Group 2 mains
-
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. ఉంటుందా? ఉండదా?
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2(Group 2) అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేసిన పనే కారణం. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ APPSC సెక్రటరీకి లేఖ రాసింది. అయితే స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసినా బోర్డు నుంచి ఇంతదాకా స్పందన లేదు. షెడ్యూల్ ప్రకారం రేపు(ఫిబ్రవరి 23, ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. రోస్టర్ తప్పులను సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న రోస్టర్ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే.. మరోపక్క మెయిన్స్(Group 2 Mains Exam) వాయిదా పడింది అంటూ వస్తున్న కథనాలను ఇంతకుముందు బోర్డు కొట్టిపారేసింది. యధావిథిగా రేపు(23 ఫిబ్రవరి) పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా? ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.చట్టరీత్యా చర్యలు తప్పవుపలు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్కులేట్ అవుతున్న వార్త అవాస్తవం. ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.:::తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. -
AP: గ్రూప్–2 మెయిన్స్లో ఇక రెండు పేపర్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్లో పేపర్–1 జనరల్ స్టడీస్ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్లో పేపర్–1గా ఉన్న జనరల్ స్టడీస్ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్ సిలబస్ అంశాల్లోనూ మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం.. గ్రూప్–2 పరీక్ష, సిలబస్ మార్పులు ఇలా.. స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ –మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు మెయిన్ పరీక్షలు పేపర్–1: (150మార్కులు) 1. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు) 2. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ పరీక్షలు పేపర్–2: (150మార్కులు) 1. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 2. సైన్స్ అండ్ టెక్నాలజీ -
గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్ నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్సైట్లో కూడా పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు 1:2 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 858 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. మొత్తం 446 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. -
‘నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు’
-
‘నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు’
విశాఖపట్నం: నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ తెలిపారు. ఈ రోజు రాత్రి మూడు పేపర్లకు సంబంధించిన కీ విడుదల చేస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీకి పంపిస్తామని చెప్పారు. అనంతరం రివైజ్డ్ కీ విడుదల చేస్తామన్నారు. రివైజ్డ్ కీ విడుదల చేసిన మూడు రోజుల తర్వాత తుది కీ వెల్లడిస్తామని అన్నారు. గీతం యూనివర్సిటీ ఘటనలో సీసీ టీవీ ఫుటేజీ ద్వారా 41 మంది అభ్యర్థులను గుర్తించామని, వారిపై నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ఉదయ్భాస్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 సెంటర్లలో 45,287 మంది గ్రూప్-2 మెయిన్స్కు హాజరయ్యారని వెల్లడించారు. -
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
-
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షను.. తీవ్ర ఆందోళన కారణంగా జూలై 15, 16 తేదీలకు వాయిదా వేశారు. మొత్తం 985 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే.. ప్రిలిమ్స్కు, మెయిన్స్ పరీక్షకు మధ్య కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉండటంతో అది ఏమాత్రం సరిపోదని విద్యార్థులు గట్టిగా పట్టుబట్టారు. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నందువల్ల పరీక్షను వాయిదా వేయడమే మంచిదని అందులో ఆయన సూచించారు. దానికి తోడు ఏపీపీఎస్సీ కూడా తమ వెబ్సైట్లో పరీక్ష నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న అంశంపై ఒక పోల్ నిర్వహించింది. అందులోనూ పరీక్షను వాయిదా వేయాలనే ఎక్కువమంది కోరినట్లు తెలిసింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు క్వాలిఫై అయిన 49 వేల మంది అభ్యర్థులు కూడా పరీక్ష వాయిదా వేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితుల మీద తగిన మెటీరియల్ తమకు అందుబాటులో లేదని, ఇప్పుడిప్పుడే తెలుగు అకాడమీ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి తమకు ప్రిపేర్ అయ్యేందుకు గడువు సరిపోదని చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అయితే దాదాపుగా కార్యదర్శిని దిగ్బంధించారు కూడా. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇంతకుముందు గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష జూలై 17న నిర్వహించాలని షెడ్యూలు నిర్ణయించారు. కానీ ఇప్పుడు గ్రూప్-2 మెయిన్స్ అయిన మర్నాడే అంటే అభ్యర్థులు ఇబ్బంది పడతారని దాన్ని కూడా నెలాఖరుకు.. అంటే జూలై 30వ తేదీకి వాయిదా వేశారు. -
గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడదు
-
గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్2 మెయిన్స్ను వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా విన్నపాలు అందుతున్నాయని, అయితే ఆ విన్నపాల్లో సహేతుక కారణం ఒక్కటీ లేదని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్భాస్కర్ పేర్కొన్నారు. గ్రూప్–2 మెయిన్స్కు తగినంత సమయం ఇవ్వలేదని, ఈ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. వాయిదా వేయడానికి ఏపీపీఎస్సీ సుముఖంగా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వారంతా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనల గురించి, అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అంశాల గురించి ‘సాక్షి’ ఏపీపీఎస్సీ చైర్మన్ను ప్రశ్నించింది. గ్రూప్2 మెయిన్స్ వాయిదా వేయడం వల్ల ఇప్పటికే వెలువరించిన నోటిఫికేషన్ల పరీక్షలకు ఆటంకం కలుగుతుందని, వచ్చే ఏడాదికి కూడా క్యాలెండర్ను విడుదల చేసినందున దానిపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. గత ఏడాదిలో దాదాపు 32 నోటిఫికేషన్లు ఇచ్చామని, వాటికి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తిచేసి వచ్చే ఏడాదికి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు 3 నెలల పాటు వాయిదా కోరుతున్నారని, అలా చేస్తే ఏదో ఒక నోటిఫికేషన్కు ఆటంకంగా మారుతుందన్నారు. ఇదే సమయంలో యూపీఎస్సీ, తెలంగాణతో సçహా ఇతర రాష్ట్రాలు ఏవైనా నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే వాయిదా వల్ల అదికూడా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. గ్రూప్2 నోటిఫికేషన్ ఆరు నెలల క్రితం ఇచ్చామని, అప్పుడే ప్రిలిమ్స్, మెయిన్స్ ఏయే తేదీల్లో ఉంటుందో వివరించామని చైర్మన్ చెప్పారు. ఇదిలా ఉండగా ఈనెల 7వ తేదీన గ్రూప్1 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని చైర్మన్ తెలిపారు.