mehandi
-
మెహందీ వేడుకలో యాంకర్ రష్మి.. ఫోటోలు వైరల్
-
పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు
హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లికి రెడీ అయిపోయింది. గత నెలలో సడన్గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పెళ్లి కార్డులు పంచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకు కూడా కార్డ్ ఇచ్చింది. మొన్నీమధ్య శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు షురూ చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. ఈమెది చెన్నై. అలా తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది.మేఘా ఆకాశ్.. విష్ణు అనే వ్యక్తిని పెళ్లాడబోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తోంది గానీ పెళ్లెప్పుడు? ఎక్కడ జరగనుందనే విషయాల్ని మాత్రం సీక్రెట్గానే ఉంచింది. మెహందీ లేటెస్ట్గా జరిగిందంటే ఒకటి రెండు రోజుల్లోనే పెళ్లి జరగడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ) -
జుట్టుకు హెన్నా పెడుతున్నారా?ఈ తప్పులు అస్సలు చేయకండి
మెహందీలో ఇవి కలిపితే... ►జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి. ► కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే... కొబ్బరి పాలలోని లారిక్ ఆమ్లం మంచి యాంటీబయోటిక్గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్గా పనిచేస్తుంది. ►టేబుల్ స్పూను హెన్నా, టేబుల్ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా? మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు. కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు. -
హీరోయిన్ అంజలి పెళ్లి కుదిరిందా? మెహందీ ఫోటోలు వైరల్
పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్లో కంటే కోలీవుడ్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.విభిన్నమైన పాత్రలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటు వెబ్సిరీస్లతోనూ ఆకట్టుకుంది. ఇక అంజలి సినిమాల విషయం పక్కనపెడితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై పలు వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెహిందీ ఫోటోలను అంజలి షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అంజలి తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అని చర్చిస్తున్నారు. అయితే ఆ ఫోటో అంజలి మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
పెళ్లి కూతురు చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చే బ్రేస్లెట్ రింగ్!
పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్లో ఉన్న బ్రేస్లెట్ రింగ్స్ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ వేడుకల్లో స్టైలిష్ డ్రెస్లకు మరింత స్టైలిష్ లుక్నిస్తున్నాయి ఈ బ్రేస్లెట్ రింగ్స్. అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్గా ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. వీటిలో బ్రేస్లెట్ రింగ్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్లెట్... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్ చేతులను మరింతగా హైలైట్ చేస్తున్నాయి. పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్బీడ్స్ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు. రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్ పొదిగిన బ్రేస్లెట్ రింగ్స్ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్గా వెలిగిపోతున్నాయి. బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్ వేర్లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది. వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్ జత కలిసిన బ్రేస్లెట్ రింగ్స్ మోడర్న్ ఔట్ఫిట్స్కు స్టైలిష్ లుక్ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్ని మెప్పిస్తూనే ఉన్నాయి. -
మెహందీ పెట్టడానికి వెళ్తూ మృత్యువాత
తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు. కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. -
Mehandi: హార్ట్ డిజైన్, పక్షి మూలాంశంతో డిజైన్... వీటి అర్థాలు తెలుసా?
మెహెందీతో వేసే ప్రతీ అందమైన డిజైన్ వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకునే డిజైన్ల వల్ల కలిగే సానుకూల భావనలు మనలో అంతర్గత శక్తిని పెంచుతాయంటున్నారు మెహెందీ ఆర్టిస్ట్లు. ఈ సందర్భంగా పండగలు, వేడుకల్లో అతివల జీవితంలో భాగమైన మెహెందీ డిజైన్స్ గురించి... మనకు తరతరాలుగా గోరింటాకు ఎర్రదనమే పరిచయం. వీటి మీద పుట్టిన పాటలు కూడా విదితమే. కానీ, మెహెందీ డిజైన్లు మాత్రం మనకు మధ్య యుగంలోనే పరిచయం అయినట్టు చరిత్ర చెబుతోంది. అయితే, ప్రతి అందమైన మెహెందీ డిజైన్ వెనుక ఓ అర్థం ఉందంటున్నారు నేటి మెహందీ డిజైనర్లు రకరకాల మెహందీ డిజైన్స్ గురించి వివరిస్తూ.. హార్ట్ డిజైన్... గుండె ఆకృతిలో వేసే మెహెందీ డిజైన్ ఆధునిక శైలికి అద్దం పడుతుంది. చిన్న మూలాంశంతో హృదయాకారంలో వేసే మెహందీ డిజైన్ స్వచ్ఛతను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది బంధానికి బలమైన పునాది అని నమ్ముతారు. ఈ కారణంగా, పెళ్లికూతురుకు వేసే మెహెందీ డిజైన్లో హార్ట్ షేప్ తప్పక మెరిసిపోతుంది. వధూవరుల డిజైన్... చాలా వరకు పెళ్లిలో వధూవరులను మెహెందీ డిజైన్లలో చిత్రిస్తారు. వధూవరుల షెహనాయ్ కూడా ఉంటుంది. భార్యాభర్త ఎప్పటికీ విడిపోక అన్యోన్యంగా కలిసి ఉంటారనే సంకేతాన్ని ఇస్తుంది ఈ డిజైన్. పక్షి మూలాంశంతో డిజైన్... ప్రాచీన కాలంలో, పక్షి జీవితంలోని ఆనందాన్ని, స్వర్గానికి, భూమికి మధ్య గల సంబంధాన్ని తలపునకు తెస్తుంది. బర్డ్ మోటిఫ్ డిజైన్ ప్రజల స్వతంత్ర స్వభావాన్ని, వారి అంతర్గత ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. పువ్వుల డిజైన్... పూల డిజైన్లు ఎవ్వరినైనా ఇష్టపడేలా చేస్తాయి. చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే, డిజైన్ వేయడం కూడా సులభం. ఇది వైవాహిక జీవితంలోని సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నం. పువ్వులు స్వచ్ఛతకు చిహ్నం. బురదలో వికసించే కమలం మనసును ఆకర్షిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ డిజైన్ బంధం లోని సామరస్యత, ప్రేమ, శ్రేయస్సులకు సంకేతం. ఇది స్త్రీ సున్నితమైన స్వభావాన్ని, అందాన్ని చూపుతుంది. సర్కిల్ డిజైన్... ఇది సులభమైన అత్యంత అందమైన డిజైన్. దీనిలో, చేతి మధ్యలో ఒక వృత్తం వేసి, దాని చుట్టూ, లోపల వివిధ రకాల డిజైన్లను సృష్టిస్తారు. హిందూ, బౌద్ధమతాలలో దీనిని మండలం అంటారు. ఇది విశ్వానికి చిహ్నం. నెమలి డిజైన్... పెళ్లికూతురు మెహెందీలో నెమలి డిజైన్ అత్యంత ఇష్టమైనది. మన దేశ జాతీయ పక్షి అందం, సృజనాత్మకతకు చిహ్నం. ఇది స్త్రీలోని దయను తెలియజేస్తుంది. కలశం డిజైన్... ఈ డిజైన్ మార్వాడీ సమాజంలో ఒక ట్రెండ్. పూర్ణ కుంభాన్ని నిండైన జీవితానికి పర్యాయపదంగా పరిగణిస్తారు పెద్దలు. ఎరుపును చిందించే కలశం శ్రేయస్సుకు, సంతోషానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. చదవండి: Priyanka Panwar Success Story: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి.. -
కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల్లో.. మెహందీ క్వీన్.. సెలబ్రిటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయం!
Bollywood Mehendi Artist Veena Nagda Been Roped In For Katrina Kaif Mehendi Ceremony: వధూవరులకు పెళ్లికళ తెప్పించే అంశాల్లో మెహందీ చాలా ముఖ్యమైనది. చేతులకు అందమైన మెహందీ డిజైన్లు వేయడంతో పెళ్లితంతు సందడిగా ప్రారంభమవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరి పెళ్లిళ్లలో మెహందీ హడావుడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల్లో మెహందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో కత్రినాను మరింత అందంగా కనిపించేలా మంచి మంచి మెహందీ డిజైన్లను వేశారు ఆర్టిస్ట్ ‘వీణా నాగాదా’. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అంబానీ ఇంట జరిగే అన్ని వేడుకల్లో వీణా మెహందీ డిజైన్లు ఉండాల్సిందే. ప్రముఖస్థాయి వ్యక్తులకు సందర్భానికి తగినట్లుగా సరికొత్తగా అలంకరిస్తూ ‘మెహందీ క్వీన్’గా ఎదిగారు వీణా. గుజరాత్లోని సనాతన జైన్ కుటుంబంలో పుట్టింది వీణా నాగాదా. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో అందరిలో ఆఖరు. తండ్రి పూజారి, తల్లి గృహిణి. పదోతరగతి అయ్యాక.. పై చదువులకు ఇంట్లో వాళ్లు అనుమతించలేదు. ఏదైనా ఇంట్లోనే ఉండి నేర్చుకోమన్నారు. దీంతో కుట్లు, అల్లికలతోపాటు మెహందీ డిజైన్లు వేయడం నేర్చుకుంది. శ్రద్ధగా నేర్చుకోవడంతో అతి కొద్దికాలంలోనే అనేక డిజైన్లను ఆకళింపు చేసుకుంది. తను నేర్చుకున్న డిజైన్లను స్నేహితులు, బంధువుల ఫంక్షన్స్లో వేస్తుండేది. వీణా పెట్టిన మెహందీ నచ్చడంతో తెలిసిన వారంతా తమ ఇళ్లలో జరిగే వేడుకలకు వీణాను మెహందీ పెట్టడానికి పిలిచేవారు. ఇలా డిజైన్లు వేస్తూ మంచి మెహందీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంది. తొలి సెలబ్రిటీ కస్టమర్.. వీణాకు తొలి సెలబ్రిటీ కస్టమర్ పూనమ్ ధిల్లాన్. పూనమ్కు మెహందీ డిజైన్లు వేసినప్పటికీ అప్పుడు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత హృతిక్ రోషన్, సుసాన్నే పెళ్లిలో మెహందీ ఆర్టిస్ట్గా పనిచేయడంతో డిజైనర్గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, శిల్పాశెట్టి పెళ్లిళ్లకు కూడా వీణా మెహందీ డిజైన్లు వేసింది. ఆ డిజైన్లు సెలబ్రిటీలను బాగా ఆకర్షించడంతో... కరీనా కపూర్, దీపికా పదుకొనే, అమృతా అరోరా, మలైకా అరోరా ఖాన్, హేమమాలిని, ఇషా డియోల్, టీనా అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీ, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, కాజోల్, షర్మిలా ఠాగూర్, కాజల్ అగర్వాల్, కపిల్ శర్మ భార్య గిన్ని ఛత్రత్, జరీన్ ఖాన్, ఫరా ఖాన్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, ఆశాభోంస్లే, ఏక్తా కపూర్, జయప్రద వంటి వారెందరికో మెహందీ డిజైన్లు వేశారు. ఇండియాలోని ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలేగాక బెల్జియం, లండన్, మారిషస్, పారిస్, సింగపూర్, అమెరికాలలో కూడా వీణాకు కస్టమర్లు ఉన్నారు. పెళ్లిళ్లకేగాక సినిమాలకూ... పెళ్లికూతుర్లను ఆకర్షణీయంగా కనిపించే విధంగా డిజైన్లు వేయడంలో వీణ స్పెషలిస్టు. బ్రైడల్, అరబిక్, డైమండ్–పర్ల్, స్టోన్–మెహందీలు వేయడంలో అందెవేసిన చెయ్యి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్లోనేగాక కొన్ని సినిమాల్లో కూడా మెహందీ డిజైన్లు వేశారు. బాలీవుడ్ సినిమాలైన ‘కభీ కుషీ కభీ గమ్’, కల్ హో నా హో, మేరే యార్ కీ షాదీ హై, యహ్ జవానీ హే దివానీ, పటియాల హౌస్ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటించిన నటీనటులకు మెహందీ డిజైన్లు వేశారు. అంతేగాక 2019లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్లో పాల్గొన్న సోనమ్ కపూర్కు, అలియా భట్ వివిధ సినిమాల్లో నటించిన కొన్ని సీన్లకు డిజైన్లు వేశారు. బాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లిళ్ళే గాక, వారు చేసుకునే కర్వా చౌత్లలో కూడా వీణా మెహందీ డిజైన్లు వేయాల్సిందే. సెలబ్రెటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉంటోన్న వీణా ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తూ మెహందీ కోర్సు నేర్పిస్తోంది. ఇప్పటిదాకా 55 వేల మంది విద్యార్థులు వీణా వద్ద మెహందీ డిజైన్లు నేర్చుకున్నారు. చదవండి: Mugdha Kalra: నా బాబు కూడా ఈ ప్రపంచం నుంచే వచ్చాడు కదా.. అందుకే.. -
'ఏంటి భువీ.. మెహందీ వేయమంటే కరోనా డిజైన్ వేశావ్'
ఢిల్లీ: శ్రీలంక పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకొన్న టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భువీ.. తన భార్య నుపుర్ నగర్తో మెహందీ డిజైన్ పోటీ పెట్టుకున్నాడు. నుపుర్ మెహందీ డిజైన్ను చక్కగా వేయగా.. భువీ మాత్రం మెమందీ డిజైన్ వేయమంటే.. కరోనా పోలిన డిజైన్ వేశాడు. ఇది చూసిన నుపుర్ ఊరుకోకుండా తన ఇన్స్టాగ్రామ్లో ఇద్దరి మెహందీ ఫోటోలను షేర్ చేసింది. భువీని ట్రోల్ చేస్తూ.. '' మా ఆయన వేసిన డిజైన్ కరోనాను పోలి ఉంది.. మీరు ఒక లుక్కేయండి'' అంటూ కామెంట్ చేసింది. నుపుర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''భువీకి ఇంకా కరోనా భయం పోలేదనుకుంటా.. మంచి డిజైన్ వేయమంటే కరోనా డిజైన్ వేశాడు..'' అంటూ కామెంట్లు చేశారు. ఇక భువనేశ్వర్ ఇటు బౌలర్గా.. అటు వైస్ కెప్టెన్గా శ్రీలంక పర్యటనలో అదరగొట్టాడు. మూడు వన్డేల సిరీస్లో మూడు వికెట్లు తీసి భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీ20 సిరీస్లోనూ తొలి మ్యాచ్లోనూ 4 వికెట్లు తీసిన భువీ ఆ తర్వాతి మ్యాచ్ల్లోనూ మంచి ప్రదర్శనే కనబరిచాడు. అయితే టీమిండియా టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. కాగా భువనేశ్వర్ ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో ఆడేందుకు త్వరలోనే యూఏఈకి వెళ్లనున్నాడు. -
ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు.. ఎందుకంటారు!
జనగామ: ఆషాఢమాసాన్ని శూన్య మాసమంటారు. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసం అనేక పర్వదినాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ప్రతి వారం, పదిహేను రోజులకోసారి ఏదో ఒక పండగ, వ్రతం, పూజ చేసుకుంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. క్షణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢమాసం అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుంచి వస్తుంది. గోరింటాకు ఎరుపు రంగును ఇస్తుంది. ఎరుపు సూర్యునికి ప్రతీక. అరచేతిలో సూర్యుడిలా గుండ్రంగా పెడతారు. నెలవంక పైన చుక్క గోరింటాకు శరీరపు ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. ఈ సీజన్లో తొలకరి మొదలై వర్ష రుతువుగా మారి జోరుగా వర్షాలు కురుస్తాయి. వర్షం నీటిలోనే పనులు చేసుకునే సీజన్ ఇది. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా.. ముఖ్యంగా పొలం పనులు చేసుకునే రైతు కుటుంబాలు గంటల తరబడి నీటిలోనే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో చర్యవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగి ఉంటుంది. ఇది పెట్టుకుని పనులు చేసిన వారికి వర్షంలో తడిసిపోయినా చర్యవ్యాధులు దరిచేరవు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వేడిని తగ్గించే గుణం ఉన్న గోరింటాకు బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. పెళ్లయిన వారైతే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు అంటుంటారు. కొత్త పెళ్లి కూతురుకు అందం.. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం అనాధి నుంచి వస్తుంది. గోరింటతో చేతులను పండించుకునే వారి సౌభాగ్యాన్ని కాంక్షిస్తుందని నమ్ముతారు. కేవలం ఆషాఢ మాసంలోనే గోరింటాకు దొరుకుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కోన్లు అందుబాటులోకి వచ్చాయి. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు మిక్సింగ్ చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే చర్మవ్యాధులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును మాత్రమే వాడుకునేలా ప్రాధాన్యతను ఇవ్వాలి. గోరింటాకు అందం ఆరోగ్య, సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. అమ్మవారికి ప్రతీకగా.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తుంది. గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మిదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా వ్రతాలు, పూజలు చేసుకుంటారు. – ఆరాధ్యశర్మ, వేదపండితులు, జనగామ -
నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘ఫరీబ్’ (1996), ‘మెహందీ’ (1998) తదితర చిత్రాల్లో హీరోగా నటించారాయన. బాలీవుడ్ నటుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫేమ్ యూసఫ్ఖాన్ కుమారుడు ఫరాజ్. సల్మాన్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘మైనే ప్యార్కియా’కి మొదటగా ఫరాజ్ఖాన్నే హీరోగా అనుకున్నారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు ఫరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఆ సినిమా చేసే అవకాశం సల్మాన్ఖాన్ దక్కించుకున్నారు. కాగా కొన్ని వారాల క్రితం పహ్ మాన్ ఖాన్ తన సోదరుడు ఫరాజ్ అనారోగ్యం గురించి చెబుతూ, ఆర్థిక సహాయం కూడా కోరారు. అప్పుడు సల్మాన్ ఖాన్ సహాయం చేశారు. -
వైభవంగా యువరాజ్ పెళ్లి వేడుకలు
-
గల్లీలు కావవి... అందమైన మెహందీ రేఖలు!
అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకుకూ... అందమైన హైదరాబాద్కూ ఓ అపురూపమైన సంబంధం ఉంది. అదెలాగంటే..! అందరూ ఓల్డ్ సిటీని ఇరుకిరుకు గల్లీల నిలయంగా చెబుతుంటారు గానీ.. నాకెందుకో ఆ నాటికి అలా ఇళ్లు కట్టుకోవడం కరెక్టే అనిపిస్తుంటుంది. ఇరుకిరుకు గల్లీలను చూసి వాళ్లేదో నాగరికత తెలియక అలా చేశారనుకోవడానికి వీల్లేదు. గల్లీ ఇరుకైందంటే అర్థం... అప్పటి మనుషుల మనసులు చాలా విశాలంగా ఉన్నాయని. ఇదేంట్రా బాబూ... ఈ వాదనేమిటీ అనే సందేహం వద్దు. ఇలా ఇరుకిరుకుగా ఇళ్లు కట్టుకున్నారంటే మనుషులు చాలా దగ్గర దగ్గరగా ఉండటాన్ని కోరుకున్నారని దానర్థం. ఎంత ఇరుకుగా ఉంటే అంత దగ్గరగా ఉండాలని కోరుకున్నారన్నమాట. అంటే పూలదండలో పువ్వు పువ్వుకూ మధ్య స్థలం ఎంత తక్కువగా ఉంటే హారం అంత ఒత్తుగా ఉంటుందన్నట్టు. హారం ఎంత ఒత్తుగా ఉంటే దాని విలువ అంత ఎక్కువన్న మాట. దూరం దూరంగా అల్లిన హారాన్ని మగువలు కోరుకుంటారా? ధర ఎక్కువ పెట్టి కొంటారా? దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఇళ్లెంతగా దగ్గర దగ్గరగా ఉంటే వాళ్లంతటి ఒత్తై సామాజిక జీవనాన్ని కోరుకున్నట్లన్నమాట. ఒక్క పూలమాలతోనే ఉదాహరణే ఎందుకు? అమ్మాయిలు పెట్టుకునే మెహందీ అనండి లేదా గోరింటాకు అనండి. దీన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అరచేతి మీద కోన్తో గీసే ఆ సన్నటి గీతల మధ్య చాలా చాలా దూరం ఉందనుకోండి. ఆ డిజైన్ బోసిగా ఉండదూ! అదే అందమైన తీగలు చుట్టలు చుట్టుకున్నట్లుగా, చేయి తిరిగిన కళాకారుడు అలవోకగా మెలికలు తిప్పుతూ గీసిన గీతలు ఒత్తుగా ఉంటేనే చేతిలోని ఆ చిత్రాకృతికి అందం, చందం. మీరు గమనించి చూశారో లేదో... ఈ మెలికల డిజైన్లు కేవలం అరచేతి వరకే పరిమితం కావు. అచ్చం హైదరాబాద్ శివార్లను దాటి ఒకవైపు సదాశివపేట్ వరకూ, మరోవైపు చౌటుప్పల్ వరకూ, ఇంకోవైపు చేవెళ్ల వరకూ పాకేసినట్లుగా.. ఆ డిజైన్లు కూడా అరచేతిని దాటేసి దాదాపు మోచేయి వరకూ పాకేస్తాయి. ఏం చేస్తాం. మెహందీ వేసుకోవాలన్న కోరిక ఎంత బలమైనదో... హైదరాబాద్నే నివాసం చేసుకుని ఆవాసం ఉండిపోవాలన్న కోరికా అంతగా తీవ్రమైనది. అందుకే ఈ పాకులాట.ఇక ఒక్కోసారి చేతికి ఒత్తుగా గోరింటాకు పూసినా సరే... చేతి ముడతల్లోని గీతల్లో రంగు అంటక అక్కడ ఖాళీ కనిపించినట్లుగా ఉంటుంది కదా... మూసీ పారే చోట అచ్చం అలాగే రంగు విడిపోయి కనిపిస్తుంది. వెరసి.. మెహందీ అంత అందమైనదీ... మెత్తనైనదిలా కనిపించే ఒత్తైదీ, చిక్కనైనది... బహు చక్కనైనది, అరచేతిన ఇమడకుండా హద్దులకు అందకుండా విస్తరించేది... స్వర్గం మన అరచేతికి అందేంత దూరంలో ఉందంటే అది హైదరాబాదే! యాసీన్ -
గుండుపై గోరింట