Divijay Singh
-
మే19న దిగ్విజయ్ కుమారుడి పెళ్లి
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో అతిపిన్న వయస్కుడిగా (28 ఏళ్లు) గుర్తింపు పొందిన జయవర్ధన్ మే 19వ తేదీన పెళ్లి చేసుకుంటున్నానని మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఆయన 14వ విధాన సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున రఘోగఢ్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన విషయం తెల్సిందే. దుమారియాలోని (బీహార్) షాహి రాజవంశానికి చెందిన శ్రీజామ్య షాహిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె ప్రస్తుతం అజ్మీర్లోని మహిళా కళాశాలలో సీఏ చదువోతోందని జయవర్ధన్ తెలిపారు. కొంతకాలంగా ఆయన పెళ్లిపై ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఇంతవరకు వాటిని ధ్రువీకరించలేదు. -
కాంగ్రెస్లో ఆధిపత్య పోరుకు తాత్కాలిక బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలు ఎట్టకేలకు సిట్టింగు ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం బీ-పారాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అందాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగులకే మరోసారి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించటం... ఆ వెంటనే బీ ఫారాలు ఎమ్మెల్యేలకు అందజేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆదిపత్య పోరు ఉంది. వైరి వర్గాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో టికెట్ను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కీలక భూమిక పోషిస్తారు.ఈ నేపథ్యంలో తన అనుచరులకు, అనుయాయులకే స్థానిక సంస్థల బీ-ఫారం ఇప్పించుకోవడానికి ఎమ్మెల్యే ఆశావాహా నేతలు పోటీ పడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకున్నారు. వర్గ విభేదాలు తీవ్రంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగి రెండు వైరి వర్గాల వారిని రాజీ చర్చలకు పిలిచి చెరికొన్ని బీ-ఫారాలు పంచుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలకు కొంత ఊరటనిచ్చింది. ఖర్చు బాధ్యత ఎమ్మెల్యేలకే? స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యేలే భరించాలని కాంగ్రెస్ అధి నాయకత్వ సూచించినట్టు తెలిసింది. ఎక్కువ సీట్లు గెలిపించుకున్న వారికే తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, లేకుంటే ఆశలు వదులు కోవాలని కరాఖండీగా చెప్పి బీ- ఫారాలు చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో ఎంపీటీసీకి కనీసం రూ 4 లక్షలు, జెడ్పీటీసీకి రూ 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రూ. 3 కోట్లు నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. -
కెసిఆర్ను నమ్ముతున్నాం: దిగ్విజయ్
-
'రాష్ట్రపతి పాలనపై రేపు కేంద్ర కేబినెట్ నిర్ణయం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రేపు వెలువడనుంది. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. అపాయింటెడ్ డేట్ వెలువడేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశముందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విలీనం విషయంలో కేసీఆర్ను నమ్ముతున్నామని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం మంచిదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దిగ్విజయ్, సుశీల్ కుమార్ షిండే సూచించినట్టు తెలిసింది. వీరి అభిప్రాయంతో సోనియా ఏకీభవించినట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్ సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానుంది.