Kappatralla Venkatappa Naidu
-
'కప్పట్రాళ్ల' హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
-
'మమ్మల్ని పరారీలో ఉండమంది రాజకీయ నేతలే'
కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్యకేసులో నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసులో డిసెంబర్ 10న 21మందికి శిక్ష విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పు సమయంలో దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదని, దాంతో అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు బృందాలుగా ఏర్పడి దివాకర్ నాయుడిని కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రాజకీయ నేతలు తమని పావులుగా వాడుకున్నారని దివాకర్ నాయుడు ఆరోపించారు. 'మమ్మల్ని పరారీలో ఉండమని చెప్పింది రాజకీయ నేతలే అని, రాజకీయ నేతల కుట్రలకు మేం బలయ్యామని' ఆయన అన్నారు. 2008, మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని ప్రత్యర్థులు లారీతో ఢీ కొట్టి, అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. -
'కప్పట్రాళ్ల' హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు. అయితే కోర్టు తీర్పు ముందే దివాకర్ నాయుడు పరారీలో ఉన్నాడు. అతడు తన భార్యతో రైల్వే స్టేషన్లో ఉండగా, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఆచూకీ తెలుసుకున్నట్లు సమాచారం. కాగా 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. -
కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు
కర్నూలు: కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి 21 మందిని దోషులుగా నిర్థారించారు. ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు. 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. (చదవండి: కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్) దీంతో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 48 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే నిందితుల భద్రత దృష్ట్యా ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చాలని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ హత్య కేసు ఆదోని సెషన్స్ కోర్టుకు మారింది. దాదాపు ఆరేళ్లు విచారణ అనంతరం కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరించింది. పోలీసు కేసు నమోదు చేసిన 48 మందిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు.