hidden cameras
-
విద్యార్థినుల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణపై విచారణ
-
సీక్రెట్ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన.. సీఎంఆర్ కాలేజీకి పేరెంట్స్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్ల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్ల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్టు విద్యార్థినిలు ఆరోపించారు. రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో పని చేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.అనంతరం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థినిల ఆందోళనలతో వారి పేరెంట్స్ కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో, కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
వనంలో వనితలపై అనుచిత నిఘా
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది! అడవే వారికి జీవనాధారం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది. ‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వాట్సాప్లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇదేం దిక్కుమాలిన పని! ఉత్తరాఖండ్లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు. తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.స్పందించని అధికారులు దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రహస్య కెమేరాలు అమర్చారు: రాధికా శరత్కుమార్
కేరళ రాష్ట్రం రిలీజ్ చేసిన హేమా కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలనూ కుదిపేస్తోందనే చెప్పాలి. ఇంతకు ముందు దగా పడ్డ నటీమణులు ఇప్పుడు తమ ఆవేదనను వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాధికా శరత్కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో క్యారవేన్లో రహస్య కెమేరాలు అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్ఫోన్లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది.నేను క్యారవేన్కు వెళ్లకుండా హోటల్కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్చార్జ్ని ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్వర్క్ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేం అందరం అలా ఎదిగినవాళ్లమే. ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమని అడుగుతారు. అంటే... జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ‘ఉల్లొళుకు’ సినిమాలో ఊర్వశితో కలిసి పార్వతి బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. ‘పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది’ అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలానా ట్రీట్ చేసేది అనిపించింది’’ అన్నారు.అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారని...2018లో ‘మీటూ’లో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను యూ ట్యూబ్లో ఓ వీడియో చూశాను. ఒక వ్యక్తి... అతను జర్నలిస్ట్ కాదు... అతను నటీమణులు అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారు అన్నట్లుగా మాట్లాడాడు. నడిగర్ సంఘమ్ జనరల్ సెక్రటరీ విశాల్కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను’’ అని ఘాటుగా స్పందించారు రాధిక. -
కళాశాలలో కీచకులు
-
రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు!
న్యూడ్ వీడియోలు ఇతరకాలేజీల విద్యార్థుల ఫోన్లలో ప్రత్యక్షమైనట్లు మాకు ఫోన్లు చేసి చెబుతున్నారు..!! డబ్బులు తీసుకొని వీడియోలు షేర్ చేస్తున్నారు.ఆందోళన, కేసులు అంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది.. మీరు, మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. సర్టిఫికెట్లు ఇవ్వరు అని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు తక్షణమే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి – గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఆక్రోశంసాక్షి ప్రతినిధి, విజయవాడ: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపగా.. అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు విఫలయత్నం చేసింది. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. వాష్ రూమ్లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.వందల వీడియోలు...!రహస్య కెమెరాలతో ఇప్పటివరకు 300 మంది విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించినట్లు తెలియడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ హాస్టల్ వద్ద బైఠాయించి న్యాయం కావాలంటూ నినదించారు. తరగతులను బహిష్కరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్ హాస్టల్ వద్దకు చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్, ల్యాప్టాప్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఒంగోలు విద్యార్థిని తండ్రికి టీడీపీ అండదండలు ఉండటంతో యాజమాన్యం వారితో కుమ్మక్కై విచారించకుండా హాస్టల్లో ఉంచి సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఇతర విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమను సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మార్కులు వేయమని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వద్ద ఉద్రిక్తత.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు సైతం విద్యార్థినులతో కలసి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయం చేయాలంటూ రోడ్డు మీద బైఠాయించారు. విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు వారి ఆందోళనకు మద్దతు పలకడంతో కళాశాల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, పోలీసులు చర్చలు జరపగా నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్.గంగా«దరరావు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్రాజా, యార్లగడ్డ వెంకట్రావ్, కాగిత కృష్ణప్రసాద్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులతో పలు దఫాలు చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం, వార్డెన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వగా యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, రెండు రోజులుగా విషయం తెలిసినా కాలయాపన చేసిందని విద్యార్థినులు పేర్కొన్నారు. గురువారం రాత్రి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారంతా మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని తండ్రి పలుకుబడి ఉన్న టీడీపీ నేతగా చెబుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వారం క్రితమే తెలిసినా..వాష్ రూమ్ల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహరించింది. ‘నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలన్నారు. ఫేక్ న్యూస్ అంటూ మళ్లీ రాత్రి ప్రచారం చేశారు. యాజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్థినిని, తండ్రిని పిలిపించండంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించారు. మేమేం తప్పు చేశాం? ’ అని ఆ విద్యార్థిని ప్రశ్నిస్తోంది. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని శుక్రవారం రాత్రి 10.15 గంటలకు కళాశాల యాజమాన్యం రహస్యంగా బయటకు పంపించేసింది. ఆ కాలేజీ టీడీపీ నేత బంధువుదేగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే భార్య గద్దె అనూరాధకు చెందిన బంధువుది కావడంతో పచ్చ గద్దలు రంగంలోకి దిగాయి. వాష్ రూమ్లలో రహస్య కెమెరాలు లేవని అధికారులతో చెప్పించే యత్నం చేశారు. విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో కథ అడ్డం తిరిగింది. గురువారం రాత్రి నుంచి ఈ ఘటనపై విద్యార్థులు అందోళన చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తండ్రి కీలక పాత్ర పోషించారు. అమ్మాయి తండ్రికి సైతం టీడీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సీసీ కెమెరాల విషయాన్ని పక్క దారి పట్టించే యత్నం చేశారు. ఓ దశలో తన కూతురి జోలికి వస్తే కాలేజీ పరువు తీస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని తండ్రితో కుమ్మక్కు అయ్యింది. టీడీపీ నేతలు, అధికారులు కాలేజి వద్దకు వచ్చి కేసు తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. ఆధారాలు నేరుగా నాకు పంపండి: సీఎం చంద్రబాబుగుడ్లవల్లేరు కళాశాల విద్యార్థినుల వద్ద ఆధారాలుంటే నేరుగా తనకే పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రహస్య కెమెరాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామోఅంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఘటనపై తనకు రిపోర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి..గురువారం అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి కనీసం జనరేటర్ ఆన్ చేయకుండా బాత్ రూమ్లలో పోలీసులు తనిఖీ చేశారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. బాత్ రూమ్లో షవర్స్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. షవర్లలో రహస్య కెమెరాలున్నట్లు పేర్కొంటున్నారు.జేఎన్టీయూకే బృందం విచారణబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అనుబంధ కళాశాల కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాల ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు వర్సిటీ వీసీ మురళీకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంపవర్మెంట్ డైరెక్టర్ యు.వి.రత్నకుమారి, ఐటీ ఇన్ఫ్రాస్టక్చర్ డైరెక్టర్ ఎ.ఎస్.ఎన్.చక్రవర్తి, ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్తో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తారని వీసీ మురళీకృష్ణ తెలిపారు.ప్రజా సంఘాల మద్దతు..సాక్షి ప్రతినిధి, విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు ఏబీవీపీ, వివిధ ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. ఏబీవీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ మాగంటి వెంకట గోపి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సీహెచ్ లీలాకుమారి, యువమోర్చా మహిళా జిల్లా సెక్రటరీ వి.అభినందన ఆందోళనలో పాల్గొన్నారు. వేల మంది విద్యార్థినులు ఉంటున్న హాస్టల్లో రహస్య కెమెరాల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తెచ్చి కారకులకు కఠిన శిక్షలు పడేవరకు పోరాడతామన్నారు. విచారణకు నెల పడుతుందన్నారు.. తెల్లవారగానే ఫేక్ అంటున్నారు రహస్య కెమెరాల గురించి కళాశాల యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదు. గురువారం రాత్రి గొడవ చేస్తే కళాశాల వారితోపాటు పోలీసులు వచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే విచారణకు నెల రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. మా వసతి గృహాల్లోని రెండు షవర్లను ఊడపీక్కుని తీసుకుపోయారు. తెల్లవారగానే అదంతా ఫేక్ న్యూస్గా కొట్టేశారు. అసలు వాటిని ఎందుకు తీసుకువెళ్లారు. వాటిల్లో కెమెరాలు ఉండబట్టే కదా వారు తీసుకువెళ్లింది. అలా తీసుకువెళ్లింది కేసును తప్పుదోవ పట్టించడానికేనా?. నిఘా కెమెరాలు ఉన్నాయా.. లేదా.. అని క్లారిటీ ఇవ్వకుండా పోలీసులు సైతం అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరించడం దారుణం. విచారణ సమయంలో సైతం పోలీసులు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బయట అందరిలో ఒక విధంగా మాట్లాడుతున్నారు. లోపల విచారణ సమయంలో బెదిరింపులకు దిగుతున్నారు. మాపై ఎదురు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మేము ఏం పాపం చేశాం. రక్షణ కోరితే ఈ విధంగా బాధపెట్టడం ఏమిటి. వీరి బెదిరింపులు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. –కళాశాల విద్యార్థినులు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి విద్యాసంస్థల్లో జరుగుతున్న వరుస ఘటనలపై దృష్టిపెట్టాలి తల్లిదండ్రుల అసోసియేషన్ డిమాండ్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయని, తమ బిడ్డల రక్షణకు జ్యుడిíÙయల్ కమిషన్ను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల అసోసియేషన్ (ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు నరహరి శిఖరం, కార్యదర్శి జి.ఈశ్వరయ్య శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లైంగిక దాడులు, విషాహారం, ఆరోగ్య సమస్యలు, మానసిక, శారీరక ఒత్తిళ్లు, దాడులు, ఆత్మహత్యల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో తమ బిడ్డలకు రక్షణ కల్పించి తమకు భరోసా ఇవ్వాలన్నారు. ఏ విద్యాసంస్థలోనైనా, హాస్టళ్లలో అయినా లైంగిక దాడులు, అనారోగ్యం, మానసిక, శారీరక ఒతిళ్లు, ఆత్మహత్యలు వంటి ఘటనలు జరిగితే సంబంధిత అధికారులు, యాజమాన్యాలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్ విద్యార్థినులు భయం.. భయంగా గడుపుతున్నారు. అత్యవసరమైనప్పటికీ టాయిలెట్స్కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. క్యాంపస్ నుంచి హాస్టల్కు 200 మీటర్ల దూరం ఉంది. పొలాల్లో ఉన్న తారు రోడ్డుపైనే విద్యార్థులు వెళ్లాల్సి ఉంది. పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తు గడ్డి మొక్కలు పెరిగాయి. పాములు, విషకీటకాలు సంచరిస్తుంటాయని, రాత్రి సమయంలో వెళ్లాలంటే భయపడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. హాస్టల్ కాంపౌండ్ ప్రధాన గేటుకు సైతం లైటు ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు.హోంమంత్రి రాజీనామా చేయాలి విద్యార్థినుల హాస్టల్ వీడియోల వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు మితిమీరాయి. గుడ్లవల్లేరు ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – తోట సంగమేశ్వరరావు, జాతీయ కార్యదర్శి, కమ్యూనిస్టు ఇండియా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఈ ఘటనపై టీడీపీ కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున వందల మంది ఆడపిల్లల గౌరవ మర్యాదలను కాపాడే ప్రయత్నం చేయకుండా, అక్కడ అసలు ఏం జరగలేదని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా, కనీసం మానవత్వంతో స్పందించలేని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్రంలో మహిళలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – పోతిన మహేష్, వైఎస్సార్సీపీ నేత సుమోటోగా విచారణగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్ వాష్ రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణం. కళాశాలను సందర్శించి, విద్యార్థినిలతో మాట్లాడాను. ఈ ఘటనపై సుమోటోగా విచారణకు ఆదేశిస్తున్నాం. హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, కానీ బాత్రూమ్లో రహస్య కెమెరాలు మాత్రం పని చేస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – గజ్జల వెంకటలక్ష్మి, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దోషులను కఠినంగా శిక్షించాలి గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో గరల్స్ హాస్టల్ వాష్ రూమ్స్లో హిడెన్ కెమెరాల ఘటన అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటనలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలు కల్పిస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి నిందితులను శిక్షించాలి. – పురందేశ్వరి, ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సమగ్ర దర్యాప్తు చేయాలి గుడ్లవల్లేరు ఘటనతోపాటు రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో జరుగుతున్న ఘటనలకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాధ్యత వహించాలి. హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. – రాజు నాయక్, అధ్యక్షుడు, గిరిజన ప్రజా సంఘం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి విద్యార్థినులు ఉండే హాస్టల్ బాత్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీయడంపై జ్యుడిíÙయల్ ఎంక్వైరీ చేయించాలి. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యానికి పట్టకపోవడం శోచనీయం. – ఆర్సీపీ రెడ్డి, సీపీఎం కృష్ణా జిల్లా నాయకుడు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాంఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో స్వయంగా చూశా. ప్రస్తుతం పిల్లలు వాష్ రూమ్స్కు పోవాలంటే భయపడుతున్నారు. తక్షణమే న్యాయం జరగాలి. నా పిల్లలు ఇద్దరూ కూడా న్యాయవాదులే. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తా. – శలంకాయల లీలాకుమారి, కృష్ణా జిల్లా అధ్యక్షురాలు, బీజేవైఎం అసలేం జరిగిందో బయట పెట్టాలి కళాశాల ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి. రాత్రి పోలీసులు వాష్రూంలోని షవర్లను తీసుకువెళ్లారని విద్యార్థినులు చెబుతున్నారు. ల్యాప్టాప్లు, ఫోన్లను సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. వాటిలో ఏం ఉందో మహిళా అధికారులు, మహిళా నేతల ఎదుట బహిర్గత పరచాలి. – వెంకట్ గోపి, జిల్లా కార్యదర్శి, ఏబీవీపీ దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి విద్యార్థినుల వసతి గృహం ఎక్కడో పొలాల్లో చివరన ఉంది. ఎవరికి ఏం జరిగినా తెలియనంత దూరంలో ఉంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యార్థినులకు న్యాయం జరుగుతుంది. – వీరమల్లు అభినందన, కృష్ణాజిల్లా కార్యదర్శి, బీజేవైఎం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేకృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనమైంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలి. – పుత్తా శివశంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతిని«ధిఆడపిల్లలకు రక్షణ క ల్పించాలి లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దారుణం. కళాశాలలో నా మేనకోడలు కూడా విద్యనభ్యసిస్తోంది. బాత్రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కనీసం వాష్రూమ్కి కూడా వెళ్లనని ఫోన్ చేసి నా సోదరుడికి చెబుతోంది. మీరు వచ్చి తీసుకెళ్లిపోండంటూ ఏడుస్తోంది. లేదంటే చనిపోతానని చెబుతుంది. నా∙మేనకోడలికే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు న్యాయం చేయాలి. – రజనీ, అడ్వొకేట్ -
చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి
సాక్షి, అమరావతి: గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి అని హితవు పలికారు. ‘చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూ నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు’ అంటూ శుక్రవారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. -
గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి,కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్, జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కాలేజి బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్ధి,అతనికి సహకరించిన విద్యార్ధినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్రగుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం.హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నాం.వీడియోలపై మూడు రోజుల క్రితమే యాజమాన్యానికి తెలిపామని విద్యార్ధినులు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది.విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయి.విద్యార్ధుల కెరీర్ కు ఎలాంటి సమస్య రాదు ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదు.కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా సర్క్యులర్ జారీ చేయిస్తాం. విచారణ జరుగుతోంది.. కాలేజీ ప్రిన్సిపల్ కరుణాకర్గురువారం సాయంత్రం విద్యార్ధుల నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. విద్యార్ధులు చెబుతున్నట్లు వారంరోజుల క్రితం మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిన్నటి నుంచి మేం విద్యార్ధులకు అందుబాటులోనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మా కాలేజీలో చోటచేసుకోలేదు.విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల పై విచారణ జరుగుతోంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం. -
హాస్టల్ బాత్రూంలో స్పై కెమెరాలు..
-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం
-
గోడలకు కళ్లుంటాయి.. గోప్యంగా చూస్తుంటాయి! జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు. ►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది.. ► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి. ► సెల్ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్పై టార్చ్పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి. ► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి. ► ట్రయల్ రూంలలో, వాష్రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి. -
మరో లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు!
ముంబై : వసతి గృహాల్లో నివసించే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఏమాత్రం సందేహం రాని వస్తువులు.. అడాప్టర్, స్విచ్బోర్డు, ఫ్యానుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి యువతుల దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ముంబైలో అడాప్టర్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి యువతుల దృశ్యాలను చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు. దక్షిణ ముంబైలో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి, ఇతరులకు పంపించాడు. నాలుగు బెడ్ రూములున్న ప్లాట్ ను హాస్టల్గా మార్చి, ముగ్గురిని పేయింగ్ గెస్టులుగా చేర్చుకున్నాడు. వారి గదిలో అమర్చిన మొబైల్ అడాప్టర్లో సీక్రెట్ కెమెరాను ఉంచాడు. ఆపై వారి కదలికలను తన మొబైల్ ఫోన్తో చిత్రీకరించాడు. వారితో ఎక్కువగా మాట్లాడటం.. వారి గదుల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అవే విషయాలు ప్రస్తావించడంతో అనుమానం వచ్చిన ఓ అమ్మాయి అడాప్టర్ పై తన వస్త్రానన్ని కప్పింది. దీంతో తనిఖీ పేరిట గదిలోకి వచ్చిన యజమాని, వస్త్రాన్ని ఎందుకు కప్పావని ప్రశ్నించాడు. దీంతో అనుమానం వచ్చిన అమ్మాయిలు.. అడాప్టర్ను పరిశీలించి పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్ లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని మీడియాకు తెలిపారు. అతనికి 47 ఏళ్ల వయస్సని, పెళ్లి జరగలేదని, వృద్ధ దంపుతులైన అతని తల్లిదండ్రులతో నివసిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇటీవల హైదరాబాద్లో ఓ మైనర్ బాలుడు హాస్టల్లోని అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇలానే తమిళనాడు, కర్ణాటకల్లోని లేడీస్ హాస్టల్లో కూడా సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. -
ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు !
-
ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు !
విఠల్ షోరూం నిర్వాహకుల అరెస్ట్ గదిలో దుస్తులు మార్చుకుంటుండగా వైర్ను గుర్తించిన యువతి బాధితుల సమాచారంతో వెలుగులోకి బెంగళూరు : బట్టల షోరూంలోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు అమర్చి మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డు చేసిన ముగ్గురు కామాంధులను ఇక్కడి బసవనగుడి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ బీఎస్. లోకేష్ సోమవారం తెలిపిన సమాచారం మేరకు.. సోదరులు సందీప్, సురేష్ అస్తేకర్, సునీల్ అస్తేకర్ గాంధీబజార్లోని డీవీజీ రోడ్డులో విఠల్ డ్రస్సెస్ పేరుతో షోరూంను నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాష అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఓ మహిళ ఆ షాపునకు వెళ్లింది. ట్రయర్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమెకు ఓ చిన్న వైర్ కన్పించింది. పరిశీలించగా ఆ రూంలో కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించి.. విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. అక్కడ ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని వారు షాపు యజమానులను ప్రశ్నించగా.. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాపు నుంచి పంపించారు. శనివారం ఆ దంపతులు వారి బంధువులను పిలుచుకుని వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బట్టల షోరూం యజమానులు రెచ్చిపోయి ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అని దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్, సురేష్ అస్తేకర్, బాషను అరెస్ట్ చేశారు. సునీల్ అస్తేకర్ పరారీలో ఉన్నాడు. ఆ ముగ్గురిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, బెయిల్ మీద బయటకు వచ్చారని పోలీసులు సోమవారం తెలిపారు.