jabardasth team
-
మేం ఏం పాపం చేశాం : షేకింగ్ శేషు
సాక్షి, హైదరాబాద్ : ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో టిక్కెట్ కలెక్టర్తో జరిగిన వాగ్వాదంపై జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు వివరణ ఇచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు రిజర్వేషన్ చేసుకున్నామని అయితే, విజయనగరంలో జనరల్ టికెట్తో రైలు ఎక్కామని చెప్పారు. ఒడిశాకు చెందిన టిక్కెట్ కలెక్టర్ వారిపై నోరు పారేసుకున్నట్లు వెల్లడించారు. ఫైన్ కడతామని, వైజాగ్ నుంచి ఏసీ కోచ్కు టికెట్లు రిజర్వేషన్తో ఉన్నాయని టీటీతో చెప్పినట్లు వివరించారు. బదులుగా టీటీ అసహ్యాంగా మాట్లాడారని తెలిపారు. వైజాగ్లో పోలీసుల, స్క్వాడ్ను పిలిచి అల్లరి చేస్తానని బెదిరించాడని చెప్పారు. అందుకే వైజాగ్ స్టేషన్లో కిందికి దిగామని తెలిపారు. తప్పు చేసింది టీటీ కావడంతో తాను జరిమానా కూడా చెల్లించాల్సిన పని లేకుండా పోయిందని చెప్పారు. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి సెల్ఫోన్లో ఆ ఘటనను చిత్రీకరించి మీడియాకు అందించాడని చెప్పారు. దీనిపై మీడియా రచ్చ చేయాల్సిన పనేముందని ప్రశ్నించారు. ఇవాళ సెలబ్రిటీ అంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయారంటూ మండిపడ్డారు. కేవలం టీఆర్పీల కోసం మీడియా ఇలా చేయడం సరికాదన్నారు. తాను రైల్లో ఉండగానే మీడియాలో వార్తల గురించి ఫోన్లు వరుస పెట్టాయని చెప్పారు. ‘మేం ఏం పాపం చేశాం. మీకైదైనా అన్యాయం చేశామా?. రేటింగ్స్ కోసం సెలబ్రిటీలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒక కళాకారుడు బ్రతకకూడదు అని మీడియా అనుకుంటున్నట్లు ఉంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు శేషు. -
ప్రాథమిక విద్యే కీలకం
కొండపాక(గజ్వేల్): చదువులో ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రాథమిక విద్యే కీలకమని సిద్దిపేట జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాబూరావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుకునూరుపల్లిలోని సెంట్ఆన్స్ స్కూల్ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. పిల్లలను హాస్టల్స్లో వేయడం వల్ల ప్రేమాభిమానాలను దూరం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన నాటికలతో పాటు జబర్దస్త్ టీం నిర్వహించిన కామెడీ సబికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోల సద్గుణ, పొల్కంపల్లి లక్ష్మి, జబర్దస్తు టీం స భ్యులు వినోధిని, బుల్లెట్ భాస్కర్, సునామి సుధాకర్, ఉదయ్, పాఠశాల కరస్పాండెంట్ చంటి, ప్రిన్సిపల్ సరోజిని దేవి, ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
‘జబర్దస్త్’ బృందం సభ్యుల సందడి
సిరికొండ(నిజామాబాద్ రూరల్): మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో జబర్దస్త్ బృందం సభ్యులు వినోద్(వినోదిని), జీవన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించని కామెడీ షోతో ఆహూతులను అలరింపజేసింది. విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. వారి కామెడీకి, నృత్యాలకు విద్యార్థులు ఈలలు, చప్పట్లతో కేకలు పెట్టారు. వారితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఎగబడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బాశెట్టి లింబాద్రి, ఎంపీడీవో చందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, రావుట్ల ఎంపీటీసీ సభ్యుడు ఎర్రన్న, సర్పంచ్లు సంజీవ్, రాజేశ్వర్, జాగృతి మండల కన్వీ నర్ కుందేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న జబర్దస్త్ టీం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్లో ఆదివారం రాత్రి రాయల్బాష్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా అట్టహాసంగా ఏ ర్పాటు చేశారు. సినీ హాస్యనటుడు తాగుబోతు రమేష్, జబర్దస్త్ టీం వేణు, ధన్రాజ్, రేడియో జాకీలు కాజల్, చైతు తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. కిరాక్ కబడ్డీ మహిళా ఆర్టిస్ట్లు, సినీ సింగర్లు, డీ డాన్స్ ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ శ్రీను టీం చేసిన నృత్యాలు యువతను ఉర్రూత లూగించాయి. నేపాల్కు చెందిన కళాకారులు అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి అందరికి పంచారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్రెడ్డి, డైరెక్టర్లు పగిడి రఘునాథరెడ్డి, రాకేష్రెడ్డి, ఆపరేషన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మోహన్ మలావత్, మార్కెటింగ్ చీఫ్ పాతకోట రాఘవరెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
జభర్దస్త్ టీమ్కు షాక్!
-
జబర్దస్త్ నటులపై కేసు నమోదు
తిమ్మాపూర్: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంలో పలువురు నటీనటులతోపాటు న్యాయ నిర్ణేతలపై కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈటీవీలో అక్టోబర్ 30న రాత్రి 9.30 గంటలకు జబర్ధస్త్లో ప్రసారమైన కామెడీ షోలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలను అగౌరవపరిచే విధంగా మద్యం సేవించినట్లు అమర్యాదగా ప్రవర్తించినట్లు చూపించారని తిమ్మాపూర్కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు.. జబర్దస్ నటులు శేషు, సుధాకర్, యాంకర్ రష్మీ, న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజాపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. -
''జబర్దస్త్ టీమ్ క్షమాపణ చెప్పాలి''
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 4
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 2
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 1