Cash donations
-
అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు. సీఈపీపీఎస్కు 48 కోట్ల డాలర్లు ‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్కు భారత్కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్ను వినియోగించాలని బంగ్లాదేశ్లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
రూ. 2 వేలు మించి నగదు విరాళాలు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు రూ 2000 మించి నగదు విరాళాలు ఇవ్వరాదని ఆదాయ పన్ను శాఖ ప్రజలను హెచ్చరించింది. అక్రమ నగదు లావాదేవీలకు దూరంగా ఉండాలని అప్రమత్తం చేసింది. ఎన్నికల ఫండింగ్ను ప్రక్షాళన చేసేందుకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం ఎస్బీఐ నిర్ధిష్ట బ్రాంచ్ల నుంచి ఎలక్టోరల్ బాండ్లను ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల మేరకు రాజకీయ పార్టీలకు ఏ ఒక్కరూ రూ 2000కు మించి నగదు విరాళం ఇచ్చేందుకు అనుమతించరు. నమోదిత ట్రస్ట్, రాజకీయ పార్టీకి ఏ వ్యక్తీ రూ 2000కు పైగా నగదు విరాళం ఇవ్వరాదని ఐటీ శాఖ ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి ప్రభుత్వం వార్తాపత్రికల్లో ఇలా ప్రకటన ఇవ్వడం ఇదే తొలిసారి. ఎలక్టోరల్ బాండ్ల జారీకి సంబంధించి సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రకటన వెలువడిందని భావిస్తున్నారు. ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎలాంటి లావాదేవీకైనా రూ 2 లక్షలు అంతకుమించి నగదును స్వీకరించరాదని ఇదే ప్రకటనలో ప్రజలకు ఐటీ శాఖ సూచించింది. వ్యాపార, వృత్తి పరమైన ఖర్చుల కింద రూ 10,000కు మించి నగదు రూపంలో చెల్లించరాదని పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే పన్ను లేదా పెనాల్టీ చెల్లించాల్సివస్తుందని స్పష్టం చేసింది. -
పార్టీలకు కూడా డిజిటల్ చెల్లింపులే ఉండాలి!
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో నల్లడబ్బును అరికట్టేందుకు రెండు వేల రూపాయలకు మించిన విరాళాలను స్క్రూటినీ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైనా ఫలితం ఉందా? గతంలో స్క్రూటినీ పరిధి 20 వేల రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని రెండువేల రూపాయలకు కుదించారు. ఎన్నికల కమిషన్ చేసిన తాజా సిఫార్సు మేరకు బడ్జెట్లో ఈ సవరణ తీసుకొచ్చారు. గతంలో 20వేల రూపాయలకు పైగా ఇచ్చే విరాళాలను చెక్కులు, డీడీలు, డిజిటల్ రూపంలోనే తీసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు రెండు వేల రూపాయలకు మించిన విరాళాలను చెక్కులు, డీడీలు, డిజిటల్ రూపంలోనే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో తీసుకోకూడదు. రెండు వేల రూపాయలకు మించి ఇచ్చిన విరాళాలు ఆదాయం పన్ను స్క్రూటిని పరిధిలోకి వస్తాయి. అంటే ఆదాయం పన్ను శాఖ అధికారులు అడిగితే ఆ దాతల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో 20 వేల రూపాయల పరిమితి విధించినప్పుడు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని, ఇప్పుడు రెండు వేల రూపాయల పరిధిని విధించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని, నల్లడబ్బు మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళంగా వస్తుందని అహ్మదాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మాజీ ప్రొఫెసర్ జగదీప్ ఛోకర్ అభిప్రాయపడ్డారు. గతంలో 19,999 రూపాయలు, అంతకన్నా తక్కువ విరాళాలు తీసుకున్నట్లు రాజకీయ పార్టీలు రసీదులు చూపగా, ఇప్పుడు 1,999 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ విరాళాలను ఒకరి నుంచి లేదా ఒక కంపెనీ నుంచి తీసుకున్నట్లు చూపిస్తాయని, ఇక్కడ రసీదులు పెరుగుతాయి తప్ప, నల్లడబ్బును అరికట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం ఉపయోగపడదని ఛోకర్ అన్నారు. గతంలోను రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 70 శాతం నిధులు గుర్తుతెలియని దాతల నుంచే రాగా, 20 వేల రూపాయలకు మించి నగదు రూపంలో విరాళాలు చెల్లించకూడదని నిబంధన తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ 70 శాతం నిధుల్లో పెద్ద తేడా ఏమీ కనిపించలేదని, కాకపోతే రసీదుల సంఖ్య భారీగా పెరిగాయని, ఇప్పుడు అదే సంఖ్య మరో పదింతలు పెరిగే అవకాశం ఉందని ఛోకర్ తెలిపారు. నగదు విరాళాలు మొత్తం సొమ్ముపై లేదా నగదు విరాళాలు ఇచ్చే దాతల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేనందున ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలంతా డిజిటల్ చెల్లింపులవైపు మళ్లాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ పార్టీలు నగదు రూపంలో విరాళాలు స్వీకరించేందుకు ఎందుకు అనుమతిస్తోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. అవినీతిని, నల్లడబ్బును అరికట్టేందుకు అన్ని విరాళాలను రాజకీయ పార్టీలు డిజిటల్ రూపంలోనే తీసుకోవాలనే నిబంధనను ఎందుకు తీసుకరావడం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ఇకముందు బాండుల రూపంలో విరాళాలు చెల్లించే విధంగా త్వరలో ఓ స్కీమ్ను తీసుకొస్తామని కూడా తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. స్కీమ్ వివరాలు పూర్తిగా వెల్లడించకపోయినా ఈ బాండ్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుందని చెప్పారు. బాండులు ఎవరు తీసుకున్నారో తెలుసుకోవచ్చు, వాటిని ఎవరు మార్చుకున్నారో తెలసుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకతను కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాంటి బాండులను ఆర్బీఐ మాత్రమే జారీ చేస్తుందికనుక అధికారంలో ఉన్న పార్టీకే ఆ వివరాలను తెలసుకునే అవకాశం ఉంటుందని, ఇది ఎంత వరకు సమంజసమని మాజీ ప్రొఫెసర్ ఛోకర్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో బీజేపీ ప్రభుత్వం నిజంగా పారదర్శకతను కోరుకుంటున్నట్లయితే రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ గత మూడేళ్లగా సుప్రీం కోర్టులో కొనసాగుతున్న కేసు పట్ల సానుకూలంగా స్పందించాలి. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను మార్చాలి. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావాలని కేంద్ర సమాచార కమిషన్ మూడేళ్లకు ముందే నిర్ణయించిన విషయం తెల్సిందే.