breaking news
ICC Womens ODI World Cup
-
విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్లు..
తొలి వన్డే వరల్డ్కప్ను గెలిచి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తమ చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకుంది. అంజుమ్ చోప్రా, జులాన్ గో స్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కాని వరల్డ్కప్ను హర్మన్ ప్రీత్ కౌర్ భారత్కు అందించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు గోవింద్ ధోలాకియా ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. సూరత్కు చెందిన గోవింద్ ధోలాకియా.. హర్మన్ సేనకు వజ్రాభరణాలు(డైమండ్ నెక్లస్), సోలార్ ప్యానెళ్లను గిప్ట్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్కు ముందు ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు."వన్డే వరల్డ్ప్లో మన భారత మహిళల జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఫైనల్లో కూడా విజయం సాధించి మన అమ్మాయిలు ఛాంపియన్గా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ భారత్ కప్ను గెలుచుకుంటే జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంతో ధోలాకియా తన మాటను నిలబెట్టుకోనున్నారు. త్వరలోనే జట్టులోని ప్రతీ ఒక్కరికి తన ప్రకటించిన గిఫ్ట్లను ఇవ్వనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా వరల్డ్ ఛాంపియన్స్కు బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టుతో పాటు సహాయక సిబ్బందికి కలిపి రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని భారత క్రికెట్ బోర్డు ఇవ్వనుంది.చదవండి: Womens World cup: చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్నే -
భారత మహిళా క్రికెట్కు ఊపిరి పోసిన ఆస్ట్రేలియన్
ఇది 112 సంవత్సరాలుగా మన దేశం కంటున్న కల. 1913లో, ఆస్ట్రేలియాలో జన్మించిన పాఠశాల ఉపాధ్యాయురాలు అన్నే కెల్లెవ్ కేరళలోని కొట్టాయంలో ఉన్న బేకర్ మెమోరియల్ స్కూల్లో బాలికలకు క్రికెట్ను తప్పనిసరి చేశారు. ఒక శతాబ్దం తర్వాత, భారత మహిళా క్రికెట్ జట్టు తన జన్మస్థలం నుంచి వచ్చిన జట్టును ఓడించి కలల ఫైనల్కు చేరుకుంటుందని బహుశా ఆమె అప్పుడే ఊహించారేమో.. తెలీదు. కానీ అదే జరిగింది.భారత్ ఇంతకు ముందు మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్లోకి ప్రవేశించలేదని కాదు, కానీ 2025 ఎడిషన్ చరిత్రలో అద్భుతాలను చవిచూసిన టోర్నమెంట్గా నిలిచిపోతుంది, కలలు పండిస్తూ మన మహిళలు విజేతలుగా మారారు. గత దశాబ్దంలో కాలానుగుణంగా పెరుగుతున్న మహిళల క్రికెట్పై మన దేశపు ఆసక్తిని మేల్కొల్పడానికి వారు అందించిన స్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే భారతదేశంలో మహిళలు ఈ క్రీడను ఆడటం అంటే ఒక పోరాటం, దీనిని అధిగమిస్తూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త స్టార్ల ఆవిర్భావాన్ని చూసింది.ఆదివారానికి ముందు, భారతదేశం రెండు ఫైనల్స్ ఆడింది ఒకటి 2005లో మరొకటి 2017లో... పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 2025 టైటిల్ పోటీ జట్టుకు ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, వారు కిక్కిరిసిన స్టేడియం మధ్య స్వదేశంలో పోరాడారు, అక్కడ ‘ఇండియా! ఇండియా!‘ అనే నినాదం దేశం అంతటా ప్రతిధ్వనించింది. "ఏఆర్ రెహమాన్ జై హో, బాలీవుడ్ సహకారం కొత్త తరపు క్రీడా గీతం, చక్ దే ఇండియా ప్రజలను చైతన్యపరచింది. ఆ కాలంలో ’పంచుకోవడం అంటే శ్రద్ధ’ అనేది నిజంగా ఉండేది. ఎందుకంటే కొన్నిసార్లు వివాహ మండపాల్లో బస చేసేవాళ్లం ఎక్కువగా పాఠశాలల్లో ఖాళీ తరగతి గదుల్లో ఉండేవాళ్ళం. మాకు తోడుగా బొద్దింకలు ఎలుకలు ఉండేవి. చాలా మందికి కేవలం ఒక జత తెల్లటి బ్యాట్లు పరిమితమైన బ్యాట్లు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎందుకంటే క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతో ఆడాము,‘ అని భారత మాజీ కెప్టెన్ నిర్వాహకురాలు శాంత గుర్తుచేసుకున్నారు. శాంత, డయానా ఎడుల్జీ, శుభంగి కులకర్ణి సుధా షాలతో కలిసి ఆటలో కొనసాగారు. ఇలాంటి అలుపెరుగని పోరాటాలు కష్టాల కథలతో మహిళల క్రికెట్ ప్రయాణం దేశవ్యాప్తంగా సాగింది. ఒక, వ్యవస్థీకృత మహిళా క్రికెట్గా రూపుదిద్దుకుంది. ఈ నేపధ్యంలోమహిళా క్రికెట్ ప్రయాణంలో కొన్ని కీలక ఘట్టాలు...👉క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యురాలు ఆలూ బామ్జీ, ఆమె పేరు ను మేళవిస్తూ ఆల్బీస్ అనే మొదటి మహిళా క్రికెట్ జట్టును ఏర్పాటు చేశారు.👉నాలుగు సంవత్సరాల తరువాత, మహేంద్ర కుమార్ శర్మ వ్యవస్థాపక కార్యదర్శిగా భారత మహిళా క్రికెట్ సంఘం లక్నోలో స్థాపించబడింది. 👉1993లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ను లక్నోలో నిర్వహించారు, ఇందులో బొంబాయి, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మూడు జట్లు ఉన్నాయి. రెండు విజిటింగ్ జట్ల నుంచి అదనపు ఆటగాళ్లను ఆతిథ్య జట్టులో చేర్చారు, ఒక కళాశాల మైదానంలో ఆడిన ఈ మ్యాచ్లో మహిళలు క్రికెట్ ఎలా ఆడతారు అనేదానికన్నా లేదా వారు ఏమి ధరిస్తారు అనే దానిపై ఆసక్తి కారణంగా ఇది గణనీయమైన ప్రేక్షకులను ఆకర్షించింది.👉1978లో, భారతదేశం ప్రపంచ కప్లో జట్టుగా ఆతిథ్య జట్టుగా అరంగేట్రం చేసింది. ఆతిథ్య జట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అనే నాలుగు జట్లతో ఈ ఈవెంట్ను నిర్వహించగలగడానికి కేవలం ధైర్యం కంటే ఎక్కువ అవసరం.👉 2006లో బిసిసిఐతో విలీనం అనేక విధాలుగా ఒక మలుపు తిరిగింది, మొదటిసారిగా, మహిళల వన్ డే మ్యాచ్ల కోసం రూ. 2,500 మ్యాచ్ ఫీజును కేటాయించారు. మెరుగైన మైదానాలు,, వసతి గృహాలు హోటల్ గదులు వచ్చాయి.,రిజర్వ్ చేయని రైలు ప్రయాణాల స్థానంలో రిజర్వ్డ్ ఎసి రైళ్లు, విమానాలు వచ్చాయి. రెండు సంవత్సరాల తరువాత, మహిళా క్రికెటర్లు జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రవేశం పొందారు. -
Women's World Cup: అమన్ కన్నీటి గాథ
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఎట్టకేలకు మన అమ్మాయిల సొంతమైంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.2005, 2017లో ఫైనల్స్లో ఓటమిని చవిచూసిన టీమిండియా.. మూడో ప్రయత్నంతో విశ్వవిజేతగా నిలిచింది. కాగా హర్మన్ సారథ్యంలోని భారత జట్టు తొలి వరల్డ్కప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ది కీలక పాత్ర. ఫైనల్లో అమన్జోత్ అద్బుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది. సెంచరీతో కదం తొక్కి భారత బౌలర్లకు కొరకరాని కోయ్యిగా మారిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ను సంచలన క్యాచ్తో ఆమె పెవిలియన్కు పంపింది. ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే తన క్యాచ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అమన్జోత్ కౌర్ వెనక ఆమె కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. ప్రపంచకప్ వంటి వేదికలో తన బిడ్డ సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగారు.ఏమి జరిగిందంటే?ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత అమన్జోత్ కౌర్ వాళ్ల నానమ్మ భగవంతి(75) గుండెపోటుకు గురయ్యారు. అయితే అమన్జోత్ తన ఆటపై ఏకాగ్రత కోల్పోకూడదని ఆమె తండ్రి భూపిందర్ సింగ్తో సహా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు. ఈ విషయాన్ని తాజాగా భూపిందర్ సింగ్ వెల్లడించారు. భారత్ విజయం సాధించిన వెంటనే అమన్జోత్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుటుంబంతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమన్జోత్ ఈ స్దాయికి చేరుకుకోవడంలో మా అమ్మ భగవంతిది కీలక పాత్ర. అమన్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజు నుంచి మా అమ్మ ఆమెకు ఎంతో సపోర్ట్గా ఉండేది. అమన్ చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఎక్కడికి వెళ్లినా మా అమ్మ తన వెనుక వెళ్లేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని మేము అమన్జోత్కు తెలియజేయలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి కఠిన సమయంలో ప్రపంచ కప్ విజయం మాకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విజయం గురుంచి మా అమ్మకు తెలియజేశాము. ఆమె వెంటనే కళ్లు తెరిచి చూసింది అని అని భూపిందర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.ప్రస్తుతం అమన్ వాళ్ల నానమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్లు ఆడిన అమన్జోత్.. 146 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో లారా వోల్వార్ట్ క్యాచ్తో అద్బుతమైన రనౌట్తో కూడా అమన్ మెరిసింది.చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయంAfter India’s World Cup triumph, cricketer Amanjot Kaur’s father grew emotional, expressing immense pride and joy over his daughter’s remarkable achievement.#WomensWorldCup2025 #WomenInBlue pic.twitter.com/Q1azAudoIj— Karan Verma (@Mekaranverma) November 2, 2025 -
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
-
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
-
భారత మహిళల జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు
భారత మహిళల క్రికెట్ జట్టు 2025 ICC Women’s World Cup విజేతగా నిలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని ఆయన "చారిత్రాత్మక ఘట్టం"గా అభివర్ణించారు, ఇది భవిష్యత్ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…— Narendra Modi (@narendramodi) November 2, 2025 భారత మహిళల జట్టు విజయంపై పలువురు ప్రముఖులు తమ 'ఎక్స్' ఖాతా వేధికగా స్పందించారుMy heartiest congratulations to each and every member of the Indian women cricket team on winning the ICC Women’s Cricket World Cup 2025! They have created history by winning it for the first time. They have been playing well and today they got the result befitting their talent…— President of India (@rashtrapatibhvn) November 2, 2025Inspiration for generations to come, you’ve made every Indian proud with your fearless cricket and belief throughout. You guys deserve all the accolades and enjoy the moment to the fullest. Well done Harman and the team. Jai Hind 🇮🇳🇮🇳 pic.twitter.com/f9J34QIMuP— Virat Kohli (@imVkohli) November 2, 2025భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలిసారి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది. ऐतिहासिक विजय...विश्व विजेता भारतीय महिला क्रिकेट टीम का हार्दिक अभिनंदन! देश वासियों को हृदयतल से बधाई!आप सभी देश का गौरव हैं।भारत माता की जय 🇮🇳— Yogi Adityanath (@myogiadityanath) November 2, 20251983 inspired an entire generation to dream big and chase those dreams. 🏏 Today, our Women’s Cricket Team has done something truly special. They have inspired countless young girls across the country to pick up a bat and ball, take the field and believe that they too can lift… pic.twitter.com/YiFeqpRipc— Sachin Tendulkar (@sachin_rt) November 2, 2025My heartiest congratulations to each and every member of the Indian women cricket team on winning the ICC Women’s Cricket World Cup 2025! They have created history by winning it for the first time. They have been playing well and today they got the result befitting their talent… -
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. తొలి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా కెప్టెన్ ఒంటరి పోరాటం..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఒంటరి పోరాటం చేసింది. 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు చేసింది. లారా క్రీజులో ఉన్నంతసేపు భారత డగౌట్తో పాటు అభిమానులలో టెన్షన్ నెలకొంది. దీప్తీ శర్మ బౌలింగ్లో వోల్వార్డ్ట్ ఔట్ కావడంతో భారత విజయం ఖాయమైంది. అమన్ జ్యోత్ కౌర్ అద్బుత క్యాచ్తో వోల్వార్డ్ట్ పెవిలియన్కు పంపించింది.శెభాష్ షఫాలీ..ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మతో బ్యాట్తో బంతితో మ్యాజిక్ చేసింది. భారీ లక్ష్య చేధనలో 51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. బ్రిట్స్ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరింది. ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా.. వన్ డౌన్ బ్యాటర్ లూస్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. భారత కెప్టెన్ హర్మన్ ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. దీంతో పార్ట్ టైమ్ బౌలర్ షఫాలీకి హర్మన్ బంతిని అందించింది. కెప్టెన్ నమ్మకాన్ని షఫాలీ వమ్ము చేయలేదు. అద్బుతమైన సన్నీ లూస్ను షఫాలీ బోల్తా కొట్టించింది. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ కాప్ను కూడా వర్మ పెవిలియన్కు పంపింది. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్ను వరల్డ్ ఛాంపియన్గా షఫాలీ నిలిపింది.WE ARE THE CHAMPIONS! Every ounce of effort, every clutch moment, every tear, all of it has paid off. 💙#CWC25 #INDvSA pic.twitter.com/hhxwlStp9t— Star Sports (@StarSportsIndia) November 2, 2025ఐదేసిన దీప్తి..ఇక భారత్ తొలిసారి వరల్డ్కప్ను సొంతం చేసుకోవడంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి.. బౌలింగ్లో బంతితో అద్బుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్ ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన శర్మ..39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచింది.బ్యాటింగ్లో అదుర్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్, ట్రయాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS T20 Series: ఉన్నపళంగా స్వదేశానికి టీమిండియా స్టార్ క్రికెటర్ -
ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు.. వరల్డ్ ఛాంపియన్స్గా భారత్
India vs South Africa Womens WC 2025 Final Live Updates: వరల్డ్కప్ విజేతగా భారత్ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్(101) అద్బుతమైన సెంచరీతో పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ రెండు, చరణి ఒక్క వికెట్ సాధించింది.👉సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.44 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 232/844 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రోటీస్ విజయానికి 33 బంతుల్లో 67 పరుగులు కావాలి. సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ డౌన్..221 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీప్తీ శర్మ బౌలింగ్లో ట్రయాన్ వికెట్ల ముందు దొరికిపోయింది.సౌతాఫ్రికా కెప్టెన్ ఔట్.. విజయం దిశగా భారత్తొలి ప్రపంచకప్ విజయం దిశగా భారత్ పయనిస్తోంది. 220 పరుగుల వద్ద సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(101) వికెట్ కోల్పోయింది. క్రీజులోకి డిక్లార్క్ వచ్చింది. ప్రోటీస్ విజయానికి 78 బంతుల్లో51 పరుగులు కావాలి. సౌతాఫ్రికా కెప్టెన్ సెంచరీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 96 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకుంది. 41 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(101), ట్రయాన్(9) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి 54 బంతుల్లో 79 పరుగులు కావాలి.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్..209 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన డికర్సన్ దీప్తీ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది.38 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్38 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 207గా ఉంది. ఇంకా దక్షిణాఫ్రికా మహిళల జట్టు 66 బంతుల్లో 92 పరుగులు చేయాలి.36 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్36 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 186గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు 84 బంతుల్లో 113 పరుగులు చేయాలి32 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 175, దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 124 పరుగులు అవసరం31 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 167 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్148 పరుగుల వద్ద సౌతాఫ్రికా జట్లు ఐదో వికెట్ కోల్పోయింది. దీప్తిశర్మ బౌలింగ్లో రాధా యాదవ్కు క్యాచ్ ఇచ్చి సినాలో జాఫ్తా ఔట్ అయింది. 27 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు141-4 గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 158 పరుగులు అవసరంమరో వికెట్ తీసిన షఫాలీ వర్మ.. సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్షఫాలీ వర్మ తన రెండో ఓవర్లో మొదటి బంతికి మరో వికెట్ తీసింది. దాంతో 123 పరుగుల వద్ద సౌతాఫ్రికా తన నాలుగో వికెట్ కోల్పోయింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..సన్నీ లూస్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. పార్ట్టైమ్ బౌలర్ షఫాలీ వర్మ బౌలింగ్లో 25 పరుగులు చేసిన లూస్ ఔటైంది. 21 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 113-3 సౌతాఫ్రికా కెప్టెన్ ఫిప్టీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 46 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 19 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(60), లూస్(21) ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..బోష్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ శ్రీచరణి బౌలింగ్లో బోష్(0) వికెట్ల ముందు దొరికిపోయింది. 13 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 69/2. క్రీజులో కెప్టెన్ లారా వోల్డోర్ట్(42), లూస్(1) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన టాజ్మిన్ బ్రిట్స్.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరింది. క్రీజులోకి అన్నేకే బోష్ వచ్చింది.స్పీడ్ పెంచిన సౌతాఫ్రికా..8 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో సౌతాఫ్రికా ఓపెనర్లు టాంజిమన్ బ్రిట్స్(17), లారా వోల్డర్ట్(23) ఉన్నారు.కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత్299 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(3), బ్రిట్స్(6) ఉన్నారు. భారత పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్, ట్రయాన్ తలా వికెట్ సాధించారు.దీప్తి శర్మ హాఫ్ సెంచరీ..దీప్తి శర్మ 53 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 48 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. క్రీజులో రిచా(33), దీప్తి(50) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రిచా..క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(25) దూకుడుగా ఆడుతోంది. 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రిచాతో పాటు దీప్తి(49) ఉన్నారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్అమన్జ్యోత్ కౌర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అమన్జ్యోత్.. డిక్లార్క్ బౌలింగ్లో ఔటైంది. క్రీజులోకి రిచాఘోష్ వచ్చింది. రిచా వచ్చిన వెంటనే సిక్సర్తో తన ఇన్నింగ్స్ను ఆరంభించింది. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 253/5టీమిండియా నాలుగో వికెట్ డౌన్..హర్మన్ప్రీత్ కౌర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హర్మన్.. మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. క్రీజులోకి అమన్జ్యోత్ కౌర్ వచ్చింది.నిలకడగా ఆడుతున్న హర్మన్, దీప్తి37 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హర్మన్ ప్రీత్(17), దీప్తి శర్మ(25) ఉన్నారు.భారత్కు భారీ షాక్.. రోడ్రిగ్స్ ఔట్టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెమీస్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్.. ఫైనల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయింది. 24 పరుగులు చేసిన రోడ్రిగ్స్, ఖాఖా బౌలింగ్లో పెవిలియన్కు చేరింది.షెఫాలీ వర్మ ఔట్..షెఫాలీ వర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 87 పరుగులు చేసిన.. ఖాఖా బౌలింగ్లో ఔటైంది. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/2గా ఉంది. సెంచరీ దిశగా సాగుతున్న షఫాలీషఫాలీ వర్మ సెంచరీ దిశగా సాగుతుంది. 74 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. షఫాలీకి జతగా జెమీమా (21) క్రీజ్లో ఉంది. 27 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 162/1గా ఉంది. షెఫాలీ వర్మ ఫిప్టీ..ఫైనల్ మ్యాచ్లో షెఫాలీ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతోంది. షెఫాలీ 49 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 20 ఓవర్లకు భారత్ స్కోర్: 114/1తొలి వికెట్ కోల్పోయిన భారత్..భారత మహిళల జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మంధాన.. ట్రయాన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. క్రీజులోకి జెమీమా రోడ్రిగ్స్ వచ్చింది.17 ఓవర్లకు భారత్ స్కోర్: 97/017 ఓవర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(45 బంతుల్లో 48), మంధాన(51 బంతుల్లో 39) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు..10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(29), మంధాన(27) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న షెఫాలీ..5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(21), మంధాన(7) ఉన్నారు.2 ఓవర్లు భారత్ స్కోర్: 7/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(5) ఉన్నారు.బ్యాటింగ్ భారత్దే..డివై పాటిల్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టునే కొనసాగించాయి.తుది జట్లుభారత్ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా : లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాతగ్గిన వర్షం..నవీ ముంబైలో వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 4:30 గంటలకు టాస్ పడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్కు రంగం సిద్దమైంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. అయితే ఈ తుది పోరుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం టాస్ 2.30 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది.కాగా సౌతాఫ్రికాకు ఇది తొలి వరల్డ్కప్ ఫైనల్ కాగా.. హర్మన్ సేన ఫైనల్ అర్హత సాధించడం ఇది మూడోసారి. అయితే ఈసారి మహిళల క్రికెట్లో సరికొత్త చాంపియన్ను చూడబోతున్నాము. ఎందుకంటే భారత్ కానీ, సౌతాఫ్రికా కానీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ ట్రోఫీని గెలుచుకోలేదు. -
రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా కన్నీటి పర్యంతం
నాలుగేళ్ల వయసులోనే ఆమె బ్యాట్ పట్టింది.. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది..కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్.. జట్టుకు అవసరమైన వేళ తన స్పిన్ మాయాజాలంతోనూ మెరవగలదు.. అంతర్జాతీయ స్థాయిలో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ ఆమె ముందే ఉంటుంది..కానీ ఊహించని రీతిలో కొన్నాళ్ల క్రితం ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎవరైనా.. ఆరోపణలు ఏవైనా కానీ.. జింఖానా క్లబ్లో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు.. ఆమె తండ్రి మతపరమైన సమావేశాలు పెట్టి ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పక్కనపెట్టారు..దీంతో ఆమె డిప్రెషన్లో కూరుకుపోయింది.. క్రికెట్నే వదిలేద్దామా అన్నంతగా కుంగిపోయింది.. ఆ సమయంలో స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు.. థెరపీ తీసుకుని ముందుగా మైదానంలో బ్యాట్తో మళ్లీ మెరుపులు మెరిపించాలంటూ ప్రోత్సహించారు..ఆమె కోలుకుంది.. దేశం కోసం ఆడాలనే దృఢ సంకల్పానికి ఇలాంటి ఆరోపణల తాలుకు ప్రభావం అడ్డుకాకూడదని తనను తాను సముదాయించుకుంది.. మాతృభూమి కోసం అవాంతరాలను అధిగమించి ఈరోజు దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.. ఆమే జెమీమా రోడ్రిగ్స్.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో వీరోచిత పోరాటంతో భారత్ను గెలిపించింది. భారీ లక్ష్యం, ముఖాముఖి రికార్డులు ఒత్తిడికి గురిచేస్తున్నా సొంత మైదానం (నవీ ముంబై)లో ప్రేక్షకుల మద్దతుతో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.అజేయ శతకంతోఅనుకోని విధంగా వన్డౌన్లో బ్యాటింగ్ రావాల్సి వచ్చినా.. ఆత్మవిశ్వాసంతో క్రీజులో కుదురుకుని అజేయ శతకం బాదింది. 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్కు ఫైనల్ బెర్తును ఖరారు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.ఈ క్రమంలో పాతికేళ్ల జెమీమా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గత కొన్ని నెలలుగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ ఇందుకు కారణం. మ్యాచ్ గెలవగానే తండ్రిని హత్తుకుని ఆమె ఏడ్చిన తీరు ఆమె వేదనకు అద్దం పట్టింది.Pure moments of joy! 💙 Tears, smiles, and family hugs. Jemimah’s match-winning knock says it all! 😭💪WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/ENDkBF5vk2— Star Sports (@StarSportsIndia) October 30, 2025 ప్రతీరోజు ఏడ్చానుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం జెమీమా మాట్లాడుతూ.. ‘‘జీసస్కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్లోని ఒక వాక్యాన్ని మ్యాచ్ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు.నాసెంచరీకి ప్రాధాన్యత లేదుమూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతాననే విషయం మ్యాచ్కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. అందుకే విజయం సాధించగానే భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను’’ అని ఉద్వేగానికి లోనైంది. ఈ నేపథ్యంలో భారత ట్టు అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ‘‘ఏడవద్దు జెమీమా.. సగర్వంగా తలెత్తుకో చాంపియన్’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.#JemimahRodrigues, take a bow! 🙌#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/2Ov9ixC7Ai— Star Sports (@StarSportsIndia) October 30, 2025చదవండి: IND Beat AUS In Semis: ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడేందుకు భారత మహిళల జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. . గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది.ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) కూడా వీరోచిత పోరాటం కనబరిచింది. వీరిద్దరూ మూడో వికెట్కు 156 బంతుల్లో 167 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. హర్మన్ ప్రీత్ ఔట్ అయినా.. జెమీమా మాత్రం పట్టువదల్లేదు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత జట్టును మూడో సారి ఫైనల్కు చేర్చింది.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్లో సంచలన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఓ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్ చేసిన జట్టుగా భారత్ రికార్డులెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇదే టోర్నమెంట్లో వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కానీ తాజా మ్యాచ్లో భారత్ 339 పరుగుల టార్గెట్ను చేధించి ఆసీస్ను అధిగమించింది. భారత్, ఆస్ట్రేలియా తర్వాతి స్ధానంలో శ్రీలంక(302) ఉంది. ఇక నవంబర్ 2న ముంబై వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్
మహిళల ప్రపంచకప్-2025 తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లారా భారీ సెంచరీతో చెలరేగింది. 26 ఏళ్ల వోల్వార్డ్ కేవలం 20 ఫోర్లు, 4 సిక్స్లతో 169 పరుగులు చేసింది. ఆమె విధ్వసంకర బ్యాటింగ్ ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. ఈ తుపాన్ ఇన్నింగ్స్తో వోల్వార్ట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.లారా సాధించిన రికార్డులు ఇవే..👉ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్గా ఆమె నిలిచింది.👉మహిళల వన్డే వరల్డ్కప్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును లారా సమం చేసింది. మిథాలీ అత్యధికంగా 13 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించగా.. లారా కూడా సరిగ్గా 13 సార్లు ఏభైకి పైగా పరుగులు చేసింది. అయితే వోల్వార్డ్ కేవలం 23 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.👉మహిళల వన్డే క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గా నిలిచింది.👉ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్గా లారా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(171), ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ(170) తొలి రెండు స్దానాల్లో ఉన్నారు. -
పాక్, కివీస్ మ్యాచ్ వర్షార్పణం.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా
మహిళల వన్డే ప్రపంచకప్లో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లను వరుణుడు వీడటం లేదు. వాన కారణంగా ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్లు రద్దు కాగా... ఇప్పుడు ఆ జాబితాలో మరో మ్యాచ్ చేరింది. శనివారం కొలంబో వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరు భారీ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పటికే ఆ్రస్టేలియా సెమీస్ చేరగా... ఇప్పడు సఫారీ జట్టు రెండో బెర్త్ దక్కించుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాలు తేలాల్సి ఉంది. శనివారం పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆలియా రియాజ్ (52 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), మునీబా అలీ (22; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లీ తహూహు 2 వికెట్లు పడగొట్టింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వర్షం కాస్త తెరిపినివ్వగా... మ్యాచ్ను 36 ఓవర్లకు కుదించారు. అయితే మరోసారి వర్షం ముంచెత్తడంతో... మ్యాచ్ను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
పాక్ ఓపెనర్ది ఔటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వైరం మరింత ముదురుతోంది. మొన్న ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు మరవకముందే.. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదస్పదమైంది. పాక్ అభిమానులు మునీబాది నాటౌట్ అంటుంటే ఇండియన్ ఫ్యాన్స్ క్లియర్ ఔట్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.అసలేమి జరిగిదంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ ఆఖరి బంతిని మునీబాకు మిడిల్ అండ్ లెగ్ స్టంప్ దిశగా సంధించింది. ఆ బంతిని మునీబా లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించింది. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి మునీబా అలీ ఫ్రంట్ ప్యాడ్ తాకుతూ వికెట్ కీపర్ వైపు వెళ్లింది.దీంతో భారత ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపారు. ఇంతలోనే మునీబా క్రీజు బయటకు ఒక్క అడుగు ముందుకు వేసి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో దీప్తి శర్మ వికెట్ కీపర్ వెనక నుంచి డైరక్ట్ త్రోతో స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. తొలుత థర్డ్ అంపైర్ నాటౌట్గా సూచించినప్పటికి.. అంపైర్ కెరిన్ క్లాస్ట్ ఆ తర్వాత పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చి ఔట్గా ప్రకటించింది. బంతి స్టంప్స్కు తాకే సమయంలో మనీబా బ్యాట్ గాల్లో ఉందని అంపైర్ చెప్పుకొచ్చారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ శిబిరం మొత్తం షాక్కు గురయ్యారు. అయితే బంతి స్టంప్స్కు తాకక ముందు మునీబా బ్యాట్ పాపింగ్ క్రీజులో ఉంచింది. కాబట్టి నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగింది. ఫోర్త్ అంపైర్ రూల్స్ను వివరించడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఏదేమైనప్పటికి మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ బంతి స్టంప్స్కు తాకక ముందు తన బ్యాట్ను పాపింగ్ క్రీజ్ వెనుక ఒక్కసారి ఉంచితే చాలు. ఆ తర్వాత బంతి స్టంప్స్కు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్న కూడా నాటౌట్గా పరిగిణిస్తారు. అయితే ఈ రూల్ కేవలం రన్కు ప్రయత్నించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ మునీబా రన్ కోసం పరిగెత్తలేదు. క్రీజులో నిలబడి బయటకు వెళ్లి వచ్చింది. కాబట్టి ఆమె అవుట్ వికెట్ కీపర్ బ్యాటర్ స్టంప్ చేయడంతో సమానం. బంతి బెయిల్స్ పడగొట్టిన సమయంలో ఆమె బ్యాట్ గాలిలో ఉంది. అందుకే థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. అదే ఆమె రన్కు ప్రయత్నించే సమయంలో ఇలా జరిగింటే నాటౌట్ ఇచ్చేవారు.రూల్ 30.1 ప్రకారం.. మునీబాను ఔట్గా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం ఒక బ్యాటర్ తన బ్యాట్ లేదా పాదం లేదా శరీరంలోని ఏ భాగమైనా పాపింగ్ క్రీజ్ చివరన లేకపోతే ఔట్గానే పరిగణిస్తారు.రూల్ 30.1.2 ప్రకారం.. ఒక బ్యాటర్ రన్కు పరిగెత్తడం లేదా డైవ్ చేసే సందర్భాల్లో బ్యాట్ ఒక్కసారి పాపింగ్ క్రీజు వెలుపుల గ్రౌండింగ్ చేస్తే చాలు. అనంతరం బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్గానే లెక్కలోకి తీసుకుంటారు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
మహిళల వన్డే ప్రపంచకప్ : శ్రీలంకపై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం
తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు ఏకంగా మూడు సార్లు ఎదురెదురుపడ్డాయి. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్లో.. తలపడిన ప్రతిసారి భారత్ పాక్ను చిత్తుగా ఓడించి, తొమ్మిదో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఈ ఆసియా కప్ టోర్నీలో మునుపెన్నడూ చోటు చేసుకొని హైడ్రామా చోటు చేసుకుంది.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్కు నిరాకరించారు. టీమిండియాను ఏమీ చేసుకోలేక పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఐసీసీకి ఫిర్యాదు చేసి శునకానందం పొందింది. ఐసీసీ తిరిగి వారికే అక్షింతలు వేయడంతో తోకముడిచి భారత ఆటగాళ్లను, భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.సూపర్-4 దశ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ భారత ఆటగాళ్లను సంజ్ఞలతో కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా మాత్రం ఈసారి కూడడా ఆటతీరుతోనే వారికి బుద్ది చెప్పింది.ఫైనల్లో భారత్ పాక్ను ముచ్చటగా మూడోసారి ఓడించిన తర్వాత డ్రామా మరింత రక్తి కట్టింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఛైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత క్రికెటర్లు ఆసియా కప్ వేదికగా పాక్ ఆటగాళ్లకు చేయాల్సిన మర్యాదంతా చేశారు. పాకిస్తాన్ను క్రికెట్ మైదానంలో మరో దెబ్బ కొట్టేందుకు టీమిండియాకు అతి త్వరలో మరో అవకాశం రానుంది. ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్-2025లో (ICC Women's World Cup 2025) భారత్ అక్టోబర్ 5న పాకిస్తాన్తో తలపడనుంది. ఈసారి కూడా టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించాలని యావత్ భారతావణి కోరుకుంటుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంకతో పాటు భారత్ కూడా ఆతిథ్యమిస్తున్నా.. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి మరో 5 రోజుల్లో పాక్కు బుద్ది చెప్పే అవకాశం భారత్కు మరోసారి రానుంది.కాగా, మహిళల వన్డే వరల్డ్కప్ రేపటి నుంచే (సెప్టెంబర్ 30) ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరిగే మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. చదవండి: క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగిల్చిన 2025 -
ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్
మహిళల వన్డే ప్రపంచకప్కు (ICC Women's World Cup 2025) ముందు భారత జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన మ్యాచ్లో స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundathi Reddy) గాయపడింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీథర్ నైట్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్ అయ్యింది. దీంతో చాలా సేపు నొప్పితో విలవిలలాడుతూ నేలపై ఉండిపోయింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్ చైర్లో తీసుకెళ్లారు.అరుంధతి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. స్కాన్ల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్కప్లో ఆమె పాల్గొనడం అనుమానంగా మారింది.27 ఏళ్ల అరుంధతి గత కొంతకాలంగా టీమిండియాలో కీలక బౌలర్గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆమె 6 ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉంది. ఒకవేళ మెగా టోర్నీ నుంచి అరుంధతి తప్పుకుంటే, బీసీసీఐ ఆమె ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. టీమిండియా సెప్టెంబర్ 30న శ్రీలంకతో జరిగే మ్యాచ్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (120 నాటౌట్) సెంచరీతో కదంతొక్కడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. బ్రంట్కు జతగా ఎమ్మా లాంబ్ (74 నాటౌట్) క్రీజ్లో ఉంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 277/3గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ 39, హీథర్ నైట్ 37 పరుగులు చేయగా.. ట్యామీ బేమౌంట్ డకౌటైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. చదవండి: న్యూజిలాండ్కు షాకిచ్చిన టీమిండియా -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి
ఆస్ట్రేలియాతో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలోనే పాతికేళ్లుగా బెలిండా క్లార్క్- లిసా కైట్లీ పేరిట ఉన్న వన్డే ప్రపంచ రికార్డును స్మృతి- ప్రతీకా బద్దలు కొట్టారు.టాపార్డర్ హాఫ్ సెంచరీలుకాగా మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI WC 2025) సన్నాహకాల్లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఆదివారం నాటి తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అయితే, మిగతా వారంతా తేలిపోయారు.A half-century filled with stylish stroke play!4th ODI Fifty for Harleen Deol 👏👏#TeamIndia inching closer to the 200-run markUpdates ▶️ https://t.co/LS3igwDIqz#INDvAUS | @IDFCFirstBank | @imharleenDeol pic.twitter.com/49Wxr8LF6f— BCCI Women (@BCCIWomen) September 14, 2025281 పరుగులుకెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 11, జెమీమా రోడ్రిగ్స్ 18 పరుగులు మాత్రమే చేయగా.. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 20 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. రాధా యాదవ్ 19 పరుగులు చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడిగతేడాది నుంచి భారత జట్టు ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు.తాజాగా మరో వరల్డ్ రికార్డును స్మృతి- ప్రతీకా తమ పేరిట లిఖించుకున్నారు. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఆసీస్తో తొలి వన్డే సందర్భంగా స్మృతి- ప్రతీకా ఈ రికార్డు నమోదు చేశారు.కాగా 2025లో ఇప్పటి వరకు స్మృతి- ప్రతీకా కలిసి 958 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు.. 2000 సంవత్సరంలో బెలిండా క్లార్క్- లీసా కేట్లీ (ఆసీస్) 905 పరుగుల పార్ట్నర్షిప్ సాధించగా.. స్మృతి- ప్రతీకా తాజాగా వారిని అధిగమించారు.అంతేకాకుండా.. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్లుగా స్మృతి- ప్రతీకా చరిత్రకెక్కారు. జయా శర్మ- కరుణా జైన్ 25 ఇన్నింగ్స్లో ఐదుసార్లు వందకు పైగా భాగస్వామ్యం సాధించగా.. స్మృతి- ప్రతీకా 15 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నారు.చదవండి: PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ.. -
వన్డే ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించనుండగా... నలుగురు కొత్త ప్లేయర్లకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.సుజీ బేట్స్, లీ తహుహు, సోఫీ డివైన్ ఐదోసారి ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా... మ్యాడీ గ్రీన్, మెలియా కెర్కు ఇది మూడోది. 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన కివీస్ జట్టు అటు అనుభవజ్ఞులు, ఇటు యువ ప్లేయర్లతో సమతూకంగా ఉందని న్యూజిలాండ్ కోచ్ బెన్ సాయర్ అన్నాడు. వరల్డ్కప్లో భాగంగా వచ్చే నెల 1న డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకీ హాలిడే, బ్రీ ఇలింగ్, పాలీ ఇన్గ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు. -
భారత్కు వచ్చేందుకు పాక్ క్రికెట్ టీమ్ నిరాకరణ..?
మహిళల వన్డే ప్రపంచ కప్ ఓపెనింగ్ సెర్మనీ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోసల్తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్గా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్ దూరం కానుందని సమాచారం.భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్ వేదికల్లో మాత్రమే.త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్కప్లో పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్ 2న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. -
వరల్డ్కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. 17 ఏళ్ల బ్యాటర్కు చోటు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup 2025) టోర్నమెంట్కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. స్టైలిష్ ఓపెనర్ లారా వొల్వర్ట్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ జట్టులో పదిహేడేళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మెసో (Karabo Meso)కు కూడా చోటు దక్కడం విశేషం.ఆమెకు ఇదే తొలిసారిఅండర్-19 వరల్డ్కప్ టోర్నీల్లో రెండుసార్లు సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన మెసో.. సీనియర్ జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ స్పెషలిస్టు నొన్కులులెకో ఎమ్లాబాతో పాటు సీమర్లు మసబట క్లాస్, తుమి సెఖుఖునె కూడా స్థానం సంపాదించారు. మాజీ కెప్టెన్కు మొండిచేయిమరోవైపు.. ఆల్రౌండర్ల కోటాలో నదినె డి క్లెర్క్, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, నొండుమిసో షంగేజ్ వరల్డ్కప్ ఆడనున్నారు. అయితే, ఇటీవలే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ పేరును మాత్రం సౌతాఫ్రికా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత్- శ్రీలంక వేదికగాఇక సీనియర్లు కొంతమంది మిస్సయినా.. హెడ్కోచ్ మండ్లా మషిమ్బీ మార్గదర్శనంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో వరల్డ్కప్ బరిలో దిగనుంది.కాగా సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు భారత్- శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టుతో పాటు సౌతాఫ్రికా వుమెన్ టీమ్ కూడా ఇంత వరకు ఒక్కసారి వరల్డ్కప్ ట్రోఫీ గెలవలేదు.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్కు సౌతాఫ్రికా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాక, క్లో ట్రియాన్, నదినె డి క్లర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్కులులెకో ఎమ్లాబా, అన్నెకె బాష్, అనెరి డెర్క్సెన్, మసబట క్లాస్, సునె లూస్, కరాబో మెసో, తుమి సుఖుఖునె, నొండుమిసో షంగేజ్.ఐసీసీ వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్ను ఆడించండి.. అతడే అందుకు అర్హుడు’ -
వన్డే వరల్డ్ కప్కు రికార్డుస్థాయి ప్రైజ్మనీ.. ఎన్ని కోట్లంటే?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ మ్యాచ్లని శ్రీలంక వేదికగా ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రైజ్మనీ ప్రకటించింది.మొత్తం ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 122 కోట్లు)గా ఖరారు చేసింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన చివరి వన్డే ప్రపంచకప్(2022)తో పోలిస్తే ఈ ప్రైజ్మనీ 300 శాతం అధికం కావడం గమనార్హం. అప్పుడు ప్రైజ్మనీ కేవలం రూ. 30 కోట్ల మాత్రమే. అదేవిధంగా పురుషుల వన్డే వరల్డ్కప్-2023 కంటే అధికం కావడం విశేషం. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీకి ఐసీసీ రూ. 88 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మహిళల ప్రైజ్మనీ పురుషుల టోర్నీని మించిపోయింది.విజేతకు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) నగదు బహుమతి అందనుంది. ఇది 2023 వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ సమయంలో ఆసీస్ కేవలం రూ. 11 కోట్లు మాత్రమే బహుమతిగా లభించింది.ఈ ఏడాది మహిళల ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 19 కోట్లు) లభిస్తాయి. సెమీ ఫైనలిస్ట్లు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) దక్కనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్మనీ కేటాయించింది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్కు 34,314 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) అందనుంది. అదేవిధంగా ఐదు, ఆరు స్ధానాల్లో నిలిచే జట్లకు 700,000 డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు), ఏడు ఎనిమిది స్ధానాల్లో నిలిచే జట్లకు 280,000 డాలర్లు (సుమారు రూ. 2.5 కోట్లు) అందనుంది.ఇక ఈ ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నందుకు ప్రతీ జట్టుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ప్రైజ్ మనీ లభించనుంది. మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రక మైలురాయి అని ఐసీసీ చైర్మెన్ జైషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!? -
ODI World Cup 2025: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్రౌండర్ ఫాతిమా సనా నాయకత్వం వహించనుంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ జట్టు కెప్టెన్గా ఫాతిమా సనా వ్యవహరించడం ఇదే తొలిసారి.అదే విధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్ వంటి యంగ్ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో పాక్ తరపున ఆడనున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. అదేవిధంగా ఆక్టోబర్ 5న కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా శ్రీలంకతో ఆడనుంది.మహిళల వన్డే ప్రపంచకప్కు పాక్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్ (సిద్రా అమీన్ మరియు) అరూబ్ షానాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి -
వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ను ఐసీసీ ఇవాళ (జూన్ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక మ్యాచ్ మాత్రం భారత్లోనే జరుగనుంది.టోర్నీ ఆరంభ మ్యాచ్లో (సెప్టెంబర్ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్కప్ 12 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతుంది.భారత్లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్లు జరుగుతాయి.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను ఓడించి ఏడోసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.పాకిస్తాన్ మ్యాచ్లు కొలొంబోలో ఎందుకు..?ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆడాల్సిన మ్యాచ్లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్లో జరిగాయి. వరల్డ్కప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ కూడా భారత్లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.🚨 SCHEDULE OF WOMEN's ODI WORLD CUP 2025 🚨 pic.twitter.com/n1nB6iYi14— Johns. (@CricCrazyJohns) June 16, 2025భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ దశతో భారత్ మొత్తం ఆరు మ్యాచ్లు ఆడనుంది. దాని షెడ్యూల్ కింది విధంగా ఉంది.మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 5—భారత్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 9—భారత్ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 19—భారత్ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 23—భారత్ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3 -
హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షో
లాహోర్: హేలీ మాథ్యూస్ మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు... రెండో మ్యాచ్లో ఐర్లాండ్పై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో విండీస్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... చినెల్లి హెన్రీ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టెఫానీ టేలర్ (56 బంతుల్లో 46; 5 ఫోర్లు), జైదా జేమ్స్ (36) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో జేన్ మాగుర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు 32.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమీ హంటర్ (46 బంతుల్లో 48; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో వీరోచిత శతకంతో పాటు... బౌలింగ్లో 4 వికెట్లతో విజృంభించినా... జట్టును గెలిపించుకోలేకపోయిన హేలీ మాథ్యూస్... తాజా పోరులోనూ 4 వికెట్లతో సత్తా చాటింది. మైదానంలో పాదరసంలా కదులుతూ మూడు క్యాచ్లు సైతం అందుకుంది. ఇతర విండీస్ బౌలర్లలో ఆలియా, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఆతిథ్య పాకిస్తాన్తో వెస్టిండీస్ తలపడుతుంది. -
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్లో మతమైన క్రికెట్కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్మనీ రాలేదు. సిరీస్లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా కప్లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్లో భారత్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్కు మరో పరాభవం.. వరుసగా మూడో మ్యాచ్లో..!
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు మరో పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓటమిపాలై, క్వార్టర్స్ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్, ఇవాళ (మార్చి 14) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పరాజయంపాలై మరోసారి భంగపడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ బ్యూమోంట్ (62), వికెట్ కీపర్ జోన్స్ (53) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. సఫారీ బౌలర్ కాప్ (5/45) ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. #TeamSouthAfrica win a thriller ✨ Their unbeaten run in the tournament continues, as #TeamEngland remain winless. #CWC22 pic.twitter.com/4M2zQgumTO — ICC Cricket World Cup (@cricketworldcup) March 14, 2022 అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లె లీ (9) వికెట్ కోల్పోయినప్పటికీ.. లారా వొల్వార్డ్ (77), తజ్మిన్ బ్రిట్స్ (23), కెప్టెన్ సూన్ లుస్ (36), మరిజన్నె కాప్ (32)ల బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ల కారణంగా మరో నాలుగు బంతులు ఉండగానే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో త్రిష చెట్టి (11), షబ్రిమ్ ఇస్మాయిల్ (5)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించారు. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇంగ్లండ్పై ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆసీస్ ఉండగా టీమిండియా మూడో స్థానంలో, ఆతరువాత న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్ చేయండి...’! -
NZ Vs IND: సరిపోని హర్మన్ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
-
ICC Womens World Cup: కివీస్తో తేల్చుకోవాల్సిందే
హామిల్టన్: ప్రపంచకప్ సన్నాహాల కోసమే న్యూజిలాండ్కు వచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్కప్లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి మిథాలీ రాజ్ బృందం శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో జైత్రయాత్ర సాగించాలని టీమిండియా ఆశిస్తోంది. గురువారం భారత్ తమ రెండో లీగ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. పాక్తో తొలి మ్యాచ్లో నెగ్గినప్పటికీ బ్యాటింగ్ గొప్పగా అయితే లేదు. టాపార్డర్లో ఓపెనర్ షఫాలీ వర్మ సహా మిడిలార్డర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఇలా ఏ ఒక్కరూ పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. వీరంతా కలిసి చేసింది 15 పరుగులే! లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ రాణించకపోతే టీమిండియా కష్టాల్లో పడేది. ఇప్పుడు పటిష్టమైన న్యూజిలాండ్తో ఏ ఒకరో ఇద్దరో ఆడితే ఏ మాత్రం సరిపోదు. పాక్తో ఆడినట్లు ఆడితే అసలు కుదరనే కుదరదు. ముఖ్యంగా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్లో ఉండటం సానుకూలాంశమైనప్పటికీ మిగతావారు కూడా జట్టు స్కోరులో భాగం కావాలి. అప్పుడే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరొచ్చు. లేదంటే ద్వైపాక్షిక సిరీస్లో ఎదురైన ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పటిష్టంగా కివీస్ మరోవైపు కివీస్ తమ తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో చివరి ఓవర్లో ఓడింది. కానీ వెంటనే తేరుకున్న న్యూజిలాండ్... బంగ్లాదేశ్ను సులువుగా ఓడించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, సుజీ బేట్స్, అమెలియా కెర్ సూపర్ ఫామ్లో ఉండటం జట్టుకు బలం. బౌలింగ్లోనూ లియా తహుహు, జెస్ కెర్, అమీ సాటర్త్వైట్ ప్రత్యర్థి బ్యాటర్స్పై నిప్పులు చెరుగుతున్నారు. సొంతగడ్డ అనుకూలతలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసిన కూడా భారత్, న్యూజిలాండ్ల మధ్య గురువారం ఆసక్తికర పోరు జరగడం ఖాయం. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 12 మ్యాచ్లు జరిగాయి. 2 మ్యాచ్ల్లో భారత్, 9 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
World Cup 2022: న్యూజిలాండ్తో భారత్ పోరు.. వాళ్లదే పైచేయి.. అయినా గానీ..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఎనిమిదో మ్యాచ్లో భాగంగా భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్తో గురువారం తలపడనుంది. సెడాన్ పార్కు వేదికగా జరిగే మ్యాచ్లో వైట్ ఫెర్న్స్తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేల్లో ఎన్నిసార్లు పోటీపడ్డాయి? ప్రపంచకప్ చరిత్రలో ఎవరిది పైచేయి అన్న వివరాలు పరిశీలిద్దాం. వాళ్లే ముందున్నారు! అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్ ఫెర్న్స్ 32 విజయాలు సాధించగా... భారత్ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. వరల్డ్కప్లో ముఖాముఖి రికార్డు ప్రపంచకప్ చరిత్రలోనూ భారత్పై న్యూజిలాండ్ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్ ఫెర్న్స్ జయకేతనం ఎగురవేయగా.. భారత్ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మిథాలీ సూపర్ రికార్డు భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్కు న్యూజిలాండ్పై మంచి రికార్డు ఉంది. ఇరు జట్ల బ్యాటర్లతో పోలిస్తే ఆమే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఈ వెటరన్ బ్యాటర్ 273 పరుగులు సాధించారు. ఇక ప్రపంచకప్ చరిత్రలోనూ ఇరు జట్లు పోటీ పడినపుడు మిథాలీ మాత్రమే సెంచరీ సాధించారు. 2017 వరల్డ్కప్లో మిథాలీ 109 పరుగులు చేశారు. అంకెల్లో వెనుకబడ్డా.. ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ప్రపంచకప్-2017లో న్యూజిలాండ్- భారత్ 2017లో చివరిసారిగా మెగా ఈవెంట్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో వైట్ ఫెర్న్స్పై ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక 109 పరుగులు సాధించిన కెప్టెన్ మిథాలీరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. కాగా ప్రస్తుత టోర్నీలో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారీ విజయంతో బోణీ కొట్టింది. 107 పరుగుల తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్ సైతం బంగ్లాదేశ్ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది జోష్ మీద ఉంది. ఈ క్రమంలో మార్చి 10 నాటి పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1 -
'మూన్బాల్'తో భయపెట్టిన బౌలర్.. షాక్లో బ్యాటర్!
Women's World Cup: వన్డే మహిళల ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ నికోలా కారీ 'మూన్బాల్' తో ప్రత్యర్ధి బ్యాటర్ను షాక్కు గురి చేసింది. పాక్ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన కారీ బౌలింగ్లో.. బంతి చేతి నుంచి జారిపోయి బ్యాటర్ తలపై నుంచి హై ఫుల్ టాస్గా వెళ్లింది. ఆ బంతిని ఆపడానికి వికెట్ కీపర్ అలిస్సా హీలీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంపైర్ ఆ బంతిని నోబాల్గా ప్రకటించారు. అయితే ఫ్రీ హిట్ బాల్కు కారీ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. మూన్ బాల్ బౌలర్ వేసే బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లి కీపర్కు కూడా అందకపోతే దాన్ని మూన్ బాల్గా పరిగణిస్తారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్ను దెబ్బ కొట్టిన ఆసీస్... బంగ్లాను ఆటాడుకున్న సౌతాఫ్రికా
Australia Defeat England, South Africa Beat Bangladesh In Womens ODI World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా ఘన విజయాలు నమోదు చేశాయి. ఇంగ్లండ్పై ఆసీస్ 12 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్ను దక్షిణాఫ్రికా 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేశాయి. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిల మెక్గ్రాత్, జెస్ జొనాస్సెన్ తలో 2 వికెట్లు, మెగాన్ ష్కట్ ఓ వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బంగ్లా బౌలర్లు ఫరీహా త్రిస్న (3/35), జహానరా ఆలమ్ (2/28), రితూ మోనీ (2/36) ధాటికి 49.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో సఫారీ బౌలర్ అయబోంగా ఖాకా (4/32) దెబ్బకు బంగ్లా జట్టు 49.3 ఓవర్లలో 175 పరుగులకే చాపచుట్టేసి 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వాల్వార్డ్( 52 బంతుల్లో 41: 5 ఫోర్లు), క్యాప్ (45 బంతుల్లో 42; 3 ఫోర్లు), టైరన్ (40 బంతుల్లో 39; ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షర్మీన్ అక్తర్ (77 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. మెగా టోర్నీలో రేపు (మార్చి 6) టీమిండియా దాయాది పాక్తో తలపడనుంది. చదవండి: IND VS SL 1st Test: కోహ్లిని గౌరవించుకున్న టీమిండియా -
వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన
రంగియోరా (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. ఓపెనర్ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. -
జైత్రయాత్రకు బ్రేక్
♦ దక్షిణాఫ్రికా చేతిలో భారత్కు పరాభవం ♦ 115 పరుగుల తేడాతో ఓడిన మిథాలీ బృందం ♦ లిజెల్లీ లీ మెరుపు ఇన్నింగ్స్ ♦ డేన్ నికెర్క్ మాయాజాలం మిథాలీ సేన విజయ పరంపరకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న భారత మహిళల జట్టు అనూహ్యంగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాట్తో లిజెల్లీ లీ చెలరేగగా... కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ బంతితో మాయాజాలం చేసింది. దాంతో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్ చేతులెత్తేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. భారత్ సెమీస్ చేరుకోవాలంటే ఈనెల 12న ఆసీస్తో, 15న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ల్లో ఒకదాంట్లో విజయం సాధించాల్సి ఉంటుంది. లీసెస్టర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ నైపుణ్యంతో మిథాలీ సేనను కంగుతినిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 115 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (65 బంతుల్లో 92; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (66 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. శిఖా పాండే 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 46 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (111 బంతుల్లో 60; 5 ఫోర్లు) పోరాడగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ నికెర్క్ 4 వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బ తీసింది. లిజెల్లీ లీ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే శిఖా పాండే షాక్ ఇచ్చింది. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ లౌరా వొల్వార్డ్ (1)ను బౌల్డ్ చేసింది. దీంతో క్రీజ్లో ఉన్న ఓపెనర్ లిజెల్లీకి త్రిశా చెట్టీ (24) జతకాగా, పరుగుల వేగం మందగించింది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి జట్టు 16/1 స్కోరు చేసింది. శిఖా వేసిన ఆరో ఓవర్లో లిజెల్లీ ఒక్కసారిగా 2 ఫోర్లు, సిక్సర్తో జోరు పెంచింది. ఇక్కడితో మొదలైన ఆమె ‘షో’ ఇక ఏ దశలోనూ ఆగలేదు. లిజెల్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడటంతో మిగతా 42 పరుగుల్ని కేవలం 16 బంతుల్లోనే చేసింది. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఆమె మూడో వికెట్గా నిష్క్రమించింది. ఇందులో లిజెల్లీవే 92 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత వాన్ నికెర్క్... డు ప్రీజ్ (22), ట్రియాన్ (24)లతో కలిసి జట్టు స్కోరును 250 పరుగుల్ని దాటించింది. మూకుమ్మడిగా... గెలిస్తే సెమీస్ బెర్తును ఖాయం చేసుకునే మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధన (4) వరుసగా మూడో మ్యాచ్లో విఫలం కాగా... జట్టు స్కోరు 47 పరుగుల వరకు బాగానే సాగింది. అదే స్కోరుపై ఓపెనర్ పూనమ్ రౌత్ (22)ను అయబొంగ ఖాకా బౌల్డ్ చేసింది. అక్కడితో భారత్ పతనం వేగమైంది. నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీల రికార్డును సాధించి న కెప్టెన్ మిథాలీ రాజ్ (0) తొలి బంతికే డకౌటైంది. విండీస్తో మ్యాచ్లో పరుగులే ఇవ్వకుండా 4 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ వాన్ నికెర్క్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మిథాలీని, హర్మన్ప్రీత్ కౌర్ (0)ను డకౌట్ చేసింది. తర్వాత వేద కృష్ణమూర్తి (3)ని అయబొంగ ఖాకా, శిఖా పాండే (0)ను నికెర్క్ పెవిలియన్కు పంపారు. సుష్మా వర్మ (1) రనౌట్ కావడంతో 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వన్డౌన్ బ్యాట్స్మెన్ దీప్తి శర్మ, జులన్ (79 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు) కాసేపు పోరాడినా భారత్ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (బి) శిఖా పాండే 1; లిజెల్లీ లీ ఎల్బీడబ్ల్యూ (బి) హర్మన్ప్రీత్ 92, త్రిశా చెట్టి (సి) జులన్ (బి) ఏక్తా బిష్త్ 24; డు ప్రీజ్ (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 22; మరిజన్ కాప్ (బి) హర్మన్ప్రీత్ 19; వాన్ నికెర్క్ (సి) స్మృతి (బి) శిఖా పాండే 57; సునే లూస్ (సి) వేద (బి) జులన్ 16; క్లో ట్రియాన్ (సి) జులన్ (బి) శిఖా పాండే 24; షబ్నిమ్ (స్టంప్డ్) సుష్మ (బి) ఏక్తా బిష్త్ 5; అయబొంగ ఖాకా నాటౌట్ 7; మొసెలిన్ డానియెల్స్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–1, 2–92, 3–134, 4–160, 5–162, 6–203, 7–252, 8–265, 9–265. బౌలింగ్: జులన్ గోస్వామి 10–0–53–1, శిఖా పాండే 9–0–40–3, ఏక్తా బిష్త్ 9–1–68–2, పూనమ్ యాదవ్ 10–1–31–1, దీప్తి శర్మ 8–0–61–0, హర్మన్ప్రీత్ కౌర్ 4–0–18–2. భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (బి) అయబొంగ ఖాకా 22; స్మృతి (సి) షబ్నిమ్ (బి) మరిజన్ కాప్ 4; దీప్తి శర్మ (సి) మొసెలిన్ (బి) వాన్ నికెర్క్ 60; మిథాలీ రాజ్ (బి) వాన్ నికెర్క్ 0; హర్మన్ప్రీత్ కౌర్ ఎల్బీడబ్ల్యూ (బి) వాన్ నికెర్క్ 0; వేద (బి) అయబొంగ ఖాకా 3; శిఖా పాండే (స్టంప్డ్) త్రిశా చెట్టి (బి) వాన్ నికెర్క్ 0; సుష్మ రనౌట్ 1, జులన్ నాటౌట్ 43; ఏక్తా బిష్త్ (సి) వాన్ నికెర్క్ (బి) లూస్ 13; పూనమ్ యాదవ్ (సి) త్రిశా చెట్టి (బి) షబ్నిమ్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 158. వికెట్ల పతనం: 1–4, 2–47, 3–48, 4–48, 5–53, 6–56, 7–65, 8–118, 9–155, 10–158. బౌలింగ్: షబ్నిమ్ 9–1–18–1, మరిజన్ కాప్ 8–1–31–1, అయబొంగ ఖాకా 10–1–33–2, డానియెల్స్ 3–0–21–0, వాన్ నికెర్క్ 10–0–22–4, లూస్ 6–1–27–1.


