Bhavanam Bhushan
-
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు. భవనం భూషణ్ (గుంటూరు వెస్ట్), రాజుల భాస్కర్రెడ్డి (పులివెందుల), వరికూటి కొండారెడ్డి (కందుకూరు) పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
లోకేష్ కు స్టాన్ఫోర్డ్ వర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో?
హైదరాబాద్: వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి నారా లోకేష్కు లేదని వైఎస్ఆర్సీపీ నేత భవనం భూషణ్ అన్నారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన నగదు బదిలీ పథకం గురించి గొప్పగా చెప్పుకున్నారని, మరి ఈసారి మేనిఫెస్టోలో అది ఎందుకు లేదని ప్రశ్నించారు. లోకేష్ కు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో అర్ధం కావడంలేదన్నారు. అత్తెసరు మార్కులతో పాసైన లోకేష్ కు స్టాన్ఫోర్డ్ యూనిర్సిటీలో సీటు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీలో లోకేష్ కు ఫీజు ఎవరు కట్టారని అడిగారు. రామోజీ రావు పత్రికా విలువలు దిగజార్చి అడ్డగోలు కథనాలు రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత ఓవీ రమణ అన్నారు. రామోజీ మీపై ఉన్న కేసుల గురించి ఎందుకు రాసుకోవడం లేదని ప్రశ్నించారు. జర్నలిజం విలువలు కాపాడాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ నేత భవనం భూషణ్ తో సాక్షి వేదిక