సొంత ఎటీఎంలనే ఉపయోగించుకోండి: ఎస్బీఐ
కోల్కతా: డెబిట్ కార్డుల సమాచారానికి ముప్పు ఏర్పడిన నేపథ్యంలో సొంత నెట్వర్క్ ఏటీఎంలనే వినియోగించుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచించింది. ఎస్బీఐకి చెందిన 6 లక్షల డెబిట్ కార్డుదారుల సమాచారం చోరీకి గురై ఉంటుందన్న సందేహంతో బ్యాంకు వాటిని బ్లాక్ చేసి కొత్తవి జారీ చేయడం తెలిసిందే. ముందు జాగ్రత్తగా సొంత నెట్వర్క్ ఏటీఎంలనే వినియోగించుకోవాలని సూచిస్తున్నామని, 2 వారాల్లోపు ఆరు లక్షల డెబిట్ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వనున్నట్టు ఎస్బీఐ బెంగాల్ సర్కిల్ సీజీఎం పార్థా ప్రతిమ్సేన్ గుప్తా తెలిపారు.