకు బీసీఆర్ ఏబీఎల్ అనే జన్యువులో లోపం వల్ల టైరోసిన్ కైనేజ్ అనే ఓ ఎంజైము నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది అత్యధికంగా తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయమంటూ దేహానికి ఆదేశాలు అందజేస్తుంది. దాంతో ఓ తెల్లరక్తకణం జీవితకాలం పూర్తి కాకుండానే అనేక తెల్లరక్తకణాలు పుట్టుకొస్తుంటాయి. పాలు విరిగినప్పుడు పనికిరాని విధంగానే.. రక్తంలో లోపభూయిష్టమైన తెల్లరక్తకణాలు గుంపులు గుంపులుగా గుమిగూడిపోయి, పూర్తిస్థాయి మెచ్యురిటీ రాకుండానే నశించిపోయి రక్తం విరిగినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వల్ల అది ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ అనే బ్లడ్ క్యాన్సర్కు దారితీస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఒక జన్యువు చెడిపోవడం వల్ల/ లోపం కలగడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా రకాలే ఉంటాయి. కొత్త చికిత్స ప్రక్రియలేమిటి? అవి ఎలా పనిచేస్తాయంటే... జన్యువులు, జెనెటిక్ కోడ్స్లో వచ్చే మ్యూటేషన్లు, వాటి కారణంగా ఉత్పన్నమయ్యే లోపాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించడానికి పరిశోధకులు సరికొత్త విధానాలను కనుగొంటున్నారు. వాటిల్లో జీన్ ఎడిటింగ్లూ, జీన్ సైలెన్సింగ్లన్నవి ఇటీవలే కనుగొన్న విధానాలు. అదెలాగంటే.. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కణంలోని జీవక్రియల్లో రకరకాల ఆర్ఎన్ఏలు.. (తాము ఏ రకానికి చెందినవన్న దాన్ని బట్టి).. జన్యు సమాచారాన్ని అందజేయడం, నిక్షిప్తపరచడం వంటి పనులు చేస్తాయి. ఇవన్నీ ఎమైనో యాసిడ్లూ, ప్రోటీన్లు ఏర్పడటం ద్వారా జరుగుతుంటాయి. ఇలాప్రోటీన్లు రూపొందే సమయంలో కొన్ని అదనంగా ఏర్పడవచ్చు. మరికొన్ని ఏర్పడాల్సిన విధంగా ఏర్పడకుండా మిస్ కావచ్చు. లేదా ఇంకొన్ని తప్పుడు సీక్వెన్స్లో ఏర్పడవచ్చు. వీటిల్లో ఏది జరిగినా.. అది వ్యాధిగా వ్యక్తమవుతుంది. చక్కదిద్దడానికి పరిశోధకులు చేస్తున్నదేమంటే.. ఇలా జన్యువుల్లోని లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లను చక్కదిద్దడానికి పరిశోధకులు కొన్ని ఎడిటింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మొత్తం ఆర్ఎన్ఏ కాకుండా... తమకు కావాల్సిన మేరకు చిన్న చిన్న ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ స్ట్రాండ్స్ రూపొందిస్తారు. ఇలా రూపొందించిన స్ట్రాండ్స్ను ‘యాంటీ సెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్’ (ఏఎస్ఓ)లని అంటారు. కణంలోని జన్యుసమాచారాన్ని అందించడం, ఉపయోగించడం వంటి కార్యకలాపాలు జరిగే సమయంలో.. బహిర్గతం కావాల్సినప్రోటీన్ భాగాలు బయటకు రాకపోయినా, లోపలే ఉండాల్సినవి బయటకు వచ్చినా లేదా ఆర్ఎన్ఏ రూపంలో తేడాలు వచ్చినా అది క్యాన్సర్గా బయటపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరిశోధకులు రూపొందించిన ఈ ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’, సంక్షిప్తంగా ఏఎస్ఓలనేవి చిన్న చిన్న స్ట్రాండ్స్గా ఏర్పడి.. ప్రధానంగా ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో వాటిని చక్కదిద్దుతాయి. అదెలాగంటే.. 1. ఆర్ఎన్ఏలో లోపభూయిష్టమైనప్రాంతం ఉంటే.. ఈ చిన్న స్ట్రాండ్స్ అక్కడికి వెళ్లి ప్రమాదకరమైన దాన్ని తొలగించడం లేదా పూర్తిగా కత్తిరించి మాయం చేయడం చేస్తాయి. (ఇది ఒకరకంగా ఎడిటింగ్ లాంటి ప్రక్రియ). 2. ఈ ఏఎస్ఓలు.. ఆర్ఎన్ఏ లోని లోపభూయిష్టమైనప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా జన్యులోపాలను చక్కదిద్దుతాయి. ఇక్కడ ఏఎస్ఓలు రెండు రకాలుగా పని చేస్తాయి. మొదటిది లోపభూయిష్టం కావడం వల్ల అవాంఛితమైన జన్యుపదార్థాలను అసలు పుట్టకుండా చేయడం లేదా ఆలస్యం చేయడం. 3. మరో ఇతర ఆరోగ్యకరమైన జన్యువు లోంచి.. తనకు కావాల్సిన విధమైన కార్యకలాపాలు నిర్వహించే ఆరోగ్యకరమైన జన్యువునే ఉద్భవింపజేసి, దాన్ని ఇక్కడ వాడుకునేలా చేస్తాయి ఈ ఏఎస్ఓలు. ఇలా చేయడం ద్వారా స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనే వెన్నుకు సంబంధించిన కండరాల వ్యాధి, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనే మతిమరపు వ్యాధులకు పరిశోధకులు ఇప్పటికే సమర్థమైన చికిత్సా విధానాలను, పూర్తిస్థాయి పరిష్కారాలను కనుగొన్నారు. ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’లను రూపొందింది ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే.. ప్రకృతి చాలా అద్భుతమైనదీ, సంక్లిషమైనది. మన దేహంలోని ఒక కణంలో పది పక్కన పదమూడు సున్నాలు పెట్టినన్ని జన్యువులు ఉంటాయి. అంతేకాదు.. రోజుకు మన దేహంలో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇన్నిన్ని కణాల్లో ఇంతగా విభజన జరిగే సమయంలో ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొరబాటు జరగకమానదు. వీటిని సరిచేయడం కోసమే మన దేహంలో ‘మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మెకానిజమ్’ అనే ప్రక్రియ ద్వారా పొరబాట్లను చక్కదిద్దడం జరుగుతుంది. ఏఎస్ఓ జీన్ మాడిఫికేషన్లూ, ఎడిటింగ్లూ, సైలెన్సింగ్లను జీన్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే నేర్చుకున్న పరిశోధకులు... ఇప్పుడు వీటినే లోకకళ్యాణం కోసం ఉపయోగిస్తూ కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొంటున్నారు. చివరగా.. ఇప్పుడు ఇదే ప్రక్రియనూ, ఇవే సిద్ధాంతాలను ఉపయోగించి.. కొన్ని జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా, అవ్యక్తంగా ఉండాల్సిన మరికొన్ని జన్యువులు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నిశ్శబ్దపరచడం (సైలెన్సింగ్) ద్వారా సీఎమ్ఎల్ మొదలుకొని చాలా రకాల క్యాన్సర్లకు చికిత్సలను కనుగొని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ఒకే జన్యువు లోపం వల్ల ఒకే వ్యాధి వచ్చే కేసుల్లోనే ఈ తరహా చికిత్స పనిచేస్తుందంటూ పరిశోధకులు దీని పరిమితులనూ చెబుతున్నారు. ఈ తరహా చికిత్సతో చాలా క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటం మనకు దగ్గర్లో కనిపిస్తున్న ఓ ఆశారేఖ. క్యాన్సర్ చికిత్స కోసం మరికొన్ని కొత్త పద్ధతులు.. జీన్ సైలెన్సింగ్, జీన్ ఎడిటింగ్ అన్నవి ప్రయోగాత్మకంగా విజయవంతమైన చికిత్స ప్రక్రియలు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిన మరికొన్ని ఆధునిక, ఆసక్తికరమైన చికిత్స, నిర్ధారణ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. క్యాన్సర్ చికిత్సలోనూ పరిశోధకులు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నారు. క్యాన్సర్ సెల్ కూడా ఒక కణమే కాబట్టి దాని జన్యుపటలాలను మనిషి ఒక్కడే అర్థం చేసుకోవాలంటే చాలా టైమూ, శ్రమ వృథా అయ్యే అవకాశముంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఏఐ’ సహాయంతో క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్ను విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా తుదముట్టించవచ్చో తెలుసుకుని, ఆ మేరకు కొత్త చికిత్సలను రూపొందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ నోస్ (ఈ–నోస్)తో క్యాన్సర్ వాసన పసిగట్టే ప్రయత్నం.. క్యాన్సర్ వ్యాధి కణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజుకు దాదాపు నాలుగు వందల రెట్లు పెరిగాకే.. ఆ కణజాలాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో క్యాన్సర్ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. అయితే ఒక చిన్న మూత్రపరీక్షతో చాలా చాలా తొలిదశలోనే క్యాన్సర్ను కనుగొనే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్లోని బీర్షెబాలో ఉన్న ‘బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్’ కు చెందిన పరిశోధకులు. ఒక ఎలక్ట్రానిక్ ముక్కును వీరు రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళల్లో వాళ్ల మూత్రపు వాసన ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు క్యాన్సర్ను పసిగడుతుంది. దీన్ని ‘ఈ–నోస్’ అని పిలుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... చాలా చవగ్గా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్.. క్యాన్సర్ కణం తాలూకు జన్యుపటలం ఆరోగ్యకరమైన కణంలా కాకుండా విభిన్నంగా ఉండటమే కాదు.. విపరీతంగా కూడా ప్రవర్తిస్తుంటుంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణ జన్యుపటలంలోనిప్రోటీన్ల చైన్’లలో మార్పులేవైనా చేయడం ద్వారా అది తనంతట తాను నశించిపోయే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ఇది జరిగితే క్యాన్సర్ చికిత్సలో అది ఓ విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. హైపర్థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్.. కీమోథెరపీ ప్రయోగం మరింత విస్తృతంగా.. కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది దేహంలోని ఒక భాగంలో ఉన్న క్యాన్సర్పైనే కాకుండా దేహంలోని మొత్తం కణాలపైనా పనిచేస్తుంటుంది. దీనికి భిన్నంగా ప్రయోగించేదే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. ఇందులో పొట్ట తెరిచి కడుపు కుహరంలో మందును ఉంచుతారు. అక్కడది విపరీతమైన వేడిపుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను మాడ్చేస్తుంది. ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ భస్మమైనప్పటికీ అవి మళ్లీ పుడతాయి. కానీ క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయమైపోతాయిగానీ మళ్లీ పుట్టవు. ఈ థెరపీని కొన్ని కడుపు క్యాన్సర్లలో వాడుతున్నారు. డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది! -
నమీబియా అధ్యక్షుడు గీన్గోబ్ కన్నుమూత
హరారే: నమీబియా అధ్యక్షుడు హగె గాట్ప్రీడ్ గీన్గోబ్(82) మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న గీన్గోబ్ హరారేలోని లేడీ పొహంబా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని అధ్యక్షభవనం తెలిపింది. ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడినట్లు 2014లో గీన్గోబ్ స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. 2015 నుంచి దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న గీన్గోబ్ పదవీ కాలం ఈ ఏడాదితో పూర్తి కావాల్సి ఉంది. వలస పాలన నుంచి బయటపడ్డాక నమీబియా మొదటి ప్రధానిగా 1990–2002 మధ్య తిరిగి 2008–12 సంవత్సరాల మధ్య గీన్గోబ్ బాధ్యతలు నిర్వహించారు. ఇదీ చదవండి: చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్.. 46 మంది మృతి, వేలాది మందికి.. -
నేను జీవించే ఉన్నాను!
‘‘సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ్రపాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం’’ అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓపోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఫైనల్గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అవును.. నా చావును ఫేక్ చేశాను. కానీ సడన్గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్. -
'పూనమ్ పాండే' డ్రామా.. 19 ఏళ్ల వయసులోనే ఆ స్టేట్మెంట్తో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) మరణించిందనే షాకింగ్ న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలో మహా నటిగా గుర్తింపు పొందకపోయినప్పటకి ఒక శృంగార తారగా గుర్తింపు పొందింది. ఒక వ్యాధితో ఆమె మరణించినట్లు వార్త రాగానే చాలామందిలో ఆందోళన నెలకొంది. నేడు తాను బతికే ఉన్నానని, ఇదంతా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కోసం చేసినట్లు తెలిపి సింపుల్గా క్షమించమని కోరింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కల్పించాలనే క్రమంలో ఆమె తనను తాను చంపుకున్నట్లు కొందరు తెలుపుతున్నా ఎక్కువ మంది ఆమె ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. క్యాన్సర్ నివారణ గురించి ప్రచారంలోకి తీసుకురావాలంటే ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఇలా ప్రజల ఉద్వేగాలతో ఆటలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే క్రమంలో పూనమ్ పాండే చేసిన పని ఎంతమాత్రం కరెక్ట్ కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆమె పేరు వెలుగులో లేకుండా పోయింది. చేతిలో సినిమా ఛాన్సులు లేవు. దీంతో ఎలాగైనా తను వైరల్ కావాలని క్యాన్సర్ పేరుతో చనిపోయినట్లు నాటకం ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కోసం తన మరణ వార్తను ఎంతగానో ఎంజాయ్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. పూనమ్ చేసిన ఆ ఒక్క ప్రకటన దేశంలోని అందరినీ నమ్మించగలిగింది. ఆమె మరణించిందని వినగానే కంగనా రనౌత్, సింగర్ చిన్మయి వంటి ఎందరో స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. ఆపై చాలామంది బాలీవుడ్ నటీనటులు సంతాపాన్ని కూడా తెలియచేశారు. (ఇదీ చదవండి: బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?) ఆమె కేవలం సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకం ఆడిందని దీనిని ఘోరమైన నేరంగా పరిగణించాల్సి వుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పరాచికలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్తో నిజంగానే బాధపడుతున్న ఎందరో మహిళలు పూనమ్ మరణవార్త తెలియగానే ఎంతగానో మదనపడి ఉంటారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని తన పబ్లిసిటీ కోసం ఉపయోగించడం ఏంటి..? అంటూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తోంది. డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ కామెంట్ సర్వైకల్ క్యాన్సర్ సమస్యపై నువ్వు (పూనమ్) చేసిన పని అందరికీ రీచ్ అయి ఉంటుంది. కానీ మీరు అవలంబించిన ఇలాంటి పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని లేదా ఇలాంటి బూటకంతో మీరు ఏమి సాధించారు అని ఎవరూ ప్రశ్నించలేరు .. సర్వైకల్ క్యాన్సర్పై చర్చ ఇప్పుడు దేశం అంతటా ట్రెండింగ్లో ఉంది. మీ మాదిరే మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు చాలా సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అని వర్మ తన ఎక్స్ పేజీలో రాసుకొచ్చారు. పబ్లిసిటీ కోసం 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి పనితో .. 2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. అది నిజం కావడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపింది. అలా ఎప్పుడూ ఆమె నెట్టింట తన పేరు ఉండాలని తాపాత్రయ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కావాలనే చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017లో పూనమ్ పాండే 'పాండే యాప్' ప్రారంభించింది. కానీ అందులోని కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్ను తొలగించేసింది. పూనమ్ పాండే తన ప్రేమికుడి సామ్ బాంబేతో కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే.. సామ్బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నారని పనాజీ పోలీసులను ఆమె ఆశ్రయించి వైరల్ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
-
సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!
కేన్సర్ అంటేనే హడలిపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా వచ్చేస్తుంది. దాని స్టేజ్ని బట్టి సులభంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలం లేదంటే ఇక అంతే సంగతులు. ఆ కేన్సర్లలో మహిళలకు వచ్చే గర్భాశయ కేన్సర్(సెర్వికల్) మరింత ప్రమాదకరమైంది. బాలీవుడ్ ప్రముఖ నటీ పూనమ్ పాండ్ మృతికి కారణమైంది కూడా ఈ కేన్సరే. దీనికి చికిత్సా విధానం కూడా కాస్త క్రిటికలే. లక్షణాలను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చు కానీ.. ఒక దశ దాటిన తరువాత చికిత్సలతో లాభం తక్కువే. అందువల్లే ఏటా కొన్ని వేలమంది మహిళలు ఈ కేన్సర్ బారిన పడే చనిపోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? ముందుగా ఎలా గుర్తించాలి? సెర్వికల్ కేన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ కేన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, స్త్రీ, పురుషులిద్దరికీ బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ కేన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలకు ఈ రకమైన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ఇవీ.. మొదటి దశ సర్వైకల్ కేన్సర్ ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరితే... కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు కలయిక సమయంలో పెల్విక్ నొప్పి సర్వైకల్ కేన్సర్లో రకాలు: పొలుసుల కణ కేన్సర్.. ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ కేన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్. అడెనోకార్సినోమా. . ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది. కారణాలు.. గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్ఏలో మార్పులు (మ్యుటేషన్లు) జరిగినప్పుడు గర్భాశయ కేన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. కేన్సర్ కణాలు దీనికి భిన్నం. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. కేన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుంచి విడిపోతాయి. గర్భాశయ కేన్సర్కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ హెచ్పీవీ పాత్ర పోషిస్తుంది. హెచ్పీవీ చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేన్సర్ రాదు. లైఫ్స్టైల్, ఇతర కారకాల కారణంగా వచ్చే అవకాశం ఉంది. చికిత్స.. నయం కాని గర్భాశయ ముఖద్వార కేన్సర్కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా చేస్తే నివారణ సాధ్యం.. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్పీవీ వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. (చదవండి: ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?) -
దేవుడా! ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు: వైరల్ లెటర్
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ దొరకదు. ఆ ప్రేమకు మరో ప్రత్యామ్నాయం లేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. తాజాగా కేన్సర్తో చనిపోతూ తన కుమారుడికి రాసిన ఒక లేఖ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రెడ్డిట్ యూజర్ మాట్ గాల్డ్ కేన్సర్తో చనిపోవడానికి ముందు తన తల్లి రాసిన ఒక లేఖను పోస్ట్ చేశారు. చని పోతానని తెలిసి తన కొడుకుపై ప్రేమను, తన బాధను ఈ లేఖలో వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి. ‘‘కన్నా నేను చనిపోతానన్న బాధకన్నా, నిన్ను విడిచి వెళ్లాలన్న ఆలోచన నా ప్రాణాల్ని తోడేస్తోంది. నా తరువాత నిన్ను ఎవరు చూసకుంటారు అనేదే ఎక్కువ బాధగా ఉంది. ఏదో ఒకరోజు నీకు ఇది దొరుకుతుందనే ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.. నువ్వు నా బంగారు కొండవి. మరే ఆదాయం రాదని తెలిసినా నాకోసం ఉద్యోగం మానేసి మరీ ఎంతో సేవ చేసావ్. నీతో గడిపిన ప్రతీ క్షణం చాలా అద్భుతం. ఎప్పుడూ నీతోనే రా..నాన్నా. ఆ పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాను కన్నా.!" అంటూ మాట్ గాల్డ్ చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె రాసిన లేఖ నెటిజన్లు భావోద్వేగానికి లోను చేసింది. ‘‘ప్రతిరోజూ అమ్మను మిస్ అవుతున్నా.. ఏడుపొస్తోంది. కానీ చిరునవ్వు మధ్య ఆ బాధనంతా దిగమింగుతున్నాను. ఎందుకంటే నాన్న కూడా కేన్సర్తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నారు. ఆయన్ని చూసుకోవాలి’’ అంటూ మాట్ గాల్డ్ రెడ్డిట్ పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు సారీ బ్రో అంటూ కమెంట్ చేశారు. నిజంగా మీరు మంచి కొడుకు.. మీకు అంతా మంచి జరగాలని అని కొందరు, అమ్మ ప్రేమ ఎపుడూ మీతోనే... తల్లీ కొడుకుల అనుబంధం ఎప్పటికీ శాశ్వతమే అని మరొకరు వ్యాఖ్యానించారు. మీ కోసం ఆమె కన్న కలలతోపాటు మీ కలలు కూడా నిజం కావాలి అంటూ మరికొందరు యూజర్లు అతనికి ఓదార్పునిచ్చారు. -
ఆ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన 30 శాతం జనాభా
నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది. ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లో 30 శాతం మంది నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్కు కారణంగా నిలుస్తున్నాయి. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నారు. -
ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని భవతారణి రాజా (47) కొంతకాలంగా క్యాన్సర్తో బాధ పడుతూ గురువారం రాత్రి శ్రీలంకలో కన్నుమూశారు. నేడు ఆమె భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. శుక్రవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్కి పరిచయమయ్యారు భవతారణి. అదే విధంగా ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారామె. తెలుగులోనూ పలు పాటలు పాడారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. దాదాపు పాతిక చిత్రాల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో ‘అవునా’(2003), కన్నడలో ‘గీయా గీయా’ (2005) సినిమాలకు సంగీతం అందించారు భవతారణి. దాదాపు పది చిత్రాలకు సంగీతదర్శకురాలిగా చేశారు. అడ్వరై్టజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్. శబరిరాజ్తో భవతారణి వివాహం జరిగింది. వీరికి సంతానం లేరు. భవతారిణి మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఘోరం: కేన్సర్ చిన్నారిని గంగలో ముంచి..
నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... హరిద్వార్లోని హర్కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. ఈ దృశ్యాలను ఘాట్కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్హెచ్ భావన కైంతోలా తెలిపారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. గతనెల కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జన్మించిన రషీద్ ఖాన్ జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలోని ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది. -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
బ్లాక్బస్టర్ మూవీ.. క్యాన్సర్ వల్ల వదిలేసుకున్న హీరోయిన్!
సినీ ఇండస్ట్రీలో దీర్ఘకాలం కొనసాగడం హీరోలకు చాలా మామూలు విషయం. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వరుస ఫ్లాపులు వచ్చినా, వయసు మీదపడ్డ ఛాయలు కనిపించినా, శరీరాకృతిలో మార్పులు వచ్చినా వెంటనే రిజెక్ట్ చేస్తారు. స్టార్ హీరోయిన్గా కీర్తి అందుకున్నా సరే కొద్దికాలానికే తెరమరుగు అవుతుంటారు. కానీ కొందరే తమకు ఎదురయ్యే ఆటంకాలను దాటుకుని ఎక్కువ కాలంపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో సీనియర్ హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటిగా కొనసాగిన ఈమె ఇటీవలే గుల్మొహర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ పాత్ర షర్మిల చేయాల్సింది తాజాగా హాట్స్టార్లో ప్రసారమయ్యే 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరైన షర్మిల తాను క్యాన్సర్తో పోరాడిన విషయాన్ని బయటపెట్టింది. ముందుగా యాంకర్, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో షబానా అజ్మీ పోషించిన పాత్ర షర్మిల చేయాల్సింది. ముందు తననే అడిగాను. కానీ తన అనారోగ్య కారణాల వల్ల ఆమె చేయనని చెప్పింది. తనతో పని చేయలేకపోయానన్న బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది' అన్నాడు కరణ్. క్యాన్సర్తో పోరాడిన సీనియర్ హీరోయిన్ దీనికి షర్మిల స్పందిస్తూ.. 'తను నాకు సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు కరోనా పీక్స్లో ఉంది. నేను వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. పైగా అప్పుడే నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. అందుకే నేను రిస్క్ చేయడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడింది? ఎలా కోలుకుంది? అన్న విషయాలనేమీ వివరించలేదు. ఆమె క్యాన్సర్తో పోరాడిన విషయం తెలిసి అభిమానులు షాక్కు గురవుతున్నారు. సత్తా చాటిన హీరోయిన్ కాగా ఈమె సత్యజిత్ రే 'ద వరల్డ్ ఆఫ్ అపు' అనే బెంగాలీ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే వెండితెర ప్రవేశం చేసింది. కొంతకాలానికే బాలీవుడ్లో ప్రవేశించి అక్కడా జెండా పాతింది. ఆరాధన, మౌసమ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన షర్మిల ఇటీవలే గుల్మొహర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకోగా వీరికి సైఫ్, సోహ, సబ అని ముగ్గురు సంతానం. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ప్రభుత్వం షర్మిలను 2013లో పద్మభూషణ్తో సత్కరించింది. చదవండి: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు -
క్యాన్సర్ కాదని తేలిగ్గా కొట్టిపడేసే సీరియస్ సంకేతాలేంటంటే..?
గుండె జబ్బులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధులో క్యాన్సర్ ఒకటి. దీని కారణంగా 2020లో దాదాపు 10 మిలయన్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్లతో మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. చాలా వరకు ఈ వ్యాధులను నిర్థారించడంలో రోగి జాప్యం ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు. క్యాన్సర్ లక్షణాలు కొన్నిసార్లు అంత తేలిగ్గా బయటపడవు. మరికొన్ని సార్లు మనమే ఏదో సమస్య ఉంది అనిపిస్తున్నా సాధారణమైనదిగా భావించి కొట్టిపరేస్తాం. అలా నిర్ల్యంగా కొట్టిపరేసే క్యాన్సర్కి సంబంధించిన సీరియస్ సంకేతాలు ఏంటంటే.. అమెరికన్ సోసైటీ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధ వహిచక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని లక్షణాలు మిస్ అయినప్పటికీ మరికొన్ని ప్రతి ఒక్కరికి తెలుస్తాయని అన్నారు. అవేంటంటే.. ఎముకల్లో నొప్పి, వాచిన.. ముఖ్యంగా అదే పనిగా ఎముకలు నొప్పిగా లేదా కదపలేనట్లు అనిపించినప్పుడు. భరించలేని నొప్పి ఉండి ఆ ప్రాంతంలో వాచినా అది ఎముకల క్యాన్సర్కి సంకేతం. ఇంకొకవ విషయం ఏంటంటే క్రమేణ నొప్పి తీవ్రమై రాత్రి వరకు కొనసాగుతుంది. ఇలా ఉంటే తక్షణమే చెకప్ చేయించుకోవాలి. మింగడంలో ఇబ్బంది.. ఇక ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా, కడుపు నిండిన అనుభూతి కలిగిన తేలిగ్గా తీసుకోవద్దు. వేగంగా తిన్నప్పుడు మింగడంలో వచ్చే ఇబ్బంది వేరు తరుచుగా మింగడంలో ఇబ్బంది రావడం వేరని నిపుణులు అంటున్నారు. తగినంతగా నమలకపోవడం వల్లే వచ్చే సమస్య కూడా వేరుగా ఉంటుంది. అసధారణ రీతీలో మింగడంలో వచ్చే నొప్పి ఎసోఫాగియల్ క్యాన్సర్కి సంకేతం అని చెబుతున్నారు. మొదటి స్టేజ్లో గుర్తిస్తే సాధారణ క్యాన్సర్లా నయం చేయొచ్చే లేదంటే ప్రమాదమేనని తెలిపారు. దద్దర్లు లేదా ఎలర్జీ.. శరీరంపై దద్దర్లు వచ్చిన నిర్లక్ష్యం చేయొద్దు. అలెర్జీలు, ర్యాష్లు అనేకరకాల వ్యాధులకు సంకేతమట. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇలానే కనిపిస్తాయట. అంతేగాదు అసాధారణ రక్త కణాలు ప్లేట్లెట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగి చర్మంలోకి లీక్ అవ్వకుండా కేశనాళికలని నిరోధించడంతో పగిలిపోతాయి. దీంతో చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను చూస్తారు. కళ్ల నొప్పి.. కళ్లల్లో నొప్పిని కూడా అంతగా పట్టించుకోం. ఏ ఐడ్రాప్స్ వాడేసి తగ్గిపోయిందనుకుంటాం. కంటి క్యాన్సర్ ఎక్కువగా ఐబాల్లోని కణాలు, కనురెప్పలు, కన్నీటి నాళాల సమీపంలో ప్రారంభమువతుంది. సాధార నొప్పితో ప్రారంభమవ్వడంతో దీన్ని అంత సులభంగా గుర్తిచలేమని వైద్యులు చెబుతున్నారు గుండెల్లో మంట.. గుండెల్లో లేదా ఛాతీలో మంటని గ్యాస్ నొప్పిగా తీసిపారేస్తాం. చిన్నగా వస్తుంది ఈ నొప్పి. దీంతో కాసేపటికి సర్దుకుంటుందని పట్టించుకోం. ఇలా వచ్చి ఎక్కిళ్లు వచ్చి ఇబ్బంది పడినా అది అన్నవాహిక లేదా కడుపు క్యాన్సర్కి సంకేతమని చెబుతున్నారు. వృషణాలు వాచిన.. ఇక గజ్జల్లో నొప్పి, వాపులు లేదా గడ్డలు వచ్చినా..వృషణ క్యాన్సర్కి సంకేతం. కొందరిలో ఆ భాగం బరువుగా ఉండటం లేదా వృషణం తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే గజ్జల్లో నిస్తేజంగా నొప్పి వస్తుండటం జరుగుతుంది. గురక.. గురక కూడా క్యాన్సర్కి సంకేతమనని అంటున్నారు. ఒక విధమైన గురక వచ్చి ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ప్రారంభమవుతుంది. ఇది ఊపిరితిత్తులు లేదా థైరాయిడ్ క్యాన్సర్కి దారితీస్తుందని చెబుతున్నారు. సాధారణ గురకలా కాక చాలా పెద్దగా వస్తూ ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలొస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గమనిక: ఇవి అధ్యయనంలో వెల్లడైన విషయాలు మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిందే. ఆయా క్యాన్సర్ల గురించి పూర్తి విశ్లేషణాత్మకంగా వైద్యులను సంప్రదించి తెలుసుకోవాల్సిందే. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ నగరాలు ఇవే!) -
ఆల్కహాల్ అలర్జీ అని పొరబడింది! చివరికి ఏకంగా..
పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్ ట్రెండ్ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్ ఎలర్జీయే కదా!.. అని లైట్ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్ ఎలర్జీ అనుకుంటా అని లైట్ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్ అయ్యింది. అప్పుడు డాక్టర్ ఆమె ఫేస్ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్గా వివరించలేదు. అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్లోనే ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది. అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటేనే వైద్యులు క్యూర్ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. (చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్) -
టెన్నిస్ లెజెండ్కు క్యాన్సర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరం
అమెరికా టెన్నిస్ లెజెండ్, ఈస్పీఎన్ ఎనలిస్ట్ క్రిస్ ఎవర్ట్ మరోసారి క్యాన్సర్ బారిన పడింది. దీంతో జనవరిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఈస్పీఎన్ నెట్వర్క్ కవరేజీకి ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ఈస్పీఎన్ సోషల్ మీడియా వేదికగా శనివారం వెల్లడించింది. ఆమె పేరిట ఓ నోట్ను ఈస్పీఎన్ నెట్వర్క్ పోస్ట్ చేసింది. కాగా అంతకుముందు 2022 జనవరిలో క్రిస్ ఎవర్ట్ అండాశయ క్యాన్సర్తో బాధపడింది. అయితే 11 నెలల తర్వాత ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలిపింది. కానీ 66 ఏళ్ల వయస్సులో మళ్లీ ఆమె క్యాన్సర్ బారిన పడడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఒక టెన్నిస్ లెజెండ్.. టెన్నిస్ చరిత్రలో క్రిస్ ఎవర్ట్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. క్రిస్ ఎవర్ట్ 1975 నుండి 1986 వరకు వరల్డ్ నెం1 లేదా రెండో ర్యాంక్లోనే కొనసాగింది. టెన్నిస్లో 1,000 సింగిల్స్ విజయాలను సాధించిన మొదటి టెన్నిస్ క్రీడాకారిణిగా ఎవర్ట్ నిలిచింది. 1995లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా ఎవర్ట్కు చోటు దక్కింది. క్రిస్ ఎవర్ట్ తన కెరీర్లో 18 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్గా నిలిచింది. A message from @ChrissieEvert Evert will not be part of ESPN's 2024 @AustralianOpen coverage pic.twitter.com/LKGmKDBNGU — ESPN PR (@ESPNPR) December 8, 2023 -
ఆ పాఠమే చెప్పకపోయి ఉంటే..ఆ స్టూడెంట్ ప్రాణాలు..!
మన నేర్చుకున్న విద్య మనకే ఉపయోగపడితే ఆశ్చర్యం ఆనందరం రెండూ వస్తాయి. ఎన్ని విద్యలైనా.. కూటి కొరకే అంటారు. మరీ మనం నేర్చుకున్న విద్య మనకు ఉపయోగపడటం ఏమిటీ? మన అభ్యున్నతి కోసమే కదా ఇంత కష్టపడి చదువుకునేది అంటారా? నిజమే గానీ మనం నేర్చుకున్న విద్య ఆపదలో ఉన్నప్పుడూ లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడూ ఉపయోగపడితే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. అలాంటి అద్భుత ఘటనే ఓ స్టూడెంట్ విషయంలో చోటు చేసుకుంది. ఏం చేశాడంటే..? యూఎస్లో న్యూజెర్సీకి చెందిన 27 ఏళ్ల వైద్య విద్యార్థి సల్లీ రోహన్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్టడీలో భాగంతో ఓ రోజు థెరాయిడ్ను ఎలా అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించాలో భోదిస్తున్నారు ప్రోఫెసర్లు. థెరాయిడ్ గురించి బోధిస్తుండగా తనకు కూడా ఉందన్న అనుమానం సల్లీలో వచ్చింది . అనుహ్యంగా ఒక్కో విద్యార్థికి టెస్ట్ చేస్తూ.. సల్లీకు కూడా చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే ఆయన డాక్టర్ని సంప్రదించమని ఆమెకు సలహ ఇచ్చారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి వివిధ వైద్య పరీక్షలు చేయగా రిపోర్ట్లో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందని తేలింది. అయితే సల్లీ థైరాయిడ్ సమస్యను సూచించే ఎలాంటి లక్షణాలను గానీ సమస్యలను గానీ ఫేస్ చెయ్యలేదు. ఇది నాలుగు ప్రాథమిక రకాల థైరాయిడ్ క్యాన్సర్లలో అత్యంత ప్రబలమైనది. అల్ట్రాసౌండ్ గురించి క్లాస్ జరగకపోతే గనుక తన వ్యాధిని కనుగొనకపోవచ్చని చెబుతోంది. సల్లీకి వచ్చిన థైరాయిడ్ క్యాన్సర్ శోషరస కణువుల వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. వెంటేనే ఆమె ఆరోగ్య ఖర్చులు కవరయ్యేలా భీమా చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవడవం ప్రారంభించింది. ముందుగా థైరాయిడ్ ప్రభావిత శోషరస కణువులను తొలగించే శస్త్ర చికిత్స చేయాలి తర్వాత రేడియో అయోడిన్ అనే ఒక రకమైన రేడియేషన్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. కళాశాలలో ఆ క్లాస్ జరగడం ఆ స్టూడెంట్ వరం అయ్యింది. లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు ఆ క్యాన్సర్ని గుర్తించి ఉండేవారు కాదు. పైగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది. మనం నేర్చకుంది ప్రాణాంతక సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడేలా చేస్తే అంతకుమించిన ఆనందం మరోకటి లేదు కదా!. (చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..) -
ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ..
ఎన్నో రకాల క్యాన్సర్ల గురించి విన్నాం. కానీ ముక్కు క్యాన్సర్గా గురించి విని ఉండం. ఐతే ఇది ఎందువల్ల అనేది? కారణాలు తెలియాల్సి ఉంది. గానీ దీని కారణంగా పలువురు పేషెంట్లు ముక్కును కోల్పోయారు. తాజాగా బ్రిటన్కి చెందిన ఓ మహిళా ఇలానే మొత్తం ముక్కును కోల్పోయింది. అసలేంటి ముక్కు క్యాన్సర్? వస్తే మొత్తం ముక్కునే తొలగించక తప్పదా..? ముక్కు లోపాల కణితి వచ్చి అసాధారణంగా పెరగడం ప్రారంభమైతే దాన్ని ముక్కు క్యాన్సర్ లేదా నాసికా క్యాన్సర్ అంటారు. వీటిలో రకాలు కూడా ఉంటాయి. కణ క్యాన్సర్, అడెనోకార్సినోమా, న్యూరోబ్లాస్టోమా, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, సార్కోమా తదితరాలు. ఇది నాసికా కుహరం లేదా పారానాసల్ లోపల ప్రారంభమయ్యే స్థితిని బట్టి ముక్కుకి సంబంధించిన ఆ రకమైన క్యాన్సర్లుగా నిర్థారిస్తారు వైద్యులు. ఈ వ్యాధి బారిన బ్రిటన్కి చెందిన 40 ఏళ్ల టీనా ఎర్ల్స్ పడింది. ఆమె ఐదుగురు పిల్లల తల్లి. ఆమె తరుచుగా ముక్కు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండేది. ముఖం ఎడమవైపు మొద్దబారిపోతున్నట్లు ఉండేది. లోపాల ఒక విధమైన గడ్డ ఉండి నొప్పి వచ్చేది. సాధారణంగా ముక్కులో వచ్చే గడ్డలనే ఆమె భావించింది. తరచుగా ముక్కు రక్తస్రావం అయ్యేంది కూడా. ఇక ఈ బాధను భరించలేక వైద్యలను సంప్రదించింది టీనా. అక్కడ తాను ముక్కుకు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుసుకుని షాక్కి గురయ్యింది. రెండో దశలో ఉందని సత్వరమే రెడియోథెరఫీ వంటి చికిత్సలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఈ చికిత్సలో ముక్కును తొలగించక తప్పదని కూడా చెప్పారు. దీంతో టీనా ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ప్రాణాలు నిలబడాలంటే టీనా ఆ ట్రీట్మెంట్ తీసుకోక తప్పలేదు. చికిత్సలో భాగంగా టీనా ముక్కును తొలగించారు వైద్యులు. ముక్కు లేకపోవడం కారణంగా గొంతు తడిగా ఉండకుండా పొడబారిపోతుంది. అందుకోసం ప్రోస్టేటిక్స్తో తయారు చేసిన ముక్కు లేదా మరేదైన రక్షణ కవచాన్ని ధరించాల్సి ఉంటుంది. అయితే ఆమెకు కృత్రిమ ముక్కు అసౌకర్యంగా ఉండటంతో క్లాత్ మాదిరి గాజును ధరించి బయటకు తిరిగేది. అంతేగాదు ఈ పరిస్థితి కారణంగా జీవితాంతం ట్యూబ్ ద్వారే ఆమెఆహారాన్ని స్వీకరించాల్సి ఉంది. ఇన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా టీనా పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న కృతనిశ్చయంతో ఉండటం విశేషం. తన ముఖాన్ని చూసి ఎవరైనా కామెంట్ చేసినా వాటిని ఎదుర్కొనగలను, ఇదివరకటి టీనాలా కాకుండా మరింత స్ట్రాంగ్గా ఉంటానని నమ్మకంగా చెప్పింది. ఎవరికీ వస్తుందంటే.. నిపుణులు అభిప్రాయం ప్రకారం 55 ఏళ్ల పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధూమపానం, కలప, తోలు దుమ్ము, వంటి వాటికి సంబధించిన వృత్తులు చేసే వారికి ఈ నాసికా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం.. కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులు దెబ్బతిన్నప్పుడు లేదా అసాధారణంగా మారినప్పుడు కణితులు ఏర్పడతాయి. ఈ జన్యు మార్పులు ఎందుకు సంభవిస్తాయో ఇప్పటి వరకు నిపుణులకు కచ్చితమైన కారణాలు తెలయరాలేదు. లక్షణాలు.. దీర్ఘకాలిక ముక్కు సమస్య లేదా సైనస్ వాసన కోల్పోవడం ముక్కు నుంచి రక్తం కారడం తలనొప్పులు తరుచుగా ముక్కు కారిపోవడం(జలుబు) నీళ్ళు నిండిన కళ్ళు ముక్కు, కళ్ళు, చెవులు బుగ్గల చుట్టూ నొప్పి ముక్కు, ముఖం, మెడ లేదా మీ నోటి పైభాగం పెరుగుదల దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు వినికిడిలో ఇబ్బంది అస్పష్టమైన దృష్టితో కూడిన కంటి సమస్యలు (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
దీనస్థితిలో నటుడు.. 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడన్న డాక్టర్స్!
సీనియర్ నటుడు, దర్శకుడు జూనియర్ మహ్మద్ అలియాస్ నయూమ్ సయ్యద్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. గత నవంబర్లో ఇతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగోదశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఊపిరితిత్తులు సహా ఇతర శరీర అవయవాలు పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. జూనియర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి ఆప్తమిత్రుడు సలాం కాజీ మాట్లాడుతూ.. 'నెల రోజుల కిందటే అతడికి క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. మొదట కడుపులో కణతి కనిపించింది. పరీక్షించగా క్యాన్సర్ అని తేలింది. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా అప్పుడే 20 కిలోలు తగ్గిపోయాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. నెల రోజుల్లోనే నాలుగో స్టేజీకి రావడంతో 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడని వైద్యులు చెప్పారు' అని తెలిపాడు. దీంతో ఆయనకు సాయం చేయడానికి కమెడియన్ జానీ లివర్.. ముంబైలోని మహ్మద్ ఇంటికి వెళ్లాడు. నటుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది. చికిత్సకుగానూ కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా కానీ వారి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించడంతో బలవంతంగా కొంత డబ్బును అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ మహ్మద్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టాడు. మరాఠీ భాషలో అనేక సినిమాలను తెరకెక్కించాడు, నటించాడు. దాదాపు 265 చిత్రాల్లో నటించాడు. కైటీ పతంగ్, ఆన్ మిలో సజ్నా, కారవాన్ వంటి పలు సినిమాలతో ఆయన పాపులర్ అయ్యాడు. Viral | Popular actor of yester years, Junior Mehmood has not been keeping well. Comedian Jonny liver seen here trying to lift up his spirits. pic.twitter.com/KQyErg4EBL — MUMBAI NEWS (@Mumbaikhabar9) December 1, 2023 చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్కు అదే కారణమంటూ.. -
ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!
హాలీవుడ్ నటి క్యాన్సర్ బారిన పడింది. అది కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది. బతికే అవకాశాలు లేవు. కానీ ఆమె మాత్రం నేను చనిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి బతుకుతాను అంటూ మొండి ధైర్యంతో జయించే ప్రయత్నం చేస్తుంది. పైగే ఈ దారుణ స్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారిస్తుంది. ఆమె అచంచలమైన ధైర్యం తనలా అనారోగ్యంతో బాధపడేవాళ్లలో ఓ కొత్త ఊపిరిని, స్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె హీరోయిన్గా వెండి తెరపైనే కాదు బయట కూడా హీరోయినే అని ప్రూవ్ చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికా నటి షానెన్ డోహెర్టీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. అది గుర్తించే నాటికే ఫోర్ట్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఆమె ఎముకలంతటికి వ్యాపించి పరిస్థితి కాస్త సివియర్గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అయినా కూడా ఎక్కడ కించెత్తు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ స్థితిలో కూడా 'నేను చనిపోవాలని కోరుకోవడం లేదు' కాబట్టి బతుకుతా. 'నేను పూర్తిగా జీవించలేదు'. 'పూర్తిగా ప్రేమించబడ లేదు'. కాబట్టి కచ్చితంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని ధీమాగా చెబుతుంది. పైగా తనలా మరెవరూ ఈ క్యాన్సర్తో బాధపడుకుండా ఉండేలా పరిశోధనలు మరింత విస్తృతంగా చేసేందుకు నిధులు వెచ్చిస్తుంది. అంతేకాదు ఈ క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది? అది కూడా స్టేజ్4లోనే ఎందుకు ఉన్నా? ఇందంత ఏదో తన వల్ల అయ్యే గొప్ప ప్రయోజనం కోసమే ఇలా అయ్యి ఉంటుంది. అందుకే ఆ దిశగా నన్ను నేను బతికేలా ధైర్యం కూడగట్టకుంటూ క్యాన్సర్ అంతమొందించే ప్రపంచానికై తపస్సు చేస్తున్నానని నిర్భయంగా చెబుతోంది. ఈ వ్యాధి కారణంగా నడవలేం, తినలేం కనీసం పనిచేయలేం అని ఆవేదనగా చెబుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ వ్యాధిని చూసి డీలా పడకుండా భిన్నమైన దృక్పథంతో మాలాంటి పేషెంట్లు ఉండి జీవితాన్ని నూతనోత్సాహంతో ఆస్వాదించాలి. అప్పుడే మళ్లీ మునుపటి జీవితాన్ని పొందగలరు అని నిరాశ నిస్ప్రుహలో ఉన్న క్యాన్సర్ పేషంట్లందరికి స్ఫూర్తినిచ్చేలా చెబుతోంది. నటి షానెన్ డోహెర్టీ 1990ల బ్లాక్బస్టర్ బెవర్లీ హిల్స్, 90201లో బ్రెండా వాల్ష్ వంటి పాత్రలతో అభిమానుల మనుసులను గెలుచుకుంది. ఈమెకు 2015లో క్యాన్సర్ నిర్థారణ అయినప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది కూడా. అయితే అది మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4లో ఉండటమే బాధాకరం. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
13 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్
ఓర్వకల్లు: ఆటలాడుతూ.. అల్లరి చేసే ఆ బాలుడికి మాయదారి రోగం వచ్చింది. పేద కుటుంబానికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏడేళ్లుగా ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేక అపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కవిత, పరమేష్ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి అచ్యుత్ కుమార్, హర్షవర్ధన్ కుమారులు. పెద్ద కుమారుడు అచ్యుత్ కుమార్(13)కు ఆరేళ్ల వయస్సు నుంచి తరచుగా జ్వరం రావడం, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతూ ఉండేది. తెలిసిన చోటల్లా అప్పులు చేసి వైద్యం చేయించారు. వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగళూరులో వైద్య పరీక్షలు చేసి బ్లడ్ కాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. అంత డబ్బు లేక తల్లిదండ్రులు దిక్కుతోచక ఇంటికి వెనుతిరిగి వచ్చారు. కుమారుడి అవస్థ చూడలేకఇతరుల వద్ద అప్పులు చేసి కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు హైదరాబాద్లో శస్త్ర చికిత్స చేయాలని, రూ.20 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పడంతో కొందరి సలహా మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా రూ.12 లక్షల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
జస్ట్ లాలాజలంతోనే గొంతు, నోటి క్యాన్సర్లను గుర్తించే పరికరం!
క్యాన్సర్లలో కొన్నింటిని చాలావరకు ముందుగానే తెలుసుకుని, కొద్దిపాటి శస్త్ర చికిత్సలతో బయటపడొచ్చు. కానీ గొంతు, నోటి క్యాన్సర్ల విషయంలో అలా కాదు. చాలా వరకు చివరి స్టేజ్లోనే గుర్తించగలం. ముందుగా గుర్తించడం అసాధ్యం. అలాంటి ప్రాణాంతక క్యాన్సర్లని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునేలా ఏఐ ఆధారిత సరికొత్త సాధనాన్ని ఆవిష్కరించారు పరిశోధకులు. ఏ వ్యాధి అయినా నయం చేయడం కంటే రాకుండా నివారించడం అనేది ఉత్తమం. కాబట్టి ఆ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా? అన్నది ఈ అత్యాధునిక సాధనంతో ముందుగా గుర్తిస్తే..వెంటనే ఆ వ్యాదులకు బ్రేక్ వేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టగలుగుతాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటా సరికొత్త సాధనం? ఎలా క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తుంది? కచ్చితమైన ఫలితాలే ఇస్తుందా..? తదితరాల గురించే ఈ కథనం. నోరు, గొంతు క్యాన్సర్లను ముందుగా గుర్తించే అత్యాధుని పరకరాలు లేకపోవడంతో ఆ క్యాన్సర్లను లాస్ట్ స్టేజ్లోనే గుర్తించడం జరగుతోంది. ఈ సమస్యకు చెక్పెట్టే సోలెడాడ్ సోసా, జూలియా, అగ్యిర్రే ఘిసో తదితర పరిశోధక బృందం కంప్యూటర్ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది 90% కచ్చిత ఫలితాలను ఇవ్వగలదని వెల్లడించారు. ఈ బృందం గొంతు, నోటి క్యాన్సర్లను ఫస్ట్ స్టేజ్లోనే ఎలా నివారించాలనే దిశగా గతంలో పలు పరిశోధనలు చేసింది. ఆ అధ్యయనంలో నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాల సామర్థ్యాన్ని ఎన్ఆర్2ఎఫ్1(NR2F1) ప్రోటీన్తో నియంత్రించొచ్చని కనుగొన్నారు. ప్రోటీన్ ఎలా నియంత్రిస్తుందంటే.. ఈ గ్రాహక ప్రోటీన్ సెల్ న్యూక్లియస్లోకి ప్రవేశించి, క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించే ప్రోగ్రామ్ను సక్రియం చేసేందుకు అనేక జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ప్రాథమిక కణుతుల్లో ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు తక్కువుగా ఉంటాయి. దీంతో నిద్రాణంగానే క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడం మొదలు పెడతాయి. దీంతో ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ సాయంతో నిద్రాణంగా ఉన్న ఈ క్యాన్సర్ కణాలను ప్రేరేపించేలా సంక్రియం చేస్తే సులభంగా క్యాన్సర్ కణాలను నియంత్రించొచ్చని వెల్లడించారు పరిశోధకులు. అంటే ముందుగానే ఆ ప్రోటీన్ స్థాయిలను గుర్తించే అత్యాధునిక పరికం ఉంటేనే ఇదంతా సాధ్యం అని భావించారు పరిశోధకులు. ఆ ఆలోచనే ఈ కంప్యూటర్ ఆధారిత స్కీనింగ్ సాధన ఆవిష్కరణకు నాంది పలికింది. ఇది ముందుగానే రోగి శరీరంలోని ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిని గుర్తించి సక్రియం చేసేలా సీ26 డ్రగ్తో చికిత్స అందిస్తారు వైద్యులు. దీంతో రోగిలో క్యాన్సర్ కణాల విస్తరణ తగ్గి ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు పెరుగుతాయి. వ్యొమ్ లైఫ్ సైన్స్ సారథ్యంలో ఆవిష్కరించిన ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్ జస్ట్ రోగుల లాలాజలాంతోనే నోరు, గొంతులోని క్యాన్సర్ కణాలను ముందుగానే డిటెక్ట్ చేసేస్తుంది. నోటి లేదా గొంతు క్యాన్సర్ ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తుల లాలాజాలం చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. తాము ఈ ఏఐ ఆధారిత క్యాన్సర్ డిటెక్టర్తో దాదాపు 945 మంది నుంచి లాలాజల నమునాలను స్వీకరించామని, వాటిలో 80 నోటి క్యాన్సర్లు కాగా, 12 మాత్రం గొంతు క్యాన్సర్ నమునాలని వెల్లడించారు. ఆయా లాలాజల్లోని శిలింధ్రం, బ్యాక్టిరియా, జన్యువులను గుర్తించేలా సాధానానికి ట్రైయినింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అధ్యయనంలో ఈ సాధనం 90% చక్కటి ఫలితాలనిచ్చిందన్నారు. తాము దీర్ఘకాలికి వ్యాధుల మూలలను గుర్తించి ముందుగానే నివారించేలా చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్ని కనిపెట్టామని అన్నారు. ఇదేవిధంగా ఇతర ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగానే గుర్తించేలా సాధనాలను అభివృద్ధిపరచడమే గాక ఆ సమస్యను నుంచి బయటపడేలా కొంగొత్త వైద్య విధానాలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. (చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు) -
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ట్రీట్మెంట్.. మొదటి హాస్పిటల్గా గుర్తింపు
అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్ను అపోలో క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టారు.సైబర్నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్లు ఉన్నవారు కూడా సైబర్నైఫ్ చికిత్స తీసుకోవచ్చు. సైబర్నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్ను ఉపయోగిస్తారు. అపోలో క్యాన్సర్ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా సైబర్నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్నైఫ్ సిస్టమ్ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్నైఫ్లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది. సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు. -
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి కన్నుమూత!
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి రోజ్లిన్ కార్టర్(96) ఆదివారం స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతిపై అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకూ ఏది సాధించినా దానివెనుక రోజ్లిన్ నాకు అండగా నిలిచారు. నేను నిరాశకు గురైనప్పుడల్లా, ఆమె నాకు ప్రోత్సాహాన్ని అందించారు. నాకు నిరంతరం మంచి సలహాలు ఇచ్చేవారు. ఆమె నాకు ఉత్తమ సలహాదారు’ అని పేర్కొన్నారు. గత ఏడాది(2022) మేలో ఆమెకు డిమెన్షియా అనే వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ఆమె చికిత్స అందుకుంటోంది. అయితే గత ఫిబ్రవరి నుంచి ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. జిమ్మీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ విజయంపై ప్రపంచ వేదికపై ఆయనకు ప్రశంసలు అందాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఇరాన్ వివాదాల కారణంగా జిమ్మీ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజ్లిన్ తన భర్తకు అండగా నిలిచారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం కార్టర్ దంపతులు కార్టర్ సెంటర్ అనే సంస్థను స్థాపించారు. జిమ్మీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ దంపతులు క్యూబా, సూడాన్, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ కార్టర్కు 2002లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 1999లో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కార్టర్ దంపతులను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్తో సత్కరించారు. ఇది కూడా చదవండి: పాక్నూ కాటేస్తున్న వాయుకాలుష్యం -
కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? 18 ఏళ్లలో ఏం జరిగింది?
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో గత 18 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు మూడున్నర రెట్లు పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణమని వైద్యులు భావిస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్, ఉదర, మూత్ర సంబంధిత క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కారణంగా 11 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పౌర రిజిస్ట్రేషన్ డేటాలోని వివరాల ప్రకారం 2005వ సంవత్సరంలో ఢిల్లీలో క్యాన్సర్ కారణంగా రెండు వేల నుండి రెండున్నర వేల మంది బాధితులు మరణించారు. గత ఏడాది 7400 మందికి పైగా క్యాన్సర్ బాధితులు మరణించారు. పిల్లలు, యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది క్యాన్సర్తో మరణించిన వారిలో దాదాపు నాలుగో వంతు మంది 44 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలు కూడా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 14.50 లక్షల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని, అలాగే ఏటా తొమ్మిది లక్షల మంది బాధితులు మరణిస్తున్నారని ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలలో.. కాలుష్యపూరిత ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాతావరణంలో ఎంపీ 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. క్యాన్సర్కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అస్తవ్యస్త జీవనశైలి, ధూమపానం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? -
క్యాన్సర్.. ఇలా గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చు
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరూ హడలిపోతారు. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఈమధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సమస్య వచ్చాక ఏం చేయాలి అని ఆలోచించే కంటే ముందు నుంచే జాగ్రత్తలు పాటిస్తే ఒకటిలో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ నివారణకు మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది, మన జీవన శైలిని ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే! క్యాన్సన్ నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐదు అలవాట్లు ఏంటంటే.. 1.మొదటిది ఆహార అలవాట్లు, మన ఆహారంలో పండ్లూ, కూరగాయలు భాగం అయ్యేలా సరైన పోషకాలు అందేలా తీసుకోవాలి. 2 ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకూడదు, మానసిక ఒత్తిడి పరోక్షంగా క్యాన్సర్కు కారణం అవ్వొచ్చు. 3.రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. క్రమం తప్పకుండా కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేయాలి. 4.అప్రమత్తంగా ఉండి ఏదైనా క్యాన్సర్ సంకేతం కనిపిస్తే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. 5. ధూమపానం ,మద్యపానం వంటి అలవాట్లకువీలైనంత దూరంగా ఉండాలి. క్యాన్సర్.. ఎలా గుర్తించాలి? క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికైనా ఏ వయసులోనైనా రావచ్చు . చాలా క్యాన్సర్లకు లోతుగా పరీక్షలు జరిపితే గానీ గుర్తించలేము . మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికీ తెలియదు. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఎలాంటి సంకోచాలు లేకుండా మన ఇబ్బందులను పూర్తిగా చెప్పేయాలి. ఏదైనా సమస్యగా అనిపించినపుడు నిర్లక్ష్యం చేయకూడదు . మన పెద్దలకు , పూర్వీకులకు క్యాన్సర్ ఉన్నట్లైతే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సంబంధిత వైద్యుల సలహాలను పాటించి కుటుంబంలో అందరు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అంతే త్వరగా కోలుకోవచ్చు.. ►క్యాన్సర్ అని పలకడానికి,చెప్పడానికి చాలామంది భయపడతారు, ఇష్టపడరు. క్యాన్సర్ అనగానే ఇక ఆ మనిషి బతకడమే కష్టమన్నట్లు ఆలోచిస్తారు. క్యాన్సర్ వచ్చినవారిని జాలిగా,చులకనగా , అంటరానివారుగా చూడడం , ఏదో పాపం చేయడం వల్లనే వారికి క్యాన్సర్ వచ్చిందని దెప్పిపొడవడం చేయకూడదు .క్యాన్సర్ అని చెప్పడానికి భయపడడం, బాగా దిగులుపడడం , నిరాసక్తంగా నిస్పృహలో ఉంటూ వైద్యులకు సహకరించకపోవడం చేయకూడదు. ► సగానికి పైగా క్యాన్సర్లు మామూలు వ్యాధుల్లానే సరైన వైద్యంతో నివారించబడతాయి. ముఖ్యంగా వ్యాధి నిర్థారణ ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా కోలుకోవచ్చు. ► వైద్యుల దగ్గర దాపరికం ఉండకూడదు. అలానే అనుమానం కూడా ఉండకూడదు . వారి సలహాల పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు.నమ్మకంతో ధైర్యంగా వైద్యం తీసుకోవాలి . ► 6 నెలలకు,సంవత్సరానికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా శారీరక ఇబ్బంది, సమస్య వచ్చినపుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ► మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యానికి ముఖ్య కారణం. సరైన నిద్ర , ఆహారం , జీవనశైలి , ఆలోచనా విధానం వల్ల సగానికి పైగా వ్యాధులు తగ్గుతాయి. ► ఎంతటి ప్రమాదకర సమస్య అయినా సరైన అవగాహనతో , సానుకూల దృక్పథంతో , ఆరోగ్యకర జీవనశైలితో ప్రయత్నస్తే తప్పకుండా బయటపడగలం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులతో అడివి శేష్ (ఫొటోలు)
-
ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. క్యాన్సర్తో బాధపడుతున్న సత్పాల్ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్’ కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి? -
'హాడ్జికిన్స్ లింఫోమా' ను అర్థం చేసుకుని.. సరైన చికిత్సనందించటం ఎలా?
సాక్షి : బ్లడ్ క్యాన్సర్కు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఉపరకం, హాడ్జికిన్స్ లింఫోమా. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క లింఫాటిక్ డివిజన్ ( శోషరస విభాగం) ని ప్రభావితం చేస్తుంది మరియు తెల్ల రక్తకణాల అసాధారణ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ కారణం చేత శరీరంలోని వివిధ ప్రాంతాలలో శోషరస కణుపులు (లింప్ నోడ్స్) పెద్దవిగా మారడం మరియు కణితులు ఏర్పడటం జరగవచ్చు. ఇది అరుదైన మరియు తీవ్రమైన పరిస్థితి అయినప్పటికీ, సత్వర గుర్తింపు మరియు చికిత్సతో విజయవంతంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గా సేవలనందిస్తున్న డాక్టర్ అనిల్ అరిబండి ఈ జబ్బు గురించి మాట్లాడుతూ.. "2020 సంవత్సరంలో, భారతదేశంలో దాదాపు 11,230 కొత్త హాడ్జికిన్స్ లింఫోమా కేసులు నమోదయ్యాయి. ఈ జబ్బు మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 20- 39 సంవత్సరాల మధ్య మరియు 65 ఏళ్లు పైబడిన వారిపై అధిక ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, వంశపారంపర్యంగా ఈ సమస్య వున్నవారు మరింత ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. HIV/AIDS మరియు ఎప్స్టీన్-బార్ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు దీని తీవ్రతను మరింతగా వృద్ధి చేసే ప్రమాదం ఉంది" అని అన్నారు. వ్యాధి లక్షణాలు.. రోగ నిర్ధారణ.. హాడ్జికిన్స్ లింఫోమా యొక్క ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. సాధారణంగా మెడ, చంకలు లేదా గజ్జలువంటి ప్రాంతాల్లో నొప్పి లేకుండా లింప్ నోడ్స్ పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఇతర లక్షణాలలో తరచుగా జ్వరం రావటం, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన దురద మరియు రాత్రి సమయంలో అధిక చెమటలు పట్టడం వంటివి కనిపిస్తాయి. ఈ సంకేతాలను సాధారణంగా ఇతర ఆరోగ్య సమస్యగా తప్పుగా భావించవచ్చు. కచ్చితమైన రోగ నిర్ధారణ మరియు సకాలంలో చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. హాడ్జికిన్స్ లింఫోమా ను గుర్తించే విధానం గురించి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ అరిబండి చెబుతూ "హాడ్జికిన్స్ లింఫోమాను గుర్తించడానికి, ప్రాథమిక దశలో శారీరక పరీక్ష చేసి, లింప్ నోడ్స్ వాపు జరిగిందా లేదా అన్నది నిర్ణయించడం చేస్తారు. హాడ్జికిన్స్ లింఫోమా యొక్క సంభావ్యతను గుర్తించడానికి CBC (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) చేసి హాడ్జికిన్స్ లింఫోమా కనుగొనే ప్రయత్నం చేస్తారు. దీనిని మరింతగా ధృవీకరించడానికి, వైద్యులు PET స్కాన్, CT స్కాన్ మరియు Tissue biopsy కూడా సిఫారసు చేయవచ్చు. రోగనిర్ధారణ జరిగిన తర్వాత, వైద్యులు వ్యాధిని స్టేజ్ I నుండి IV వరకు విభజించి, తగిన చికిత్సను అందిస్తారు " అని అన్నారు. చికిత్స అవకాశాలు: ► కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఒకే ఔషదాన్ని నేరుగాగానీ, పలు ఔషదాల మిశ్రమంను నోటి ద్వారాగానీ, నరాల ద్వారా శరీరంలోకి ఇస్తారు. ► రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, అలగే నాశనం చేయడానికి అధిక-తీవ్రత కలిగిన కిరణాలు ఉపయోగించబడతాయి. ► టార్గెటెడ్ థెరపీ: ఈ ప్రత్యేక చికిత్స నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై దృష్టి పెడుతూ.. తొలగిస్తుంది. ► ఇమ్మ్యూనో థెరపీ: ఈ పద్ధతి శరీరం యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, సాధారణంగా చెక్పాయింట్ ఇన్హిబిటర్ల వినియోగం ద్వారా ఇది చేస్తారు. ► బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్: రోగి, దాత నుండి మూలకణాలను ఉపయోగించి, ఈ ప్రక్రియలో ప్రభావితమైన ఎముక మజ్జ (బోన్ మారో)ను రక్తం, రోగనిరోధక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేస్తారు. స్థిరమైన జీవనశైలి మార్పులు.. హాడ్జికిన్స్ లింఫోమా ఉన్న రోగులు గుర్తించవలసినది ఏమిటంటే, తమ రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవటం చికిత్స ఫలితాల పరంగా ప్రధానంగా మార్పు తీసుకువస్తుందని. ఆహార ప్రాధాన్యతలు, వ్యాధి మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. హాడ్జికిన్స్ లింఫోమా చికిత్స చేయగలదని పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా గుర్తించడం.. సత్వర చికిత్స వైద్య ఫలితాలను, రోగుల జీవన నాణ్యతను బాగా మెరుగుపరుస్తుందని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ అరిబండి వెల్లడించారు. డాక్టర్ అనిల్ అరిబండి, సీనియర్ కన్సల్టెంట్ హెమటో - ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. -
సీఎం జగన్ సార్.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు! : బాధితురాలు లక్ష్మి
సాక్షి, అనంతపురం: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి వరకూ గడప దాటి ఎరుగని ఇల్లాలిపై ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారం పడింది. దిక్కుతోచని పరిస్థితి. అయినా బిడ్డల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. అయినా విధి ఆమె పట్ల వక్రీకరించింది. ఏడేళ్ల వయసున్న చిన్న కుమారుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా.. చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి అంశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.14 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి విప్ అందజేసినప్పుడు నిస్సహాయురాలైన ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. ఆ వేదన ఆమె మాటల్లోనే... చిన్న వయసులోనే పిల్లల తండ్రి పోయాడు.. నా పేరు వడ్డే లక్ష్మి. రాయదుర్గంలోని పదో వార్డులో నివాసముంటున్న వడ్డే లోకేష్తో నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దొడు చిన్మయ్ 8వ తరగతి, చిన్నోడు లక్షిత్ 3వ తరగతి చదువుకుంటున్నారు. వీరిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే నా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచలేదు. ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకుని ఎలా బతకాలో అర్థం కాలేదు. అయినా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే ఆశ నన్ను బతుకు పోరాటం సాగించేలా చేసింది. రూ.20 లక్షలు అవుతుందన్నారు.. మా చిన్నోడు లక్షిత్ ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ సొమ్మసిల్లి పోయాడు. ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షించిన వైద్యులు అదేదో క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. హైదరాబాద్లోని అమెరికన్ సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అతి కష్టంపై పిల్లాడిని తీసుకుని హైదరాబాద్కు వెళ్లా. ఆస్పత్రిలో పరీక్షించిన డాక్టర్లు పిల్లాడికి బోన్మ్యారో చికిత్స చేయాలని, ఇందు కోసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఓ లెటర్ చేతికి ఇచ్చారు. ఆలస్యం చేస్తే పిల్లాడి ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు. దేవుడిలా మా బాధను అర్థం చేసుకున్నారు.. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన నేను నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సార్ను కలిసేందుకు ఆయన ఇంటి వద్దకెళ్లా. అప్పటికే ఇంటి వద్ద చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత సార్ నన్ను చూసి ఆగారు. వెంటనే నేనెళ్లి బిడ్డ పరిస్థితి తెలిపి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నా. గొప్ప మనసుతో ఆయన మా బాధను అర్థం చేసుకున్నారు. విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. వైద్యం కోసం రూ.14 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆస్పత్రికి ఉత్తర్వులు పంపారని, నేరుగా అక్కడికెళ్లి పిల్లాడికి చికిత్స చేయించుకుని రమ్మని మా ఎమ్మెల్యే సార్ ధైర్యం చెప్పారు (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ). లెటర్ కూడా నా చేతికి ఇచ్చారు. మాకు నిజమైన దసరా ఈ రోజే వచ్చింది. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సీఎం జగనన్న, విప్ కాపు రామచంద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. చిన్మయ్కు అభినందన.. సీఎం కార్యాలయం నుంచి అందిన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సమస్యను వివరించగానే రూ.14 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారన్నారు. అంతేకాక బాధితుడికి అవసరమైన బోన్మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చిన సోదరుడు చిన్మయ్ని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఏటూరి మహేష్ పాల్గొన్నారు. -
ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!
డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థలపై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది. క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. డాబర్..చ్యవన్ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్ మంజన్ టూత్పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. -
కేన్సర్ రోగుల కష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: కేన్సర్ రోగుల కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు కేన్సర్ రోగులు చికిత్స కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు. ఇకపై వారికి రాష్ట్రంలోనే ఆధునిక చికిత్సను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 21 నుంచి రాష్ట్రంలోని 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవలు ప్రారంభిస్తోంది. రోగులు ఈ ఆస్పత్రుల్లో హబ్ అండ్ స్పోక్ విధానంలో కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు పొందవచ్చు. తిరుపతిలోని స్విమ్స్తో పాటు మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పాత 10 బోధనాస్పత్రులు హబ్స్గా వ్యవహరిస్తాయి. వీటికి సమీపంలోని జిల్లా ఆస్పత్రులను మ్యాపింగ్ చేశారు. రోగులకు తొలుత హబ్స్లో చికిత్స అందిస్తారు. ఆ తర్వాత కేన్సర్ వైద్య నిపుణుల సూచనలతో జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లా ఆస్పత్రిలో నాలుగు పడకలతో ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలందించడానికి ప్రతి యూనిట్లో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ను నియమించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. మందులు, ఇంట్రావీనస్, ఇంట్రాపెరిటోనియల్, ఇంట్రాథేకల్ ఇలా వివిధ కేన్సర్ వ్యాధులకు కీమోథెరపీ చేస్తారు. సాధారణంగా బ్రెస్ట్, తల, గొంతు కేన్సర్ రోగులకు వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితి ఆధారంగా ఆరు అంతకంటే ఎక్కువ సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర కేన్సర్ కేర్ ప్రత్యేకాధికారి డాక్టర్ రమేశ్ తెలిపారు. గర్భాశయ కేన్సర్తో బాధపడేవారికి ఐదు సైకిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు తొలుత రెండు సైకిల్స్ కీమోథెరపీని బోధనాస్పత్రుల్లో (హబ్స్లో) ఇస్తారు. అనంతరం రోగి ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని జిల్లా ఆస్పత్రికి మ్యాప్ చేస్తారు. ఇలా మ్యాప్ చేసిన రోగికి హబ్లోని అంకాలజీ నిపుణుడి సూచనల మేరకు మిగిలిన అన్ని సైకిల్స్ కీమోథెరపీ జిల్లా ఆస్పత్రుల్లోనే చేస్తారు. భరించలేని నొప్పితో బాధపడుతున్న రోగులకు నొప్పి నుంచి నివారణ కల్పించేలా పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. కేన్సర్ రోగుల వైద్యానికి ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చు కేన్సర్ రోగులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని అన్ని రకాల కేన్సర్ రోగులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 2019–20 నుంచి ఇప్పటివరకు 2.70 లక్షల మందికిపైగా రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన కేన్సర్ వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో కేన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించడానికి గుంటూరు బోధనాస్పత్రిని లెవెల్–1, కర్నూలు, విశాఖ ఆస్పత్రులను లెవెల్–2 సెంటర్స్గా అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ 21 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్కు అవసరమైన మందులు, ఇతర సదుపాయాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. ఇక మీదట కేన్సర్ రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే వారు చికిత్స పొందవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
‘క్యాన్సర్ మానిటరింగ్’లో 353 పోస్టుల సృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన, నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్లలో క్యాన్సర్ సెంటర్లతో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం 353 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు. 6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 90 స్టాఫ్ నర్స్, 90 జనరల్ డ్యూటీ అటెండెంట్ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 50 కి.మీ దూరంలో క్యాన్సర్ వైద్యసేవలనుఅందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లెవల్–1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరును, లెవల్–2 సెంటర్లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. -
సరోగసి ద్వారా బిడ్డను కంటే క్యాన్సర్ వస్తుందా? డాక్టర్లు ఏమంటారంటే..
నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
క్యాన్సర్ థర్డ్ స్టేజ్! కానీ ఎలాంటి సర్జరీ లేకుండానే..
క్యాన్సర్ స్టేజ్లను బట్టి రోగులకు చికిత్స అందించడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని క్యాన్సర్లు మొదటి స్టేజ్ల్లో చికిత్స తీసుకుంటేనే సులభంగా బయటపడగలుగుతారు. కొన్ని క్యాన్సర్లు మాత్రం ఏ స్టేజ్ అయినా పరిస్థితి సీరియస్ తప్ప క్యూర్ అవ్వడం అనేది ఉండదు. కానీ ఇక్కడొక మహిళ విషయంలో ఓ డ్రగ్ మిరాకిల్ చేసింది. ప్రాణాంత క్యాన్సర్ వ్యాధి నుంచి ఎలాంటి కీమో థెరఫీ, సర్జరీ వంటివి చేయంచుకోకుండానే సులభంగా నయం కావడమే కాదు పూర్తి స్థాయిలో క్యాన్సర్ సమస్య నుంచి బయటపడింది. వైద్యులను సైతం నివ్వెరపరిచింది ఈ డ్రగ్. ఇంతకీ ఏంటా మెడిసన్? ఆమెకు క్యాన్సర్ ఎలా క్యూర్ అయ్యిందంటే.. వివరాల్లోకెళ్తే..యూకేలోని వేల్స్కు చెందిన క్యారీ డౌనీ అనే మహిళకి ప్రేగు క్యాన్సర్ వచ్చింది. అది కూడా థర్డ్ స్టేజ్. ఆమెకు వైద్యులు వండర్ మెడిసిన్ని ఇచ్చారు అంతే జస్ట్ ఆరు నెలల్లో పూర్తిగా నయం అయిపోయింది. వైద్యుల కూడా ఇది మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోయారు. ఆమెకు దోస్టార్లిమాబ్ అనే డ్రగ్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. ఇది యాంటీబాడీస్కి సంబంధించిన ఔషధం. ఇది క్యాన్సర్ కణాలలో నిర్దిష్ట ప్రోటీన్ చర్యను నిరోధిస్తుంది. అంతేగాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్కణాలకు వ్యతిరేకంగా పోరాడేల క్యాన్సర్ కణితి పెరుగుదలను నియంత్రిస్తుంది. ఈ డ్రగ్ కారణంగా పెద్దగా ఎలాంటి దుష్పరిణామాలను సదరు మహిళ ఎదుర్కొనలేదు. కొద్దిగా శరీరంపై అక్కడక్కడ దద్దుర్లు వచ్చినా.. అవి కూడా త్వరితగతిన తగ్గిపోయాయి. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇది క్లినికల్ ట్రయల్ డ్రగ్ అయినప్పటికీ సానుకూల ఫతితాలని ఇచ్చింది. ఒకరకంగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్ చాలా రకాల దుష్పరిణామాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది అవేమీ చేయించుకోనక్కర్లేకుండా నయం కావడం నిజంగా అద్భుతం అని వైద్యులు అంటున్నారు. పైగా ప్రేగ్లుల్లో క్యాన్సర్ కణితి థర్డ్ స్టేజ్(మూడో దశ)లో ఉంది. ఈ స్టేజ్లో ఉండగా నయం కావడం కాస్త రిస్క్తో కూడినదే. కానీ ఈ వండర్ డ్రగ్ అద్భుతంగా పనిచేయడమే కాక భవిష్యత్తులో రోగులు ఎలాంటి సర్జరీల జోలికి వెళ్లాల్సిన పనిలేదనే కొత్త ఆశని రేకెత్తించింది. సదరు మహిళకు కేవలం ఆరు నెలల్లోనే క్యాన్సర్ కణితి తగ్గిపోయిందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ప్రేగు క్యాన్సర్ ఉన్న రోగులకు వారానికి మూడుసార్లు చొప్పున ఇంట్రావీనస్గా ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రతిసారి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడూ కనీసం అరగంట సమయం పడుతుంది. పైగా పేషెంట్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి స్కాన్లు నిర్వహిస్తూ.. ఆ డ్రగ్ పనితీరుని అంచనా వేయాల్సి ఉంటుందని డాక్టర్ బారిటన్ తెలిపారు. సదరు మహిళ తనకు జీవించేలా మరో అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ బారిటన్ వైద్య బృందానికి ఎంతగానో రుణపడి ఉంటానని ఉద్వేగంగా చెప్పింది. గతేడాది బారిటన్ వైద్య బృందం ఇదే డ్రగ్ని మల క్యాన్సర్తో బాధపడుతున్న 18 రోగులపై క్లినికల్ ట్రయల్ నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారు. నిజంగా క్యాన్సుర్ రోగుల పాలిట ఈ మెడిసిన్ ఓ గొప్ప అద్భుత వరం!. (చదవండి: ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?) -
క్యాన్సర్కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..
క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్గా వచ్చి ఒక్కసారిగా మనిషిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే భయానక వ్యాధి అనే చెప్పాలి. ఇంతవరకు డబ్బున్న వాళ్లకు, చెడువ్యసనాలు ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చేది ఈ వ్యాధి. ఇప్పుడు ఇది కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందర్నీ అటాక్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తోంది. చాలావరకు కొన్ని క్యాన్సర్లను దశాల రీత్యా మందులతోనే నయం చేయొచ్చు. కానీ కొన్నింటికి కీమో థెరఫీ వంటి చికిత్సలు మరికొన్నింటికి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తారు వైద్యులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సంబంధించి వైద్యం మాత్రమే గాక మెడిసిన్ సైతం అత్యంత ఖరీదే. అలాంటి మందులను సైతం భారత్ ఫ్రీగా ఇస్తోంది. ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తుంది ఆరోగ్య సంరక్షణలో భారత్ తీసుకుంటున్న చర్యలు గురించే ఈ కథనం.! భారత్ క్యాన్సర్కి సంబంధించి సుమారు 90 మందులలో 42 మందులను ఫ్రీగానే రోగులకు అందిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సంజీవని: యునైటెడ్ ఎగైనెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తూ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచామననారు. ఆరోగ్యం ఎప్పుడూ రాజీకీయ అంశం కాదని అదొక గొప్ప సేవ అని చెప్పారు. కాలక్రమేణ వ్యాధుల తీరు మారుతోంది. దీనిపై సమగ్ర దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పారు మాండవీయ. అంతేగాదు భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిలోకి విలీనం చేసిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యమే అత్యంత కీలక పాత్ర అని చెప్పారు. అందువల్లే ప్రభుత్వం ఆరోగ్య సేవలు పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించిందన్నారు. కోవిడ్ 19 తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో అధిగమించింది. అలాగే మాండవియా తాను ప్రారంభించిన సంజీవని ఫౌండేషన్ గురించి కూడా వివరించారు. ఇది నిశబ్దంగా కబళించే క్యాన్సర్పై అవగాహన కల్పించడం, వ్యాధికి సంబంధించిన భయాలను పోగొట్టడం తదితర అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తూ వారిక తగిన సలహాలు సూచనలు ఇస్తున్న 'ఆశా బెహన్' సామాజకి కార్యకర్తల పాత్ర చాలా గొప్పదని అన్నారు. అంతేగాదు క్యాన్సర్ సంరక్షణలో భారత విధానం గురించి కూడా విపులీకరించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పేద రోగులకు ఫీజులు మినహాయింపు ఇవ్వడమేగాక లాభప్రేక్షలేని ధరల్లోనే మందులను అందిస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వల్ల భారత్ కొంతమేర ఆరోగ్య సంరక్షణను తక్కువ ధరలోనే అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించనున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి మాండవీయ. (చదవండి: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..) -
Zoleka: క్యాన్సర్తో మండేలా మనవరాలి కన్నుమూత
జొహన్నెస్బర్గ్: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) కన్నుమూశారు. జొలేకా.. రచయిత, ఉద్యమకారిణి కూడా. చాలా కాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో మండేలా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కారణంగా.. జొలేకా ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించినట్టు వైద్యులు తెలిపారు. జొలేకా తొలిసారిగా 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. 2016లో మరోమారు అది బయటపడింది. కానీ, ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. నెల్సన్ మండేలా కూతురు జింద్జీకి జొలేకా 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి జొలేకాకు వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా జొలేకా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్గానూ అవగాహన కల్పిస్తున్నారు. లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్లో సైతం వెల్లడించారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం ప్రకటించింది.