doctarate
-
విద్యార్థులకు ఫెదరర్ చెప్పిన జీవిత పాఠాలు.. వీడియో
రోజర్ ఫెదరర్.. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ను సొంతం చేసుకున్న ధీరుడు రోజర్ ఫెదరర్. తాజాగా ఈ స్విస్ టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గౌరవం దక్కింది. న్యూ హాంప్షైర్లోని డార్ట్మౌత్ కాలేజీ నుంచి ఫెదరర్ డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలను విధ్యార్ధులతో ఫెదరర్ పంచుకున్నాడు.దాదాపు 25 నిమిషాల పాటు సాగిన తన స్పీచ్తో విధ్యార్ధులను ఫెదరర్ మంత్రముగ్ధులను చేశాడు. తన కెరీర్లో సాధించిన ప్రతీ విజయానికి తను ఎంతో కష్టపడ్డానని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.‘ఎఫర్ట్లెస్.. నిజానికి ఈ పదాన్ని తమ కోసం ఉపయోగించినట్లయితే చాలా మంది ప్రశంసలా భావిస్తారు. నాకు మాత్రం ఈ పదం వింటేనే నాకు చిరాకెత్తిపోతుంది. ఎందుకంటే.. శ్రమించకుండా ఏదీ అంత సులువుగా దొరకదు. చాలా మంది నేనేదో అలవోకగా.. ఎటువంటి కష్టం లేకుండా ఆడతానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. చాలా సార్లు నాకు నేనే తిట్టుకుంటూ రాకెట్ విసిరి కొట్టేవాడిని.కచ్చితంగా నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించేందుకు కష్టడాల్సి ఉంటుంది. ఇక రెండో పాఠం.. వీలైనంతవరకు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ కష్టపడండి. అప్పటికి మీరు ఓటమి చవిచూస్తే ఆఖరివరకు పోరాడాలి. నా కెరీర్ను ఉదహరణగా తీసుకుంటే వింబుల్డన్లో ఓడిపోయాను. నేను నా నంబర్ వన్ ర్యాంక్ను కోల్పోయాను. ఆ సమయంలో కూడా నన్ను చాలా మంది ప్రశంసలతో ముంచెత్తారు. కానీ అప్పుడు కూడా వాటిని నేను పట్టించుకోలేదు. ఏమి చేయాలో నాకు తెలుసు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మీరు కూడా పొగడ్తలను ఎప్పుడూ పట్టించుకోకండి.ఇక మూడో పాఠం.. టెన్నిస్ కోర్టు కంటే జీవితం చాలా విలువైనది. నేను చాలా కష్టపడ్డాను. నా కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చిన్న స్థలంలో (టెన్నిస్ కోర్ట్) చాలా మైళ్ళు పరిగెత్తాను. కానీ టెన్నిస్ కోర్టు ప్రపంచం చాలా పెద్దదని గ్రహించానని విధ్యార్ధులకు ఇచ్చిన ప్రసంగంలో ఫెదరర్ పేర్కొన్నాడు. ఆయన స్పీచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Roger Federer’s Commencement Address at Dartmouth yesterday might be the best speech he’s ever given.Amazingly articulate, funny, full of wisdom. Made me laugh and tear up. I’m so very proud to have had him as my idol for the past two decades.If you have 25 minutes to spare… pic.twitter.com/qfd9io9kzV— Bastien Fachan (@BastienFachan) June 10, 2024 -
డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత'లా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేడు గ్లోబల్ స్టార్ రేంజ్కు చేరుకోవడమే కాదు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తన నటనతో 'రంగస్థలం'పై మెప్పించి ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా గుర్తింపు తెచ్చుకున్న 'చరణ్' వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ను సంపాదించుకున్న రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్ప్రెన్యూరర్గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది. అందులో రామ్ చరణ్తో పాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో), డా.జి.ఎస్.కెవేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), అచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్)లను కూడా గౌరవించారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్ బహుకరించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 45వేలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మగారు నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్ మధ్యలో నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు.. నా అభిమానులది, దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది. వేల్స్ యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజమాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా సతీమణి ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనబై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలు కని చెన్నైకి వస్తే అది నేరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలను నేరవేర్చేదిగా ఉంటూ వస్తుంది. నేను ఇక్కడ విజయ హాస్పిటల్లోనే పుట్టి పెరిగాను. సినిమాల విషయానికి వస్తే ప్రముఖ డైరెక్టర్ శంకర్గారితో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాను. ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియెన్స్. శంకర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఫరెంట్ స్టోరీతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ' అని అన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది: చిరంజీవి 'తమిళనాడులో ప్రసిద్ధ విద్యాసంస్థగా కొనసాగుతున్న వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక తండ్రిగా ఎమోషనల్గా ఫీల్ అవడమే కాకుండా.. గర్వంగా భావిస్తున్నాను. పిల్లలు విజయాలను అధిగమించినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరంగా విజయాలను అందుకుంటున్నాడు. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్' అని మెగాస్టార్ తెలిపారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
రామ్ చరణ్కు అరుదైన గౌరవం.. ప్రముఖ యూనివర్శిటీ ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ త్వరలో డాక్టరేట్ అందుకొనున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న చెన్నైలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సినీ నిర్మాత, యూనివర్శిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ ఆద్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. కళా రంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ అరుదైన గౌరవం తమ హీరోకు దక్కడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వేడుకల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. సినిమాల విషయానికొస్తే.. రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్'లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాలో అంజలి, ఎస్.జె.సూర్య, జయరామ్, సునీల్, నాజర్, శ్రీకాంత్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో చరణ్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
మీ డాక్టరేట్లను రుజువు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: మీ డాక్టరేట్లు (పీహెచ్డీలు) ప్రామాణికమైనవైతే తగు రుజువులు చూపి వాటిని నిరూపించుకోవాలని జేఎన్టీయూహెచ్ తన అనుబంధ కళాశాలల ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీచేసింది.వర్సిటీ అనుబంధ కళాశాలల్లో తప్పుడు పీహెచ్డీలతో లేదా సంబంధిత పట్టాపత్రాలు లేకున్నా కొందరు హెచ్వోడీలుగా, అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారికి చెక్ పెట్టడంతో పాటు, ఉన్నవారి పనితీరు సమీక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. నిజమని తేల్చిన తరువాతే.. దీనిలో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను అందించడం తోపాటు, వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న పీహెచ్డీ పట్టా కలిగిన అధ్యాపక సభ్యులు తమ డిగ్రీలు నిజమైనవని నిరూపించుకోవాలి, అలాగే తమ పనితీరు మూల్యాంకనం కోసం సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ముందు హాజరుకావాలి. కమిటీ సభ్యులు అధ్యాపకుల పీహెచ్డీ డిగ్రీ నిజమైనదా కాదా తేల్చాల్సి ఉంది. అలా ధ్రువీకరణ పొందాకనే వాటిని ఫ్యాకల్టీ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి అనుమతిస్తారు. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. పీహెచ్డీ, ఫ్యాకల్టీల పత్రాలను వర్సిటీకి పంపించే బాధ్యతను అను బంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కమిటీ అప్పగించింది. వీటిని అక్టోబర్ 19లోగా పంపాలి. దీనికోసం పీహెచ్డీలు గల అధ్యాపకులు తమ పీహెచ్డీ పత్రాల హార్డ్ కాపీలతోపాటు వర్సిటీల నుంచి పొందిన సర్టి ఫికెట్లను సమర్పించాలి. పరిశీలించిన తర్వాత వీటిని వర్సిటీకి ప్రిన్సిపాళ్లు పంపించాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య తెలిపారు. నకిలీ అధ్యాపకులకు చెక్:పీహెచ్డీ ఉన్న అధ్యాపకులు హార్డ్ కాపీలను గడువులోగా వర్సిటీకి సమర్పించడంలో విఫలమైతే, వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ కళాశాల ల్లో నకిలీ అధ్యాపకులను తొలగించటానికి ఇది తోడ్పడనుంది. యూజీసీ నిబంధనల ప్రకారం 10% మంది అధ్యాపకులకు పీహెచ్డీ హోదా ఉంటేనే ఆ కళాశాలకు అక్రిడేషన్ వస్తుంది. దీంతో కళాశాలలు పీహెచ్డీ ఉన్న వారినే నియమించుకోవటానికి అవకాశం ఉంటుంది. -
సినీ నటి రమ్యశ్రీకి డాక్టరేట్ ప్రదానం
పెందుర్తి: సినీ నటి రమశ్రీకి డాక్టరేట్ లభించింది. అమెరికా లోని ఫిలాంథ్రోఫిక్ సొసైటీ నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ విజ యవాడలోని ఐలాపురం కన్వెషన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కు డాక్టరేట్ ప్రదానం చేశారు. సినీ నటిగా, దర్శక నిర్మాతగా రమ్యశ్రీ కళారంగానికి అందించిన సేవలకుగాను ఈ డాక్టరేట్తో అభినందించారు. రమ్య హృదయాల ఫౌండేషన్ ద్వారా గత పదేళ్ల నుంచి యాచకులు, వృద్ధులు, వికలాంగులకు ఆమె అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు. రమ్యమైన హృదయంతో రమ్య హృదయాల ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సినీ నటిగా రాణిస్తూనే సామాజిక బాధ్యతగా రమ్యశ్రీ మెడికల్ క్యాంపులు, క్యాన్సర్పై చైతన్యం, బీపీ, సుగర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. -
సీనియర్ హీరోయిన్కు డాక్టరేట్
సీనియర్ నటి, నాట్యకళాకారిణి శోభన, సంగీతదర్శకుడు హరీశ్జయరాజ్లకు ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. ఈ విద్యాసంస్థ విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమం ఈ నెల 10వ తేదీన వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ కన్వెన్సన్ సెంటర్లో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎంజీఆర్ విద్య, పరిశోధన సంస్థ అధినేత ఏసీ.షణ్ముగం నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో విక్రం సారాబాయ్, స్పేస్ డైరెక్టర్ సోమనాథ్, నటి, భరతనాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హరీశ్జయరాజ్లను గౌరవ డాక్టరేట్లతో ఘనంగా సత్కరించనున్నారు. కార్యకమంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ వేదికపై 3,300 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అందించనున్నారు. -
స్వదేశీ టెక్నాలజీకే ఓటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. భవిష్యత్ భారత్ కోసం.. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం. క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా... క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం. దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం. -
అస్త్రశస్త్రాల సృష్టికర్త...!
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త , తెలుగు తేజం గుండ్రా సతీశ్ రెడ్డి(55) నియమితులయ్యారు. ఆ పదవికి ఎంపిౖకైన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో జన్మించిన ఆయన స్వయం కృషితో రక్షణ, క్షిపణి రంగంలో భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. డీఆర్డీఓ చైర్మన్ బాధ్యతలతో పాటు రక్షణ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శిగానూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సతీశ్ రెడ్డి నియమకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా.. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చేవారం ఆయన డీఆర్డీఓ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు నెలలుగా డీఆర్డీఓ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పదవీకాలం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాకు అప్పగించారు. క్షిపణి పరిశోధనల్లో భాగస్వామి.. సైంటిఫిక్ అడ్వయిజర్గా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. క్షిపణుల రంగంలో దేశం çస్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన పరిశోధనల్లో, దేశీయ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. క్షిపణులు, స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్గా దేశ రక్షణ పరిశోధన కేంద్రాలైన ఏఎస్ఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఐటీఆర్, టీబీఆర్ఎల్ను సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతోపాటు æ సైనికదళాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. సుదూర లక్ష్యాలను చేధించే అగ్ని–5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేశారు. ప్రోగ్రామ్ డైరెక్టర్గా భూమి పై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్గా దేశీయంగా గైడెడ్ బాంబును అభివృద్ధిచేయడంతో పాటు సుదూర లక్ష్యాల చేధనకు ‘స్మార్ట్ గైడెడ్ ఆయుధాల్ని’ రూపొందించారు. లండన్లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్, యూకేలోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాలోని ఫారెన్ మెంబర్ ఆఫ్ ద అకాడమి ఆఫ్ నేవిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సభ్యుడిగా ఉన్నారు. దేశ, విదేశాల్లోని ప్రాధాన్యత గల వివిధ సంస్థల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఫెలోషిప్లు, సభ్యత్వాలు లభించాయి. ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్ రెడ్డి అందుకున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్ ఏరోనాటిక్స్ బహుమతి, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్మెడల్, ఇంజినీరింగ్ ఎక్స్లెన్స్కు ఇచ్చే ఐఈఐ–ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్ అవార్డు, లండన్ రాయల్ ఏరోనాటిక్స్ సొసైటీ వెండిపతకం వంటివి ఉన్నాయి. ప్రఖ్యాత డా.బీరెన్రాయ్ స్పేస్ సైన్స్ డిజైన్ అవార్డు, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాకెట్రీ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవార్డును పొందారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డు అందుకున్నారు. మహిమలూరు నుంచి డీఆర్డీవోకు.. .సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఆత్మకూరు రూరల్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న రెండో సంతానంగా సతీశ్ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. మరుసటి ఏడాదే 1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా చేశారు. తర్వాత కలామ్ మానసపుత్రిక ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’(ఆర్సీఐ)లోకి మారారు. కఠోర శ్రమతో నేవిగేషన్ విభాగంలో విజయాలు అందుకున్నారు. తన అసాధారణ పరిశోధనలతో ఆగిపోకుండా 2008లో ఎంఎస్ చేశారు. 2014లో డాక్టరేట్ పట్టా పొందారు. 1986 నుంచి నేవిగేషన్ విభాగంలో అవుట్స్టాండింగ్ శాస్త్రవేత్తగా, ప్రాజెక్ట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా, అవుట్స్టాండింగ్ డైరెక్టర్గా, శాస్త్రవేత్తగా, డైరెక్టర్ జనరల్గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా అనేక హోదాల్లో పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేశారు. ఎన్నో అస్త్రశస్త్రాలను సృష్టించిన ఆయన పలువురు రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి అవార్డులు పొందారు. 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరిని మర్చిపోకుండా మహిమలూరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. 14 ఏళ్ల క్రితమే గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నారు. భార్య పద్మావతి, అన్న గుండ్రా శ్రీనివాసుల రెడ్డి, సేవాదృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నారు. కుమార్తె సిగ్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా పనిచేస్తుండగా.. కొడుకు అనూష్ బీటెక్ చదువుతున్నారు. రక్షణ మంత్రి సలహదారుగా బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా మహిమలూరులో అభివృద్ది పనుల్ని పరిశీలించటంతో పాటు యువతకు కెరీర్లో సలహలు సూచనలిస్తుంటారు. డీఆర్డీఓ చైర్మన్గా సతీశ్ ఎంపికతో నెల్లూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ నుంచి ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డు అందుకుంటున్న సతీశ్ రెడ్డి. చిత్రంలో ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి (ఫైల్) జేఎన్టీయూ–కాకినాడ నుంచి గౌరవడాక్టరేట్ను అందుకుంటున్న సతీశ్ రెడ్డి(ఫైల్) -
ప్రతానికి డాక్టరేట్
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ (యుటిఆర్) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్లను గౌరవ డాక్టరేట్కి ఎంపిక చేసింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్ సర్వీస్కి గాను ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు. -
దక్షిణాఫ్రికాలో మెరిసిన తెలుగు తేజం
తిరుపతి: తిరుపతి రూరల్లోని సి.గొల్లపల్లికి చెందిన చొక్కారెడ్డి రాజశేఖర్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూ నివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఈయన డర్బన్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పరిశోధన చేశారు. ఈయన ప్రొఫెసర్ జీజీ రెడ్డి పర్యవేక్షణలో ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సెన్సార్ ఫర్ ద ఎలక్ట్రోకెమికల్ రిడక్షన్ ఆఫ్ యాంటీ ట్యూబర్క్యూలోసిస్ డ్రగ్’ అనే అంశంపై మూడు సంత్సరాల పాటు పరిశోధన చేశారు. -
డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు, విద్యావేత్త మోహన్ బాబు చెన్నైలోని ఏంజీఆర్ యూనివర్సిటీ నుంచి బుధవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మంచు లక్ష్మీ ట్విట్టర్లో తెలియజేశారు. ‘మేము ఈ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వం. చెన్నైలో నాన్న ఏంజీఆర్ యూనివర్సటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.’ అని తమ్ముడు మంచు మనోజ్తో దిగిన ఫొటోతో పాటు మోహన్ బాబు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో ఉన్న మరో ఫోటోను లక్ష్మీ ట్వీట్ చేశారు. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ప్రస్తుతం ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. We definitely could not miss this for the world! Surprised Nana in Chennai as he received his honorary doctorate from MGR University ❤ pic.twitter.com/pMYDkX8WZm — Lakshmi Manchu (@LakshmiManchu) 4 October 2017 -
మోహన్ బాబుకు మరో గౌరవం
ప్రముఖ నటుడు విద్యావేత్త అయిన మోహన్ బాబు కు ఏం.జి.ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. అక్టోబర్ 4 న డాక్టరేట్ ప్రధానోత్సవం చెన్నై లో జరగనుంది. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. అదే కార్యక్రమంలో ఆయనకు 'ప్రనామ్' అనే అవార్డు తో సత్కరించి, ఆయన చిత్రాల లోని ఉత్తమ డైలాగులను ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. మోహన్ బాబు 500 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన సొంత బ్యానర్ అయిన 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. మోహన్ బాబు రాజ్య సభ ఎం.పి. గా కూడా పని చేసారు. ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో కె.జి. నుండి పి.జి. దాక 20,000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. -
ఎస్ఆర్ఐటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బుక్కరాయసముద్రం: రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకురాలు దీప్తికి జేఎన్టీయూ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ‘మెషిన్ లర్నింగ్ అప్రోచ్ ఫర్ సూటబుల్ కెర్నల్ పంక్షన్ అండ్ అప్లికేషన్ ఆన్ ఇమేజస్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దీప్తిని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి, సీఏఓ రంజిత్రెడ్డి, రీసెర్చ్ విభాగం అధిపతి అమర్నాథ్ అభినందించారు. -
ఆర్థిక సంక్షోభంలో చికాగో స్టేట్ యూనివర్సిటీ