dasari unwell
-
దాసరిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న దాసరి నారాయణరావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులతో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన ఆయన దాసరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. దాసరి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
దాసరికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్ జగన్ బుధవారం కలిశారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : దర్శకుడు దాసరికి అస్వస్థత ) దాసరి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దాసరిని పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
దర్శకుడు దాసరికి అస్వస్థత
అనారోగ్యంతో కిమ్స్లో చేరిన దాసరి నారాయణరావు అన్నవాహికతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వెంటిలేటర్పై ఉంచి వైద్య సేవలు దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కిమ్స్ వైద్యుల వెల్లడి మంత్రి తలసాని, మోహన్బాబు సహా పలువురి పరామర్శ హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం అన్నవాహికలో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్కు గురైనట్లు గుర్తించి వైద్యసేవలు అందజేశారు. దాసరి ఆరోగ్య స్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యాన్ని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు, ఇతర వైద్యులు మీడియాకు వివరించారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు వైద్యం అందజేస్తూనే.. వెంటిలెటర్పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. అన్నవాహికకు స్టెంట్ వేసినట్లు చెప్పారు. కిడ్నీలు కూడా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో వెల్లడవడంతో డయాలసిస్ కూడా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. తరలి వచ్చిన సినీ ప్రముఖులు.. దాసరి కిమ్స్లో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నాయి. ప్రముఖ సినీనటుడు మోహన్బాబు, ఆయన సతీమణి, కుమారుడు మంచు విష్ణు మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సినీ నటి జయసుధ, ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. తన గురువు దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అని మోహన్బాబు చెప్పారు. -
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
-
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. దాసరికి చెస్ట్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని ఆయన వివరించారు. ఇప్పుడైతే ఆయన చాలా బాగున్నారని, రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకేమీ చెప్పలేనని డాక్టర్ భాస్కరరావు అన్నారు. (చదవండి: వెంటిలేటర్పై దాసరి నారాయణరావు) తన గురువుగారైన దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావల్సిన మనిషని నటుడు మోహన్ బాబు అన్నారు. డాక్టర్లు అన్నీ చెబుతున్నారని.. వీళ్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయన తెలిపారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. దాసరి నారాయణరావు అన్నయ్య, దాసరి కుమారుడు రఘు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు.