love fall
-
ఒకరిని ప్రేమించి మరో అమ్మాయితో...
పార్వతీపురం : తనను ప్రేమించి...మరో అమ్మాయితో ప్రియుడు పెళ్లికి సిద్ధపడ్డాడనే బాధతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన కలమటి రాణి అదే గ్రామంలో విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న కొల్లి పృథ్వి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పృథ్వి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. పైగా ఈ నెల 20న మరో యువతితో పెళ్లి చేసేందుకు పృథ్వి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాణి పెళ్లి విషయమై పృథ్విని నిలదీయగా, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. పైగా పెళ్లి అయిన తర్వాత ఇద్దరం వెళ్లిపోదామని తెలిపాడు. ఈ ప్రతిపాదన నచ్చని రాణి గురువారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఆమెను పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమించిన యువతి దక్కలేదని యువకుడి బలవన్మరణం
టెక్కలి: ప్రేమించిన యువతికి వివాహం జరిగిపోయిందనే విషయం తెలుసుకున్న ఆ యువకుడు భరించలేకపోయాడు. చావే చరణ్యమని భావించాడు. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోస్టల్ ఉద్యోగి. టెక్కలి మండలం నౌపడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనపై పలాస జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్ని పొట్టయ్య (23) సంతబొమ్మాళి మండలం నౌపడ పోస్టల్ కార్యాలయంలో మెయిల్ క్యారియర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన కొంత కాలంగా సొంత గ్రామానికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు ఇటీవల పెళ్లై పోవడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం రాత్రి నౌపడ రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్టు జీఆర్పీ హెచ్సీ సత్యనారాయణ గురువారం తెలిపారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన పోస్టల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొట్టయ్య బుధవారం విధులు నిర్వహిస్తున్న సమయంలో చాలా ఫోన్ కాల్స్ రావడంతో హడావుడిగా స్వగ్రామానికి వెళ్లే సమయంలో ఎవరైనా దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.