minister ganta srinivasrao
-
మహిళను ఢీకొట్టిన మంత్రి కారు డ్రైవర్
జూబ్లీహిల్స్ పీఎస్లో కేసునమోదు బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్రావు కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని నవనిర్మాణ్ నగర్కు చెందిన సుమలత(24) మంగళవారం ఉదయం సమీపంలోని గుడికి వెళుతుండగా అతివేగంగా వచ్చిన ఏపీ33 జే1 ఆడీ కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడడంతో గుర్తించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని కారులో ఎక్కించుకుని, 5 కిలో మీటర్ల దూరంలోని నానక్రాం గూడ చెరువు సమీపంలో ప్రదేశంలో వదిలేశాడు. ఆమె చేతిలో రూ.100 పెట్టి తాను మంత్రి గంటా డ్రైవర్నని, ఈ విషయం బయటకు చెబితే అంతుచూస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన సుమలత రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చి తనభర్త వెంకన్నకు ఫోన్ చేయడంతో ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
స్వైన్ ఫ్లూ 'ఫ్రీ సిటీగా విశాఖ': మంత్రి గంటా
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాను స్వైన్ ఫ్లూ ఫ్రీ సిటీగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యనించారు. ఆయన ఇక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్టైడ్స్, కరపత్రాలు ఇతర సాధనాల ద్వారా స్వైన్ ఫ్లూపై విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) లో త్వరలోనే వైరాలజీ విభాగాన్ని అప్గ్రేడ్ చేసి తగిన సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, స్వైన్ ఫ్లూ మందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ ఉత్సవ్లో స్వైన్ ఫ్లూ అవగాహన కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.