dead line extension
-
‘జమిలి’ జేపీసీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్సభలో ప్రవేశపెట్టింది.అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు జూన్ 4వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించిన టీఎస్పీఎస్సీ.. మే 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తుకు గడువును విధించింది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడం మరోవైపు పరీక్షకు సన్నద్ధం కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్ అప్లోడ్ నిబంధనకు బ్రేక్ ఇచి్చన టీఎస్పీఎస్సీ.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది. చివరి రెండ్రోజుల్లో ఏకంగా 60 వేల దరఖాస్తులు వచి్చనట్లు అంచనా. -
ఆధార్ లింక్ గడువు పెంపు
న్యూఢిల్లీ : ప్రభుత్వం నుంచి సబ్సిడి ప్రయోజనాలు పొందుతోన్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఆధార్ లింక్ గడువు పొడిగించారు. ఈ నెల 31 వరకు ఉన్న ఈ గడువును తాజాగా మరో మూడు నెలలు పొడిగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను జూన్ 30 వరకు చేపట్టకోవచ్చు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన గడువు (మార్చి 31)ని మార్చకూడదని మొదట భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై చర్చించి ఆధార్ అనుసంధానం చేసుకోని లబ్దిదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పాన్కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన వారికి కూడా నిన్న సీబీడీటీ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించినట్లు పేర్కొంది. టెలికాం డిపార్ట్మెంట్ కూడా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు మొబైల్ యూజర్లు తమ ఆధార్ అనుసంధానం చేపట్టుకోవచ్చని తెలిపింది. -
మూడోసారి
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఘాట్ల పనులను పూర్తిచేయడానికి ముచ్చటగా మూడోసారి గడువు ఇచ్చారు. తొలుత జూలై 25 తేదీ లోపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఏ ఆదేశిం చారు. ఆ తరువాత నెలాఖరు లోపు పూర్తిచేయాలని గడువు ఇచ్చారు. ఈ రెండు గడువుల్లోనూ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో ముఖ్యమైన ఘాట్ ఒక్కటి కూడా సిద్ధం కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఈ నెల 5వ తేదీలోగా ఘాట్ల నిర్మాణం పూర్తవ్వాలంటూ కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు అల్టిమేటం ఇచ్చారు. అయితే 10వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తవడం కూడా కష్టమేనని ఇంజినీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ముంచుకొస్తున్న ముహూర్తం ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. బుధవారాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే పుష్కరాల ప్రారంభానికి 9 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఘాట్ కూడా పూర్తి కాలేదు. కలెక్టర్ ఒత్తిడి భరించలేక కృష్ణవేణి ఘాట్లో మెట్ల నిర్మాణం పూర్తి చేసి టైల్స్ అంటించిన కాంట్రాక్టర్, ఇంజినీర్లు మభ్యపెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న పద్మావతి ఘాట్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఈ ఘాట్లో మరో రెండు లక్షల అడుగుల మేర టైల్స్ అంటించాల్సి ఉందని ఇంజినీర్లే చెబుతున్నారు. ఈ రెండు ఘాట్లలోనూ నదిలో సిమెంట్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు నిర్మించాల్సి ఉంది. విద్యుదీకరణ పనులు కూడా జరగాలి. ఘాట్లలో రెయిలింగ్లు ఏర్పాటు చేయలేదు. పోలవరం కాలువ చందమేనా.. పోలవరం కుడికాలువకు రామిలేరు అండర్ టెన్నల్ వద్ద పడిన గండి ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీ యాశంగా మారింది. ఒకవైపు రాత్రిపూట గండి పెట్టారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. పనులు హడావుడిగా చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇంజినీరింగ్ వర్గాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతం పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను.. కుడికాల్వ వద్ద జరిగిన పనులతో పోల్చుకుంటున్నారు. ఇక్కడ నాణ్యత ఎంత మేరకు ఉందో చెప్పడం కష్టమని వ్యాఖానిస్తున్నారు. ఏౖ§ð నా పొరపాటు జరిగితే తాము ఇబ్బంది పడతామని ఇంజినీర్లు భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న ఘాట్లలో పనులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రాత్రీ పగలు చేసినా పుష్కరాల నాటికి పూర్తయ్యే పరిస్థితులు కనపడటం లేదని, పదో తేదీ వరకూ చేసి పనులు ఆపేస్తామని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మట్టిదిబ్బలు... ఇసుక కుప్పలు.... ఒక్క ఘాట్ కూడా చూడముచ్చటగా లేదు. ప్రతి ఘాట్ ముందు, పక్కన మట్టి దిబ్బలు, ఇసుక కప్పలు దర్శనమిస్తున్నాయి. పొక్లెయినర్లతో ఇప్పటికీ తవ్వకాలు సాగుతున్నాయి. రెడిమిక్స్ మిషన్న్లు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి. జరుగుతున్న పని జరుగుతూనే ఉన్నా చేయాల్సిన పని చాంతా ండంత కనపడుతోందని పలువురు వ్యాఖానిస్తున్నారు. కీలకమైన పవిత్ర సంగమం, దుర్గాఘాట్ వంటి ఘాట్లలో పనులు ఇంకా సగానికి పైగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయనేది ఇంజినీర్ల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు.