internet services restrored
-
లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు?
శ్రీనగర్: లద్దాఖ్లోని కార్గిల్ జిల్లాలో 145 రోజుల తర్వాత శుక్రవారం మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం కాగా కశ్మీర్ లోయలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మోదీ నేతృత్వంలోని కేంద్రసర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇప్పటికే 145 రోజులవుతోంది. గత నాలుగు నెలల నుంచి కార్గిల్లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగనందున అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సేవలను దుర్వినియోగం చేయొద్దని అక్కడి మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం ఆగస్ట్ 5న ఆర్టికల్–370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసినప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్లో గత 145 రోజులుగా డిజిటల్ బ్లాకవుట్ కొనసాగుతుండగా ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతోందో తెలియదు. సమీప భవిష్యత్తులో సేవలను పునఃప్రారంభించే సూచనలు కూడా కనిపించడం లేదు. -
శ్రీనగర్లో కర్ఫ్యూ ఎత్తివేత
-
శ్రీనగర్లో కర్ఫ్యూ ఎత్తివేత
శ్రీనగర్ : జమ్మాకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆందోళన పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలు తొలగించినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో 17 రోజుల తర్వాత ఆంక్షలతో పాటు కర్ఫ్యూ ఎత్తివేయటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కర్ఫ్యూ ఎత్తివేయటంతో సాధారణ పరిస్థితులు నెలకొనటంతో వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. ఇక ఆందోళనల సందర్భంగా పెల్లెట్ గాయాలైన వారికి సీఆర్ఫీపీఎఫ్ డీజీ క్షమాపణ తెలిపారు. తక్కువ ప్రమాదం గల పెల్లెట్స్ వాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు. కాగా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్తో మొదలైన అల్లర్లను అదుపుచేసే క్రమంలో కశ్మీర్ లోయ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లలో 47మంది మృతి చెందగా, 5500మంది గాయపడ్డారు. కాగా అనంత్నాగ్ జిల్లాలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు వేర్పాటువాదులు బుధవారం ర్యాలీకి పిలుపునిచ్చారు.