Handri-Neeva project
-
హంద్రీ–నీవా.. చుక్కాని లేని నావ!
సాక్షి, అమరావతి : దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. సీమకు కల్పతరవు వంటి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసింది. ప్రధాన కాలువ ప్రవా హ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేసింది. తద్వారా సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తా గు నీటికీ తల్లడిల్లాల్సిన దుస్థితిలోకి సీమ ప్రజలను నె ట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజులపాటు 3,850 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీ–నీవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీ–నీవాపై ఆధారపడి చేపట్టిన భైరవా నితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగు నీటి కోసం గాజులదిన్నెకు 3 టీఎంసీల తరలింపు.. తదితర ప్రాజెక్టులకు మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది. అంటే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని రోజులు వరద ప్రవాహం, నిల్వ ఉండదు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–1 తీర్పు అమల్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 2,578 టీఎంసీలను పూర్తిగా వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు మిగులు జలాలను విడుదల చేస్తామని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవాకు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశమే ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవకాశం ఉన్న రోజుల్లో కూడా కేవలం 3,850 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోయడం వల్ల కనిష్ట స్థాయిలో మాత్రమే హంద్రీ–నీవాకు నీటిని తరలించే పరిస్థితి ఉంటుందని తేల్చి చెబుతున్నారు.తెలంగాణ దోపిడీ..ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్నడూ లేని రీతిలో జూన్ నుంచి ఇప్పటి వరకు 1,575.62 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 806.2 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటి తరలింపును ప్రారంభిస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఆగస్టు 2 నుంచి హంద్రీ–నీవాకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. రోజుకు కనిష్టంగా 253 నుంచి గరిష్టంగా 1,695 క్యూసె క్కుల చొప్పున ఎత్తిపోయడం వల్ల ఆగస్టు 2 నుంచి బు« దవారం వరకు అంటే 152 రోజుల్లో కేవలం 19.65 టీ ఎంసీలను మాత్రమే తరలించగలిగింది. శ్రీశైలం ప్రా జెక్టులో ఏడాదికి 33 టీఎంసీలు ఆవిర వుతాయి. అంటే.. ఆవిరయ్యే నీటిలో 59 శాతం మేర కూడా హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలించలేదన్నది స్ప ష్టమవుతోంది. ఎడమ గట్టు కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రా జె క్టు నుంచి దిగువకు నీటిని తరలించేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఇక ఎన్ని రోజులు నీరు నిల్వ ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీన్ని బట్టి సీమ ప్రజలకు కూట మి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నది స్పష్టమవుతోంది.తాగునీటికీ కష్టాలే.. పరిశ్రమలు మూతే » శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. 2009 నాటికే తొలి దశ పనులు పూర్తవడంతో 2012 నుంచి నీటిని తరలిస్తున్నారు.» 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి సామర్థ్యం మేరకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, సీమను సస్యశ్యామలం చేసింది. గతంలో చంద్ర బాబు 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్పుడుగానీ, ఇప్పుడుగానీ హంద్రీ–నీవా సా మ ర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవు. » వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే రోజులు తగ్గడం వల్ల కృష్ణా నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసి పట్టి.. హంద్రీ–నీవా నుంచి తరలించే ఎత్తిపోతలు, ప్రధా న కాలువ (–4.806 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. » కాలువలో నీటి ప్రవాహం లేనప్పుడు కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారు. రోజుకు 6,300 క్యూసెక్కుల చొప్పున 120 రోజులు తరలిస్తేనే హంద్రీ–నీవా, దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమతం చేయడం.. బ్రిజేష్కు మార్ ట్రిబ్యునల్కు స్పష్టం చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే సీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందే అవకాశమే లేదని, గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కియా వంటి పరిశ్రమల అవసరాలకు నీటి లభ్యత ఉండదని, ఇది సీమలో ఉపాధి అవకాశాలను మరింత దెబ్బ తీస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నీటి బొట్టు.. విలువ తెలుసు: సీఎం జగన్
రాష్ట్రంలో నాలుగేళ్లలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆపై ఓట్లు వేసేందుకు ఎన్నికల్లో అడుగులు వేయాలి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్! మారిందల్లా సీఎం మాత్రమే. కానీ అప్పుల రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ. మీ బిడ్డ వచ్చాక అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు హయాంలో ఇది ఎందుకు జరగలేదు? నాడు జన్మభూమి కమిటీల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి దాకా దోచుకోవడం, పంచుకోవడమే! మన పాలనలో ప్రతి అడుగు మంచి కోసమే. విద్య, వైద్యంతోపాటు మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేశాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరు. మీకు మంచి జరిగి ఉంటే సైనికుల్లా మీ బిడ్డకు తోడుగా నిలబడి ప్రోత్సహించండి. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వినాయక చవితి సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువైన వరాలను అందించారు. 2 జిల్లాల్లో 77 చెరువులకు హంద్రీ–నీవా నీటితోపాటు తాగునీటిని కూడా అందించే ప్రాజెక్టును సీఎం మంగళవారం ప్రారంభించారు. పత్తి కొండ నియోజకవర్గం లక్కసాగరం సమీపంలోని ఆలంకొండ పంప్హౌస్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అక్కడ పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం డోన్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్కనే శ్రీశైలం ఉన్నా.. ఇది నీటి విలువ తెలిసిన మనందరి ప్రభుత్వం. రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా శాశ్వత మార్పులు తెచ్చేందుకు నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులను నింపుతు న్నాం. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజు ల్లో 1.24 టీఎంసీల హంద్రీ–నీవా జలాలతో చెరు వులను నింపుతాం. ఆశ్చర్యమేంటంటే పక్కనే శ్రీ శైలం ఉన్నా మెట్ట ప్రాంతాలైన పత్తికొండ, డోన్కు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. డోన్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నికరజలాలు లేని పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులున్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. 2019 ఎన్ని కలకు కేవలం 4–5 నెలల ముందు చంద్రబాబు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టారు. కనీసం పైపులు వేసేందుకు భూసేకరణ కూడా జరగలేదు. హడా వుడిగా టెంకాయలు కొట్టేందుకు మాత్రం 8 ఎకరా లు కొనుగోలు చేశారు. అలాంటి దారుణమైన మోసాలకు పాల్పడ్డారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పనులు చేపట్టే ప్రభుత్వం మాది కాదు. మనందరి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీటి విలువ తెలిసిన రాయలసీమ బిడ్డగా రూ.253 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. ఈ ప్రాంతంలో 8 మండలాలు కరువుతో ఉన్నాయి. మొత్తం 10,130 ఎకరాలకు సాగునీటితోపాటు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీరు అందించే పనులు పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవ ర్గాలకు మంచి జరుగుతుంది. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి ఇప్పటికే పైపులైన్ కనెక్టివిటీ పూర్తయింది. ట్రైల్ రన్ చేస్తున్నాం. కృష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపులైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రైల్ రన్ జరుగుతోంది. ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైపులైన్ పూర్తయింది. జొన్నగిరి, డోన్, తుగ్గలి మండలాల్లోని మరో 7 చెరువులకు ట్రైల్రన్ పూర్తయి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. డోన్ నియో జకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకూ నీరిస్తున్నాం. మొత్తంగా 77 చెరువులకు సంబంధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం. గాజులదిన్నె సామర్థ్యం పెంపుతో సాగుకు భరోసా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న సంజీవయ్యసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీంఎంసీలు. 24,372 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వర్షాధారంతో నిండాల్సిందే. కృష్ణా జలాల కేటాయింపు లేదు. పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలో 55 ఆవాసాలకు, గోనెగండ్ల మండలంలోని 10 ఆవాసాలకు, డోన్ మునిసిపాలిటీకి ఇది తా గునీరు అందిస్తోంది. కర్నూలు కార్పొరేషన్కు కూడా తాగునీటిని అందిస్తోంది. ఇన్ని రకాలుగా ఉప యోగపడే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 టీఎంసీలకు పెంచాం. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి రూ.57 కోట్లతో నీళ్లు ఇస్తున్నాం. ఆ పనులు కూడా పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రాంతానికి ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై గతంలో ఎప్పు డూ ఎవరూ ఆలోచన చేయలేదు. ఇక్కడ వర్షాలు పడితేనే వ్యవసాయం. చెరువులున్నా నింపాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎన్నికల సమయంలోనే కొందరికి టెంకాయలు, జీవోలు గుర్తొస్తాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాదు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇక్కడకు వచ్చి నప్పుడు మీ కష్టాలు చూశా. మీకు నేనున్నానని చెప్పా. మాట ప్రకారం నాలుగేళ్లలో పూర్తి చేసి ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడుతున్నా. ఆ రోజు వైఎస్సార్.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం రాయలసీమలో ఎంత దుర్భిక్ష పరిస్థితులున్నాయో నాకు తెలుసు. ఈ రోజు హంద్రీ–నీవా నుంచి తూ ము పెట్టి 77 గ్రామాలకు జలాలు ఎత్తిపోస్తున్నాం. ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని అడుగుతున్నా. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఖర్చు చేసింది కేవ లం రూ.13 కోట్లు. దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.6 వేల కోట్లతో హంద్రీ–నీవా కాలువ నిర్మించారు. అందువల్లే ఈ రోజు కాలువ లపై తూములు ఏర్పాటు చేసి లిఫ్ట్లు పె ట్టుకుంటున్నాం. రాయలసీమ సాగునీటి కష్టాల ను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రజల గురించి ఎవరైనా ఆలోచించారంటే అప్పుడు వైఎస్సార్ హయాంలో.. ఆ తర్వాత దేవుడి దయ, మీ అందరి దీవెన లతో ఏర్పడ్డ మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పోతిరెడ్డి పాడును 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లేలా అడు గులు పడుతున్నాయి. గత పాలకుల నిర్వాకా లను మనమంతా చూశాం. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలా లంటే శ్రీశైలం నిండాలి. 881 అడుగులకు చేరితే త ప్ప నీళ్లు రాని పరిస్థితి. శ్రీశైలం నిండేదెప్పుడు? నిండినా ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి? తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్నా రు. 790 అడుగులకే పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆ లోచించాం. 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునేలా రా యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రకాశం కరువూ తీరుస్తాం కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కరువు కూడా తీరుస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్లు వస్తాయి. ఇక్కడ రెండు టన్నెళ్లు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే టన్నెల్–1లో 12 కిలోమీటర్లు, టన్నె ల్–2లో 8 కిలోమీటర్లు మేర పనులు జరిగా యి. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కరు వుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ బిడ్డ మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. రెండో టన్నెల్ను అక్టోబర్లో జాతికి అంకితం చేస్తున్నాం. నాడు వెలవెల.. నేడు కళకళ బాబు హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. గండికోటకు 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 10–12 టీంఎసీలు కూడా నిల్వ చేయలేదు. చిత్రావతి సామ ర్థ్యం 10 టీఎంసీలు కాగా 2–3 టీఎంసీలను కూడా నిల్వ చేయని దుస్థితి. బ్రహ్మంసాగర్కు 17 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాడు నీళ్లు అందని పరిస్థితి. మీ బిడ్డ సీఎం అయ్యాక కాలువల సామర్థ్యాన్ని పెంచాం. ప్రతి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కోసం డబ్బులిచ్చాం. దీంతో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయగలుగుతున్నాం. గాలేరు –నగరి సుజల స్రవంతిలో అవుకు రెండో టన్నెల్ పనులను పూర్తి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇవన్నీ మంచి మనసు పెట్టి చేసిన పనులు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.2.35 లక్షల కోట్ల ను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మరి నాడు బాబు ఎందుకు చేయలేకపోయారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) లక్ష్యంగా వ్యవహరించారు. కళ్లెదుటే మార్పులు.. గ్రామ స్థాయిలో మీ స్కూళ్లలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించండి. స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చింది. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతిలో ట్యాబ్లు ఇస్తు న్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, అభివృద్ధి చేసిన పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎప్పడూ చూడని విధంగా కనిపి స్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తు న్నాం. 53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తు న్నాం. వ్యవసాయంలో ఆర్బీకేలు రైతన్నలను చేయి పట్టుకుని నడిపి స్తున్నాయి. ఈ– క్రాపింగ్ నుంచి పంట కొనుగోలు వరకు మంచి జరుగుతోంది. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్న మన ప్రభు త్వానికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నా. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు గుమ్మనూరు, అంబటి, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్, ఎమ్మెల్యేలు ఆర్థర్, శిల్పా రవి, కంగాటి శ్రీదేవి,రాంభూపాల్రెడ్డి, చక్రపాణి రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ఖాన్, చెన్నకేశవరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్, మధుసూదన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సుగుణాల మారాజు – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ‘కరువు సీమకు పండుగ పూట బహుమానం ఇచ్చేందుకు సీఎంజగన్ వచ్చారు. కర్నూలు జిల్లా శతాబ్దాలుగా ఎన్నో కరువులు చూసింది. ఒక్క ఎకరాకూ నీటి పారుదల లేని ప్రాంతం డోన్. రెయిన్గన్ ద్వారా నీళ్లిస్తామని గత పాలకులు బూటకపు మా టలు చెబితే ఈ రోజు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం మాది. చెరువులకు నీళ్లు ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరిగి భూములు సస్యశ్యామలం కానున్నాయి. సుగుణాలన్నీ ఉన్న మారాజు మన జగన్. అ వినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకు వెళితే నిరసన దీక్షలు ఏమిటి? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి దీనికి మద్దతు ప్రకటించడం ఎంత దారుణం? ప్రజలకు చైతన్యం లేదని, పిరికి వాళ్లు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణాలు, కుట్రలను చట్ట సభల సాక్షిగా ప్రజలకు తెలియచేస్తాం’ -
ఖజానా కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం గత ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసింది. పలు పథకాలకు సంబంధించి కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాల్సిన అవసరం లేకున్నా, ఆ పద్ధతిలో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి ఖజానాను కొల్లగొట్టింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశకు సంబంధించిన 14 ప్యాకేజీల్లో మొత్తం రూ.109.7 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైంది. చంద్రబాబు బినామీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కే రూ.37.76 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూర్చినట్లు తేల్చింది. ఇక గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం మొదటి దశలో ఒక్క 26వ ప్యాకేజీలోనే రూ.46.45 కోట్లను కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టినట్లు స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి రాబట్టడంతో పాటు, ఆ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సాగునీటి ప్రాజెక్టుల పనులలో కఠినమైన బండరాళ్లను తొలగించేందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేయాల్సి వస్తే, అదనపు నిధులు చెల్లించాలన్న నిబంధన ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో ఎక్కడా లేదు. కానీ ఆ సాకు చూపి అదనపు బిల్లులు చెల్లించడానికి నవంబర్ 25, 2016న గత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. అదీ అప్పుడు జరుగుతున్న పనులకు కాదు. 2003 నుంచి 2014 దాకా చేసిన పనులతోపాటు, 2014 తర్వాత చేపట్టిన పనులకు కూడా అదనపు బిల్లులు చెల్లించేలా ఉత్తర్వు జారీ చేసింది. కంట్రోల్ బ్లాస్టింగ్ చేసినట్లుగా ఆర్డీవో స్థాయి అధికారి ధ్రువీకరిస్తే చాలని నిబంధన పెట్టింది. ఆ ఉత్తర్వును అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ వారికి అదనపు బిల్లుల రూపంలో భారీ ఎత్తున దోచిపెట్టారు. సీఎం రమేష్కు రూ.37.76 కోట్ల అదనపు లబ్ధి ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ దర్యాప్తు చేసింది. విచారణలో వెలుగుచూసిన అంశాలు.. - కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకున్నా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించినట్లు, డీ వాటరింగ్, పూడిక తీత తీయకున్నా– తీసినట్లుగా చూపించి బిల్లులు చెల్లించారు. నేల స్వభావాన్ని తప్పుగా వర్గీకరించి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చారు. - హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువ (–1.150 కిమీ నుంచి 78.670 కిమీ వరకు) విస్తరణ పనుల్లో సీఎం రమేష్కు చెందిన కాంట్రాక్టు సంస్థ కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేసిన దాఖలాలు లేవు. కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పని చేసినట్లు ఆర్డీవో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. అయినప్పటికీ సీఎం రమేష్కు 2018లో రూ.32.72 కోట్లను కట్టబెట్టారు. - హంద్రీ–నీవా తొలిదశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.4 కిమీ నుంచి 20 కిమీ వరకు తవ్వకం) పనుల్లో డీ వాటరింగ్, పూడిక తీతను సీఎం రమేష్ సంస్థ చేపట్టలేదు. 2005లో చేసిన ఆ పనులకు 2016లో డీవాటరింగ్.. పూడిక తీశారంటూ అదే ఏడాది రూ.94 లక్షలను ఆ సంస్థకు దోచిపెట్టారు. - హంద్రీ–నీవా తొలి దశలో 32వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 115 కిమీ నుంచి 176 కిమీ వరకు తవ్వకం) పనులను 2005–2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేయలేదు. అయినా సరే 2016లో డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేసినట్లు చూపి రూ.4.1 కోట్లను కట్టబెట్టారు. గాలేరు–నగరిలో రూ.46.45 కోట్లు... గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 26వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 25.067 కిమీ నుంచి 56.775 కిమీ వరకూ) పనులను 2005 నుంచి 2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయలేదు. డీ వాటరింగ్ చేయలేదు. అయినా సరే.. కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ చేసినట్లు చూపి 2017లో కాంట్రాక్టర్కు రూ.46.45 కోట్లను దోచిపెట్టారు. -
వైఎస్ జగన్ను కలిసిన సీపీఐ నేతలు
పులివెందుల: కరువు ప్రాంతానికి వరంగా మారిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కోసం రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల వెళుతున్న ఆయనను గురువారం సీపీఐ నేతలు కలిశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్పై ఉద్యమించాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఓబులదేవరచెరువులో పశుగ్రాసం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. మరింత నాణ్యమైన పశుగ్రాసం పంపిణీ చేయాలని ఆయన... అధికారులకు సూచించారు. కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందులలో ఉండనున్నారు. -
హంద్రీ - నీవా ఘనత వైఎస్దే
సీఎం చంద్రబాబు విమర్శను తిప్పికొట్టిన శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: ‘హంద్రీ-నీవా’ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్జా జలాలు వచ్చాయంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైల జానాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై నిజా నిజాలను ప్రజల ముందుంచేం దుకు చంద్రబాబు తమతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేదిక, సమయం తెలుగుదేశం పార్టీ నాయకులే చెబితే అందుకు తాము సిద్ధమన్నారు. శనివారం ఇందిర భవన్లో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పథకాన్ని తాగునీటికే పరిమితం చేసి 1996 మార్చి 11న ఒకసారి, 1999 జూలై 13న మరోసారి శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకుంటే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిర్మించే విధంగా 2004 జూలై 24న (జీఓ ఎంంఎస్ నం: 731) ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేశారని తెలిపారు.