Doda
-
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్సభలోకి రాహుల్ -
కాశ్మీర్ లో భూకంపం.. రెక్టార్ స్కేలుపై తీవ్రత 5
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దోడా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5గా నమోదైంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు. పాకిస్థాన్లోని నైరుతి ప్రాంతంలోనూ శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. -
మహిళలపై గౌరవం ఇదేనా?
అఫిడవిట్లో భార్య పేరు ప్రస్తావించరు మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు దోడా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తాను వివాహితుడినంటూ మొదటిసారిగా తన భార్య పేరును వెల్లడించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ‘‘బీజేపీ మహిళల భద్రత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఇప్పటికి ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ, తాను వివాహితుడినని మొదటిసారిగా వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మహిళల గౌరవం గురించి మాట్లాడతారు. కానీ, ఆయన భార్య పేరు అఫిడవిట్లో ఉండదు’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జమ్మూకాశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. గుజరాత్లో ఒక మహిళపై పోలీసు నిఘా అంశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ అసలు రూపం ఇదేనని, మహిళల సాధికారతపై ఆ పార్టీ చెప్పేదేంటని ప్రశ్నించారు. అద్వానీ స్థానంలో అదానీ వచ్చారు.. గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ఆ రాష్ట్ర సీఎం మోడీకి ఉన్న సంబంధాలపై రాహుల్ ప్రశ్నలు సంధించారు. అదానీకి అన్నీ ఇచ్చారని, అదే సమయంలో బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, జశ్వంత్సింగ్ను పక్కకు నెట్టేశారని రాహుల్ విమర్శించారు. గుజరాత్లో అదానీ ప్రభుత్వం నడుస్తోందంటూ దెప్పిపొడిచారు. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: తన వైవాహిక స్థితి విషయమై తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు మోడీపై ఎన్నికల కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ డిమాండ్ చేశారు. మోడీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి వినతిపత్రం అందజేసింది. మోడీపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ ఖండించింది. తన వివాహ విషయంలో మోడీ అబద్ధాలాడలేదని, అలాంటప్పుడు దీనిని ఒక అంశంగా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది.