GST
-
మాకూ ట్యాక్స్ ఆడిట్ అవకాశం కల్పించాలి: కాస్ట్ అకౌంటెంట్స్
న్యూఢిల్లీ: ప్రస్తుతం సీఏలకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఆడిటింగ్ అవకాశాన్ని తమకు కూడా కల్పించాలని కాస్ట్ అకౌంటెంట్లు కోరుతున్నారు. జీఎస్టీ చట్టంలో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గాను, సోషల్ ఆడిటర్లుగాను ఇద్దరికీ సమాన హోదాలనిచ్చినప్పటికీ ట్యాక్స్ ఆడిటింగ్ మాత్రం సీఏలకే పరిమితం చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ను చేర్చకపోవడమనేది గతంలో అకౌంటింగ్ వృత్తి నిపుణులందరికీ సమాన హోదా కల్పిస్తామన్న హామీకి విరుద్ధమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.ఈ అంశంపై విధాన నిర్ణేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మూర్తి వివరించారు. అటు అకౌంటెంట్ల నిర్వచనం పరిధిలో తమను చేర్చకపోవడంపై కంపెనీ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేశారు.పరోక్ష, ప్రత్యక్ష పన్ను చట్టాలపై కంపెనీ సెక్రటరీలకు కూడా పట్టు ఉంటుందని, ట్యాక్సేషన్ వ్యవస్థలో వారు కీలకంగా వ్యవహరిస్తారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ ధనంజయ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, ఆడిట్ అనేది సీఏల పరిధిలోకి మాత్రమే వస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. -
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని గణనీయంగా పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుత పన్నులు ఇలా..ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు విధిస్తున్నారు. దాంతో మొత్తం పన్ను భారం 53 శాతంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 75% పన్ను విధానం కంటే తక్కువగానే ఉంది. ఈ ఉత్పత్తులపై 5 శాతం జోడించే పరిహార సెస్ను నిలిపివేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో మరింత భారీగా పన్నులు విధించాలని చూస్తున్నారు.ప్రతిపాదిత మార్పులుపొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. పరిహార సెస్ నిలిపేసిన తర్వాత ఈ ఉత్పత్తుల నుంచి పన్ను ఆదాయం తగ్గకుండా ఇది తోడ్పడుతుంది. 2026 అనంతరం పరిహార సెస్ పరిస్థితులను సమీక్షించడానికి, ప్రత్యామ్నాయ పన్ను పద్ధతులను అన్వేషించడానికి కౌన్సిల్ ఇప్పటికే మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ బృందం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.ప్రజారోగ్యం, ఆర్థిక ప్రభావంపొగాకు ఉత్పత్తులను ‘హానికారక వస్తువులు’గా పరిగణిస్తున్నారు. వీటిపై అధిక పన్నులు విధిస్తే వినియోగం తగ్గుతుందనేది ప్రభుత్వం భావన. కాగా, పొగాకు, పొగాకు ఉత్పత్తుల ద్వారా 2022-23లో ప్రభుత్వానికి రూ.72,788 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నులు మరింత పెంచితే ఆదాయం కూడా అధికమవుతుంది. ప్రతిపాదిత పన్ను పెంపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’సవాళ్లు ఇవే..ప్రభుత్వం పన్నులను పెంచడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పొగాకు పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికుల స్థితిగతులు, వారి ఉపాధి ప్రభావితం చెందుతుందనే ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త సెస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సంకోచిస్తున్నాయి. జీఎస్టీను పరిగణించి పోగాకు ధరలు పెంచాలంటే సెస్ల విధింపే కీలకం కానుంది. దాంతో ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
అన్నదొకటి... అయ్యిందొకటి!
కాలక్రమంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలు అర్థం కోల్పోతాయని, పైగా వాటికి పూర్తి విరుద్ధమైన అర్థాలు పుట్టుకొస్తాయని ప్రముఖ రచయిత జార్జ్ ఆర్వెల్ అంటారు. 8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్– జీఎస్టీ)గా చెప్ప బడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెడుతోంది.జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణ నీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. దాంతో సహజంగానే పన్ను వసూళ్ల మొత్తం పెరుగుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే! ఒక దశాబ్ద కాలంలో దేశస్థూల ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయమూ హెచ్చింది. కనుక కేవలం జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయని, కేంద్రం చెబుతున్నట్లు జీఎస్టీ వల్ల దేశంలో ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందని చెప్పడం అర్ధసత్యమే. దేశంలో 8 ఏళ్ళుగా అమలవుతున్న జీఎస్టీ వల్ల అనేక సమ స్యలు వస్తున్నాయని పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. సరళతరమైన పన్నుగా జీఎస్టీని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుద రకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతి పెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 50కి పైగా సమావేశాలు జరిపినప్పటికీ పలు అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిక్కుముళ్లుజీఎస్టీ అమలులో అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1400 పైబడిన వస్తువులు; 500 రకాల సేవలను ఈ 4 శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారుగానీ అందులో హేతు బద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా (లైఫ్ ఇన్సూ రెన్స్), ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సహచర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై 18% జీఎస్టీ వేయడం వల్ల... వారందరూ జీవితం, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపుదారులకు, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు తలెత్తి చివరకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. ఈ సెస్సును ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది.జీఎస్టీ పరిధిని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. శ్లాబ్లను మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపైన, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపైన కనిష్ఠంగా 5% జీఎస్టీని మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తుల పైన, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల పైన 18% జీఎస్టీ విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ మండలి సమావేశంలో... పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పాప్ కార్న్పై 3 రకాల జీఎస్టీని విధించడాన్ని ప్రజలు తప్పుబట్టారు. ఎంఎస్ఎంఈలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న ప్రధాన రంగాలలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీరంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఈ రంగం జీఎస్టీ కారణంగా కుదేలైందన్నది ఓ చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతి మంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ... మరో వైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి జీఎస్టీ అప్పీ లేట్ ట్రిబ్యునల్ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? ఇక, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆ యా ఉత్ప త్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది.ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవ కాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. రాష్ట్రాల వినతులకు జీఎస్టీ కౌన్సిల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. జీఎస్టీకి సంబంధించి ఏ యే రాష్ట్రాలు ఎన్నెన్ని అభ్యర్థనలు అంది స్తోంది? అందులో వేటికి ఆమోదం తెలుపుతున్నారు? ఎన్నింటిని బుట్టదాఖలా చేస్తున్నారన్న సమాచారాన్ని వెల్లడించడం లేదు. నిజానికి, తగిన సన్నద్ధత లేకుండా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. జీఎస్టీ అమలు లోకి వచ్చి 8 ఏళ్లు గడిచాయి. జీఎస్టీ మండలి 55 పర్యాయాలు సమావేశమైంది. అయినా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసి పోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొంద రగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుక తోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరి కొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. ఈ రెండూ నిజమే కావొచ్చు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం. రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్లు కొన్ని పదాలు అర్థం కోల్పోవడమే కాక వాటికి పూర్తి భిన్నమైన అర్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ‘సంస్కరణ’ అనే పదం. ప్రపంచీకరణ తర్వాత ఈ పదా నికి అర్థం మారిపోయింది. సంస్కరణ అంటే ఆర్థిక భారంగా ప్రజలు భావిస్తు న్నారు. జీఎస్టీ అంశంలో కూడా సరళతరమైన పన్ను అనే భావన పోయి జీఎస్టీ అంటేనే మోయలేని భారం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.» జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీ యంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది.» పుట్టుకతోనే లోపాలున్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివ ర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం.» చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్నువల్ల... దాదాపు 20 కోట్ల మంది ఆధా రపడ్డ సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది.- వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
ఏపీ జీఎస్టీ ఆదాయం నేల చూపులే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను కూడా నాశనం చేస్తోంది కూటమి సర్కారు. బీహార్ వంటి రాష్ట్రాలు కూడా సంపద సృష్టించడంలో దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో నమోదవుతున్న క్షీణతలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉండగా, ఇదే సమయంలో దేశ జీడీపీ ఆదాయం 10 శాతం పెరిగితే.. బీహార్ మనకంటే అధికంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 జనవరిలో రూ.3,587 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది జనవరిలో రూ.3,604 కోట్లకు చేరింది.జనవరి నెల రాష్ట్ర ప్రజలకు అత్యంత ఇష్టమైన నెల. ఈ నెలలో సంక్రాంతి పండుగను పేదలు, ధనికులు.. ఎవరి స్తోమత మేరకు వారు ఘనంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికందడంతో రైతులు ఏదో ఒక కొత్త వస్తువును కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏటా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో భారీ వృద్ధి రేటు ఉంటుంది.కానీ ఈసారి దీనికి భిన్నంగా జీఎస్టీలో ఎక్కడా సంక్రాంతి వెలుగులు కనిపించ లేదు. ఇదే సమయంలో బీహార్ జీఎస్టీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,565 కోట్ల నుంచి రూ.1,684 కోట్లకు చేరింది. అదే మన పొరుగు రాష్ట్రం తమిళనాడు అయితే ఏకంగా 20 శాతం వృద్ధితో జీఎస్టీ ఆదాయం రూ.9,606 కోట్ల నుంచి రూ.11,496 కోట్లకు చేరింది. తెలంగాణ 10 శాతం, కర్ణాటక 8 శాతం, కేరళ 8 శాతం, ఓడిషా 7 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రమే స్థిరంగా ఉంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 10.04 శాతం పెరిగింది.జనవరిలో ముఖ్య రాష్ట్రాల జీఎస్టీ పెరుగుదలఏప్రిల్–జనవరి అదే తీరుఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు పది నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేల చూపులు చూస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయంలో వృద్ధి రేటును నమోదు చేస్తుంటే ఒక్క ఏపీలో మాత్రమే వృద్ధి నమోదు అంతంత మాత్రంగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.36,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో వెనుకబడిన బీహార్ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 9.9 శాతం పెరిగి రూ.15,965 కోట్లకు చేరింది.దే సమయంలో కర్ణాటక 10.5 శాతం, తమిళనాడు 8, తెలంగాణ 6 శాతం వృద్ధితో దేశ వ్యాప్తంగా 10.1 శాతం వృద్ధి నమోదయ్యింది. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి దేశ సగటు వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు అధికంగా ఉంటూ వచ్చేదని, కానీ తొలిసారిగా ఈ ఏడాది దానికి భిన్నంగా తిరోగమన దిశలో పయనిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఐదేళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించడం, కేవలం రెడ్బుక్ రాజ్యాంగం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించక పోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది.అందువల్లే పండుగల నెలలైనప్పటికీ నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో జీఎస్టీ ఆదాయం క్షీణించిందని అధికారులు పేర్కొంటున్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని, అందరినీ లక్షాధికారులను చేస్తానని ఎన్నికల ముందుచెప్పిన సీఎం చంద్రబాబుకు వాస్తవం బోధ పడుతున్నట్లు తెలుస్తోంది.అందువల్లే ‘సంపద సృష్టించే సలహా ఉంటే నా చెవిలో చెప్పు తమ్ముడూ’ అనే పరిస్థితికి దిగజారిపోయాడని, సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ కొత్త రాగం తీస్తున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయని, చివరికి ఉద్యోగుల జీతాల కోసం మంగళవారం రిజర్వ్ బ్యాంకు అప్పు కోసం ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారంటూ విమర్శిస్తున్నారు. -
ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా
విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్ కట్టాలని అధికారులు తెలిపారు.ఇండిగో స్పందన..జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. -
త్వరలో జీఎస్టీ శ్లాబ్ల సరళీకరణ
వస్తు, సేవల పన్ను (GST) శ్లాబ్లను మరింత సరళీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సరళమైన, క్రమబద్ధమైన పన్నుల వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ శ్లాబుల సంఖ్యను తగ్గించడం, రేట్లను హేతుబద్ధీకరించడాన్ని కౌన్సిల్ పరిశీలిస్తోందని మంత్రి హింట్ ఇచ్చారు.ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు అంచెలు ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా 5 శాతం, లగ్జరీ వస్తువులు వంటివాటిపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు, వ్యాపార సంఘాల నుంచి ఈ శ్లాబ్ల సవరణకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ శ్లాబ్ల సంఖ్యను తగ్గించేలా రానున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తారని అభిప్రాయపడుతున్నారు.సామాన్యులపై భారం పడకుండా..జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం, వాటిని సరళతరం చేసే కార్యక్రమాలు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. జీఎస్టీ రేట్లలో మార్పులు, శ్లాబులను తగ్గించేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులపై రేట్ల సవరణ వల్ల సామాన్యులపై భారం పడకుండా పన్ను వ్యవస్థను నిష్పక్షపాతంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. జీఎస్టీ సమీక్ష పరిధిని విస్తృతం చేశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమంఎన్నికల వేళ నిర్ణయాలపై విమర్శలు2025-26 కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆదాయపు పన్ను ఉపశమనం లభించింది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, నిర్మాణాత్మక ఆర్థిక మందగమనం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా పన్ను మినహాయింపు ఉందన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళతరం చేసి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్లో కెమెరామెన్గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
కిలోమీటర్కు రూ.53.88 కోట్లు!
మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు? సిమెంటు దగ్గర నుంచి స్టీలు, కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బేరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించిన మేస్త్రీకే వాటిని అప్పగిస్తారు. ఎందుకంటే అప్పు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి. తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృథా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి. ఎవరైనా సరే ఇలానే చేస్తారు. కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి.. ‘మీకింత.. మాకింత’ అంటూ కమీషన్లు దండుకునేందుకు రాజధాని రహదారుల పనుల్లో బరితెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతోంది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక కిలోమీటర్ పొడవున ఆరు లేన్ (ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు) జాతీయ రహదారిని సగటున రూ.20–22 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అదీ.. అన్ని రకాల పన్నులు అంటే జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో అదే ఆరు లేన్లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలి పోయిన పనులకు కిలోమీటర్కు గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను.. అదీ మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటర్కు గరిష్టంగా రూ.31.88 కోట్లు, కనిష్టంగా రూ.24.88 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.3,405.57 కోట్ల వ్యయంతో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా ఆ నోటిఫికేషన్లో నిబంధనలు పెట్టారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే సగటున 4 నుంచి 5 శాతం అధిక ధరలకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణం నుంచి కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి, వాటినే కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణాన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి దోచుకుంటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనాల్లో గోల్మాల్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 ప్రధాన రహదారుల పనులను ఏడీసీఎల్ చేపట్టింది. ప్రధాన రహదారుల్లో మిగిలిపోయిన పనులకు ఈ నెల 4, 9న టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించనుంది. ఆరు లేన్లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు(ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులకు అంచనా వ్యయాలను ఖరారు చేయడంలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు వరద నీటిని ఒడిసి పట్టడానికి, తాగునీటి సరఫరాకు, మురుగు నీటిని తరలించడానికి, భూగర్భ విద్యుత్ సరఫరా.. పంపిణీ, ఆర్సీసీ డక్ట్.. 220/33 కేవీ, 415 కేవీ విద్యుత్ తీగల ఏర్పాటుకు హెచ్డీపీఈ పైపు లైన్, ఆఫ్టికల్ పైబర్ కేబుల్కు, హెచ్డీపీ పైపు లైన్, సైకిల్ ట్రాక్, రహదారికి ఇరు వైపులా చెట్లు నాటడం తదితర పనుల్లో ఒక్క విద్యుత్ సరఫరా మినహా తక్కినవన్నీ ఇదే రీతిలో చేపడుతోంది.వాస్తవానికి ఎన్హెచ్ఏఐ.. జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి అన్ని రకాల పన్నులతో కలిపి ఆరు లేన్ జాతీయ రహదారి (సరీ్వసు రోడ్లతో కలిపి) నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.20–22 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ లెక్కన.. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ వ్యయం అంతకన్నా పెరగడానికి వీల్లేదు. ఎందుకంటే జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నులను అదనంగా కాంట్రాక్టు సంస్థకు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ నిబంధన పెట్టింది కాబట్టి. ఆ పన్నుల విలువతో భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థ, సైకిల్ ట్రాక్ తదితరాలను నిరి్మంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ గరిష్టంగా రూ.53.88 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంస్థలకే పనులు! ప్రధాన రహదారుల్లో మిగిలి పోయిన పనులకు సంబంధించి అంచనాల దశలోనే పలు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్య నేతలు బేరసారాలు జరిపారనే చర్చ అప్పట్లో సాగింది. నాలుగు సంస్థలు అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏడీసీఎల్ అధికార వర్గాలకు ముఖ్య నేతలు నిర్దేశించినట్లు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 11 రహదారుల పనుల టెండర్లలో ఒక్కో టెండర్లో నాలుగింటిలో మూడు సంస్థలు షెడ్యూలు దాఖలు చేసేలా.. కనిష్టంగా 4 నుంచి 5 శాతం అధిక ధరకు కోట్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. షెడ్యూలు దాఖలుకు తుది గడువు ముగిశాక, ఆరి్థక బిడ్ను తెరిచి కనిష్టంగా కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకే పనులు అప్పగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. -
దేశంలో అత్యధిక ట్యాక్స్లు వీటి మీదే..
దేశంలో పన్నుల (Tax) అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నప్పుడు అందరూ పన్నుల గురించే మాట్లాడుతుంటారు. పన్నుల్లో ఉపశమనం కల్పించడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో వస్తువులు, సేవలపై వస్తు సేవల పన్ను (GST) పేరుతో పన్నులు వసూలు చేస్తోంది ప్రభుత్వం.జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అనేది దేశంలో వస్తువులు, సేవల సరఫరాపై విధించే పన్ను. గతంలో వివిధ రకాల వస్తువులు, సేవలపై వ్యాట్ రూపంలో పన్నులు వసూలు చేసేవారు. కొన్ని రాష్ట్ర పన్నులు మినహా దాదాపు అన్ని పరోక్ష పన్నులను ఉపసంహరించి సమగ్ర పన్నుగా జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2017 జూలై 1 నుండి ఇది అమలులోకి వచ్చింది.వివిధ వస్తువులు, సేవలపై పన్ను వసూలు కోసం జీఎస్టీలో 5 వేర్వేరు పన్ను స్లాబ్లుగా విభజించారు. అవి 0%, 5%, 12%, 18%, 28%. అయితే పెట్రోలియం ఉత్పత్తులు , మద్య పానీయాలు, విద్యుత్తుపై జీఎస్టీ కింద పన్ను విధించరు. వీటిపై మునుపటి పన్ను విధానం ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు విధిస్తాయి. అయితే మనం ఏయే వస్తువులపై అధికంగా ట్యాక్స్ (Highest Tax) చెల్లిస్తున్నామో ఇప్పుడు చూద్దాం.28% శ్లాబ్లోని వస్తువులుజీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 226 ఉత్పత్తులను 28 శాతం పన్ను శ్లాబ్లో చేర్చారు. అయితే. కాలక్రమేణా ఈ జాబితా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం 35 ఉత్పత్తులు మాత్రమే ఈ స్లాబ్ కిందకు వస్తాయి. వీటిలో ప్రధానంగా విలాసవంతమైనవి లేదా అత్యవసరం కానివి ఉంటాయి. అవి.. సిమెంట్, ఆటోమొబైల్ విడిభాగాలు, టైర్లు, మోటారు వాహనాల పరికరాలు, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా, విమానాలు, యాక్స్ వంటి ప్రత్యేక వస్తువులు, సినిమా టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం, పానీయాలు.గతంలో ఎక్కువ ఉండి తగ్గినవికొన్ని సంవత్సరాల క్రితం 28% పన్ను శ్లాబ్లో చేర్చబడిన 15 వస్తువులను 18% పన్ను శ్లాబ్కు తగ్గించారు. వీటిలో వాషింగ్ మెషీన్, 27 అంగుళాల టీవీ, వాక్యూమ్ క్లీనర్, ఫ్రిజ్, పెయింట్ వంటి వస్తువులు ఉన్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.పెట్రోల్, డీజిల్ప్రస్తుతం పెట్రోలు, డీజిల్లు జీఎస్టీ పరిధిలోకి రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై వ్యాట్, ఇతర పన్నులను తమ సొంతం ప్రకారం విధిస్తున్నాయి. వాటిని జీఎస్టీలో చేర్చి 28% శ్లాబ్లో ఉంచితే తద్వారా పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ పన్ను భారం ముఖ్యంగా సామాన్య ప్రజలను, పరిశ్రమలను ప్రభావితం చేస్తుంది. వచ్చే బడ్జెట్లో ఈ రేట్లను మార్చడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్లో జీఎస్టీ సంగతేమో కానీ ఆదాయపు పన్ను పరిమితికి సంబంధించి మాత్రం పెద్ద ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి. -
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్ !
సాక్షి, అమరావతి: గత ఆరు నెలలుగా సరైన ఆదాయం లేక రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. జీఎస్టీని 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి వసూళ్లలో భారీ వృద్ధి నమోదు చేసిన మన రాష్ట్రం.. గత 6 నెలల నుంచి తిరోగమనం బాటపట్టింది. ఒకవైపు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోవడం... మరోవైపు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయడం... ఇంకోవైపు కమీషన్ల కోసం మైనింగ్, పోర్టు, ఇతర కీలక కార్యకలాపాలను కూటమి నేతలు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పండుగ నెలల్లోనూ విలవిల!సాధారణంగా వరుసగా పండుగలు ఉండే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వ్యాపారులతోపాటు రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ, ఈ ఏడాది ధరల పెరుగుదల, పనులు లేకపోవడం, గత ఐదేళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను ఏడు నెలలుగా నిలిపివేయడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. దీనికి నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 10 శాతం, డిసెంబర్లో 6 శాతం తగ్గడమే నిదర్శనం.దేశవ్యాప్తంగా పెరిగినా... మన రాష్ట్రంలో తగ్గుదలగత ఆరు నెలల్లో ఒక్క అక్టోబర్ నెల మినహా... మిగిలిన అన్ని నెలల జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే తగ్గినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెల విడుదల చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 8 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాదిడిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు... ఈ ఏడాది రూ.3,315 కోట్లకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని పెద్ద రాష్ట్రాలు వృద్ధిరేటును నమోదు చేయగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే క్షీణతను నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు చూస్తే 3.63 శాతం తగ్గి రూ.21,771 కోట్ల నుంచి రూ.20,979 కోట్లకు పడిపోయాయి. నిలిచిపోయిన వాణిజ్య కార్యకలాపాలు.. తగ్గిన సొంత పన్ను ఆదాయం: కాగ్రాష్ట్రంలో ఏడు నెలలుగా వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాయకులు కమీషన్ల కోసం మైనింగ్ వ్యాపారులను బెదిరించడం వల్ల కార్యకలాపాలు నిలిపివేశారు. దీంతో మైనింగ్ ప్రక్రియతోపాటు వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు మూతపడ్డాయి. ఉచిత ఇసుకను కాగితాలకే పరిమితం చేస్తూ కొందరు నేతలు సిండికేట్లుగా మారి ధరలను భారీగా పెంచేశారు. దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఇవన్నీ జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారద్శకంగా అమలు చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయడం (డీబీటీ)తోపాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు తగిన సాయం క్రమం తప్పకుండా అందించడం వల్ల అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచిందని వారు గుర్తుచేస్తున్నారు.కానీ, కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం, రైతులు, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించకపోవడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు. ఇది జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని, ఏపీలో సొంత పన్ను ఆదాయం తగ్గిపోయిందని, ముఖ్యంగా అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్న విషయాన్ని ‘కాగ్’ తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది. -
రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐజ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు. -
రూ.లక్షల్లో పానీపూరి వ్యాపారం.. రంగంలోకి జీఎస్టీ డిపార్ట్మెంట్
వీధి వ్యాపారులు ముఖ్యంగా పానీపూరి విక్రేతలు ఏ స్థాయిలో సంపాదిస్తున్నారో తెలిపే ఉదంతం ఇది. కొంత మంది వ్యాపారులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నా ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు కట్టడం లేదు. ఇలాగే ట్యాక్స్ (Tax) కట్టకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్న పానీపూరి విక్రేతకు (PANIPURI WALA) జీఎస్టీ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది.తమిళనాడులో సంవత్సరానికి రూ.40 లక్షలు సంపాదిస్తున్న పానీపూరీ విక్రేతకు జీఎస్టీ డిపార్ట్మెంట్ పన్ను నోటీసు ఇచ్చింది. ఫోన్పే (Phonepe), రేజర్పే (Razor Pay) రికార్డ్ల ఆధారంగా పానీపూరి వాలాకు నోటీసు పంపింది. ఇది కేవలం ఆన్లైన్ చెల్లింపు మాత్రమే. ఇక నగదు రూపంలో ఎంత సంపాదించి ఉంటాడో ఊహించండి.“రేజర్పే, ఫోన్పేల నుండి అందిన నివేదికల ఆధారంగా మీరు వస్తువులు/సేవల సరఫరా కోసం పరిమితికి మించి యూపీఐ (UPI) చెల్లింపులను స్వీకరించారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు మీరు అందుకున్న మొత్తం చెల్లింపులు రూ.40,11,019” అని నోటీసులో జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం సదరు వ్యాపారి నమోదు చేసుకోలేదని తెలిపారు.జీఎస్టీ చట్టం 2017 సెక్షన్ 22లోని సబ్సెక్షన్ (1) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల మొత్తం టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. పరిమితిని దాటిన తర్వాత కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం నేరం. ఇందుకుగానూ రూ.10,000 లేదా టర్నోవర్లో 10% వరకు జరిమానా విధిస్తారు.Pani puri wala makes 40L per year and gets an income tax notice 🤑🤑 pic.twitter.com/yotdWohZG6— Jagdish Chaturvedi (@DrJagdishChatur) January 2, 2025 -
జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్టైల్ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..రెండు నెలల్లో రూ.20 కోట్లు..గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు. -
(అ)సాధారణ బీమా
కోల్కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు. అందరికీ అందుబాటు.. బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు. -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు 2024 డిసెంబర్లో స్థూలంగా (2023 ఇదే నెలతో పోల్చి) 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి. సమీక్షా నెల్లో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల పైన వచ్చే పన్నుల వసూళ్లు దాదాపు 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరాయి. డిసెంబర్లో రిఫండ్స్(Refunds) భారీగా నమోదుకావడం గమనార్హం.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..రిఫండ్స్ 31 శాతం పెరిగి రూ.22.490 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను సవరించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ. 32,836 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ. 40,499 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.47,783 కోట్లు. సెస్సు(Cess) రూ.11,471 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ వసూళ్ల ఇప్పటి వరకూ ఒక రికార్డు. -
థియేటర్లలో పాప్కార్న్పై జీఎస్టీ 5 శాతమే
న్యూఢిల్లీ: థియేటర్లలో లూజుగా విక్రయించే పాప్కార్న్పై జీఎస్టీ అనేది రెస్టారెంట్ల తరహాలో 5 శాతంగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, సినిమా టికెట్తో పాటు కలిపి విక్రయిస్తే మాత్రం నిబంధనల ప్రకారం ఆ కాంబో ప్యాకేజీకి వర్తించే రేటు అమలవుతుందని పేర్కొన్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు వివరణనిచ్చాయి.మరోవైపు, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయానికి సంబంధించిన జీఎస్టీపైనా స్పష్టతనిచ్చాయి. విక్రయ విలువ కన్నా తరుగుదల విలువ ఎక్కువ ఉంటే మార్జిన్లపై 18 శాతం జీఎస్టీ వర్తించదని, అదే తక్కువగా ఉంటే వర్తిస్తుందని పేర్కొన్నాయి. మధ్యవర్తిత్వ సంస్థలు విక్రయించే పాత వాహనాల విషయంలో మార్జిన్లపై సింగిల్ జీఎస్టీ రేటు 18 శాతం వర్తింపచేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాప్కార్న్పై జీఎస్టీ.. నెట్టింట చర్చ
పాప్కార్న్లోని చక్కెర, మసాలా స్థాయుల ఆధారంగా విభిన్న పన్ను స్లాబ్లను అమలు చేయడంపట్ల నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్లోని జసల్మేర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో జీఎస్టీను హేతుబద్దీకరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పాప్కార్న్(Popcorn)లోని చక్కెర, మసాలా స్థాయులను అనుసరించి విభిన్న రేట్లను నిర్దేశించారు.సాల్ట్, మసాలాలతో కూడిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్పై 5 శాతం జీఎస్టీ, ప్రీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ పాప్కార్న్పై 12 శాతం, కారామెల్ పాప్కార్న్, చక్కెర కంటెంట్ ఉన్న పాప్కార్న్పై 18 శాతం జీఎస్టీను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లు వెంటనే అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆదివారం పాప్కార్న్ కొనుగోలు చేసివారు వాటిపై జీఎస్టీ(GST) విధించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.Complexity is a bureaucrat’s delight and citizens’ nightmare. https://t.co/rQCj9w6UPw— Prof. Krishnamurthy V Subramanian (@SubramanianKri) December 22, 2024ఇదీ చదవండి: ‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణఅదనపు చక్కెర, మసాలాలతో కూడిన ఉత్పత్తులపై వేర్వేరుగా పన్ను విధిస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా ఈ నిర్ణయం వల్ల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నెట్టింట ఈ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ పేరుతో సాధారణ పౌరులపై పన్నుల రూపంలో భారీగా ఆర్థిక భారం మోపుతున్నట్లు విమర్శకులు వాదిస్తున్నారు. -
ఏటీఎఫ్పై జీఎస్టీకి నో!
జైసల్మేర్: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్ చేసే పేమెంట్ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్టెక్ సర్వీసెస్, పేమెంట్ గేట్వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. ఆరోగ్య బీమాపై.. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్ కోసం సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది. పాత ఈవీలపై పన్ను.. పాత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్/డీజిల్ కారును విక్రయిస్తే మార్జిన్ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్కార్న్పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. 50 శాతం పైగా ఫ్లైయాష్ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏసీసీ) బ్లాక్స్పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్టెక్ సేవలకు వర్తించదు.రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదాబీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదాజీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లోని జైసల్మేర్లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.ఇదీ చదవండి: ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టుఎవరు హాజరయ్యారంటే..కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. -
బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
జైసల్మేర్: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను భారం తొలగించాలన్న కీలక డిమాండ్పై జీఎస్టీ కౌన్సిల్ ఈ రోజు భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఖరీదైన చేతి గడియారాలు, పాదరక్షలు, వస్త్రాలపై పన్ను పెంపు, కొన్ని రకాల ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక సిన్ (హానికారక) ట్యాక్స్పైనా చర్చించనున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ రాజస్థాన్లోని జైసల్మేర్లో జరగనుంది. కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొననున్నారు.148 ఉత్పత్తుల పన్ను రేట్ల క్రమబద్దీకరణపై జీవోఎం నివేదిక కూడా కౌన్సిల్ అజెండాలో ముఖ్యాంశంగా ఉంటుందని తెలుస్తోంది. విమానయాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు జొమాటో, స్విగ్గీపై 18 శాతం పన్ను (ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో) ఉండగా, ఇన్పుట్ ట్యాక్స్ ప్రయోజనం లేకుండా 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. వినియోగించిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలంటూ ఫిట్మెంట్ కమిటీ కౌన్సిల్కు నివేదించనున్నట్టు తెలిసింది. ప్రధాన అంశాలు ఇవే..టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించేందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం నవంబర్లోనే అంగీకారం తెలిపింది.రూ.5 లక్షల సమ్ అష్యూరెన్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పూర్తి పన్ను మినహాయింపునకు సైతం అంగీకరించింది. ఇందుకు సంబంధించి జీవోఎం ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది.రూ.5 లక్షలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను రేటులో ఎలాంటి ఉపశమనం ఉండదని తెలుస్తోంది.ఎయిరేటెడ్ బెవరేజెస్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని జీవోఎం ఇప్పటికే తన సిఫారసులను సమర్పించడం గమనార్హం.గేమింగ్ డిపాజిట్లపై కాకుండా ప్లాట్ఫామ్ ఫీజులపైనే 28 శాతం జీఎస్టీ విధించాలని స్కిల్ ఆన్లైన్ గేమ్స్ ఇనిస్టిట్యూట్ (ఎస్వోజీఐ) డిమాండ్ చేసింది. తద్వారా ఆఫ్షోర్ గేమింగ్ ప్లాట్ఫామ్లు పన్ను ఆర్బిట్రేజ్ ప్రయోజనం పొందకుండా అడ్డుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి సూచించింది.ఉపాధి కల్పన, జీడీపీలో కీలక పాత్ర పోషించే గేమింగ్ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరింది.ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు, క్యాసినోల్లో గేమర్లు చేసే డిపాజిట్లపై పన్ను రేటు 18 శాతం ఉండగా, 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతానికి పెంచడం గమనార్హం.ఇదీ చదవండి: పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయాలంటే..?అదనపు ఫ్లోర్ స్పేస్పై జీఎస్టీ వద్దు: క్రెడాయ్ అదనపు ఫ్లోర్ స్పేస్ (విస్తీర్ణం) కోసం చెల్లించే ఛార్జీలపై జీఎస్టీ విధించొద్దంటూ ప్రభుత్వాన్ని క్రెడాయ్ కోరింది. డిమాండ్ను దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు రియల్టర్ల మండలి క్రెడాయ్ ఒక లేఖ రాసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)/ అదనపు ఎఫ్ఎస్ఐ కోసం స్థానిక అధికారులకు చెల్లించిన ఛార్జీలపై 18 శాతం జీఎస్టీని విధించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ ఛార్జీ విధింపు నిర్మాణ వ్యయాలను పెంచేస్తుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 10 శాతం వరకు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు వ్యయాల్లో ఎఫ్ఎస్ఐ/అదనపు ఎఫ్ఎస్ఐ అధిక వాటా కలిగి ఉన్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్టీ విధింపు ఇళ్ల సరఫరా, డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. -
జీఎస్టీ మినహాయింపు వీటిపైనే?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.మినహాయింపులు..జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.మార్పులు..జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్ గూడ్స్ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 28% జీఎస్టీ.కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్లోకి తీసుకురాబోతున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..పన్ను తగ్గింపు..ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.నోట్బుక్లపై 12% నుంచి 5%కి తగ్గింపు. -
నేతన్న కంట కన్నీళ్లు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. కరువైన నేతన్న నేస్తం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కలగానే చేనేత పార్కు.. చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు. కనీస వేతన చట్టానికి దిక్కేది? కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్లూమ్, ఏడీ -
కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ!
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు (Zomato) జీఎస్టీ (GST) విభాగం నుంచి గట్టి దెబ్బ తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా రూ.803.4 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ,పెనాల్టీతో జీఎస్టీని చెల్లించని కారణం చూపుతూ పన్ను నోటీసు వచ్చినట్లు జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది."కంపెనీకి 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 కాలానికి సంబంధించి 2024 డిసెంబర్ 12న ఒక ఆర్డర్ అందింది. రూ.4,01,70,14,706 జీఎస్టీతోపాటు వడ్డీ, పెనాల్టీ మరో రూ. 4,01,70,14,706 చెల్లించాలని సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, థానే కమిషనరేట్, మహారాష్ట్ర నుంచి ఆర్డరు జారీ అయింది" జొమాటో పేర్కొంది.అయితే జీఎస్టీ నోటీసులపై అప్పీల్కు వెళ్లనున్నట్లు జొమాటో తెలిపింది. దీనిపై తమ న్యాయ, పన్ను సలహాదారులతో సంప్రదించామని, వారి అభిప్రాయాల మేరకు జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేస్తామని జొమాటో వివరించింది.సాధారణంగా కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు జొమాటో బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. వాటిలో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి కంపెనీ దీని నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక మూడోది ఆహారం ధర, ప్లాట్ఫామ్ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. ఇందులో ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ చెల్లించడం లేదనేది జీఎస్టీ విభాగం అభియోగం. -
రాష్ట్ర వాణిజ్యం.. తిరోగమనం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు తిరోగమన దిశలో సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడంతో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయి. గడచిన మూడు నెలల్లో నాలుగు, ఏడు శాతం చొప్పన జీఎస్టీ వసూళ్లు తగ్గగా, నవంబర్లో ఏకంగా 10 శాతం మేర క్షీణించాయి. నవంబర్లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 10 శాతం క్షీణించి రూ.4,093 కోట్ల నుంచి రూ.3,699 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడు 8 శాతం, కర్ణాటక 15 శాతం, కేరళ 10 శాతం, తెలంగాణ 3 శాతం వృద్ధి నమోదు చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే క్షీణతను నమోదు చేసింది. నవంబర్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9.38 శాతం వృద్ధితో రూ.139,678 కోట్లుగా నమోదైంది.దేశ సగటు కంటే వెనుకబాటు వైఎస్సార్సీపీ హయాంలో దేశ సగటు కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మాత్రం వెనుకబడ్డాయి. ఈ ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధితో రూ.11,04,817 కోట్లు వసూళ్లు అయితే ఏపీలో కేవలం 2.2శాతం వృద్ధితో రూ.30,056 కోట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు అటకెక్కడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతోపాటు అధికారం చేపట్టి 5 నెలలు గడచినా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం జీఎస్టీ వసూళ్లు తగ్గిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. -
రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్లో మెరుగ్గానే నమోదయ్యాయి. సమీక్షా నెలలో 8.5 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోలిస్తే) రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది.రిఫండ్స్ రూ.19,259 కోట్లునవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,82 కోట్లలో రూ.19,259 కోట్ల రిఫండ్స్ జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 8.9 శాతం క్షీణతను నమోదు చేసింది. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరాయి.విభాగాల వారీగా..→ మొత్తం వసూళ్లు రూ.1,82 కోట్లు→ సెంట్రల్ జీఎస్టీ రూ.34,141 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.43,047 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.91,828 కోట్లు → సెస్ రూ.13,253 కోట్లు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంమరోవైపు డిసెంబర్ 21న జైసల్మేర్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కౌన్సిల్ మొదట నవంబర్లో సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా పడింది. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
Rahul Gandhi: బీజేపీ విధానాలతో ప్రజలకు చావులే
జంషెడ్పూర్/ధన్బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్ఎస్ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్పూర్లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.మహారాష్ట్రలోనూ కుల గణన సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
18వేల కంపెనీలు.. రూ.25వేల కోట్ల ఎగవేత
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదైన 18,000 కంపెనీలు 25,000 కోట్ల పన్ను ఎగవేత వ్యవహారం వెలుగు చూసింది. ఇటీవలే జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇది తెలిసింది.కేవలం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కోసమే 73,000 కంపెనీలు ఏర్పాటైనట్టు పన్ను అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘ఎందుకంటే ఈ సంస్థలకు ఎలాంటి అమ్మకాలు లేకపోవడం గమనార్హం. వీటిల్లో 18వేల కంపెనీలు మనుగడలో లేవు. అవి రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి’’అని ఓ పన్ను అధికారి తెలిపారు. గతేడాది నిర్వహించిన తొలి డ్రైవ్లోనూ.. 21,791 కంపెనీలు రూ.24,010 కోట్లు ఎగవేసినట్టు గుర్తించడం గమనార్హం. -
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్బుక్లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
జీఎస్టీలో లోయెస్ట్
సాక్షి, అమరావతి: మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెబ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో కాలం గడిపేస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. బాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా మూడో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఒకపక్క దేశంలోని ప్రధాన రాష్ట్రాల జీఎస్టీఆదాయం భారీగా పెరుగుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తగ్గిపోతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తిరోగమనంలో ఉంది. మిజోరం, మేఘాలయా, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలతో పోటీపడుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.3,658 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో (గత నెల) రూ.3,506 కోట్లకు పడిపోయింది. అంటే 4 శాతం తగ్గిపోయింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక 8 శాతం, కేరళ 7 శాతం, తమిళనాడు 5 శాతం వృద్ధిని సాధించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెలా జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నా మన రాష్ట్రంలో మాత్రం జూలై నెలలో ఏడు శాతం, ఆగస్టులో 5 శాతం, సెప్టెంబర్లో 4 శాతం మేర తగ్గిపోయింది. -
సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
ఆల్కహాల్లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్టీ విధించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: పెట్రోల్పై రూ.15, డీజిల్పై రూ.12 లాభం..!దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్డ్రింక్స్పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు. -
జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ
జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్టీ కౌన్సిల్కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్! -
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్కు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
నిర్మలాసీతారామన్పై స్టాలిన్ మండిపాటు
చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారామన్ను ప్రశ్నించారు.జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్, క్రీమ్, క్రీమ్ బన్లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి.. ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది -
తగ్గిన జీఎస్టీ ఆదాయం
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతినాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధికోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది. బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
భారత ఆర్థిక వ్యవస్థకు ఇదే కీలకం: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకంభారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్లో తయారు చేసే బైక్లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు. -
హైదరాబాద్లో ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు..
సా క్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం ఆరోపణలపై జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్తోపాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐరన్ స్క్రాప్ గోదాంలో అక్రమాలపై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. స్క్రాప్ గోదామును సీజ్ చేశారు. అనంతరం బాధితుడు నుంచి అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. అయితే సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. -
రూ.341 కోట్ల జీఎస్టీ ఎగవేత!.. బజాజ్ ఫైనాన్స్కు నోటీసు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది. -
ఇన్సూరెన్స్పై జీఎస్టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం జీఎస్టీ తొలగించాలనే ఇండియా కూటమి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ ఉండేది. ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇది ఉందని వెల్లడించారు.ఇక్కడ నిరసన తెలుపుతున్నవారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా? వారు తమ తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు దాని గురించి లేఖలు వ్రాసి, రాష్ట్రాలకు 2/3 వంతు ఉన్న GST కౌన్సిల్లో దానిని పెంచాలని కోరారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి డ్రామా అని నిర్మలా సీతారామన్ అన్నారు.జీవిత, వైద్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిని కోరుతూ నితిన్ గడ్కరీ మొదట లేఖ రాసారు. ఈ చర్య బీమా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకూండా.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో కీలకమైన బీమా ఉత్పత్తుల డిమాండ్ను పెంచుతుందని ఆయన అన్నారు.నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి నాకు మెమోరాండం సమర్పించింది. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్ అండ్ మెడికల్పై GST ఉపసంహరణకు సంబంధించినదని గడ్కరీ అన్నారు.Tax has been there on medical insurance even before GST was introduced. There was already a Service Tax on medical insurance, before the GST was introduced. This is not a new tax, it was already there in all the states. Those protesting here, did they discuss regarding the… pic.twitter.com/iPfSp8goRr— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) August 7, 2024 -
సోమేశ్కుమార్కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్కుమార్తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసు లు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నా రు. వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. తొలుత ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీసీ ఎస్ పోలీసులు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. సీసీఎస్ నుంచి వచి్చన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు.మాజీ సీఎస్ సోమేశ్కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్విస్ ట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్బాబు, మాజీ సీఎస్ సోమేశ్కుమార్, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సోమేశ్కుమార్ కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.‘స్పెషల్ ఇన్సియేటివ్స్’వాట్సాప్ గ్రూప్ ద్వారా సోమేశ్కుమార్ సర్విస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. అయి తే, కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేçపట్టారు. ఇన్పు ట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానా కు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయితే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
తొలి నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలు ఢమాల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలకు కొలమానంగా నిలిచే జీఎస్టీ ఆదాయం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తొలినెలల్లోనే పాతాళం బాట పట్టింది. కొన్నేళ్లుగా జీఎస్టీ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధిరేటును సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ జూలై నెలలో నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేసింది. గతేడాది జూలై నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల్లో పెరుగుదల నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గుదల నమోదైంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,346 కోట్లు. గతేడాది ఇదే నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,593 కోట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ ఆదాయం ఏడుశాతం క్షీణించింది. రూ.247 కోట్ల ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం తొమ్మిదిశాతం వృద్ధితో రూ.1.34 లక్షల కోట్ల (దిగుమతి వస్తువులు లేకుండా)కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్జీఎస్టీలోను కోత నమోదైంది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో ప్రీ సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ వసూళ్లు 10 శాతం, పోస్ట్ సెటిల్మెంట్ వసూళ్లు ఐదుశాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి రెండు నెలలుగా ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పెన్షన్లు పెంచడం తప్ప పరిపాలనను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయని, ఈ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై పడిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులో ఉంచకపోవడంతో భవననిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడం జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. భవననిర్మాణ పనులు జరిగితే సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్, కలప.. ఇలా అనేక వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఇసుక కొరత కారణంగా వ్యాపారాలు జరగడంలేదని పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు రావడంతో కొనుగోళ్లు సాగి వ్యాపారాలు కళకళలాడేవి. ఇప్పుడు ఆషాఢమాసం అని ఆఫర్లు పెట్టినా.. కొనుగోళ్లు లేవని రిటైల్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రికార్డు గతేడాది రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ 10 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆ శాఖ ఆదాయం రూ.50 వేలకోట్ల మార్కు దాటింది. 2023–24లో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.50,422.60 కోట్లకు చేరితే అందులో నికర జీఎస్టీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.32,029.62 కోట్లు (ఐజీఎస్టీ చెల్లింపులు పోగా). గత ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖలో రిటర్నులు దగ్గర నుంచి పన్ను చెల్లింపుల వరకు అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధికారుల ప్రమేయం లేకుండా వాహనాల తనిఖీకి ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్రూ్కట్నీలో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్రూ్కట్నీ ఆటోమేటెడ్ టూల్ వంటి ఎన్నో వ్యాపార అనుకూల చర్యలను చేపట్టడంతో ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. -
ఇన్ఫోసిస్కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్మాల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్కుమార్కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్మాల్కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్వేర్ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో పాటు ఐజీఎస్టీ, సెస్లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
‘ఒకే పన్ను’కు పెద్ద రంగాలే దన్ను
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరుతుంది.జీఎస్టీపై సాధికార కమిటీదేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.మెరుగుపడిన పన్ను వసూళ్లు!ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి. జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్టేప్ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.జీఎస్టీ పరిధిలోకి పెట్రోలుజీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరంజీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ -
జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనితో ‘పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచి్చందని‘ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో ఆర్థిక శాఖ ఈ మేరకు పోస్ట్ చేసింది. జీఎస్టీకి పూర్వం అన్ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ మొదలైన వాటిపై 2.5–4 శాతం పన్ను ఉండేదని, కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాటిపై పన్నులు లేవని పేర్కొంది. అలాగే కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్ వేర్, ఫరి్నచర్ మొదలైన వాటిపై రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక, 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు మొదలైన వాటిపై 31.3 శాతం పన్నుల భారం ఉండేదని .. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇవి 18 శాతం శ్లాబ్లోకి వచ్చాయని పేర్కొంది. 2023–24లో రూ. 2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉన్న ట్యాక్స్పేయర్లకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపునివ్వడంతో చిన్న స్థాయి ట్యాక్స్పేయర్లకు నిబంధనల భారం తగ్గిందని వివరించింది. 17 రకాల స్థానిక పన్నులు, సెస్సుల స్థానంలో జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత నుంచి నిబంధనలను పాటించడంతో పాటు ట్యాక్స్పేయర్ల బేస్ కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరినట్లు వివరించారు. -
Budget 2024: వ్యవసాయ పరిశోధనకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: సాగు రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు, వ్యవసాయ రంగ మండళ్లు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాయి. 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్కు ముందు ఆరి్థక మంత్రి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయ పరిశోధనపై పెట్టుబడులు మరింతగా పెంచాలని, ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరికంచాలని ఈ సందర్భంగా ఆయా రంగాల ప్రతినిధులు సూచించారు. ఆరి్థక వ్యవస్థలో వినియోగం పుంజుకోవడానికి వీలుగా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, తక్కువ రేటుకు వర్తకులకు రుణాలు అందించాలని రిటైల్ వర్తకుల సమాఖ్య ఆరి్థక మంత్రిని కోరింది. వర్తకులకు జీఎస్టీ విషయంలో పలు వెసులుబాట్లు కలి్పంచాలని జీటీఆర్ఐ సూచించింది.జీఎస్టీ భారం దించాలి..1.46 కోట్ల రిజి్రస్టేషన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన జీఎస్టీకి సంబంధించి చేపట్టాల్సిన కీలక సంస్కరణలను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఆరి్థక మంత్రి దృష్టికి తీసుకొచి్చంది. జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్కు పెంచాలని కోరింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న సంస్థలకే జీఎస్టీ రిజిస్ట్రేషన్ మినహాయింపు అమల్లో ఉంది. జీఎస్టీలో ప్రస్తుతమున్న శ్లాబులను తగ్గించాలని, రాష్ట్రం వారీగా జీఎస్టీ రిజి్రస్టేషన్ను పరిహరించాలని.. దీనివల్ల జీఎస్టీ మరింత సమర్థవంతంగా, వ్యాపార అనుకూలంగా మారుతుందని పేర్కొంది. రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలు మొత్తం రిజి్రస్టేషన్లలో 80 శాతంగా ఉంటాయని, మొత్తం పన్ను వసూళ్లలో వీటి ద్వారా వస్తున్నది 7 శాతమేనని గుర్తు చేసింది. ‘‘ఏటా రూ.1.5 కోట్లు అంటే నెలవారీ టర్నోవర్ రూ.12–13 లక్షలు. 10 శాతం మార్జిన్ ఆధారంగా వచ్చే లాభం రూ.1.2 లక్షలే. వీరికి మినహాయింపు కల్పిస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 23 లక్షలకు దిగొస్తుంది. జీఎస్టీ వ్యవస్థపై ఇది భారం తగ్గిస్తుంది’’అని వివరించింది. పన్ను వసూళ్లను పెంచడం ద్వారా 7 శాతం పన్ను నష్టాన్ని అధిగమించొచ్చని సూచించింది. ఈ ఒక్క చర్యతో ఎంఎస్ఎంఈలో వృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల మధ్య వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా జీఎస్టీ నిబంధనలను సులభతరం చేయాలని కూడా కోరింది. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై పరిశోధనకు జీటీఆర్ఐ కృషి చేస్తుంటుంది.పన్ను తగ్గిస్తే వినియోగానికి ఊతం..అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య ప్రతినిధులు ఆర్థిక మంత్రికి ఇచి్చన వినతిపత్రంలో పలు కీలక సూచనలు చేశారు. రిటైల్ రంగం వృద్ధి చెందేందుకు వీలుగా డిమాండ్ ను పెంచడం, వినియోగానికి ఊతమివ్వడం కోసం 2024–25 బడ్జెట్లో తక్కువ పన్ను రేట్ల రూపంలో ప్రయోజనాలు లేదా రాయితీలు కలి్పంచాలని కోరింది. ‘‘పన్ను రేట్లు తగ్గిస్తే, నెలవారీ ఖర్చు చేసే ఆదాయంపెరుగుతుంది. అది అంతిమంగా వినియోగానికి ప్రేరణనిస్తుంది. రిటైల్ రంగానికీ మేలు చేస్తుంది’’ అని పేర్కొంది. రిటైలర్లకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేయాలని కోరింది. ఫుడ్ అండ్ బెవరేజెస్ను అత్యవసర సేవగా గుర్తించాలని, భూముల రేట్లు, విద్యుత్పై సబ్సిడీలు, ఇతర ప్రయోజనాల కల్పించాలని కోరింది. వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా జాతీయ రిటైల్ విధానాన్ని వేగంగా రూపొందించి, అమలు చేయాలని కోరింది. ఎంఎస్ఎంఈల ప్రయోజనాలకు రిటైలర్లను అర్హులుగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కలి్పస్తూ, జీడీపీలో 10 శాతం వాటాను రిటైల్ రంగం సమకూరుస్తుండడం గమనార్హం. వ్యవసాయ రంగం పటిష్టత కోసం.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా సాగు రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) చైర్మన్ ఎంజే ఖాన్ ప్రస్తావించారు. దీనివల్ల సాగు రంగం మరింత వృద్ధి పథాన సాగుతుందని, రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు బడ్జెట్లో నిధుల కేటాయింపులు రూ.9,500 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచాలని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో (డీబీటీ) ఇచ్చే అన్ని రకాల వ్యవసాయ సంబంధిత సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలని, 2018 నుంచి ఎలాంటి మార్పుల్లేని యూరియా రిటైల్ ధరలను పెంచాలని, సబ్సిడీల ద్వారా బయో ఫరి్టలైజర్స్, ఫోలియర్ ఫరి్టలైజర్స్ను ప్రోత్సాహించాలన్న సూచనలు ఆరి్థక మంత్రి దృష్టికి వచ్చాయి. ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే వ్యవసాయ పరిశోధన పెట్టుబడులపై వచ్చే ఆరి్థక ప్రయోజనాలు పది రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో బడ్జెట్ కేటాయింపులు ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉండడాన్ని భారత్ కిసాన్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ గుర్తు చేశారు. ఎంఎస్పీ కమిటీని వేరు చేయాలని, నూతన వ్యయసాయ రంగ విధానాన్ని తీసుకురావాలన్న సూచనలు కూడా వచ్చాయి. వ్యవసాయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు వీలుగా అపెడాకు కేటాయింపులను రూ.80 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంచాలని జిల్లా స్థాయిలో ఎగుమతుల కేంద్రాలు తెరవాలని పలువురు సూచించారు. -
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
సంకలనాలు కలిగిన పిండి మిశ్రమాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. అవి తక్కువ పన్ను రేటు చట్టంలో పేర్కొనని ఆహార పదార్థాల తరగతి కిందకు వస్తాయని పేర్కొంది.ఇడ్లీ, ధోక్లా, దహీ వడ వంటి వంటకాలకు పిండి మిశ్రమాలను విక్రయించే గాంధీనగర్కు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఈ తీర్పు వెలువడింది. ఈ పిండి మిశ్రమాలను 5 శాతం పన్ను రేటు ఉన్న కేటగిరీ కింద వర్గీకరించాలని కంపెనీ వాదించింది.చట్టంలో పేర్కొనని నిష్పత్తిలో మసాలా దినుసులు, ఇతర పదార్ధాలతో పిండి మిశ్రమాలు తక్కువ పన్ను రేటును క్లెయిమ్ చేయలేవని అథారిటీ మే 29న ఒక ఉత్తర్వులో తెలిపింది. గుజరాత్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ గతంలో ఇచ్చిన ముందస్తు తీర్పును ఈ నిర్ణయం సమర్థించింది. -
ప్రభుత్వానికి కాసుల వర్షం.. భారీగా జీఎస్టీ వసూళ్లు
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దేశీయ లావాదేవీల్లో బలమైన పెరుగుదల, దిగుమతులు మందగించడంతో మే నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మే వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3.83 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది వార్షిక వృద్ధికి 11.3 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. రిఫండ్ల లెక్కింపు తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 2024 మే వరకు రూ .3.36 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం పెరిగింది.రిఫండ్ల లెక్కింపు తర్వాత మే నెలలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) రూ.32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉన్నాయని, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. -
‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్!
భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.👉 #GST revenue collection for April 2024 highest ever at Rs 2.10 lakh crore👉 #GST collections breach landmark milestone of ₹2 lakh crore 👉 Gross Revenue Records 12.4% y-o-y growth👉 Net Revenue (after refunds) stood at ₹1.92 lakh crore; 17.1% y-o-y growthRead more… pic.twitter.com/Ci7CE7h35o— Ministry of Finance (@FinMinIndia) May 1, 2024 -
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్తో బదులిచి్చంది. పాక్లోని బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
జీఎస్టీ వసూళ్లు ప్రతినెల భారీగా వసూలు అవుతున్నాయి. మార్చి నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దానితో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. గరిష్ఠంగా ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో వసూలైన రూ.1.68 లక్షలకోట్ల కంటే ఈసారి అధికంగానే జీఎస్టీ ఖజానాకు చేరింది.ఈసారి సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం.గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. -
విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు
-
జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..
-
నిత్యావసరాలు మరింత చవక