brutally killed
-
కసాయి తల్లి.. కన్న పిల్లల్నే చంపేసి..
కర్ణాటక: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను ఓ తల్లి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన బెంగళూరు జాలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాదేవి తన ఇద్దరు పిల్లలైన లక్ష్మీ (9), గౌతమ్ (7)లను చంపేసి పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి చెప్పింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం వలసవచ్చి జాలహళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేసేది, ఆమె భర్త బీబీఎంపీ కాంట్రాక్టు పౌర కార్మికుడు. గత నెలలో భర్తపై గంగాదేవి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అరెస్ట్చేశారు. ఇద్దరు పిల్లలతో మంగళవారం ఉగాది పండుగ చేసుకున్న గంగాదేవి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలను దిండుతో ఉపిరాడకుండా చేసి హత్యచేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతోంది, రావాలని కోరింది. జాలహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా, పిల్లలను తానే చంపానని ఆమె చెప్పిందని ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. భర్తతో గొడవలు, ఆర్థిక సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళను జాలహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్కుమార్ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి తీవ్ర భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. बांदा में एक दलित के साथ बलात्कार व जघन्य हत्या की जो ख़बर आई है, वो दिल दहला देने वाली है। उप्र की महिलाएं डरी हुई हैं और अंदर-ही-अंदर आक्रोशित भी। साथ ही आईआईटी बीएचयू की महिला छात्रा के साथ अभद्रता के बाद निर्वस्त्र कर वीडियो बनाने की घटना उप्र की क़ानून-व्यवस्था के मुँह पर… pic.twitter.com/g96iu9MFIK — Akhilesh Yadav (@yadavakhilesh) November 2, 2023 -
తమ్ముడిపై ప్రేమ నటించి.. ఇంట్లోకి పిలిచి ఓ అన్న ఘాతుకం
ఖిలా వరంగల్ : ఆస్తి విషయంలో మాట్లాడుకుందా మని ఓ అన్న.. తన సొంత తమ్ముడిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి కర్రలతో కొట్టి.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు కరీమాబాద్ ఉర్సు ప్రతాప్నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం..వరంగల్ ఉర్సు కరీమాబాద్ కురుమవాడ వెంకటేశ్వర హైసూ్కల్ సమీప కాలనీలో గోవిందుల కొమ్మాలుకు ముగ్గురు కుమారులు శ్రీని వాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీధర్కు తన తమ్ముడు శ్రీకాంత్(35)తో కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీకాంత్ తన అన్న శ్రీధర్పై మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు మార్లు శ్రీధర్ను మందలించి వదిలేశారు. అన్న శ్రీధర్ అరాచకంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ భార్య రాణితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వలసవెళ్లాడు. అక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంటి స్థలం విషయం మరోసారి మాట్లాడుకుందామంటూ శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్ను వరంగల్లోని తన ఇంటికి పిలిపించాడు. అన్న మాటలు నమ్మిన తమ్ముడు ఇంట్లోకి రాగానే బలమైన కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక రోడ్డుపై పరుగులు పెట్టాడు. శ్రీకాంత్ డ్రెయినేజీలో పడగానే అతడి తలపై శ్రీధర్ బండరాయి ఎత్తేసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కు శ్రీనివాస్, ఎస్సై సాంబయ్య, క్లూస్ టీం బృందంతో ఏసీపీ బోనాల కిషన్ చేరుకున్నారు. శ్రీ కాంత్ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరి శీలించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహా న్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నింది తుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య రాణి ఘటన స్థలానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ.. కరీమాబాద్లో జరిగిన హత్య ఘటన వద్ద కర్ర, బండరాయి, పెట్రోల్ డబ్బాను గుర్తించామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్పై శ్రీధర్ కర్రతో మోది ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని పేర్కొన్నారు. -
ప్రేమోన్మాది దారుణం..కత్తితో పొడిచి.. టవల్తో గొంతు నులిమి
గూడూరు: ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గూడూరులోని తిరుపతి రైల్వేలైన్ గేటు సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరికి ఇంజనీరింగ్ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. గురువారం దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఆమె సోదరుడు ఉన్నారు. చెన్నూరు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న చిన్నికృష్ణ కుమారుడు వెంకటేష్ బెంగళూరులో స్టాఫ్వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నాడు. తేజస్విని, వెంకటేష్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. కత్తితో పొడిచి.. టవల్తో గొంతు నులిమి.. గురువారం యువతి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే వెంకటేష్ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్తో గొంతు నులిమి చంపేశాడు. యువతి సోదరుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీలోంచి చూడగా బెడ్పై తేజస్విని పడి ఉంది. స్థానికులు రావడంతో భయపడ్డ వెంకటేష్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి దారుణ హత్య.. పెట్రోల్ పోసి..
అమరచింత (కొత్తకోట): పట్టణ సమీపంలోని కొత్తతండా శివారులో ఉన్న పత్తి పొలంలో బుధవారం ఓ యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు..తండా సమీపంలోని చిన్న కుర్మన్న పొలాన్ని పట్టణంలోని శ్రీకృష్ణానగర్కు చెందిన కతలన్న కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. వారం రోజుల క్రితం పత్తి తీసిన రైతు బుధవారం మరోమారు పత్తిని ఏరుతుండగా పరిసరాల నుంచి దుర్వాసన వచ్చింది. పరిశీలించగా ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించడంతో ఆందోళన చెంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటన స్థలానికి తరలివచ్చారు. డీఎస్పీ కిరణ్కుమార్ అక్కడికి చేరుకొని జాగిలాలతో అన్వేషణ చేపట్టారు. సీఐ సీతయ్య, ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వారం క్రితమే యువతిని హతమార్చి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. మృతిచెందిన యువతి వయస్సు 18 నుంచి 20 ఏళ్లలోపు ఉంటుందని.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఉండవచ్చన్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందని.. అన్ని మండలాల పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
తనెంత డేంజరో తెలపడానికే ఇంత దారుణం
గాంగ్టక్: ఈ మధ్య కాలంలో నోరులేని మూగ జీవాలను చంపుతున్న మానవ మృగాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మూగ జీవాలను దారుణంగా హింసించి సైకోల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సిక్కింలో చోటు చేసుకుంది. బంధువులతో గొడవ పడిన ఓ వ్యక్తి వారి పెంపుడు కుక్కను అత్యంత దారుణంగా చంపేశాడు. కుక్కల పండుగ నాడే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు.. తూర్పు సిక్కిం మానే దారా గ్రామానికి చెందిన నరెన్ తమంగ్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న నరెన్కు అతడి బంధువుకు మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ కోపాన్ని నిందితుడు అతడి పెంపుడు కుక్క మీద చూపించాడు. (కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి) బంధువు పెంపుడు కుక్కను దారుణంగా హత్య చేశాడు నరెన్. అనంతరం మృతదేహాన్ని కొండపై నుంచి విసిరి సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించాడు. కానీ బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కుక్క మృతదేహాన్ని గుర్తించారు. దానికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్లు నరెన్ కృరత్వానికి భయపడిపోయారు. ‘నిందితుడు కుక్క తలపై, నోటిపై పొడిచాడు. దాని నాలుకను ముక్కలు చేశాడు. పాపం ఆ మూగజీవి తన ప్రాణాలు కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. సాయం కోసం అరిచింది. దురదృష్టవశాత్తు దాని యజమానురాలు దారుణం జరుగుతున్నప్పుడు అక్కడే ఉంది కానీ.. నరెన్ చేష్టలకు భయపడి పోయింది. సగం స్పృహలో ఉన్న ఆ కుక్కపిల్ల పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ నరెన్ మళ్లీ దాన్ని పట్టుకుని చెవి కత్తిరించి.. తలపై కొట్టాడు. ఆ తర్వాత దాన్ని తన ఇంటి దగ్గర ఉన్న కొండపైకి విసిరాడు’ అని తెలిపారు పోలీసులు. తాను ఎంత ప్రమాదకరమైన వాడో తన బంధువులకు తెలియజెప్పేందుకే నరెన్ ఈ నేరానికి పాల్పడ్డాడన్నారు పోలీసులు. మూగజీవిని ఇంత దారుణంగా హింసించి చంపిన నరెన్కు కఠిన శిక్ష విధించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (వణికించిన బర్మా కొండచిలువ) -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిన్నకోడూరు(సిద్దిపేట): జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్నం కోసం కట్టుకున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్లో బుధవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాస్రెడ్డికి మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా శ్రీనివాస్రెడ్డి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగమ్మను కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన మంగమ్మ 10 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రాయచూర్కు చెందిన ఇందిర అనే మహిళతో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన విఠలాపూర్కు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. వీరికి లోకేష్(06) కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా మరిది, అత్త, ఆడపడుచులు ఇందిరను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇందిర తన సోదరుడికి సమాచారం అందించింది. అయినప్పటికీ వారి వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం తెల్లవారు జామున శ్రీనివాస్రెడ్డి భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతురాలి బంధువులు శ్రీనివాస్రెడ్డి, అత్త భూదవ్వ, ఆడపడుచు రేణుక, మరది కనకారెడ్డిలే హత్య చేశారని ఆరోపించారు. వారిని శిక్షించే వరకు ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించొద్దని బీష్మించారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్రెడ్డి, అత్త భూదవ్వలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతురాలి సోదరుడు గట్టు వీరేశ్రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ముందస్తుగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. -
తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం..
ప్యాపిలి: పాతకక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. తొమ్మిదేళ్ల జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్యాపిలిలో శనివారం అర్ధరాత్రి జరిగిన హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని స్థానిక కుంటగడ్డ వీధిలో నివాసం ఉంటున్న తొండపాడు మధు (35) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మధును వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికారు. కొన ఊపిరితో ఉన్న మధును కుటుంబ సభ్యులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇంద్రజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, డోన్, బనగానపల్లె సీఐలు రాజగోపాల్ నాయుడు, శ్రీనివాసులు, ప్యాపిలి, బనగానపల్లె, దేవనకొండ, బేతంచర్ల ఎస్ఐలు పీరయ్య, రాకేశ్, గంగాధర్, తిరుపాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి చిన్నాన్న తొండపాడు మద్దయ్య ఫిర్యాదు మేరకు తొండపాడు పాండురంగడు, రామాంజనేయులు, పూజారి సూర్యనారాయణ, ఓబులేసు, మధు, కొండా కొండన్న, పూజారి వెంకటేశ్, పోదొడ్డి శివ, డైలి రామాంజనేయులు, వైటీ చెరువు నాగేంద్ర, పూజారి శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య పచ్చి బాలింత మధు, ఇంద్రజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారం క్రితమే ఇంద్రజ మూడో శిశువుకు జన్మనిచ్చింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న ఆమెను శనివారమే డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చిన మధు భార్య, పొత్తిళ్లలో ఉన్న చిన్నారితో కొద్దిసేపు గడిపాడు. అనంతరం పట్టణంలో జరుగుతున్న తిరునాలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ దారుణహత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం.. 2009లో పట్టణంలోని స్థానిక శ్రీరామా టాకీస్ వద్ద తొండపాడు లక్ష్మీరంగయ్య దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీరంగయ్య, మధు దగ్గరి బంధువులే అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో వైరం ఉంది. లక్ష్మీరంగయ్యకు చెందిన నాటుసారా కుండలను మధు వర్గీయులే ధ్వంసం చేశారన్న నెపంతో అప్పట్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో మధు వర్గీయులు 2009లో లక్ష్మీరంగయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో మధుతో పాటు 16 మంది ముద్దాయిలుగా ఉన్నారు. అయితే గతేడాది డిసెంబర్లో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీరంగయ్య వర్గీయులు మధును హతమార్చేందుకు పథకం పన్నారు. మధు ఇంటికి వెళ్లాలంటే ప్రత్యర్థి పాండురంగడు ఇంటిని దాటుకుని వెళ్లాలి. ఇదే అదనుగా భావించిన దుండగులు శనివారం రాత్రి తిరునాల నుంచి ఇంటికి వెళ్తున్న మధు పాండురంగడు ఇంటి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. -
స్నేహితుని తల నరికి...
సాక్షి, అన్నానగర్: నాగైలో దారుణం జరిగింది. స్నేహితులే చిన్న తగాదా కారణంగా మరో స్నేహితుని తల నరికి హతమార్చారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాతిపెట్టిన ఆ యువకుడి మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగై భారతి మార్కెట్ ప్రాంతానికి చెందిన మదియళగన్ (24), సరన్రాజ్ (26), విజయ్ (23), మారియప్పన్ (26), శివా (24), జయరామన్ (26) మంచి స్నేహితులు. సరన్రాజ్, విజయ్, మారియప్పన్, శివా, జయరామన్ గత నెల 31వ తేదీ రాత్రి నాగై బాప్పాన్ శ్మశానవాటిక ప్రాంతంలో మద్యం సేవించారు. అప్పుడే అక్కడికి వచ్చిన మదియళగన్ నన్ను వదిలివేసి మీరు మద్యం సేవిస్తున్నారా అని స్నేహితులను అడిగాడు. దాంతో వారి మధ్య గొడవ జరిగింది. మదియళగన్ సమీపంలో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని జయరామన్ని పొడవటానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ఐదుగురు స్నేహితులు వారి వద్ద ఉన్న కత్తితో మదియళగన్ను పొడిచారు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మత్తులో ఉన్న వారు అంతటితో ఆగక మదియళగన్ తలను నరికి దేహాన్ని, తలని సమీపంలో ఉన్న కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. మదియళగన్ అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి అందుబాటులో ఉన్న నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల ఎదుట వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. అనంతరం బుధవారం సాయంత్రం మదియళగన్ని పాతిపెట్టిన స్థలానికి నిందితులను తీసుకుని వెళ్ళి మృతదేహాన్ని వెలికితీశారు. తరువాత పోస్టుమార్టం కోసం మదియళగన్ మృతదేహాన్ని నాగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో స్నేహితుడు జయరామన్ కోసం గాలిస్తున్నారు. -
మామ చేతిలో అల్లుడి హతం
హైదరాబాద్ : యాకుత్పురా తన వద్ద పని చేస్తూ కూతురిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన ఓ వ్యక్తి కొడుకు, బావమరిదితో కలిసి అల్లుడిని దారుణంగా హత్య చేశసిన సంఘటన శుక్రవారం రాత్రి భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అదనపు ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర నాందేడ్కు చెందిన షేక్ ఫిరోజ్ ఆలియాస్ షేక్ సల్మాన్(22) తలాబ్కట్టా ఆమన్నగర్–బిలో నివాసముంటున్నాడు. గతంలో అతను తలాబ్కట్టా నషేమాన్నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయూబ్ఖాన్ వద్ద ఆటో డ్రైవర్గా పని చేస్తున్న సమయంలో అతని కుమార్తె నేహా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ వద్ద పని చేస్తూ తన కూతురునే వివాహం చేసుకున్నందుకు ఆయూబ్ ఖాన్ ఫిరోజ్పై కోపం పెంచుకున్నాడు. గత నెల 6న ఫిరోజ్, నేహా బేగం కుమార్తె తొట్టెల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్, ఫిరోజ్ల మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయూబ్ ఖాన్న్అల్లుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు పథకం పన్నిన ఆయూబ్ శుక్రవారం రాత్రి తన కుమారుడు ఇమ్రాన్, బావమరిదితో కలిసి ఫిరోజ్ ఇంటికి వచ్చి అతడిని బయటికి పిలిచి కత్తులతో దాడి చేసి గొంతు కోశారు. తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఫిరోజ్పై గతంలో వనస్థలిపురం, చైతన్యపురి, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఆసీఫ్నగర్ జిర్రా ప్రాంతంలో ఉన్న ఫిరోజ్ మూడు నెలల క్రితం తలాబ్కట్టా ఆమన్నగర్–బికి మకాం మార్చాడు. మామ ఆయూబ్ ఖాన్పై గతంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు. -
మహిళ దారుణ హత్య
ఖమ్మం : కారేపల్లి మండలం రేలాకయాలపల్లి ఈర్యా తండాలో బానోత్ అరుణ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అరుణను హత్య చేసి ఆమె మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్పై పడేశారు. శుక్రవారం ఉదయం ట్రాక్ పై మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అరుణ భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. అయితే గ్రామంలో ఉన్న రమేష్ అనే యువకుడితో అరుణ వారం క్రితం పారిపోయి వివాహం చేసుకుంది. అరుణ కంటే రమేష్ వయసులో చిన్నవాడు. ఈ విషయంపై గురువారం తండా గ్రామంలో పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. తెల్లవారేసరికి అరుణ శవం రైల్వే ట్రాక్పై ఉంది. దీంతో రమేశ్ తల్లిదండ్రులు, బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
చిత్తూరు : రైస్ మిల్లులో పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వజ్రవారి కండ్రీగలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసిస్తున్న సుందరరామిరెడ్డి (55) రైలు మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సుందరరామిరెడ్డిపై ఆగంతకులు దాడి చేశారు. అనంతరం అతన్ని కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారు పరారైయ్యారు. ఆదివారం ఉదయం సుందరరామిరెడ్డి మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెంపుడు కుక్కల దాడిలో యజమాని హతం
వేలూరు: పెంపుడు కుక్కల పాశవికదాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తోన్న కృపాకరం అనే వ్యక్తి.. రాట్ వీలర్ జాతికి చెందిన ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. వేలూరుకు సమీపంలోని తన మామిడి తోటలో కుక్కను కాపాలగా ఉంచి, రోజూ వస్తూ పోతూఉండేవాడు. దాదాపు 50 కేజీల బరువు, అరమీటరు ఎత్తుండే ఆ కుక్కను క్రాసింగ్ చేసే నిమిత్తం.. ఇటీవల అదే జాతికి చెందిన ఓ మగకుక్కను తీసుకొచ్చాడు. రెండు కుక్కలకు తానే స్వయంగా ఆహారం పెట్టేవాడు. మంగళవారం డ్యూటి నుంచి ఆలస్యంగా వచ్చిన కృపాకరం రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటకు వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టే ప్రయత్నం చేశాడు. ఏరకమైన చిరాకులో ఉన్నాయోగానీ.. రెండు రాట్ వీలర్ కుక్కలు ఒక్కసారే యజమాని మీద దాడిచేశాయి. ముఖం, ఎద, పొట్ట భాగాన్ని ఖండఖండాలుగా పీకిపారేశాయి. కృపాకరం హాహాకారాలు చేయడంతో తోట పరిసర ప్రాంతాల్లోని రైతులు పరుగుపరుగున వచ్చి.. కుక్కలను అదిలించి, రక్తపు మడుగులో పడిఉన్న అతనిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడం కృపాకరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మాయదారి కుక్కలు ఎంతపని చేశాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న బానవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర పళ్లు, బలమైన దవడలు కలిగిన రాట్ వీలర్ (జర్మన్) జాతి కుక్కల పెంపకంలో అసమాన శ్రద్ధ అవసరమని, ఆదేశాలు పాటించడం నేర్పకపోతే అవి యజమానిపైనే దాడికి దిగుతాయని వేలూరు వణ్యప్రాణి సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చెబుతున్నారు. -
తమిళనాడులో మరో ఘాతుకం
ఆరో తరగతి విద్యార్థిని హత్య మృతదేహాన్ని పూడ్చిపెట్టిన వైనం గొంతు కోసుకుని నిందితుడి ఆత్మహత్యాయత్నం చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్య ఘటన మరువక ముందే, ఆరో తరగతి విద్యార్థి ఓ కిరాతకుడి చేతిలో హతమైంది. మంగళవారం ఈ ఘటన మానామధురై సమీపంలో కలకలం రేపింది.శివగంగై జిల్లా మానామధురై సమీపంలోని గణపతి తలవాయి గ్రామానికి చెందిన కరుప్పయ్య, జయ దంపతులకు కాళేశ్వరి(11) అనే కుమార్తె ఉంది. కరుప్పయ్య ఇటీవల మరణించడంతో కుమార్తె కాళేశ్వరితో కలిసి జయ నివసిస్తుంది. మేలనట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో కాళేశ్వరి ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన కాళేశ్వరి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన జయ ఇరుగు పొరుగు వారిని విచారించింది. పాఠశాల పరిసరాల్లో ఆరా తీయగా, కార్తీక్(25) అనే వ్యక్తి కాళేశ్వరిని మోటారు సైకిల్పై ఎక్కించుకు వెళ్లినట్టు తెలిసింది. తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న కార్తీక్ కోసం కుటుంబీకుల వద్ద జయ ఆరా తీసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు అతడి సెల్ఫోన్కు ఫోన్ చేసింది. దీంతో కాళేశ్వరి గొంతు కోసి హత్య చేశానని, ఆమెను పూడ్చి పెట్టి, తాను చచ్చిపోతున్నట్టు సమాధానం ఇచ్చి కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన జయ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మానా మధురై పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేలనట్టూరు గ్రామానికి సమీపంలోని చెరువు గట్టు వద్ద కార్తీక్ గొంతు కోసుకుని కొన ఊపిరితో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం శివగంగై ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పోలీసులు కాళేశ్వరిని పూడ్చి పెట్టిన ప్రదేశం కోసం గాలించారు. చివరకు మంగళవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఆ స్థలాన్ని గుర్తించారు. ఖననం చేయబడ్డ కాళేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానామధురై ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు స్పృహలోకి వస్తే గానీ, ఈ ఘాతుకం వెనుక గల కారణాలు తెలియరావని మానా మధురై పోలీసు ఉన్నతాధికారి వనిత వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని జయ బంధువులు భావిస్తున్నారు. -
బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!
-
నరహంతక ముఠా పరారీ
* కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకున్న నలుగురు రిమాండ్ ఖైదీలు * వెంబడించి ఒకరిని పట్టుకున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పసిపిల్లలను సైతం దారుణంగా హత్య చేసే నరహంతక, దొంగల ముఠా గురువారం తప్పించుకుంది. పార్ధీగ్యాంగ్కు చెందిన ఈ సభ్యులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువస్తుండగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి పరారయ్యారు. వీరు మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 31 హత్యలు, పలు దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో పార్ధీ గ్యాంగ్ లీడర్ తరుణ్ బోస్లే అలియాస్ అరుణ్ బోస్లేతో పాటు లక్ష్మణ్ బోస్లే, కైలాస్, పరమేశ్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, పరమేశ్ను పట్ణణంలోని సితారా సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. జరిగింది ఇలా.. నలుగురు పార్ధీ ముఠా సభ్యులతో పాటు మరో సాధారణ దొంగను పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు గురువారం తీసుకువచ్చారు. ఐదుగురు సభ్యులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. సాధారణ దొంగను ముందుగా కోర్టులో హాజరుపరిచారు. పార్థీ గ్యాంగు సభ్యులను హాజరు పరిచేందుకు సమాయత్తం అవుతుండగా.. అందులోని ఒక సభ్యుడు పరమేశ్ ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నాడు. అతణ్ని వెంబడిస్తూ ఇద్దరు పోలీసులు పరుగెత్తారు. ఎట్టకేలకు అతణ్ని సితారా టాకీసు సమీపంలో పట్టుకున్నారు. ఈలోగా మిగిలిన ముఠా సభ్యులు పరారయ్యారు. ఎస్కార్టు పోలీసు వారిని కాల్చి వేసేందుకు తుపాకీని లోడ్ చేసి గురిపెట్టగా.. అది పేలకుండా మొరాయించినట్టు సమాచారం. దొరికిన కొద్దిపాటి సమయంలో ముగ్గురు మెరుపులా మాయమయ్యారు. ఇవీ కేసులు.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పార్లీ వైద్యనాథ్కు చెందిన తరుణ బోస్లే, లక్ష్మణ్ బోస్లే, పరమేశ్వర్, కైలాష్లు కరడుగట్టిన నేరస్తులు. 2009 నాటికి ఈ గ్యాంగ్పై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 31 హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వీళ్లు పట్టుబడిన సమయానికి వారి వయస్సు 18 ఏళ్ల యువకులు. 2012లో బయటికి వచ్చిన ఈ గ్యాంగ్ మళ్లీ హత్యలు, దోపిడీకి తెగబడింది. 2012 నుంచి 2014 వరకు దాదాపు రెండేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆరు హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో ఒక ఇంట్లోకి చొరబడి తల్లీకూతుళ్లతో పాటు పసికందును దారుణంగా హత్య చేసి దోపిడీ చేయడంతో పార్ధీగ్యాంగ్ క్రూరత్వానికి సమాజం వణికిపోయింది. నల్లగొండ జిల్లా బీబీనగర్లో ఒకరిని, కరీంనగర్లో వృద్ధ దంపతులను, సుల్తానాబాద్లో ఇద్దరిని హత్య చేశారు. మెదక్ జిల్లాలో వీరిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. రామచంద్రపురం మండలం నాగుపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీలు, హత్య కేసుల్లో రామచంద్రాపురం పోలీసులు దాదాపు 40 రో జుల పాటు పర్లీలో మకాం వేసిపట్టుకున్నారు. పట్టణం చుట్టూ అష్టదిగ్బంధనం సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సంగారెడ్డి పట్టణం నలుమూలను అష్టదిగ్బంధనం చేశారు. మఫ్టీ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాలనే ఎంచుకొని దోపిడీలు చేసే అలవాటు ఉండటంతో పోలీసులు ఆ దిశగా నిఘా పెట్టారు. కదులుతున్న రైలు ఎక్కటానికి అవకాశం ఉన్న ప్రతి చోట పోలీసులను మొహరించారు. -
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తలను దుండగులు బండి ఆత్మకూరులో వదిలి వెళ్లారు. సదరు గ్రామస్తులు మనిషి తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా... కోడూరు వద్ద తల లేని మొండాన్ని గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తల, మొండం గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుదిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు. తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు.