hot comments
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-
ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్
-
నేను చెప్తే బాబు, పవన్ చెప్పినట్టే..
-
సీఎం రేవంత్ పై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
-
కేటీఆర్పై బండిసంజయ్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వికారాబాద్ నేవీ రాడార్ కేంద్రానికి మీరే అనుమతిచ్చి మీరే ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘కేటీఆర్.. మీ అయ్య ఫాంహౌజ్ ముందు ధర్నా చేయ్. ఆనాడు రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో అడుగు. మీ అయ్య ఆనాడు సోయిలో ఉండే ఆమోదం తెలిపారో లేదో అడుగు. మీరే అనుమతి ఇచ్చి మీరే వ్యతిరేకిస్తారా? దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ది చెప్పినా మార్పు రాలేదు. కాగా, వికారాబాద్ దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మంగళవారం(అక్టోబర్ 15) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రాడార్కు అనుమతులిచ్చింది వాళ్లే: సీఎం రేవంత్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
-
మేము జగన్ తోనే ఉంటాం..
-
ప్రచార వేడి.. ప్రధాని మోదీపై ‘దీదీ’ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సందేశ్ఖాలీ వివాదంపై ప్రధాని తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పదే పదే సందేశ్ఖాలీ ఆందోళనలపై మాట్లాడుతున్న ప్రధానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో మహిళలు, దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదు. ఆయన కుంభకర్ణుని తరహాలో నిద్ర పోతున్నారు. సందేశ్ఖాలీ ఆందోళనలపై మా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంది’అని మమత తెలిపారు. కాగా, టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్ఖాలీలో తమపై లైంగిక దాడులు చేసి వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలకు కారణమైన షేక్ షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. సందేశ్ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖా పత్రకు బీజేపీ ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. మరోపక్క టీఎంసీ షేక్ షాజహాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బెంగాల్లో తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పామునైనా నమ్మగలం కానీ.. మమత -
అప్పుల విషయంలో రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు
-
మొదటి లిస్ట్ లో చోటు దక్కని చింతమనేని..హాట్ కామెంట్స్
-
రాళ్ళూ వేయించటం రాజీకి వెళ్ళటం..చంద్రబాబు డర్టీ పాలిటిక్స్
-
కాంగ్రెస్ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ
రాట్లం: కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రధాని మోదీ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. శనివారం మధ్యప్రదేశ్ రాట్లంలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల డైలాగులు, ప్రకటనలు,వారి క్యారెక్టర్లు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని చమత్కరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతోందని మోదీ అన్నారు. డిసెంబర్3న ఎన్నికల రిజల్ట్ రాగానే ఇది మరింత తీవ్రం అవుతుందని చెప్పారు.కాంగ్రెస్ నేతలకు చాన్సిస్తే ప్రజల ఒంటి మీద కూడా బట్టలు చింపేస్తారని హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టుకోవడం లేదన్నారు పీఎం మోదీ. వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన అని ఎద్దేవా చేశారు.కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ఇద్దరు అగ్రనేతలు కమల్నాథ్, దిగ్విజయసింగ్ మధ్య అంతర్గత పోరు జరుగుతున్నవిషయం తెలిసిందే -
తుమ్మల వర్సెస్ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు. సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కే ఓటు వేయాలని తుమ్మల కోరారు. తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ. -
తెలంగాణలో పొన్నాల రాజకీయం
-
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్ కామెంట్స్
సాక్షి, కరీంనగర్ జిల్లా: వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో.. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలనుద్ధేశించి తన మనసులో మాటలన్నీ వెళ్లగక్కారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కారస్వరాన్ని వినిపించిన చెన్నమనేని.. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. ఆ విషయాన్ని సూటిగా కేటీఆర్తో కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానన్న చెన్నమనేని రమేష్ బాబు.. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం సులభమయ్యేదేమోనన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై నేను ప్రశ్నించానన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే చెబుతున్నానన్న చెన్నమనేని.. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్న రమేష్బాబు.. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని తమ అభ్యర్థి చల్మెడకు సూచిస్తున్నానన్నారు. రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ నిశ్ఛేష్ఠుడై చూస్తూ కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని నియమించాక.. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందనుకుంటున్న తరుణంలోనూ ఎమ్మెల్యే రమేష్బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
టీడీపీ అధిష్టానంపై మరోసారి కేశినేని నాని ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని మరోసారి మండిపడ్డారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ల కోసం కూడా తాను పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తా. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు. బాబు ఢిల్లీ వెళ్తున్నారు రావాలని చంద్రబాబు పీఏ ఫోన్ చేస్తే వెళ్లాను’’ అని కేశినేని అన్నారు. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్గా నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టంగాడు, చెప్పుతో కొడతా అన్నారు. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశాం. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నా. నేను ఇక్కడ నుంచి పని చేస్తున్నా ఇంకా నేను ఎందుకు స్పందించాలి’’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. -
శ్రీరంగ సూక్తులు పలుకుతున్న భజ్రంగీ భాయిజాన్
-
తన వ్యాఖ్యలతో నవ్వుల్లో ముంచిన మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో తాను గడిపిన జీవితాన్ని వివరిస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నవ్వులు పూయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన తన లాక్డౌన్ జీవితాన్ని వివరించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలతో పాటు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇతరులతో చేతులు కలపడానికి.. ఆలింగనం చేసుకోవడానికి భయపడ్డామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. నిజాయతీగా చెబుతున్నాననంటూ ఆ భయంతోనే తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచారు. ఏమో ఏమైనా జరగొచ్చనే భయంతో మనసెంత కోరుకున్నా సరే తాను నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని ఆకాంక్షిస్తూనే కోవిడ్ టీకా రావడంపై మాజీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. -
అగ్రనేతలపై సిన్హా పంచ్లు
సాక్షి,న్యూఢిల్లీ: పార్టీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించే బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా మరోసారి అగ్ర నాయకత్వంపై పంచ్లతో చెలరేగారు. జీఎస్టీ, నోట్లరద్దుతో ప్రజలు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదని, బీజేపీకి సవాల్ వంటివని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్లో సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఓ న్యాయవాది చర్చించడం, టీవీ నటి మానవవనరుల మంత్రి కావడం, ఛాయ్ వాలా ప్రధానిగా అయినప్పుడు తానెందుకు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడకూడదని సిన్హా ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ, స్మృతీ ఇరానీ, నరేంద్ర మోదీల పేర్లను ప్రస్తావించనప్పటికీ, వారిని ఉద్దేశించి పరోక్షంగా సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.తాను పార్టీని సవాల్ చేయడం లేదని, వాస్తవ పరిస్థితిని బీజేపీ ముందుంచుతున్నానని పేర్కొన్నారు. మీరు వేరే పార్టీలో చేరుతున్నారా అని ప్రశ్నించగా మాజీ సినీ స్టార్ తనదైన శైలిలో ఖామోష్ ( నిశ్శబ్ధం) అంటూ బదులిచ్చారు.జీఎస్టీ, నోట్ల రద్దు సహా మోదీ ప్రభుత్వ విధాన నిర్ణయాలతో గత కొంతకాలంగా ఆయన విభేదిస్తున్నారు. -
'రుణమాఫీని అలవాటు చేయడం సరికాదు'
నెల్లూరు: రుణమాఫీ హామీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు రుణమాఫీ అలవాటు చేయడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. రుణమాఫీలతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు. జీఎస్టీ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా చేస్తామని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో త్వరలోనే జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ క్లస్టర్ ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. -
నేటి సినిమాకు కథతో పనిలేదు: దాసరి
దర్శకరత్నకు బొల్లిముంత అవార్డు ప్రదానం తెనాలి: కథతో పనిలేకుండా హీరో అంగీకరిస్తేనే సినిమాలు తీస్తున్న ధోరణి బాధ కలిగిస్తోందని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ కళా అవార్డును దాసరి నారాయణరావుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రదానం చేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ ‘ప్రజానాయకుడు’లో రాసిన డైలాగులను నేటి రాజకీయ నాయకులకు చూపితే వాళ్లు బతకడం కష్టమని వ్యాఖ్యానించారు. సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రయోగాలు చేస్తూ శిఖర సమానుడిగా వెలుగుతున్న దాసరికి.. సమాజంలో మార్పు కోసం జీవితాంతం పోరాటం చేసిన బొల్లిముంత అవార్డును ప్రదానం చేయటం సముచితమన్నారు. పత్రికారంగ ంలో దాసరి చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు. -
నక్సలిజం వస్తే బాగుండును: రేవంత్రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు... ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేసీఆర్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్ జరిగింది. నెల క్రితం ఆర్మూరులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడానికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి కారణమని' అన్నారు. -
సూట్కేసుతో చిన్నబాబు..బ్రీఫ్కేసుతో పెద్దబాబు