
ఏపీలో కూటమి పాలనపై జెట్ స్పీడ్లో వ్యతిరేకత మొదలైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ఉండి ఉంటే.. అనే చర్చ ఈపాటికే ఏపీలో మొదలైంది

వైఎస్సార్సీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు వైఎస్ జగన్. రేషన్ డీలర్ వద్ద నుంచి ప్రతి రోజు ఉదయం బియ్యం, పంచదార సరుకులు తీసుకుని వాటిని ఇంటింటికీ వెళ్లి కార్డుదారులకు ఎండీయూ ఆపరేటర్లు పంపిణీ చేసేవాళ్లు. ఈ పోస్ మిషన్లో ప్రతి కార్డుదారుడి వేలిముద్ర తీసుకుని అందులో వారికి కావాలిసన సరుకులను నమోదు చేసి రేషన్ అందించేవాళ్లు

కూటమి అధికారంలోకి వచ్చాక ఆ వాహనాలను ఆపేసింది. దీంతో మళ్లీ కష్టాలు మొదటికొచ్చాయి

















