-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్.. పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ను ఆవిష్కరించింది. ఈ సంచలనాత్మక ఉత్సవంలో సినిమాలను ప్రదర్శించటంతో పాటు గ్రూప్ డిస్కషన్స్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. వర్ధమాన దర్శకులు తమ ప్రతిభను చాటిచెప్పుకోవడానికి ఇదొక వేదికగా పని చేయనుంది. ఈ వేడుకలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు https://blog.aha.video/entertainment/nominations-for-south-indian-film-festival/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మూడు విభాగాల్లో పోటీ ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేవారిని మూడు భాగాలుగా విభజించారు. షార్ట్ ఫిలిం విభాగంలో 3-15 నిమిషాల వ్యవధి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. రెండో విభాగం షార్ట్స్ షార్ట్.. దీని కోసం మూడు నిమిషాల కంటే తక్కువగా ఉన్న షార్ట్స్ షార్ట్ను పంపాల్సి ఉంటుంది. అలాగే మ్యూజిక్ వీడియో విభాగం కోసం ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉన్న వీడియోను చిత్రీకరించి పంపాలి. 2020లో జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10 మధ్య వచ్చిన సినిమాల కంటెంట్తో వీడియోలను చిత్రీకరించి పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 20న తెలుగు ఫిలిం ఫెస్టివల్.. ప్రస్తుతం తెలుగులో ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. టాలీవుడ్కి చెందిన స్టార్ మేకర్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్గా పని చేయనున్నారు. నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వి.ఎన్.ఆదిత్య, చందు మొండేటి.. నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్.. ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్గా పని చేసిన అనీల్ వాన్వరి ఈ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు. డిసెంబర్ 20 నుంచి ఈ తెలుగు ఫిలిం ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియాలోని ప్రముఖ సినీ సెలబ్రిటీలు పాల్గొననున్నారు. చదవండి: సినిమా షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం.. -
14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో సినిమా విడుదలైన 14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. సినిమా కథేంటంటే? సుధీర్.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. చదవండి: లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే? -
OTT Releases: భోళాశంకర్, రామబాణం సహా బోలెడన్ని చిత్రాలు..
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద సినిమాలు సైతం రిలీజైన నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ వారంలో మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. మెగాస్టార్ భోళాశంకర్ మెగాస్టార్ భోళాశంకర్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించగా... తమన్నా హీరోయిన్గా నటించింది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ సెప్టెంబర్ 15 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ రామబాణం గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతంగా మెప్పించలేకపోయింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. మాయపేటిక విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్పుత్లు నటించిన చిత్రం మాయపేటిక. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మొబైల్ ఫోన్ వల్ల చెడు, మంచి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అనీతి వసంతబాలన్ దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ మూవీ అనేతి. ఈ చిత్రంలో అర్జున్ దాస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హౌస్ కీపర్తో ప్రేమలో పడే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు యువకుల డిజిటల్ విలేజ్ ఫహద్ నందు, ఉల్సవ్ రాజీవ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం డిజిటల్ విలేజ్. ఇందులో హృషికేష్, ఇందిర, ఎంసీ మోహనన్, సురేష్ బాబు కన్నోమ్ నటించారు. తమ గ్రామంలోని ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముగ్గురు స్నేహితుల స్టోరీనే కథాంశంగా చూపించారు. ఈ సినిమా ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. జర్నీ ఆఫ్ లవ్ 18+ నాస్లెన్ గఫూర్, మీనాక్షి దినేష్, మాథ్యూ థామస్, నిఖిలా విమల్ నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ . అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హేలీ లు రిచర్డ్సన్, బెన్ హార్డీ, రాబ్ డెలానీ, సాలీ ఫిలిప్స్, జమీలా నటించిన చిత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీనికి వెనెస్సా కాస్విల్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటికి డ్రామాను ఓ విమానంలో చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ చిత్రాలు వైఫ్ లైక్- నెట్ఫ్లిక్స్- 11 సెప్టెంబర్ 2023 ఎలిమెంటల్- డిస్నీ ప్లస్ హాట్స్టార్- 13 సెప్టెంబర్ 2023 ఎ మిలియన్ మైల్స్ అవే- అమెజాన్ ప్రైమ్ వీడియో- 15 సెప్టెంబర్ 2023 -
ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న మాస్ కా దాస్ హీరో..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న కొత్త షో "ఫ్యామిలీ ధమాకా". ఈ షో ఆహాలో రాబోతోంది. ఈ షో ద్వారా విశ్వక్ సేన్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాకుండా ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అయ్యాడు. "ఫ్యామిలీ ధమాకా" సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ కానుంది. ఈ షో కుటుంబ మొత్తానికి వినోదాన్ని అందిస్తుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ షో ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు సెప్టెంబర్ 7న మొదటి ఎపిసోడ్ని వీక్షించవచ్చు. ఇకపోతే ఈ షో ప్రీ లాంచ్ ఈవెంట్ కాకినాడలోని SRMT INOX మాల్లో జరిగింది. కాకినాడలోని కుటుంబాలతో కలిసి ఆహా ఫ్యామిలీ ధమాకా గేమ్ ఆడించారు. ఆ తర్వాత షో థీమ్ సాంగ్ మీద అందరూ డ్యాన్స్ చేసి ఆనందించారు. మరి విశ్వక్ సేన్ హోస్టింగ్ ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ ధమాకా షో ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందనేది తెలియాలంటే మరో మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే! చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్ల జాబితా ఇదిగో!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement