Landmarks
-
వారసత్వ కట్టడాలు..ఘఢి చౌక్లు!
గొప్ప సాంస్కృతిక, వారసత్వ చరిత్ర కలిగిన హైదరాబాద్కు ఘడి చౌక్గానూ పేరుంది. చార్మినార్, గోల్కొండ వంటి వారసత్వ కట్టడాలకు నిలయమైన ఓల్డ్ సిటీ నుంచి సైబర్ టవర్స్, హైటెక్ సిటీ వంటి ఆధునిక నగరం మీదుగా.. నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందనున్న ఫ్యూచర్ సిటీకి విస్తరిస్తోంది. సిటీ ఏదైనా సరే అప్పటి సంస్కృతి, అభివృద్ధిని సూచించే విధంగా ఐకానిక్ ల్యాండ్ మార్క్లను నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. నాడు ఓల్డ్ సిటీలో క్లాక్ టవర్లు వారసత్వ గుర్తింపుగా నిలిస్తే.. నేడు ఐటీ పార్క్లు హైటెక్ సిటీ ల్యాండ్ మార్క్గా మారిపోయాయి. ఇక, రానున్న ఫోర్త్ సిటీ భవిష్యత్తు తరాలకు ప్రతీకగా నిలిచిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, ప్రదేశాలతో నిండిన భాగ్యనగరంలో.. నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక కట్టడాల్లో క్లాక్ టవర్లు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో ఈ ఐకానిక్ నిర్మాణాలు వారసత్వ చిహా్నలగా విరాజిల్లాయి. నాటి చరిత్రకు ఇవే కీలకమైన మైలురాళ్లు. సమయ పాలనతో పాటు నగరంలోని రద్దీ వీధుల్లో దిక్సూచిగా నిలిచేవి. విస్తరణలో క్రమేణా వీటి ప్రాముఖ్యత తగ్గింది. కానీ, రాతితో చెక్కిన చారిత్రక గుర్తులు నేటికీ పూర్వ వైభవం కోసం వేచిచూస్తున్నాయి.మోజమ్ జాహీ మార్కెట్.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1935లో మోజమ్ జాహీ మార్కెట్లో క్లాక్ టవర్ నిర్మించారు. మార్కెట్లో అత్యంత ఎత్తయిన నిర్మాణం ఇదే. రెండు అంతస్తులు, అష్టభుజి ఆకారంలో ఉంటుంది. మార్కెట్లోని అన్ని దిక్కుల నుంచి వీక్షించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. విక్రేతలు, దుకాణదారులు సమాయానికి బస చేసేవారు. ఒక్కో మతం.. ఒక్కో తీరు.. క్లాక్ టవర్లు దేనికవే ప్రత్యేకమైనవి.. చరిత్ర కలిగినవి. ఇవి గంటలను మాత్రమే కాకుండా భక్తి శ్రద్ధలు, రోజువారీ జీవిన విధానాన్నీ సూచిస్తాయి. వివిధ మతాల సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్నాయి. క్రైస్తవ సంప్రదాయంలో చర్చిల పైన ఉన్న బెల్ టవర్లు ప్రార్థన గంటలను సూచిస్తాయి. ఇస్లామిక్ సంస్కృతిలో ప్రార్థనలకు పిలుపుగా సూచిస్తారు. మసీదు మినార్ల నుంచి మోగుతూ ఆ సమాజాన్ని ఏకంచేసే కాల గమనాన్ని సూచిస్తుంది. హిందూ ఆచారంలో గంటలు, శంఖాల శబ్దం ప్రజలను ప్రార్థనలకు మేల్కొలుపుతాయి.చౌమహల్లా ప్యాలెస్.. చౌమహల్లా ప్యాలెస్ పశ్చిమ దిక్కున ప్రధాన ద్వారం వద్ద ఉన్న టవరే ఖిలాఫత్ గడియారం. 1750లో నిర్మించిన టవర్ మూడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మొఘల్ శైలికి చెందిన ఝరోకాలతో, హారాలజిస్ట్ నిపుణుల కుటుంబం ప్రతి వారం యాంత్రిక గడియారాన్ని మారుస్తూ ఉంటుంది. ఖిలాఫత్ గడియారం చారిత్రక మైలురాయిగా మాత్రమే కాదు.. నగర సాంస్కృతిక, ఆధ్యాతి్మక చిహ్నంగా గుర్తింపు పొందింది.జేమ్స్ స్ట్రీట్.. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో జేమ్స్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో క్లాక్ టవర్ ఉంది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ వారు నిర్మించిన చారిత్రాత్మక టవర్. ఇది ఒకప్పుడు రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు నిలయంగా పనిచేసింది. దీని నిర్మాణానికి నిధులను అందించిన సేథ్ రాంగోపాల్ గౌరవార్థం ఆయన పేరే పెట్టారు. ఈ గడియారం వలస నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తుంది.చార్మినార్.. చార్మినార్ పై ఉన్న నాలుగు గడియారాలు 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఏర్పాటయ్యాయి. లండన్ నుంచి తీసుకొచి్చన నాలుగు గడియారాలనూ చార్మినార్కు నాలుగు వైపులా ఆర్చ్ మధ్యలో అమర్చారు. ఈ గడియారం ముళ్లుల గుండా గాలి ప్రసరించినా ఖచి్చతమైన సమయాన్ని సూచిస్తాయి. నాలుగిటిలో గుల్జార్ హౌజ్కు ఎదురుగా ఉన్న గడియారం ఒక్కటే ప్రతి గంటకూ ఒకసారి మోగుతుంది. అయితే నాలుగు గడియారాలకూ ప్రతి 48 గంటలకు ఒకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది.మోండా మార్కెట్.. సికింద్రాబాద్లో సందడిగా ఉండే మోండా మార్కెట్లోని టవర్ పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 1920–40 ప్రాంతంలో రైస్, ఆయిల్ మిల్లు వ్యాపారంలో ఉన్న సంపన్న డూండూ కుటుంబం దీనిని నిర్మించింది. విలాసవంతమైన ఆర్ట్ డెకో శైలిలో దీని నిర్మాణం వాణిజ్య కేంద్రాల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.మహబూబ్ చౌక్.. 1892లో సర్ అస్మాన్ జా ఈ టవర్ను నిర్మించారు. చార్మినార్కు పశ్చిమాన మహబూబ్ చౌక్లో చిన్న తోటలో టర్కిష్ శైలిలో దీన్ని నిర్మించారు. స్థానిక ప్రజలకు సమయాన్ని సూచించేందుకు ఉద్దేశించిన ఈ క్లాక్ 72 అడుగుల ఎత్తులో ఉంటుంది.సుల్తాన్ బజార్.. నగరంలోని పురాతన క్లాక్ టవర్లలో ఇదొకటి. 1865లో బ్రిటిష్ పాలనలో చాదర్ఘాట్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆధునిక డిజైన్తో దినిని నిర్మించారు. అయితే ఇతర క్లాక్ టవర్స్ లాగా దీనికి అలంకరణ ఉండదు. చతురస్రాకారంలో ఆ సమయంలో ముస్లిం రాజైన అసఫ్ జాహీ నిర్మించిన భవనాల తరహాలోనే దీనిని తీర్చిదిద్దారు. శాలిబండ.. ఈ గడియార స్థంభాన్ని రాజా రాయ్ రాయన్ ఘడియాల్ అని కూడా పిలుస్తారు. మూడో నిజాం సికిందర్ జా ఆస్థానంలో దఫ్తార్దార్ (రెవెన్యూ అధికారి) శాలిబండ ప్యాలెస్లో 1904లో ఈ క్లాక్ టవర్ను నిర్మించారు. యూరోపియన్ శైలిలో హిందు–అరబిక్, రోమన్, హిందీ, తెలుగు అంకెలు దీనిలో ఉంటాయి. టవర్ ప్రవేశ ద్వారం వద్ద గణేష్ ప్రతిమ ఉంటుంది. కాలక్రమేణా ప్యాలెస్ ధ్వంసమైనా.. క్లాక్ టవర్ అలాగే ఉంది. -
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
దామరచర్లలో ఆదిమానవుల ఆనవాళ్లు
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామసమీపంలో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. కృష్ణా తీరం వద్ద ఇటీవల బయటపడ్డ సమాధులు పరిశీలించడానికి వచ్చిన నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు ఈ ఆనవాళ్లు కనుగొన్నారు. తీర ప్రాంతంలో బయటపడ్డ కుండలు, పెంకులు, సమాధులను పరిశీలించి అవి సింధునాగరికథ కాలంనాటివని తేల్చారు. పరిశోధన నిమిత్తం కుండలను, పెంకులను స్వాధీనం చేసుకున్నారు. -
యమహా నగరి.. కోల్కతా పురి
'నేతాజీ పుట్టిన, గీతాంజలి పూసిన.. ఆ వంగ భూతలం.. భతరజాతికి మకుటం..' అంటూ కోల్ కతా ఉన్నతిని కీర్తించారు తెలుగు సినీ కవి వేటూరి. ఆయనలాగే మరెందరో కవులు, కళాకారులు.. ఆ మహానగర రసహృదయధారను ఒడిసిపట్టి చరితార్థులయ్యారు. ఇప్పుడు పాత ఘాటువాసనల నడుమ అదే కోల్ కతా శోభను సరికొత్త కోణంలో చూపే ప్రయత్నం చేశాడు యువ ఫొటోగ్రాఫర్ సందీప్ డే. అత్యాధునిక డ్రోన్ సహాయంతో గంగాతీరంలోని ఆ మహానగరాన్ని, అక్కడి కొండగుర్తుల్ని కొత్తగా చూపుతూ 'వాకింగ్ అప్ విత్ కల్ కతా' పేరుతో ఆయన రూపొందించిన వీడియో బెంగాలీలేకాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోల్ కతా అభిమానుల్ని అలరిస్తోంది. మొదట షహీద్ మినార్ ను అల్లంత ఎత్తునుంచి, ఆ తర్వాత విక్టోరియా మహల్, సెయింట్ పాల్స్ కాథడ్రల్, గంగానడిపైనున్న హౌరా వారధి, విద్యాసాగర్ సేతుల అందాలను మీరూ వీక్షించండి.. -
చెరిగిపోతున్న ఆనవాళ్లు..!
వేల ఏళ్లనాటి మానవ మనుగడకు చిహ్నం ఈరన్నగుండు గుహ గుహలో అరుదైన రేఖాచిత్రాలు.. అంతుబట్టని లిపి గుర్తులు పదేళ్ల క్రితమే గుర్తించినా పరిరక్షణ చర్యలు శూన్యం ఇదేపరిస్థితి కొనసాగితే అరుదైన చారిత్రక ఆనవాళ్లు మాయం వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించిన గుహ అది.. ఆ కాలంలోనే సాగు చేశారని చెప్పే ఆనవాళ్లు కూడా ఉన్నాయక్కడ.. పంటలపై పక్షులు వాలితే చెదరగొట్టేందుకు వాడే వడిశల రాళ్లు బయటపడ్డ ప్రాంతమది.. పాడికి సూచికగా ఆవులు, పంటలకు గుర్తుగా ఎడ్ల బొమ్మలు అద్భుత రీతిలో చెక్కిన గుహ అది.. ఇలా ఒక్కటేమిటి.. మానవ నాగరికత పరిణామక్రమంలో ఓ దశను కళ్లకు కట్టే సజీవసాక్ష్యాలవి.. కానీ, ఇవేవీ మన పురావస్తు శాఖ కళ్లకు కనిపించవు. నిపుణులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అద్భుత చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని తేల్చినా గాలికొదిలేశారు. ఇప్పుడు రాళ్లు కొట్టుకునేవారు యథేచ్ఛగా ఆ గుట్టలను ధ్వంసం చేస్తూ మన చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ చారిత్రక గుహ ఎక్కడ.. మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దొంగలగట్టు తండాలోని ఈరన్నగుండు గుహ. కల్వకుర్తి నుంచి జూపల్లికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంది. వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు చెందిన అపురూప ఆనవాళ్లు ఉన్నది ఇక్కడే. అయితే స్థానిక తండావాసులకు వాటిపై అవగాహన లేదు. ఆ గుహను వారి పూర్వీకులు మైసమ్మ గుడిగా పేర్కొనటంతో ఇప్పటికీ వారు దాన్ని గుడిగా భావిస్తూ అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ గుహలో దాదాపు ఐదు వేల ఏళ్ల నాటివని భావిస్తున్న నాటి మానవులు గీసిన రేఖా చిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే.. భూ ఉపరితలానికి అడుగు ఎత్తున రెండు అడుగుల పొడవు, అంతే ఎత్తుతో మూపురం, వాడి కొమ్ములున్న ఎద్దు బొమ్మ, దాని పక్కన కొంచెం చిన్న పరిమాణంలో మరో రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. దీనికి ముందువైపు ఆరడుగుల ఎత్తులో అదే రాయిపై ఓ ఆవు దాని వెనుక రెండు ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. వీటి కింద చిన్నచిన్న లేగ దూడల బొమ్మలున్నాయి. వాటికింద నాటి లిపిగా భావిస్తున్న అక్షరాలు (గ్రాఫితీ మార్చ్) చెక్కి ఉన్నాయి. ఆ లిపిని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి పురావస్తు నిపుణులు యాజ్దానీ ఇలాంటి లిపిని గుర్తించారు. ఆ పరిసరాల్లో కొత్త రాతి యుగంలో వినియోగించిన వడిశల రాళ్లు, నూరుడు రాళ్లు లభిస్తున్నాయి. పరిరక్షించేవారేరీ? ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ తాజాగా ఈ గుహను గుర్తించి పరిశీలించారు. అక్కడి రేఖా చిత్రాల్లోని ఎద్దుల కొమ్ములు ఈనాటి మైసూరు ఎద్దులను పోలి ఉన్నాయని, కానీ వాటి మూపురాలు, గంగడోలు సింధూ నాగరికత కాలానికి చెందిన వాటివిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితమే పురావస్తు నిపుణులు వచ్చి ఈ రేఖా చిత్రాల అచ్చులను శాస్త్రీయ పద్ధతిలో సేకరించారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ తర్వాత ఎవరూ వీటిని పట్టించుకున్న దాఖలాలులేవు. రాళ్లు కొట్టేవారు గుహను ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.