assassin
-
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
హంతకుడికి జీవితఖైదు
జగిత్యాల కోర్టు సంచలన తీర్పు జగిత్యాల: హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి పి.రంజన్కుమార్ గురువారం సంచలన తీర్పుచెప్పారు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివరెడ్డి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామానికి చెందిన మోతె పుల్లయ్య ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ అనుబంధ గ్రామమైన విట్టంపేటకు వచ్చాడు. ఈయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మోతె బంగారం గ్రామంలో 7వ తరగతి వరకు చదివాడు. ఉపాధి కోసం చూస్తుండగా విట్టంపేట గ్రామానికి చెందిన ఆరెల్ల చిన్నరాజగౌడ్ మెట్పల్లి–కమ్మర్పల్లి రోడ్డులో సత్తక్కపల్లె శివారులో శివ హోట్ల్ పేరుతో దాబా ఏర్పాటు చేశాడు. ఈ హోటల్లో బంగారం సర్వర్గా చేరాడు. ఇదే హోటల్లో ప్రస్తుతం మెట్పల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన బండ్ల దేవదాసు సైతం సర్వర్గా పనిచేసేవాడు. 2015, ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు హోటల్లో పనిచేసిన ఇద్దరూ అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం హోటల్ యజమాని రాజగౌడ్ వచ్చి చూసేసరికి బంగారం తల హోటల్ వెనుకభాగంలో, మొండెం హోటల్ సమీపంలో పడి ఉంది. బంగారం యువకుడితో ఆ రోజు హోటల్లో పడుకున్న బండ్ల దేవదాసు కనిపించకుండా పోయాడు. దీంతో యజమాని బంగారం తల్లితండ్రులకు విషయం తెలుపగా, సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం, మృతుడి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై రాజిరెడ్డి కేసు నమోదు చేసుకోగా, అప్పటి మెట్పల్లి సీఐలు కె.రాజశేఖర్ రాజు, వి.సురేందర్ విచారణ చేశారు. విచారణలో దేవదాసే నిందితుడని, ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి వివాదం తలెత్తడంతో ఓ పదునైన కత్తితో హత్య చేసి, తల, మొండెం వేరుచేశాడని నిర్ధారించారు. దీంతో, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారి సత్యనారయణ, హెడ్ కానిస్టేబుల్ రవీందర్రెడ్డి 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడు బండ్ల దేవదాసుకు జీవితఖైదుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
-
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
న్యూయార్క్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించిందా? ఆయనపై దాడి జరిగే సూచనలు ఉన్నాయని హత్య జరగడానికి ఐదేళ్ల ముందే ఊహించిందా? అంటే అవునని ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. అయితే, అంతకంటె ముందే రాజీవ్ హత్యకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ 1986లోనే ఓ 23 పేజీల్లో 'ఇండియా ఆఫ్టర్ రాజీవ్..' అనే పేరుతో సీఐఏ రాసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఐఏనే ఇటీవల బయటపెట్టింది. 1986వరకు సీఐఏకు అందిన సమాచారం మేరకు అది రాసిన నివేదికలో తొలి వాక్యంగా 'ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన పదవికాలం ముగిసేనాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్యాప్రయత్నమే' అని మరో వాక్యంలో రాసింది. ఇలా సీఐఏ చెప్పిన సరిగ్గా ఐదేళ్ల తర్వాత 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్యకు గురయితే కచ్చితంగా భారత్కు అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం పడుతుందని కూడా సీఐఏ అప్పట్లోనే అంచనా వేసింది. పలు గ్రూపులు రాజీవ్ హత్యకోసం యత్నిస్తున్నాయని, అది ఏ సమయంలోనైనా జరగొచ్చే అవకాశం ఉందని సీఐఏ రిపోర్టు తెలిపింది. అంతేకాదు, రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పీవీ నరసింహరావు, వీపీ సింగ్లాంటి ప్రజ్ఞావంతులు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. -
హంతకురాలి ఆత్మకథ