ఆకాశాన్ని తాకేలా..
వెంకటాపురం : మండలంలోని నల్లగుంట శివారులో దేవాదుల మొదటి దశకు చెందిన పైపులైన్ గేట్వాల్్వను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీరు 40 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతోంది. నల్లగుంట సమీపంలోని ఆరె‡కుంట కింద కొందరు రైతులు వరిని సాగు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దేవాదుల పైపుౖలñ న్ గేట్వాల్్వను తొలగించడంతోపాటు ఫెన్సింగ్ (ఇనుపరాడ్ల)ను ధ్వంసం చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు నీరు ఆరెకుంటలోకి వెళ్లింది. ఈ విషయమై స్థానిక దేవాదుల సిబ్బంది మొగిలిని ‘సాక్షి’ వివరణ కోరగా.. గేట్వాల్్వను ఎవరో ధ్వంసం చేయడంతో నీరు వృథాగా పోతుందని తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.