జూబ్లీహిల్స్ పీఎస్లో కేసునమోదు
బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్రావు కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని నవనిర్మాణ్ నగర్కు చెందిన సుమలత(24) మంగళవారం ఉదయం సమీపంలోని గుడికి వెళుతుండగా అతివేగంగా వచ్చిన ఏపీ33 జే1 ఆడీ కారు ఆమెను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆమె గాయపడడంతో గుర్తించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని కారులో ఎక్కించుకుని, 5 కిలో మీటర్ల దూరంలోని నానక్రాం గూడ చెరువు సమీపంలో ప్రదేశంలో వదిలేశాడు. ఆమె చేతిలో రూ.100 పెట్టి తాను మంత్రి గంటా డ్రైవర్నని, ఈ విషయం బయటకు చెబితే అంతుచూస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన సుమలత రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చి తనభర్త వెంకన్నకు ఫోన్ చేయడంతో ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మహిళను ఢీకొట్టిన మంత్రి కారు డ్రైవర్
Published Wed, May 13 2015 1:49 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
Advertisement
Advertisement