breaking news
kranthi kumar
-
సాక్ష్యాలు మాయం చేసి అరెస్ట్ చేశావ్... గుట్టు విప్పిన అంబటి
-
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని, క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. -
మాట్లాడితే లోపల వేసి చంపేస్తాం..! గ్యాంగ్ కు గ్యాంగ్ స్టర్..
-
నా కొడుకు క్రాంతి కుమార్ ఎలా చనిపోయాడో.. నిజాలు బయటపెట్టిన తండ్రి
-
వీడియోలో ఏముంది..? ఒక్కొక్కటిగా బయతీకువస్తున్న సీఐ అరాచకాలు
-
పోలీసులే భక్షకులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘పోలీసులే భక్షకులవుతున్నారు. నా బిడ్డ బలవన్మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణం’’ అని పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విమర్శించారు. క్రాంతికుమార్ మరణానికి కారణమైన సీఐ నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్క్లబ్లో పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘నేనొక సామాజిక ఉద్యమకారుడిని. సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేశాను. ప్రజల హక్కులు, దళిత హక్కుల కోసం పోరాడాను. నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెల 21న ఉదయం 10.30 గంటల సమయంలో కృష్ణలంక పోలీసులు నా కుమారుడి ఇంటికి వచ్చారు. సీఐ రమ్మంటున్నారు. పోలీసు స్టేషన్కు రావాలని పిలిచారు. నా బిడ్డ భయపడి రానని చెప్పాడు. ‘‘సీఐ నన్ను చంపేస్తాడు’’ అని పోలీసులతో అన్నాడు. ‘‘నువ్వు వచ్చినా.. రాకపోయినా జరిగేది అదే’’ అని పోలీసులు బెదిరించారు. పోలీసులు పక్క ఇంట్లో ఉన్న నా భార్య వద్దకు వెళ్లి మీ అబ్బాయిని బయటకు రమ్మని చెప్పండని కోరారు. నా భార్య అక్కడికి వెళ్లి కొడుకును బయటకు రమ్మని చెప్పగా .. ‘‘వద్దమ్మ నేను బయటకు వస్తే చంపేస్తారు’’ అని భయపడుతూ నా కొడుకు చెప్పాడు. తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అనంతరం 11 గంటల సమయంలో నా కొడుకు గుళికల మందు తాగాడు. వెంటనే అక్కడే ఉన్న నా భార్య తలుపులు తీయాలని కోరగా తలుపులు తీశాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ వెంటనే హెల్ప్ హాస్పిటల్కు తరలించాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లాం. అదే రోజు రాత్రి హాస్పిటల్లో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమోనని తొలుత అనుకున్నాం. కానీ అతని ఫోన్ వెతకగా సెల్ఫీ వీడియో బయటపడింది. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశాం. దీంతో సీపీ వారం గడువు కావాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు రాయబారానికి వచ్చారు. నేను నా కొడుకు మరణంపై ప్రైవేటు కేసు వేయడానికి సిద్ధమయ్యా.’’ అని వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. మా అబ్బాయి ఒక్కడే కాదు...పోలీసుల మీద నమ్మకం కోల్పోయానని పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి ఒక్కడే కాదు. అతని కంటే ముందే సాయికృష్ణ అనే అతన్ని కూడా పోలీసులే గోళ్లు పీకి లాకప్ డెత్ చేసిన విషయం బయట పడింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధమై లాయర్లను కలుసుకున్నా. ఈ క్రమంలో గురువారం నా కుమారుడు వీడియో బయటకు వచ్చింది. నేనైతే వీడియో బయటికి పంపలేదు. కానీ క్రాంతి చనిపోయే ముందు తన స్నేహితులకు ఆ వీడియో పంపాడు. వారి ద్వారా బయటకు వచ్చింది. నా కొడుకు రౌడీషీటరే. కాదనను. సాయికృష్ణ, నా బిడ్డ క్రాంతికుమార్ వీరికంటే ముందు ఇంకా అనేక మంది సీఐ వేధింపుల బారిన పడ్డారు.’ అని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారు‘‘పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని పోలీసులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పోలీసులు చెప్పినట్లు చేయకుంటే వారం వారం స్టేషన్కు రావడం లేదన్న పేరుతో కొట్టి వేధిస్తున్నారన్నారు. నా బిడ్డ ఇవన్నీ నాకు చెప్పుకోలేక పోయాడు. ఒకటి రెండు సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రతిసారీ పోలీసులు ఇంటికి రావడం వల్ల నా బిడ్డ భయపడిపోయాడు. సెల్ఫీ వీడియోలోనూ నేను ఎస్సీ మాదిగగా పుట్టడమే తప్పా అంటూ ఆవేదన చెందాడు. సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. అతడిని తక్షణమే అరెస్టుచేయాలి. కఠినంగా శిక్షించాలి’’ అని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా బిడ్డలా ఎవరూ బలి కాకూడదు‘‘నా బిడ్డ ఆత్మహత్యపై నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయ్యాక స్పందించాలనుకున్నా. దీంతో నేను ప్రలోభాలకు లొంగిపోయానని వార్తలు వచ్చాయి. నేనెవ్వరికి లొంగిపోలేదు. నా బిడ్డ మరణంపై న్యాయ పోరాటం చేస్తా. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కూడా స్పందించాలి. నేను కోరుతున్నది ఒక్కటే . ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలి. నా బిడ్డలా ఏ వ్యక్తి బలికాకూడదు.’’ అని పేరుపోగు వెంకటేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు. -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
నా కొడుకు చనిపోయే ముందు చివరి మాటలు.. క్రాంతి కుమార్ తండ్రి షాకింగ్ కామెంట్స్
-
సర్కారు అండతో ఖాకీల క్రౌర్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఖాకీ కర్కశం వికట్టాహాసం చేస్తోంది. పోలీసు లాఠీ రాజ్యమేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు థర్డ్ డిగ్రీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. రక్షకభట నిలయాలు మానవ వథశాలలుగా మారుతున్నాయి. చంద్రబాబు అండదండలతో టీడీపీ వీరవిధేయ ఐపీఎస్లు రెచ్చిపోయి అరాచకం ప్రదర్శిస్తున్నారు. రోజులు, నెలల తరబడి యువకులను అక్రమంగా నిర్బంధించి.. చిత్రహింసలకు గురిచేస్తూ వారి పాలిట పోలీసులే యమకింకరులుగా మారుతున్నారు. అందుకు విజయవాడ కేంద్రబిందువుగా మారడం గమనార్హం. విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్లోనే పోలీస్ థర్డ్ డిగ్రీ వికృత రూపం దాల్చింది. విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి ‘కనుమరుగు’ చేసిన ఉదంతం సంచలనంగా మారగా... అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో పోగు క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలపైనా కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతుండగా.. దళిత సంఘాలు సైతం పోలీస్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహోదగ్రమవుతున్నాయి. పోలీస్ దందాకు ఎదురు తిరగడంతో.. తాజా ఉదంతంలో విజయవాడకు చెందిన దళిత యువకుడు పోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ముందు రికార్డు చేసిన మరణ వాంగ్మూలం సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు బాధ్యుడని కూడా స్పష్టం చేస్తూ క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అందర్నీ కలచి వేస్తోంది. ఈ ఉదంతంతో క్రాంతికుమార్ను పోలీసులు ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారన్నది వెలుగులోకి వచ్చింది.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పోగు వెంకటేశ్వరరావు కుమారుడైన క్రాంతికుమార్ వివిధ పనులు చేసుకుంటూ జీవించేవారు. అతడిని కృష్ణలంక పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పిన పనులన్నీ చేయాలని వేధించారు. తమకు అనుకూలంగా నేరాలు చేసేలా.. తమ సెటిల్మెంట్లకు సహకరించేలా పోలీసులు ఆయన్ని వాడుకున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల తరువాత పోలీసుల దందాకు తాను సహకరించలేనని క్రాంతికుమార్ ఎదురుతిరిగారు. దాంతో పోలీసులు ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి లాఠీమార్కు వేధింపులకు గురి చేశారు. విచారణ పేరుతో రోజూ స్టేషన్కు పిలిపించి వేధించడమే కాకుండా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇలా మూడు నెలలపాటు పోలీసుల అరాచకం సాగింది. వేధింపులు తట్టుకోలేక.. పోలీసులు థర్డ్ డిగ్రీకి తన శరీరం ఇక ఏమాత్రం సహకరించదని భీతిల్లిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ట్విస్ట్ ఇదీ కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ పోలీసులు మే 9న అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీవ్రంగా చిత్రవథకు గురిచేశారు. కాళ్లూ చేతులూ కట్టేసి లాఠీలతో విరుచుకుపడుతుండటంతో సాయికృష్ణ హాహాకారాలు చేశాడు. పోలీసులు రోజుల తరబడి ఈ అరాచకం కొనసాగించారు. అదే సమయంలో దళిత యువకుడు క్రాంతికుమార్ను సైతం పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. అనంతరం సాయికృష్ణను ఏం చేయాలనే దానిపై పోలీసులు మంతనాలు సాగించారు. పోలీస్ బాస్తోను, మరికొందరు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటాన్ని క్రాంతికుమార్ గమనించారు. పక్కా పన్నాగంతోనే సాయికృష్ణను ‘కనుమరుగు’ చేయడాన్ని క్రాంతి ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. తనను కూడా ఇదేవిధంగా చేస్తారని.. సాయికృష్ణలా కనుమరుగైపోతే.. కనీసం తన మృతదేహం కూడా తన కుటుంబ సభ్యులకు దక్కదని క్రాంతికుమార్ భావించారు. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తింటూ ప్రాణాలు విడిచేకంటే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని నిర్ణయించుకున్నారు. తన మరణానికి కారణమేమిటనే దానిపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు పెడితే పోలీసు మార్క్ బెదిరింపులు పోలీసుల చిత్రహింసలు భరించలేక క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తప్పనిసరి కావడంతో పోలీసులు మే 22న కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు బాస్, ఇతర అధికారులు వెంకటేశ్వరరావుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును పట్టించుకోవద్దని.. కాదని మొండికేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ మాట వింటే తృణమో ఫణమో ఇస్తామని కూడా ప్రలోభపెట్టారు. లేకపోతే క్రాంతికుమార్కు పట్టిన గతే ఇతరులకూ పడుతుందని హెచ్చరించారు. దాంతో వెంటేశ్వరరావు మౌనం వహించినట్టు తెలుస్తోంది. పోలీసులే దగ్గరుండి క్రాంతికుమార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయించారు. ఆ విధంగా తమ అరాచకాన్ని గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చామని భావించారు. ఆ తరువాత సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగైన విషయం వెలుగులోకి రాగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనివెనుక విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ సూత్రధారులనే విషయం బయటపడింది. దాంతో బాధిత కుటుంబం ధైర్యం చేసి క్రాంతికుమార్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అన్ని వేళ్లూ బాస్.. బిగ్బాస్వైపే పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు కావడం, దళిత యువకుడు క్రాంతికుమార్ పోలీసుల థర్డ్ డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలను పోలీసులు నిస్సిగ్గుగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వారి దమనకాండకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ రెండు ఉదంతాలను సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారులను తప్పించేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ రెండు దారుణాల వెనుక అన్ని వేళ్లూ విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే.. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అచేతనంగా మారిన తరువాత కనుమరుగు చేయడం అన్నది సీఐ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదన్నది పోలీసు శాఖ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. పోలీస్ కమిషనరేట్కు అల్టిమేట్ బాస్ పోలీస్ కమిషనరే. ఆయనకు చెప్పకుండా సాయికృష్ణను కనుమరుగు చేయడం సాధ్యం కాదు. ఇక రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుడిని పోలీసులే అదృశ్యం చేసిన విషయాన్ని నగర బాస్.. బిగ్ బాస్ దృష్టికి ముందుగా తీసుకువెళ్లకుండా ఉంటారా అంటే.. కచ్చితంగా కాదని స్పష్టం చేస్తున్నారు పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన అధికారులు. అంటే ఈ విషయాలపై బిగ్ బాస్కు ముందుగానే తగిన సమాచారం ఉండి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎంవో అండదండలు ఉన్న పోలీస్ బాస్, బిగ్బాస్ స్వయంగా కథ నడపించారు కాబట్టే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎంతగా ఆవేదన వెళ్లగక్కినా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకువచ్చింది. ఐజీపై విచారణకు ఎస్పీనా?! సాయికృష్ణను లాకప్లో అదృశ్యం చేసిన దారుణాన్ని చాకచక్యంగా కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా కుట్రకు తెర తీసింది. ఈ ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపించి సరిపెట్టాలని యత్నించింది. చివరకు ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఈ ఉదంతంపై విచారణకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీఎన్ కిశోర్ను నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ఎందుకంటే సాయికృష్ణ అదృశ్యం వెనుక కేవలం సీఐ నాగరాజు మాత్రమే కాదు.. విజయవాడ టాస్్కఫోర్స్ విభాగంలో ఇద్దరు ఎస్పీస్థాయి మహిళా అధికారులు, పోలీస్ బాస్ పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పోలీస్ బిగ్బాస్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నది కీలకంగా మారింది. అంటే సాయికృష్ణ కనుమరుగైపోయిన ఉదంతంపై విచారించాలంటే.. ప్రాథమికంగా కృష్ణలంక సీఐ నుంచి నగర బాస్ వరకు అధికారులను విచారించాలి. నగర బాస్ ఐజీ ర్యాంక్ అధికారి. ప్రభుత్వం మాత్రం ఎస్పీస్థాయి అధికారి డీఎన్ కిశోర్ను నియమించడం గమనార్హం. నిజానికి ఎస్పీస్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి చేసిన అరాచకం, అక్రమాలపై విచారించలేరు. అది పోలీస్ ప్రోటోకాల్ కూడా కాదు. అయినా సరే ప్రభుత్వం ఎస్పీస్థాయి అధికారినే విచారణాధికారిగా నియమించింది. అంటే విచారణ వ్యవహారాన్ని సీఐ వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ కుతంత్రమనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ వీరవిధేయ ఐపీఎస్గా రెడ్బుక్ కుట్రలను అమలు చేస్తున్న రాజశేఖరబాబుకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. సీబీఐ విచారణతోనే న్యాయం: న్యాయ నిపుణులు ‘సాయికృష్ణ ఉదంతంపై వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. ఎందుకంటే పోలీస్ అత్యున్నత అధికారుల పాత్ర ఉందని భావిస్తున్న ఈ కేసును దిగువస్థాయి అధికారి అయిన ఎస్పీ డీఎన్ కిశోర్ విచారించడం నిబంధనలకు విరుద్ధం. ఆయన నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించడం సాధ్యం కాదు’ అని న్యాయనిపుణులు, పౌర హక్కుల సంఘాల నేతలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అందుకే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘తూత్తుకుడి’ తీర్పు రిపీట్ కావచ్చు సాయికృష్ణ ఉదంతం నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి దారుణ ఉదంతాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తూత్తుకుడి పోలీసులు తండ్రీకొడుకులను పోలీస్ స్టేషన్లో అత్యంత భయంకరంగా హింసించడంతో ఇద్దరూ మరణించారు. ఈ కేసును విచారించిన మధురై న్యాయస్థానం ఆ దారుణంలో భాగస్వాములైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 6న సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం విజయవాడ పోలీసులు పాల్పడిన దారుణం కూడా అటువంటిదేనని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశా: మహంకాళి చందు గాదె సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలకు గురి చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని మహంకాళి చందు అనే యువకుడు వీడియో విడుదల చేశారు. తనను కూడా పోలీసులు ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని ఆయన చెప్పాడు. ‘కృష్ణలంక పోలీసులు నన్నూ ఓ కేసులో అదుపులోకి తీసుకుని లాకప్లో పెట్టారు. అదే లాకప్లో ఉన్న సాయికృష్ణపై పోలీసులు విచక్షణా రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. పోలీసులు అంతటి దారుణానికి పాల్పడ్డారు. సాయికృష్ణ చేసిన నేరాన్ని ఒప్పుకున్నా.. చేయని ఇతర నేరాలు కూడా ఒప్పుకోవాలని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతడిని వేధించారు’ అని ఆ వీడియోలో మహంకాళి వివరించాడు. -
వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్
తక్కువ కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ 'ఆర్ట్ డైరెక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి స్వస్థలం. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లో కావడంతో కన్నడ భాష కూడా వచ్చింది. ఇంట్లో టీవీ లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ఫ్యాషన్ పెంచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు డిప్లొమాలు, పీజీ (థియేటర్) పూర్తి చేశారు క్రాంతి కుమార్. హైదరాబాద్లో అనేక లఘు చిత్రాలకు పనిచేశారు. నాటకాల కోసం సెట్లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు. నంది అవార్డుతో మొదలైన గెలుపు క్రాంతి కుమార్కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూద చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్కి విజయం సాధించారు. తన సక్సెస్ పట్ల క్రాంతికుమార్ మాట్లాడూతూ..' సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఓపిక కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తా. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం. ' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం 'పేక మేడలు', 'బహిష్కరణ' జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్లను శరవేగంగా పూర్తి చేశారు. అంతేకాదు, రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా, కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్డ్రాప్లో రానున్నాయి. క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. -
ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ.. భర్తకు రెడ్హ్యాండెడ్గా దొరికి..
సాక్షి, తాడేపల్లిరూరల్(మంగళగిరి): పండగ వేళ కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను కర్కశంగా హతమార్చింది. విచక్షణారహితంగా కొట్టి చంపింది. మంగళగిరి సీఐ అంకమరావు కథనం ప్రకారం మంగళగిరి పట్టణానికి చెందిన వింజమూరు క్రాంతికుమార్ (32) బంగారం పని చేస్తుంటాడు. ఏడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన గంగాలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. క్రాంతికుమార్ శనివారం అర్ధరాత్రి వరకు షాపులో ఉండి అనంతరం ఇంటికి వచ్చాడు. సమీప బంధువు అయిన ఏలూరుకు చెందిన మరిడయ్య అనే యువకుడితో కలిసి గంగాలక్ష్మి బెడ్రూంలో సన్నిహితంగా ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. భార్యతో గొడవ పడ్డాడు. మరిడయ్యను నిలదీశాడు. దీంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో క్రాంతికుమార్ను గంగాలక్ష్మితోపాటు మరిడయ్య బయటకు తీసుకొచ్చి మరో వ్యక్తితో కలిసి విచక్షణా రహితంగా రాడ్లతో కొట్టారు. దీంతో క్రాంతికుమార్ బిగ్గరగా కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి క్రాంతికుమార్ మృతి చెందాడు. గంగాలక్ష్మి, మరిడయ్యతో కలిసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించింది. ఇదే సమయంలో ఘటనాస్థలానికి వచ్చిన మంగళగిరి సీఐ అంకమరావు గంగాలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిడయ్య, మరో వ్యక్తి పరారయ్యారు. క్రాంతికుమార్ సోదరుడు హరి కృష్ణ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాక ముందు నుంచే గంగాలక్ష్మి మరిడయ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. గంగాలక్ష్మి భర్తతో కలిసి ఆదివారం ఉదయం పండగకు ఏలూరు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరిడయ్య ఇక్కడకు రావడం, క్రాంతికుమార్ను చంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు పథకంలో భాగంగానే హత్య జరిగినట్టు క్రాంతి కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. చదవండి: (షార్లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
`సూర్యాస్తమయం` చేయడం గర్వంగా ఉంది
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్ రెడ్డి. ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు. -
సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, సిద్ధిపేట: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీజేపీ నేతల మధ్య తోపుటలా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్ను కోరుతున్నామన్నారు. -
గెలుపు పంటలు!
యుద్ధభేరి మోగగానే ఆహార భద్రత గురించిన ఆలోచన మదిలో రేకెత్తుతుంది. కష్టకాలంలోనే ఆహార స్వావలంబన మార్గాల అన్వేషణ ప్రారంభమవుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటి పంటలు, పెరటి తోటల సాగు దిశగా అడుగులు పడతాయి. తొలి, మలి ప్రపంచ యుద్ధ కాలాల్లోనూ ‘విక్టరీ గార్డెన్స్’ విస్తరించాయని చరిత్ర చెబుతోంది. అమెరికా విధించిన కఠోర ఆంక్షల నడుమ క్యూబా బతికి బట్టకట్టగలిగింది కూడా సేంద్రియ ఇంటిపంటల ద్వారానే. కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడిన ఈ యుద్ధ కాలమూ అందుకు అతీతం కాదు. గోదాముల్లో తిండి గింజలకు కొరత లేదు. కానీ వాటికి మన సేంద్రియ ఇంటిపంటలు కూడా తోడైతేనే సంపూర్ణ ఆహార భద్రత చేకూరేది. అప్పుడే పౌష్టికాహార లోపాన్ని, అనారోగ్యాలనూ మనం గెలవగలం. అందుకే మనకు ఇప్పుడు ఇంటింటా ‘గెలుపు పంటలు’ కావాలి! కరోనా మహమ్మారి విశ్వమానవాళిపై యుద్ధం ప్రకటించగానే ఆహార భద్రత గురించిన తలపులు మదిలో మెదిలాయి. లాక్డౌన్ పునరాలోచనకు పురికొల్పింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొంతమేరకైనా ఇంటి పట్టున అప్పటికే పండించుకుంటున్న నగరాలు, పట్టణ వాసులు సంతోషించారు. టెర్రస్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడమే మేలన్న భావన మిగతా వారిలోనూ వేరూనుకుంటున్నది. ఈ చైతన్యం మున్ముందు అర్బన్ ఫార్మింగ్ వ్యాప్తికి దోహదం చేస్తుందని ఆర్కిటెక్ట్లు, ఆహార నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘మనం తినే ఆహారం ఎంత దూరం నుంచి తరలివస్తున్నది? అక్కడి నుంచి తరలి వచ్చే దారిలో ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం ఉంది? ఈ అవాంతరాలను తగ్గించుకునే మార్గాలేమి ఉన్నాయి? అని చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు’ అని థాయ్లాండ్కు చెందిన ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కొచ్చకార్న్ ఒరాఖోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. బాంకాక్లో ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ రూఫ్టాప్ ఫామ్కు రూపుకల్పన చేసిన ఆర్కిటెక్ట్గా ఆమె ప్రసిద్ధిపొందారు. తొలి ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ‘విక్టరీ గార్డెన్స్’ పేరిట పంటల సాగు చేపట్టాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అంతే. అమెరికాలో ప్రతి ఇల్లు, స్కూలు పరిసరాల్లో గజం కూడా ఖాళీ స్థలం వదలకుండా కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష భవనం ఎదుట కూడా కూరగాయలు సాగు చేశారు. 1940వ దశకంలో 2 కోట్ల అమెరికన్ కుటుంబాలు కూరగాయలు ఇంటిపంటలు పండించడం ప్రారంభించారు. నాలుగేళ్లలో 40% కూరగాయలను విక్టరీ గార్డెన్లే వారికి తఅందించాయట. ‘ఇంటిపంటల టవర్’ విశేషం ఏమిటంటే.. దీని పైన, చుట్టూతా కూడా అనేక మొక్కలు పెంచుకోవచ్చు. కంపోస్టు తయారు చేసుకోవచ్చు. టవర్ పైభాగన నీరు పోస్తే చాలు. ♦ అమెరికా కఠోర ఆంక్షల వల్ల క్యూబాకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చమురు దిగుమతి ఆగిపోయింది. ఆ కష్టకాలంలో క్యూబా నగరాలు, పట్టణాల్లో ప్రజలు సేంద్రియ ఇంటి పంటల సాగు ద్వారానే బతికి బట్టకట్టగలిగారు. అంతేకాదు, తాము పండించిన కూరగాయలు, పండ్లు గ్రామాలకు కూడా పంపగలిగారు! ♦ 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు మంది నగరాల్లో నివాసం ఉండబోతున్నారని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. వీరికి కావాల్సిన కూరగాయలు, పండ్లలో కొంత మేరకైనా అర్భన్ ప్రాంతాల్లోనే పండించే మార్గాంతరాలు వెతకాల్సి ఉందని ఎర్త్ ఫ్యూచర్ అధ్యయనం చెబుతోంది. ♦ భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరీకరణ వేగం పుంజుకున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతవాసుల్లో పౌష్టికాహార లోపం (హిడెన్ హంగర్) పెరుగుతున్నది. కనపడని శత్రువుపై పోరులో మనకు నిండుగా తోడుండేవి ఇంటి పంటలు. ♦ అవును, ఇవే గెలిపించే పంటలు.. మనుషులుగా మనల్ని, దేశాన్ని కూడా! ♦ ఇంటిపంటలు ఎంత మంచివైనా ఇప్పుడు టైం ఎక్కడుందిలే అని ఇక సరిపెట్టుకోలేం!!– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి ‘ఇంటిపంటల టవర్’తో మేలు పట్టణాలు, నగరాల్లో గృహస్తులు టెర్రస్ల మీద కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మా ఇంటిపైన పుదీనా, పొన్నగంటి, గంగవాయిలి, ఎర్రగలిజేరు వంటి ఆకుకూరలు, టమాటా, వంగ వంటి కూరగాయలను అతితక్కువ స్థలంలో ఇమిడిపోయే ‘ఇంటిపంటల టవర్’లో పెంచుతున్నాం. మేం తినడంతోపాటు బంధుమిత్రులకూ పంచుతున్నాం. వంటింటి వ్యర్థాలను ఈ టవర్లో వేసి కంపోస్టు తయారు చేస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కుటుంబాల పౌష్టికాహార, ఆరోగ్య భద్రతకు టవర్ గార్డెనింగ్ ఎంతగానో దోహదపడుతుంది. – కె. క్రాంతికుమార్రెడ్డి,లక్ష్మి దంపతులు (83096 15657),రామాంతపూర్, హైదరాబాద్అర్బన్ ఫార్మింగ్తోనే ఆహార భద్రత ప్రజలు, ప్రణాళికావేత్తలు, ప్రభుత్వాలు కూడా నగరాల్లో భూమిని ఇప్పుడు ఉపయోగిస్తున్న తీరుపై పునరాలోచన చేయాలి. అర్బన్ ఫార్మింగ్కు చోటివ్వాలి. ఇది ఆహార భద్రతను కల్పించడంతోపాటు పౌష్టికాహార లోపాన్ని అరికడుతుంది. వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మానసిక వత్తిడినీ ఉపశమింపజేస్తుంది.– కొచ్చకార్న్ ఒరాఖోమ్,ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్,ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ ఫామ్ రూపశిల్పి, బ్యాంకాక్ -
ఫైర్మేన్ను అభినందించిన మెగాస్టార్
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు. అంతేకాదు క్రాంతి కుమార్కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు. -
పంట సాగులో ‘క్రాంతి’
రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో పంట సాగు చేపట్టి విప్లవాత్మక ఫలితాలను సాధిస్తున్నాడు బీటెక్ విద్యార్థి క్రాంతికుమార్. బుక్కరాయసముద్రంలోని కేకే అగ్రహారానికి చెందిన జ్యోతి, నాగేశ్వరరెడ్డి దంపతలు కుమారుడు క్రాంతికుమార్ రెడ్డి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ (ద్వితీయ) చేస్తున్నాడు. తమకున్న 13 ఎకరాల పొలంలో వివిధ రకాల పంట సాగు చేపట్టారు. వరిసాగులో సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఎకరాకు 45 బస్తాల ధాన్యం పండించగలిగినట్లు కాంత్రికుమార్ తెలిపారు. ఎకరా పొలంలో వరిసాగుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు పెట్టుబడి అయిందని, పంట దిగుబడి విక్రయిస్తే రూ. 50 వేలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. బేర్ యాపిల్, దానిమ్మ, వంకాయ పంటలను కూడా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నట్లు వివరించారు. - బుక్కరాయసముద్రం (శింగనమల) సేంద్రియ ఎరువుల తయారీ ఇలా.. జీవామృతం : పేడ, ఆవు మూత్రం, బెల్లం, సెనగపిండి, దోసెడు గట్టు మన్ను కలిపి ఐదు రోజులు నిల్వ ఉంచిన తర్వాత పొలంపై పిచికారి చేసుకోవాలి. నీమాశ్రమం : వేపాకు, కిలో పేడ, ఆవు మూత్రం బాగా రుబ్బి రెండ్రోజలు తర్వాత పిచికారి చేసుకోవాలి. దశ పరణి కషాయం : వేపాకు, ఉమ్మెత్త ఆకులు, జిల్లేడు ఆకులు, బంతి పూల ఆకులు, తంగేడు ఆకులు, బాగా మిశ్రమం చేసి మూడు రోజుల తరువాత స్ప్రే చేయాలి. మురిపిండి కషాయం : కిలో పిప్పి ఆకు, లీటరు పాలు, వేపాకు కషాయం, ఆవు మూత్రం కలిపి నాలుగు రోజుల తర్వాత పిచికారి చేయాలి. ఇవన్నీ పచ్చ పురుగు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణతో పాటు కాయ నాణ్యతకు, పూత రావడానికి ఎంతో ఉపయోగపడతాయి. జీవన ఎరువులే ఎంతో మేలు పంటల సాగులో జీనవ ఎరువుల వినియోగం లాభదాయకం. ప్రతి ఒక్కరూ జీవన ఎరువులను వాడితే పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లవుతుంది. పంట దిగుబడి నాణ్యతగా ఉండడంతో పాటు రైతుకు లాభదాయకంగానూ ఉంటుంది. - డాక్టర్ లక్ష్మిరెడ్డి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త -
డాన్స్ చేయలేదని చితకబాదాడు
బాన్సువాడ టౌన్: డాన్స్ చేయనందుకు ఓ డీఎడ్ శిక్షణలో ఉన్న ఓ వ్యక్తి విద్యార్థిని చితకబాదాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి విద్యార్థిని దివ్యను డీఎడ్ శిక్షణ పొందుతున్న క్రాంతికుమార్ కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన దివ్య వీపును చూసిన ఆమె తండ్రి ప్రభాకర్ వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తరగతి గదిలో తనను నృత్యం చేయాలని క్రాంతి సార్ కోరాడని.. చేయకపోవడంతో కర్రతో కొట్టాడని విద్యార్థిని దివ్య తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మీడియాకు చెప్పారు. -
నవ వధువు అదృశ్యం
మారేడుపల్లి: భర్తతో కలిసి నగరానికి వచ్చిన ఓ నవ వధువు కనిపించకుండాపోయింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన వేముల క్రాంతి కిరణ్కు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన జ్యోతితో గత నెలలో వివాహమైంది. క్రాంతి కిరణ్ సికింద్రాబాద్లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లేందుకు భార్యతో కలిసి ఆదివారం జూబ్లీ బస్టాండ్కు చేరుకున్నాడు. బస్టాండ్కు వచ్చాక జ్యోతి వాష్ రూంకు వెళ్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో భర్త, బంధువులు చుట్టుపక్కల వారిని వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త క్రాంతికిరణ్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పార్కింగ్ యాప్
క్రాంతికుమార్ను హ్యాకథాన్లో గెలిపించిన ప్రాజెక్ట్.. హైదరాబాద్ పార్కింగ్ యాప్. క్రాంతికుమార్ స్వస్థలం ఖమ్మం. తల్లిదండ్రులు కమల, సులోచనరామ. కంప్యూటర్ గేమ్స్ టెక్నాలజీలో యూకే యూనివర్శిటీలో ఎమ్మెస్ చేసొచ్చాడు. అక్కడే ఎడిన్బర్గ్లో కొన్నాళ్లు పనిచేసొచ్చి బెంగళూరు ఐబీఎంలో చేరాడు. తర్వాత ‘పర్ఫెక్ట్ 12’ అనే సొంత కంపెనీ స్థాపించాడు. ఈ యాప్ తయారీలో తనను ఏ ఆలోచన నడిపించిందో క్రాంతి చెబుతూ.. ‘నేను కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను. ఓ రోజు పేపర్లో ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో స్థలం లేక పనికోసం అక్కడికి వచ్చిన వాళ్లంతా తమ వాహనాలను రోడ్డుమీదే నిలుపుతున్నార’నే వార్త చదివాను. పార్కింగ్ స్థలాలు నిర్వహించే జీహెచ్ఎంసీకి పార్కింగ్ స్థలం లేకపోవడమేంటి ?. హైదరాబాద్ నడిబొడ్డున స్థలం లేదు. ఉన్న స్థలాన్ని ఎలా వాడుకోవచ్చనే ఆలోచన నుంచే ఈ యాప్ పుట్టింది. ముందుగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని వాహనాలున్నాయి? నిత్యం ఎన్ని కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి? జీహెచ్ఎమ్సీ నిర్వహణలో ఉన్న పార్కింగ్ స్థలాలెన్ని.. ఇలా లెక్కలన్నీ తీశాను. జీహెచ్ఎంసీ 47 పార్కింగ్ స్థలాలను మాత్రమే నిర్వహిస్తుందని తేలింది. అంతే నా హెచ్వైడీ పార్కింగ్ యాప్ తయారీకి బీజం పడింది’ అని వివరించారు. ఎలా పనిచేస్తుందంటే.. మీ ఇంటి దగ్గర గానీ, మీ షాప్ ప్రాంగణంలో గానీ, సిటీలో ఇంకెక్కడైనా గానీ మీకు ఖాళీ స్థలం ఉంటే ఆ ప్రదేశాన్ని కార్పొరేషన్కి ఇవ్వదలిస్తే ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ నేరుగా జీహెచ్ఎంసీ అధికారులకు వెళ్తుంది. వారు మిమ్మల్ని సంప్రదించి ఆ స్థలాన్ని పార్కింగ్కి ఇచ్చేట్టుగా మీకు అనుమతి మంజూరు చేస్తారు. అంతేకాదు మీరు పార్కింగ్ నిర్వహించదలచుకుంటే కూడా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ పార్కింగ్ స్థల సమాచారం ఈ యాప్ ఉపయోగించే వారికి తెలుస్తుంది. అబిడ్స్ వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. వాహనదారులకు ఆ ప్రదేశానికి దగ్గర్లోని పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఈ యాప్ చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నగరంలోని పార్కింగ్ ప్లేసెస్ సమస్త సమాచారం యాప్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పటికే ఇది 300 పైగా పార్కింగ్ స్థలాలను గుర్తించింది. అనుమతిలేని చోట్ల పార్కింగ్ దందా చేస్తున్న వాళ్ల మీదా ఈ యాప్లో ఫిర్యాదు చేయొచ్చు. ఇది త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ‘రానున్నది స్మార్ట్ సిటీ కాలం. దీన్ని దృష్టిలోపెట్టుకొనే నగరాల్లోని రిటైల్ స్టోర్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ మొదలైన వాటికి ‘స్మార్ట్ సొల్యూషన్’ అనే కాన్సెప్ట్పై రీసెర్చ్ చేస్తున్నాను. మొబైల్ యాప్సే కాకుండా వెబ్యాప్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్.. ఇట్లా అన్ని సొల్యూషన్స్ మీదా వర్క్ చేస్తున్నాను’ అని క్రాంతికుమార్ తెలిపారు. -
ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్ చలవే
ధారూరు, న్యూస్లైన్: వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వమే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 4 శాతం నుంచి 11 శాతానికి పెంచి అమలు చేయనున్నారని వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి క్రాంతికుమార్ అన్నారు. మండలంలోని సర్పన్పల్లి, అంతారం గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచార పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా కొండా రాఘవరెడ్డిని, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. మహానేత మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ప్రజలకు దూరం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని, దీనికి తమ పార్టీ రూపొందించిన మెనిఫెస్టోనే నిదర్శనమన్నారు. టీడీపీ నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంట్ అంటే వైర్లకు బట్టలు ఆరేసుకున్నట్లే.. అన్న ఆయన ఇప్పుడు ఉచిత విద్యుత్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగాల నిషేధాన్ని కొనసాగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసిన చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజల్ని కష్టాల పాలుచేసిన చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి దివంగత నేత వైఎస్ఆర్ ఆశయం నెరవేర్చేలా దీవించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ీ సపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగరాజ్, నాయకులు రాఘవరెడ్డి, రాజేందర్రెడ్డి, పి.రమేశ్, గోవర్దన్రెడ్డి, రాంరెడ్డి, బెనర్జీ, రాజిరెడ్డి, నవాజ్ఖాన్, రాజునాయక్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ ఐదుగురు' మూవీ ట్రైలర్ లాంచ్


