kumbamela
-
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
మేడారంలో నేడు మండమెలిగె పండుగ.. జాతరలో ఇది కీలక ఘట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. నాలుగు రోజులు కార్యక్రమాలు... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి 1.20 కోట్లమందికిపైగా హాజరు కాగా.. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం.. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సా రలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సు మారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం.. జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది. ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు.. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం.. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు. మండ మెలిగే ప్రక్రియ ఇలా... ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తా రు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. -
కుంభమేళాకు అన్ని కోట్లు అవసరమా?
లక్నో : కుంభమేళా నిర్వాహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ప్రభుత్వం కుంభమేళా పేరిట అలహాబాద్లో 4200 కోట్ల రూపాయలు ఖర్చుచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ర్టానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండదని, అలాంటప్పుడు మత ప్రచారాలు, బోధనలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఓ కార్యక్రమానికి హాజరైనప్పడు వారికి మౌలిక సదుపాయలు ఏర్పాటుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. (లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు కోసమే ప్రభుత్వం పనిచేయదని, కుంభమేళా అన్నది కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. భక్తుల కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ మాట్లాడుతూ.. కుంభమేళా అన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు హాజరవుతారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. (తెలంగాణ సీఎస్కు కేరళ సీఎస్ లేఖ) -
ఆ ఫోటోలను చూపించొద్దు..!
లక్నో: వార్తాపత్రికలకు, టీవీ చానల్స్కు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించకూడదని కోర్టు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళలో మహిళలు స్నానం చేసే ఫోటోలను చిత్రీకరించవద్దని ధర్మాసనం స్పష్టంచేసింది. కుంభమేళాలో స్నానఘాట్టాలకు వందమీటర్ల దూరంలో కెమెరా పాయింట్లపై నిషేధం విధించినప్పటికీ.. ఆదేశాలను ఎందుకు పాటించట్లేదని అధికారులను ప్రశ్నించింది. కాగా కుంభమేళాలో మీడియా ఫోటో గ్రాఫర్లు మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించవద్దన్న ఓ న్యాయవాది అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈవిధంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. -
దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్
-
అర్థ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన యోగి సర్కార్
-
కుంభమేళాకు ఎయిర్ఇండియా ప్రత్యేక సర్వీసులు
-
కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి
నాసిక్: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం కుంభమేళాను ప్రారంభించారు. నాసిక్లో ఈరోజు ఉదయం ఆయన కొందరు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల నడుమ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాసిక్ త్రయంబకేశ్వర్లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పుష్కరుడు వస్తున్నాడు!
-
పుష్కరుడు వస్తున్నాడు!
* తెలంగాణలో తొలి పుష్కర సంరంభం రేపట్నుంచే * ఉదయం 6.21 గంటల నుంచి పుణ్యస్నానాలు మొదలు * ధర్మపురిలో సకుటుంబంగా స్నానం ఆచరించనున్న కేసీఆర్ * 25 వరకు కొనసాగనున్న పుష్కర స్నానాలు * 2 కోట్ల మంది రావచ్చని అంచనా సాక్షి, హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 25 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాలలో దాదాపు రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. ఈ సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం, ముమ్మర ప్రచారం వెరసి గతంలో జరిగిన పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి తీరంలో 73 ప్రాంతాల్లో 81 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాలకు ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు అందజేసింది. ధర్మపురిలో కేసీఆర్ పుణ్యస్నానాలు మంగళవారం ఉదయం 6.21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కె.చంద్రశేఖర్రావు కుటుంబ సమేతంగా ధర్మపురిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఇందుకు సోమవారం సాయంత్రమే అక్కడికి బయలుదేరనున్నారు. అనంతరం కాళేశ్వరం, భద్రాచలం కూడా సందర్శించనున్నారు. ఆయన వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినా ఆయన రాకపై స్పష్టత లేదు. చాలాచోట్ల తుంపర స్నానాలే దిక్కు.. వానలు లేకపోవడంతో ఇప్పటికీ నదిలోకి కొత్త నీరు అంతగా ప్రవేశించలేదు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. కరీంనగర్ జిల్లాలో త్రివేణీ సంగమ క్షేత్రమైన కాళేశ్వరం వరకు గోదావరిలో ఇసుకే కనిపిస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత వచ్చి చేరటంతో అక్కడ్నుంచి నీటి ప్రవాహం కొంత పెరిగింది. వరంగల్ జిల్లా పరిధిలో గోదావరి ప్రవాహం ఓ పాయగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రాణహిత వచ్చి కలిసిన కాళేశ్వరం, భద్రాచలం మినహా మరెక్కడా పుష్కర ఘాట్లకు తగిలేలా నీరు లేదు. చాలాచోట్ల పైపుల కింద తుంపర స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కనికరించని మహారాష్ట్ర ఎగువన మహారాష్ట్ర గోదావరిపై 12 ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో వాటిల్లో నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేసి పుష్కర భక్తులకు సాంత్వన కలిగించాలన్న తెలంగాణ అభ్యర్థనను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తుది ప్రయత్నంగా సీఎం చంద్రశేఖర్రావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుతో ఆదివారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. గైక్వాడ్ రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చూడాలని కోరారు. కానీ అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి ఈ నీరు ఖమ్మం సరిహద్దు వరకు చేరుకునే అవకాశం ఉంది. బాసర వద్ద నదిలో తాత్కాలిక అడ్డుకట్ట వేసి ఘాట్ల వద్ద నీరు ముందుకు వెళ్లకుండా చూస్తున్నారు. ధర్మపురి, వరంగల్ జిల్లా మంగపేట వద్ద కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు. ఆంధ్రా వైపు దృష్టి నీటి కొరత కారణంగా.. హైదరాబాద్ నుంచి పుష్కర స్నానాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ఆంధ్రావైపు దృష్టి సారించారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రత్యేక సర్వీసుల రిజర్వేషన్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. తెలంగాణలో భద్రాచలంపై భారం అధికంగా ఉంది. రోజుకు ఇక్కడికి దాదాపు 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఘాట్ల వద్దకు 12 రోజుల్లో కోటి మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఆదివారం రాత్రి వరకు కూడా చాలాచోట్ల పుష్కర ఘాట్లు, రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. బస్సులు, రైళ్లు ఫుల్ పుష్కర భక్తుల కోసం 250 ట్రిప్పులకు సరిపడా రైళ్లు, 2,600 అదనపు బస్సులను ప్రకటించారు. ఇవి సరిపోయేలా కనిపించటం లేదు. హెలీకాప్టర్లనూ అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ నుంచి బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో 10 నిమిషాలు ఆకాశంలో విహరించవచ్చు. ఇందుకు రూ.2,500-రూ.3,000 వరకు చెల్లించాలి. బురద దాటితేనే నీళ్లు ప్రస్తుతం బాసరలో పాత ఘాట్ వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. వంతెన వద్ద నిర్మించిన కొత్త ఘాట్ల వద్ద 50 మీటర్లు బురదలో ముందుకు వెళ్తేనే నీళ్లు తగులుతాయి. ధర్మపురి, మంథని వద్ద ఇదే పరిస్థితి. వరంగల్ జిల్లా ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట వద్ద అర కిలోమీటరు నుంచి కిలోమీటరు మేర ఇసుకలో ముందుకు నడవాల్సిందే. భద్రాచలంలో ఘాట్లు దిగాక 10 మీటర్ల మేర బురద మేట వేసింది. దీంతో దానిపై రెండడుగుల మేర ఇసుక నింపారు. ఖమ్మం జిల్లా పర్ణశాల, మోతెగడ్డ, రామచంద్రాపురంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. చినరావిగూడెం, రామానుజపురంలో ఇసుకలో ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేసి ఘాట్ల వద్దకు నీటిని మళ్లిస్తున్నారు. ధర్మపురికి పీఠాధిపతుల రాక ధర్మపురి: ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు పీఠాధిపతులతోపాటు వంద మందికిపైగా వారి శిష్యులు రానున్నారు. శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతి, రాఘవేంద్ర పీఠాధిపతి, వీరశైవ పీఠాధిపతి, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, మదనానంద స్వామీజీ, తోగూట పీఠాధిపతి, విశాఖపట్నంకు చెందిన స్వరూపానంద స్వామీజీ రానున్నారు.