bunk
-
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
Ongole: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేటలోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్ ఏర్పాటు చేయగా.. ఈ బంక్లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య స్రత్పవర్తనతో మెలుగుతున్నా హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కల్పించారు. – డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ పశ్చాత్తాప పడుతున్నా క్షణికావేశంలో తప్పు చేశా. కుటుంబాలకు దూరమై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీలతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కలిగింది. – జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ పరివర్తన తీసుకొచ్చే దిశగా.. ఈ బంక్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. – పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్ చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
సాక్షి ఎఫెక్ట్: పెట్రోల్ బంకుల్లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: పెట్రోల్ బంకుల్లో చిప్లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న తీరుపై ‘కనికట్టు కొలత’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తూనికలు–కొలతల శాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అసిస్టెంట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో విజయవాడలోని 7 పెట్రోల్ బంకులను అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా బంకులను పరిశీలించారు. పెట్రోల్ కొలతలు, నాణ్యతను పరీక్షించి రికార్డులను చూశారు. వారం పాటు ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. చదవండి: కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్లు -
పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా దాదాపు 69,000 పెట్రోల్ బంకుల్లో కనీసం ఒక్కటి చొప్పునైనా చార్జింగ్ కియోస్క్లు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన సొంత బంకుల్లో (సీవోసీవో) ఈవీ చార్జింగ్ కియోస్క్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో చమురు శాఖ వర్గాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. ఇందుకోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ కియోస్క్లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీ చేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతరత్రా ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ ప్రతీ బంకులో కనీసం ఒక్కటైనా కియోస్క్ పెట్టేలా ఆదేశాలిస్తే.. దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాకారం కాగలదని పేర్కొన్నాయి. నగరాలతో పాటు జాతీయ రహదారులపై కూడా ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్తో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, వదోదర, భోపాల్ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వివరించాయి. -
పెట్రోల్ బంక్లో నీరు కలిసిన పెట్రోల్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పెట్రోల్ బంక్ పంపుల్లో నీరు మిశ్రిత పెట్రోల్ రావడంతో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందికి గురైన సంఘటన దేవనహళ్లి శివారులోని ఓ పెట్రోల్ బంక్లో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి వచ్చిన మంజునాథ్ అనే వ్యక్తి తన కారుకు ఇదే పెట్రోల్ బంక్లో పెట్రోలు కొట్టించాడు. కాస్త దూరం వెళ్లిన కారు నిలిచిపోయింది. మెకానిక్ను రప్పించి చెక్ చేయిస్తే పెట్రోల్లో నీరు కలిసిందని చెప్పాడు. మంజునాథ్ బంకు దగ్గరుకు వెళ్లేసరికి ఇంకా కొందరు వాహనదారులు అప్పటికే బంక్ దగ్గర సిబ్బందితో గొడవపడుతున్నారు. దీంతో వినియోగదారులు పెట్రోల్ బాటిళ్లతో బంక్ దగ్గరే ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న బంకు యజమాని వచ్చి చెడిపోయిన వాహనాలను రిపేరీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు. పెట్రోల్లో నీరు ఎలా కలిసిందనే విషయంపై యజమాని ఆరా తీస్తున్నాడు. -
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు?
కందుకూరు అర్బన్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఓ చిత్రంలో పేదల పట్ల ధనవంతులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఓ పాటను చిత్రీకరించారు. ‘పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు..మా గంజిలోన ఉప్పుచూసి గొణగుడెందుకూ..’ అంటూ చిత్రంలోని ధనవంతులను తన పాటలో సూటిగా ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నే ఇప్పుడు కందుకూరు పట్టణంలోని పేదల నుంచి అధికారులు, పాలకులను ఉద్దేశించి ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న తీరు అచ్చం అలాగే ఉంది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత మున్సిపల్ అధికారుల చర్యలు ప్రస్పుటం చేస్తున్నాయి. మున్సిపల్ స్థలంలో ఉన్న లారీ స్టాండ్ను స్వాధీనం చేసుకోవాలని రెండున్నరేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినా రాజకీయ నాయకులు అటువైపు కన్నెతి చూడలేదు. ఏళ్ల నుంచి రాబందుల చేతుల్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేతగానీ మున్సిపల్ అధికారులు 50 ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న బడుగుజీవులపై కన్నెర్రజేశారు. ఇదీ.. అసలు కథ కందుకూరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి రావిచెట్టు సెంటర్లో చేపల మార్కెట్ ఉండేది. దాని చుట్టు పక్కల నిరుపేదలైన 20 ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు అక్కడ అన్న క్యాంటీన్ నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బంకులు తొలగించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బడుగులకు హుకుం జారీ చేశారు. నిరుపేదలైన బంకుల యజమానులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఆయన కూడా పట్టించుకోలేదు. ప్రజాసంఘాల నాయకులు రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పట్టించుకోని మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో జులుం ప్రదర్శించి బంకులను ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ కోసం పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న నిరుపేద కుటుంబాల పొట్టకొట్టడం ఎంతవరకు భావ్యమని వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి చిన్న బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరు పేదలను ఖాళీ చేయించడం దుర్మార్గమంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆగమేఘాలమీద బంకులు ఖాళీ చేయించడం అన్యాయమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. గుండంకట్ట, ప్రభుత్వ వైద్యశాల తదితర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించిన ధనవంతులు పాలకులు, అధికారులకు కనిపించడంలేదా..అని ప్రశ్నిస్తున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం గుండంకట్ట పక్కన రాజకీయ పలుకుబడి కలిగిన బలమైన సామాజికవర్గం వారు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి లారీ స్టాండ్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే పోతుల రామారావుకు తెలుసు. ఈ స్థలం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఉంటుంది. లారీస్టాండ్ యజమానులు ఆర్థికంగా, రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీ స్టాండ్ గొడవ ఎందుకన్నట్లు ఎమ్మెల్యే గద్దల జోలిక వెళ్లకుండా పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అన్న క్యాంటీన్ పేరుతో పేద ముస్లిం బతుకలను ఛిద్రం చేశారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం అంకమ్మతల్లి దేవాలయం వద్ద ఉన్న పేదల బంకులను కూడా అధికార పార్టీ నాయకులు నిలువునా తొలగించి వారి పొట్టకొట్టారు. -
డీజిల్ బంక్ సీజ్
కోనరావుపేట : పెట్రోల్, డీజిల్లో కల్తీ చేసి అమ్ముతున్నారని వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనరావుపేటలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పెట్రోల్బంక్ను అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. బంక్లోని డీజిల్, పెట్రోల్తో వాహనాలు చెడిపోతున్నాయని పలువురు ఉదయం ఆందోళన చేశారు. దీంతో డీటీసీఎస్ రవీందర్, ఆర్ఐ నాగరాజు వినియోగదారుల సమక్షంలో విచారణ చేపట్టారు. డీజిల్ కల్తీతో తమ ఆటోలు చెడిపోతున్నాయని డ్రైవర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు బంక్లో ఉన్న డీజిల్ నమూనాలు సేకరించారు. ల్యాబ్కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతవరకు డీజిల్ బంక్ సీజ్ చేస్తున్నామని చెప్పారు. -
పెట్రోల్ కల్తీతో అడ్డంగా బుక్కైయాడు