foodgrains
-
డబ్ల్యూటీవో అంతర్థానానికి నాంది?
అబూ ధాబీలో ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13) పెద్దగా సాఫల్యతలు లేకుండానే ముగిసింది. భారత్ లాంటి దేశాలకు ముఖ్యమైన మత్య్స రాయితీల అంశంలో, ప్రభుత్వాలు నిల్వచేసే ఆహార ధాన్యాల అంశంలో ఏ విధమైన పరిష్కారాలనూ కనుగొనలేదు. పైగా వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన అప్పిలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా ససేమిరా అంది. అదే జరిగితే మళ్లీ ‘గాట్’ రోజులకు తిరిగి మరలాల్సి ఉంటుంది. ఇక, డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ దేశం ఏకంగా డబ్ల్యూటీవో నుంచే నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. 166 సభ్య దేశాలున్న ఈ సంస్థ ఉనికి ఇప్పటికే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన ఒప్పందాల విషయంలో త్వరపడాలి. అబూ ధాబీలో (ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2 వరకు) జరిగిన మరో డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) మంత్రివర్గ సమావేశం ఎలాంటి ఆసక్తిని రేకెత్తించకుండానే ముగిసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన విధులు,అంటే చర్చల పనివిధానం, వివాద పరిష్కార పనితీరు గత కొంత కాలంగా స్తంభించిపోయాయి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఈసంస్థకు చెందిన 166 సభ్యదేశాల్లో బలమైన విభజనలు పెంచేలా, ఈ రెండింటినీ పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదు.అబూ ధాబీలో జరిగిన 13వ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13)లో డబ్ల్యూటీఓ సభ్యులకు నాలుగు ప్రధాన సవాళ్లు ఎదుర య్యాయి. ఒకటి, మత్స్య రాయితీలపై అంతుచిక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ఎలా ముగించాలి? రెండు, అప్పీలేట్ బాడీని ఎలా పున రుద్ధరించాలి? తద్వారా వివాద పరిష్కార యంత్రాంగంగా డబ్ల్యూ టీఓ కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి ఎలా పున రుద్ధరించాలి? మూడు, భారతదేశంతోపాటు అనేక ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్ స్టాక్హోల్డింగ్ (ఆహార భద్రత కోసం ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వచేయడం) సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఎలా పొందాలి? చివరగా, పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ లపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపును ఎలా నిర్ధారించాలి? ఇందులో ఉన్న ఆదాయ నష్టం కారణంగా కొన్ని ప్రభుత్వాలు (భారత్ వంటివి) దీన్ని ఇష్టపడలేదు. కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నా, ఇవి ఎంసీ 13 కోసం ప్రధాన అజెండా అయ్యాయి. మత్స్యకారులకు సబ్సిడీలపై బహుపాక్షిక ఒప్పందం గత మంత్రి వర్గ సమావేశంలో పాక్షికంగా ముగిసింది. ఇది అమల్లోకి వచ్చేలా ఈ ఎంసీ 13లో పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ సందర్భంలో,సంధానకర్తలు ఏదీ సాధించలేకపోయారు. భారత్ సమానత్వంకోసం, న్యాయం కోసం పోరాడింది. దీనివల్లే యూరోపియన్ యూని యన్ సంధానకర్త ఒకే ఒక్క దేశం (భారత్) దీనికి తన సమ్మతిని నిలిపి వేసినట్లు చెప్పారు. ఇది నిజమే అయినప్పటికీ, భారత్ తన మత్స్య కారుల జీవనోపాధి కోసం మంజూరు చేస్తున్న సబ్సిడీలను యూరో పియన్ యూనియన్, జపాన్, చైనా, తైవాన్ లు ఇస్తున్న భారీ సబ్సి డీలతో సమానం చేయడం అసంబద్ధం. భారత్ 25 ఏళ్ల సమ యాన్ని కోరింది. ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మన లాంటి సమాఖ్య నిర్మాణంలో, మనం నెమ్మదిగా మాత్రమే త్వర పడగలము! ఎన్నికల సంవత్సరం కూడా అయినందువల్ల మత్స్య కారుల ప్రయో జనాలను గట్టిగా కాపాడటం తప్ప, ఇంకేదీ ప్రభుత్వం చేయలేక పోయింది. మన రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది. పబ్లిక్ స్టాక్హోల్డింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని భారత్ లాంటి దేశాలకు ప్రకటించిన నిబద్ధతను ప్రపంచ వాణిజ్య సంస్థ నిలుపు కోలేదు. సమస్యంతా మార్కెట్ ప్రాప్యతతో దీన్ని లింక్ చేయాలని పట్టుబట్టిన అభివృద్ధి చెందిన దేశాలతోనూ, కెయిర్న్స్ గ్రూప్ తోనూ (19 వ్యవసాయ సంబంధ ఎగుమతి దేశాల గ్రూప్) ఉంది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంతో ముడిపడిన ఒక తీవ్రమైన అంశం. దీనిని మార్కెట్ యాక్సెస్కు తాకట్టు పెట్టడం అన్యాయం, అధర్మం కూడా. అంతిమ పరిణామం ఏమిటంటే, ఎంసీ 13 ఈ సమస్యపై పురోగతి సాధించడంలో విఫలమైంది. అప్పిలేట్ బాడీ పునరుద్ధరణ గురించిన కథ సైతం భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక్క సభ్యదేశం, అంటే అమెరికా మాత్రమే దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక, దానిమీదే భీష్మించుకుని కూర్చుంది. అమెరికన్ ఎన్నికల వల్ల దీనికి అదనపు అనిశ్చితి కూడా తోడైంది. డోనాల్డ్ ట్రంప్ గనక విజయం సాధిస్తే, అన్నీ ముగిసిపోతాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అప్పీలేట్ బాడీ పునరుద్ధరణను అడ్డుకోవడమే కాకుండా ఏకంగా డబ్ల్యూటీఓ నుండే మొత్తంగా వైదొలిగినా ఆశ్చర్యం లేదు. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఈ ఎంసీ 13 సమావేశం, ఎలక్ట్రానిక్ ప్రసారాలకు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ నిలుపుదలను కేవలం రెండేళ్లపాటు పొడిగించగలిగింది. అలా జరగకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్... యూఏఈ వాణిజ్య మంత్రి నుంచి వచ్చిన వ్యక్తిగత అభ్యర్థన మేరకు చివరి నిమిషంలో అంగీకరించినట్లు భారత వాణిజ్య మంత్రి ద్వారా స్పష్టం చేసింది.ఎంసీ 13 ఎదుర్కొన్న ఇతర ప్రధాన సమస్య ఏమిటంటే, బహుపాక్షిక చర్చల కార్యక్రమాలతో ఎలా వ్యవహరించాలి అనేదే. ఒక విషయం చాలా ముఖ్యమైనది: అదేమిటంటే, 100 దేశాల మద్దతుతో జరిగిన చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభ తర అభివృద్ధి ఒప్పందం. కానీ ప్రతి డబ్ల్యూటీవో సభ్యదేశ ఏకాభిప్రాయాన్ని పొందనందున, దీన్ని సూత్రప్రాయంగా భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకించాయి. చైనా ఈ పరిణామాన్నిఊహించి ఉండాల్సింది. దీంతో బహుపాక్షిక వేదికలలో చైనా–భారత సన్నిహిత సహకార యుగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించవచ్చు. ‘బ్రిక్స్’ సమూహానికి ఇది ఎలాంటి చిక్కులను కలిగిస్తుందో చూడాలి.కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎంసీ 13లో వచ్చిన ఫలితాలు స్వల్పం. కొన్ని తాత్కాలిక నిర్ధారణలుగా వీటిని తీసుకోవచ్చు: ఒకటి, ప్రపంచ వాణిజ్య సంస్థకు నిజమైన బహుపాక్షిక(మల్టీలేటెరల్) సంస్థగా ఉజ్వల భవిష్యత్తు లేదు. కాబట్టి, అది బహుముఖంగా(ప్లూరీలేటెరల్) మారుతుందా? అలా అయితే, భారత్ దాన్ని ఎలా చూస్తుంది? రెండు, యథాతథ స్థితిని సూచించే అప్పీలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా అంగీకరించే అవకాశం కని పించడం లేదు. బదులుగా మనం కేవలం ఒకే–దశ ప్యానెల్ విధానంతో సాగిన ‘గాట్’ (పన్నులు, సుంకాలపై సాధారణ ఒప్పందం) తరహా పాత చెడ్డ రోజులకు తిరిగి మరలవచ్చు. అదే జరిగితే, భారత్ దానిని ఎలా ఎదుర్కొంటుంది? చివరగా, ప్రపంచ వాణిజ్య సంస్థను పునరుజ్జీవింపజేసే స్వల్ప అవకాశాలను దృష్టిలో ఉంచుకుని,ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తో తన కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విష యంలో భారత్ త్వరపడాలి. ఈ విషయంలో సమయాన్ని వృథా చేసే ప్రసక్తే లేదు, మే నెలలో వచ్చే కొత్త ప్రభుత్వం దీన్నొక ప్రాధాన్యతగా దృష్టి సారించాల్సి ఉంది.భారత వ్యూహాత్మక/విదేశీ విధాన చర్చలకూ, దాని వాణిజ్య విధాన చర్చలకూ మధ్య కొంత వ్యత్యాసం కూడా ఉంది. మనం అనతి కాలంలోనే ఏడు లేదా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం అనే ఊహపై మన వ్యూహాత్మక చర్చలు ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత వాణిజ్య విధాన ప్రక్రియ కేవలం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకే సరిపోతుంది! ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. మే నెలలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం వ్యవసాయం, భూమి, కార్మికులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో లోతైన, నిర్మాణాత్మకమైన సంస్కరణలను చేపట్టడం దీనికి ఒక మార్గం. ఇది భారత్ను పెద్ద ఆర్థిక కూటమిలోకి చేరేలా సాయపడుతుంది. - వ్యాసకర్త మాజీ రాయబారి, డబ్ల్యూటీవోలో భారత అనుసంధానకర్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - మోహన్ కుమార్ -
ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి! -
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్లో జరుగుతోంది. భారత్తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
‘చిరు’ ప్రయత్నం చేయాల్సిందే!
కొన్ని సందర్భాలు ఆగి ఆలోచించుకోవడానికి ఉపకరిస్తాయి. గతాన్ని సింహావలోకనం చేసుకొమ్మం టాయి. భవిష్యత్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఐరాస ప్రకటించిన ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సరం’ సరిగ్గా అలాంటి సందర్భమే. మన దేశం చొరవతో ఈ ప్రకటన రావడం సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచమే కాదు... ముందుగా మనమెక్కడ ఉన్నామో పర్యాలోచించుకోవాలి. ఆరోగ్య ‘సిరి’గా పేరు తెచ్చుకున్న విలువైన పోషకాహారానికి మనం నిజంగానే ఆచరణలో విలువ ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత నాలుగైదు దశాబ్దాల్లో మన దేశంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తి 2.3 – 2.4 కోట్ల టన్నుల నుంచి 1.9– 2 కోట్ల టన్నులకు పడిపోయిందట. ఈ లెక్కలు కొత్త సంవత్సర కర్తవ్యానికి ఓ మేలుకొలుపు. జనవరి 1 నుంచి చిరుధాన్య వత్సరంగా ఉత్సవం జరుపుకొనేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, 2018లోనే భారత సర్కార్ ఆ ఏడాదిని జాతీయ చిరుధాన్య వత్సరంగా తీర్మానించింది. చిరుధాన్యాలను ‘పోషక సంపన్న ఆహారధాన్యాలు’గా అధికారికంగా గుర్తించి, ‘పోషణ్ మిషన్ అభియాన్’లో చేర్చింది. ఆపైన 2023ను అంతర్జాతీయ చిరుధాన్య వత్సరమని ప్రకటించాల్సిందిగా ఐరాసకు ప్రతిపాదన పెట్టింది. మరో 72 దేశాలు మద్దతునిచ్చాయి. అలా ఈ పోషక ధాన్యాలను ప్రోత్సహించాలన్న మన చొరవ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకుంది. చివరకు 2021 మార్చి 5న ఐరాస సర్వప్రతినిధి సభ చిరుధాన్య వత్సర ప్రకటన చేసింది. ప్రపంచ పటంపై చిరుధాన్యాలను మళ్ళీ తీసుకురావడానికి ఇది భారత్కు మంచి అవకాశం. ఈ పోషకధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఆ ధాన్యాల ఉత్పత్తులకు సమర్థమైన మార్కెటింగ్ వసతులు కల్పించడానికి నడుం కట్టాల్సిన తరుణం. ఈ ‘సిరి’ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ, భారత జాతీయ వ్యవసాయ సహాయక మార్కెటింగ్ సమాఖ్యలు అక్టోబర్ మొదట్లో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ సైతం ఆ మధ్య తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లోనూ ఈ పోషకధాన్యాల ఉత్పత్తితో రైతులకూ, వినియోగంతో ప్రజలకూ కలిగే లాభాలను ప్రస్తావించారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ, ఆచరణలో ఇంకా వెనకబడే ఉన్నాం. దేశంలో దాదాపు 80 శాతం మెట్టభూములైనా, 20 శాతం మాగాణితో వచ్చే వరి, గోదుమల పైనే ఇప్పటికీ అర్థరహితమైన మోజు! అదనులో రెండు వర్షాలు కురిస్తే చాలు... ఆట్టే నీటి వసతి అవసరం లేకుండానే మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాలు నిజానికి మన శీతోష్ణాలకు తగినవి. వీటి లోనే పోషకాలు ఎక్కువ. అయినా చిరుధాన్యాల్లో పెద్ద గింజలైన జొన్న, సజ్జ, రాగులన్నా, చిన్న గింజలుండే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగెల లాంటివన్నా అటు రైతులకూ, ఇటు వినియోగదారులకూ చిన్నచూపే. పండుగపూట పరమాన్నంలా వరి వండుకొని తినగలిగిన తాతల కాలం నుంచి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులతో పుష్కలంగా వరి పండించగలగడం పురోగతే. ఆ మోజులో మన ఒంటికీ, వాతావరణానికీ సరిపోయే జొన్నలు, సజ్జల్ని వదిలేయడమే చేస్తున్న తప్పు. వరి, గోదుమల పంటకాలం 120 – 150 రోజులైతే, సిరి ధాన్యాలు 70–100 రోజుల్లోనే చేతికొ స్తాయి. నీటి వసతి ఆట్టే అవసరం లేని వర్షాధారిత మెట్టభూములు, కొండ ప్రాంతాల్లో ఈ ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నది అందుకే. విదేశాంగ మంత్రి అన్నట్టు ‘కోవిడ్, యుద్ధ వాతావరణం, పర్యావరణ సమస్యలు’ అంతర్జాతీయ ఆహార భద్రతకు సవాలు విసురుతున్న వేళ చిరుధాన్యాల సాగు, వాడకం పట్ల అవగాహన పెంచడం పరిష్కారం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గండం నుంచి గట్టెక్కించడానికీ ఈ ధాన్యాలే మందు. క్రీ.పూ. 3 వేల నాటి సింధునదీ పరివాహక ప్రజల కాలం నుంచి ఇవే తినేవాళ్ళం. ఇవాళ ప్రపంచంలో అనేక రకాలు ముందు మన దేశంలోవే. ఇప్పుడు మళ్ళీ ఆ పంటలకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. ఈసరికే వాటిని పండిస్తున్న పశ్చిమ రాజస్థాన్, దక్షిణ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్లలో రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఒక నిర్ణీత ధాన్యం సాగుకు కేంద్రంగా మలచడం లాంటివీ చేయవచ్చు. ఆ ప్రాంతీయుల ఆహారంలో ఆ ధాన్యాన్ని అంతర్భాగం చేయగలగాలి. అందుకు ముందుగా ప్రజలకు వీటి వినియోగాన్ని అలవాటు చేయాలి. ఇక, ఫలానా ధాన్యంతో ఫలానా రోగం పోతుందని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయోగపూర్వకంగా ఏళ్ళకొద్దీ చెబుతున్నాయి. పరిశోధన లతో వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లాంటివి ఆ పని తలకెత్తుకోవాలి. దాని సత్ఫలితాలు మరిందరిని సిరిధాన్యాల వైపు మళ్ళిస్తాయి. భూతాపం పెరిగిపోతున్న వేళ ఎండలు మండేకొద్దీ దిగుబడి పడిపోయే వరి కన్నా వేడిని తట్టు కొని దిగుబడినిచ్చే చిరుధాన్యాలకు ఓటేయడం వివేకం. ప్రపంచంలో సగం మంది పోషకాహారలోప పీడితులు గనక వారికీ ఈ ధాన్యాలే శ్రీరామరక్ష. ఈ వ్యావసాయిక జీవవైవిధ్యాన్ని కాపాడేలా కేంద్రం ‘మిల్లెట్ మిషన్’ ప్రకటించింది. కర్ణాటక, ఒరిస్సా లాంటివి అందులో దూసుకుపోతు న్నాయి. రేషన్ షాపుల్లో సిరిధాన్యాలను ఇవ్వడం మొదలు దేశంలోని 15 లక్షల స్కూళ్ళు, 14 లక్షల ప్రీస్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయగలిగితే భేష్. ఇలాంటి ప్రాథమిక ఆలోచనల్ని పటిష్ఠంగా అమలు చేస్తే– ఆహార భద్రతలో, పోషకా హార విలువల్లో బలమైన భారతావని సాధ్యం. చిరుధాన్య నామ సంవత్సరాలు సార్థకమయ్యేది అప్పుడే! -
ఇథనాల్ హబ్గా ఏపీ
సాక్షి, అమరావతి: ఇథనాల్ తయారీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో చెరకు నుంచే కాకుండా బియ్యం నూక, మొక్కజొన్నలు లాంటి ఆహార ధాన్యాల నుంచి ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో 2025–26 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించాలన్న లక్ష్యంతో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంతో ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించగా మరికొన్ని కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల సుమారు రూ.1,917 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. ఎక్కడెక్కడ? రూ.560 కోట్లతో నెల్లూరు జిల్లాలో క్రిబ్కో బయో ఇథనాల్ తయారీ యూనిట్కు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో రూ.600 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్లను స్థాపిస్తున్నట్లు ప్రకటించగా రాజమహేంద్రవరం వద్ద బియ్యం నూక, పాడైన బియ్యం నుంచి ఇథనాల్ తయారీ యూనిట్ను రూ.300 కోట్లతో పెడుతున్నట్లు అస్సాగో ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకోస్టీల్ సంస్థ మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈఐడీ ప్యారీ రూ.94 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. రూ.84 కోట్లతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఇథనాల్ తయారీ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో.. భారీగా పెరుగుతున్న ముడి చమురు దిగుమతి వ్యయాన్ని అరికట్టేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపి విక్రయించడాన్ని కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్లో 10.5% ఇథనాల్ కలిపి విక్రయిస్తుండగా 2030 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. భారీగా పెరుగుతున్న చమురు రేట్లను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో 20% ఇథనాల్ కలపటాన్ని తప్పనిసరి చేయగా 2025–26 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి పచ్చజెండా ఊపింది. 1,016 కోట్ల లీటర్లు అవసరం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుండగా 20% లక్ష్యాన్ని చేరుకునేందుకు 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం కానుందని అంచనా. చక్కెర తయారీ సంస్థలు కూడా ఇథనాల్ ఉత్పత్తి పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇథనాల్ కలపటాన్ని 20%కి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వచ్చే ఏడాది నుంచి 20 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీలో ఏటా 15.5 కోట్ల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. వచ్చే ఏడాది నాటికి 20 శాతం లక్ష్యం చేరుకోవాలంటే కనీసం 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. త్వరలో ఇథనాల్ పాలసీ రాష్ట్రంలో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఇథనాల్ పాలసీ రూపొందిస్తున్నాం. ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత రాకుండా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీని రూపొందిస్తున్నాం. నూకలు, పాడైన బియ్యం నుంచి మాత్రమే ఇథనాల్ తయారీకి అనుమతించాలన్నది ప్రభుత్వ విధానం. – జి.సృజన, పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది మాదిరిగా దేశ వ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ లేదని, పరిశ్రమలు కూడా నడుస్తున్నందున ఈసారి వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)కింద 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రెండు నెలల (మే, జూన్)పాటు అదనంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం అమలు తో బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాల ధరలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొంది. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. పీఎంజీకెఎవై పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సోమవారం నాటికి 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిపోల నుంచి తరలించుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు అన్ని రాష్ట్రా లు మే, జూన్ నెలల పీఎంజీకేఏవై ఆహార ధాన్యాల పంపిణీని జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించాయన్నారు. ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిపై ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. అంతేగాక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ప్రారంభించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో 69 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాలకు నగదు దేశంలో గోధుమల సేకరణతో ఇప్పటివరకు రూ.49,965 కోట్లను నగదు బదిలీ చెల్లింపులో నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశామని సుధాన్షు పాండే తెలిపారు. ఇందులో పంజాబ్లో రూ.21,588 కోట్లు, హరియాణాలో రూ.11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. కోవిడ్ కారణంగా గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ఓఎంఎస్ఎస్(డి) విధానాన్ని సరళీకృతం చేసిందని పాండే పేర్కొన్నారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో 928.77 లక్ష మెట్రిక్ టన్నుల(ఎల్ఎమ్టీ) ఆహార ధాన్యాలు, 363.89 ఎల్ఎమ్టీ గోధుమలు, 564.88 ఎల్ఎమ్టీ బియ్యం గతేడాది సెంట్రల్ పూల్ నుంచి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. చదవండి: డబుల్ మాస్క్పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం -
18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్రాజ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఆహారధాన్యాలను సరఫరా చేయడంతో తెలంగాణ రీజియన్ శాఖ విశేష కృషి చేస్తోందని వెల్లడించింది. దీంతోపాటే తెలంగాణ పీడీఎస్ అవసరాలకు బియ్యం సరఫరా చేస్తోందన్నారు. -
గోధుమ అవతారాలు
ఆయుర్వేదం ఆహారధాన్యాలను ఐదు రకాలుగా విభజించింది. శాలి, పష్టిక (వ్రీహి), శూక, శింబీ, తృణ. రంగు, రూపం, పరిమాణం, ఎంతకాలం లో పంట పండుతుంది వంటి అంశాలను బట్టి వీటికి నామకరణం చేసి, గుణధర్మాలను వివరించారు. యవలు, గోధుమలను శూక ధాన్యాలుగా వర్ణించారు. ఈ గింజలకు ఒక వైపు చిన్న ముక్కు ఆకారంలో సూదిగా ఉంటుంది. గోధుమలు: పరిమాణంలో కొంచెం పెద్దగా ఉన్నవాటిని మహా గోధుమలనీ, చిన్నగా ఉన్నవాటిని మథూలీ గోధుమలనీ, శూకము లేకుండా పొడవుగా ఉన్నవాటిని దీర్ఘ గోధుమలనీ అన్నా రు. వీటినే నందీముఖ గోధుమలని కూడా అంటారు. గుణాలు: (భావప్రకాశ): గోధూమో మధురః శీతో వాతపిత్తహరో – గురుః జీవనోబృంహణో, వర్ణ్యః, వ్రణరోపకః, రుచ్యః స్థిరకృత్’ – రుచికి తియ్యగా ఉంటాయి. కొంచెం జిగురుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతాయి. బరువు ఆహారం, బలకరం, శుక్రకరం, ధాతు పుష్టికరం, జీవనీయం, చర్మకాంతిని పెంపొందిస్తుంది. గాయాలను మాన్చటానికి ఉపయోగపడుతుంది. కొత్తగా పండిన గోధుమలు కఫాన్ని కలిగిస్తాయి, బరువైన ఆహారం. పాతబడిన గోధుమలు తేలికగా జీర్ణమై, శరీరంలోని కొవ్వుని కరిగించి, బరువుని తగ్గిస్తుంది. మెదడుకి మంచిది (మేధ్యము). నీరసాన్ని పోగొడుతుంది. శుక్రకరం కూడా. అడవి గోధుమల్ని ఆయుర్వేదం గవేధుకా అంది. ఇవి తీపితో పాటు కొంచెం కారంగా ఉంటాయి. కొవ్వుని, కఫాన్ని హరించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: గోధుమ పైపొరను బ్రాన్ అంటారు. లోపల జెర్మ్, ఎండోస్పెర్మ్ అనే పదార్థాలుంటాయి. గ్లూటెన్ అనే అంశ వలన గోధుమపిండి జిగురుగా ఉంటుంది. అన్నిటికంటె జెర్మ్లో ప్రొటీన్లు, కొవ్వు, పీచు, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భాగాలతో కూడిన గోధుమల్ని ఆహారంగా సేవించడం శ్రేష్ఠం. బ్రాన్లో పీచు అధికంగా ఉంటుంది. జెర్మ్ నుంచి మొలకలు తయారవుతాయి. గోధుమగింజలో ఎండోస్పెర్మ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ (శర్కర) మాత్రమే ఉంటుంది. ఇతర పోషకాలేవీ ఉండవు. 100 గ్రా. సంపూర్ణ గోధుమలో 346 కేలరీలు ఉంటాయి. బొంబాయి రవ్వ: ఇది మనం చేసుకునే ఉప్మాకు ప్రసిద్ధి. దీనిని సంపూర్ణ గోధుమను కొంచెం సంస్కరించి తయారుచేస్తారు కనుక పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. మైదా: ఇది అతి తెల్లని, అతి మెత్తని పిండి. దీనిని గోధుమలోని ఎండోస్పెర్మ్ని బ్లీచింగ్ చేయటం ద్వారా తయారుచేస్తారు. బ్రాన్, జెర్మ్లను సంపూర్ణంగా తొలగిస్తారు. కనుక మైదాలో ఎక్కువ సాంద్రతలో స్టార్చ్/శర్కర మాత్రమే ఉండటం వలన గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కనుక మధుమేహరోగులకు మంచిది కాదు. పీచు ఉండకపోవటం వలన మల బంధకం కలుగుతుంది. శరీర బరువును పెంచుతుంది. బ్లీచింగ్ చేయటం కోసం కలిపే కెమికల్స్ క్లోరిన్ బెంజాయిక్, కాల్షియం పెరాక్సైడ్, ఎంజోడై కార్బనమైడ్ ప్రధానమైనవి. ఎండోస్పెర్మ్ తో జరిపే రసాయనిక చర్య వలన ఎలోగ్సిన్ అనే మరో కెమికల్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేసి డయాబెటిస్ను కలిగిస్తాయి. పూరీలు, నిమ్కీన్స్, పునుగులు, చల్ల బూరెలు, బొబ్బట్లు, బ్రెడ్, రకరకాల కేకులు, సమోసాలు, పేస్ట్రీలు మొదలైనవి మైదా వంటకాలలో ప్రధానమైనవి. పాలకోవా, బర్ఫీలలో వ్యాపారార్థమై మైదాను కలిపేస్తారు. జాగ్రత్త: పై విషయాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవటం అవసరం. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
ఆహారధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి రెండో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28.13 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 3.88 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, 2018–19లో ఏకంగా 11.56 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 45.9 లక్షల టన్నులు పెరగడం గమనార్హం. ఇక కీలకమైన పత్తి దిగుబడి మాత్రం పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2018–19లో 3 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 39 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.40 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.15 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దిగుబడి ఢమాల్.. తెలంగాణలో పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. గతం కంటే ఈసారి సాగు తగ్గడం, 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉండగా పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. 2017–18 సంవత్సరంలో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఇక 2018–19 ఖరీఫ్లో వరి ఉత్పత్తి 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరి ధాన్యం ఉత్పత్తి ఖరీఫ్లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇరవై ఏళ్లలో ఇంతటి స్థాయి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇక ఈ రబీలో 34.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. -
పశుగ్రాస పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జగన్
-
ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నాం: కేవీ థామస్
ఒకపక్క ఉల్లిపాయలు కిలో 50 రూపాయలు.. బియ్యం 50-60 రూపాయల మధ్యనే. పప్పులు, ఉప్పులు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తోందో తెలుసా.. తీరిగ్గా ఇది ఎందుకు జరుగుతోందో పరిశీలిస్తోంది!! ఈ విషయాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ స్వయంగా వెల్లడించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా బాగున్నా.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, ఆహార ద్రవ్యోల్బణం ఎందుకు వస్తోందో పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 18.18 శాతానికి పెరిగిపోయింది. సాధారణ ద్రవ్యోల్బణం కూడా 6.1 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, నిల్వ గత కొన్నేళ్లుగా బాగానే ఉన్నా, ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని, దాన్ని తాము విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు. ధరలు పెరగడానికి కారణమేంటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 73వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. బియ్యం విషయంలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం ఏకంగా 20.13 శాతం ఉంది. గోధుమల విషయంలో ఇది 7.6 శాతమే.