Jubilee hills police station
-
కుక్క దొరికిందని ఠాణా మెట్లెక్కారు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నివసించే 21 ఏళ్ల సంవీత్.. తన స్నేహితులైన గౌతమ్, దీక్షిత్, తరుణ్, ధనుష్లతో కలిసి మంగళవారం రాత్రి కారులో వెళ్తున్న సమయంలో మాదాపూర్లోని బజాజ్ ఎ్రక్టానిక్స్ ఎదుట సలూకి జాతికి చెందిన పెంపుడు శునకం కనిపించింది. దాని యజమానిని గుర్తించేందుకు వారంతా ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి మాదాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శునకానికి తాడు కొని దానిని గౌతమ్ ఇంటికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. శునకం యజమానిని కనుగొనేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసం సమీపంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ సదరు కుక్కను గుర్తు పట్టి సమీపంలో చూశానని చెప్పారు. దీంతో యజమానిని గుర్తించేందుకు చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లను తట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి వాచ్మన్ ఈ కుక్కను గుర్తించాడు. అంతకు కొన్ని గంటల ముందే కుక్క యజమాని వెతుక్కుంటూ వచ్చాడని, అతని సెల్ నంబర్ ఇచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్కు చెందిన ఆ యజమానికి కుక్కను అప్పగించారు.బ్లేజ్ పేరుతో పిలుచుకునే ఈ కుక్క కనిపించగానే యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసులు యువకులను అభినందించారు. కాగా.. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, తన స్నేహితుడు గౌతంకు ఆరు కుక్కలు ఉన్నాయని.. వాటితో ఉండే అనుబంధం వేరుగా ఉంటుందని సంవీత్ తెలిపారు. అందుకే రెండు రోజుల పాటు కుక్క యజమానిని గుర్తించేందుకు గల్లీ గల్లీ జల్లెడ పట్టామన్నారు. అప్పగించిన కుక్క ఖరీదు దాదాపు రూ.2 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని.. అందుకే ఎంత కష్టమైనా దాని యజమానిని గుర్తించి అప్పగించామన్నారు. -
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్నగర్లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్నగర్ బ్యాంక్లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్కుమార్, హిమాయత్నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అలా జైలుకు..ఇలా బెయిల్పై
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నని..తనకు డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రెస్లో ఏకంగా సైఫాబాద్లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్కు చెందిన కొనకంచి కిరణ్కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్స్పెక్టర్నని, డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది. -
తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి..
బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచి్చన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ (30) రాయదుర్గం సమీపంలోని అడాప్్ట్స ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్ బైక్పై హెల్మెట్ ధరించి జూబ్లీహిల్స్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వచి్చ న టిప్పర్ శివశంకర్ బైక్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారయ్యాడు. మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్ విగత జీవిగా మారడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్స్టేషన్ ఆవరణలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో శివశంకర్ పని చేస్తున్న సంస్థలో, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
Hyd: లిఫ్ట్ అడిగి మరీ రేప్ బెదిరింపులు!
హైదరాబాద్, సాక్షి: నడిరోడ్డుపై నిల్చుని కారులో వెళ్లేవాళ్లను లిఫ్ట్ అడుగుతుంది. జాలిపడి లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే!. రేప్ చేయబోయారని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటుంది. అలా పదుల సంఖ్యలో బెదిరింపు ఉదంతాలకు పాల్పడిన కిలా(లే)డీని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి ఏదో అర్జంట్ పని ఉందంటూ లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత ‘రేప్’ చేయబోయారని బెదిరిస్తూ డబ్బులు గుంజడం ఆమెకు బాగా అలవాటు అయ్యింది. పైగా తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు దిగుతుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారు ఎక్కింది. ఆపై దిగేముందు బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో సదరు డ్రైవర్ పరమానంద.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించిన పోలీసులు.. నగర వ్యాప్తంగా పలు స్టేషన్లో ఆమెపై 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
పార్కింగ్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో అతి వేగంగా కారులో దూసుకెళుతూ కారును కంట్రోల్ చేయలేక పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా, గడి గ్రామానికి చెందిన ఫిర్దోస్ సాదిక్ అలీ ఆదివారం రాత్రి కారులో తన స్నేహితులు అస్మత్, షాబాద్తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం వారు కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెం 70 డీకే నగర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ప్లాట్ నెం 179లోని పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బోర్వెల్ను ఢీకొట్టడంతో బోర్వెల్ ధ్వంసమైంది. అదే సమయంలో సమీపంలో నిద్రిస్తున్న వాచ్మెన్ రవి పక్కకు జరిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి వారు మద్యం సేవించినట్లుగా నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్మాత బెల్లంకొండ కారు అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే అభియోగం మీద.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలానగర్ బస్తీవాసి విజయ్తో కలసి షేక్ హైదర్ అనే వ్యక్తి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే వారెవరికీ అక్కడ ఇళ్లు రాలేదు. షేక్హైదర్, విజయ్ చేతుల్లో మోసపోయినట్లు వారికి తెలిసింది. దీంతో వారంతా బస్తీవాసులపై గొడవకు దిగుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందంటూ అదే బస్తీకి చెందిన జె.గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమను మోసగించాడంటూ డబ్బులు చెల్లించిన వారందరికీ విజయ్, షేక్హైదర్లు చెబుతూ.. వారిని నమ్మించి తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని బస్తీవాసులుగా పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు వారినుంచి ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో తీన్మార్మల్లన్నతోపాటు షేక్హైదర్, విజయ్, మధులపై ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితే అసలైన పెట్టుబడిదారు! -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పిపుచ్చుకోలేరు: డింపుల్
-
సినీ నటి డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు
-
పవన్కళ్యాణ్ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుసరిస్తున్నవారు అభిమానులు కాదని పేర్కొన్నారు. మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలపైన, కారులోను పవన్కళ్యాణ్ను వెంబడించారని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్కళ్యాణ్ ఇంటివద్దకు వచ్చి గొడవ చేశారని, సెక్యూరిటీ సిబ్బంది నివారిం చబోగా దుర్భాషలాడుతూ గొడవకు దిగారని పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
'నా కుటుంబం ఆపదలో ఉంది'.. జూబ్లీహిల్స్ పీఎస్లో పూరి ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. #Liger : Producer-Director #PuriJagannath Complains to Poloce Authorities that his Distributors are trying to instigate violence! pic.twitter.com/POxsnGsbdk — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 26, 2022 -
అర్ధరాత్రి గోడదూకి.. మహేష్బాబు ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇంట్లో ఓ యువకుడు గోడదూకి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్నెం 81లో నివసించే మహేష్బాబు ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి కృష్ణ(30) అనే యువకుడు గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించాడు. పది అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శబ్ధానికి అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తీవ్ర గాయాలతో వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరా తీయగా సదరు యువకుడు మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు కోలుకున్నాక లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. చదవండి: (25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు) -
పీఎస్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు
-
ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. పోలీస్స్టేషన్లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంఐఎం నేత కొడుకును తప్పించారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ -
భర్తను చంపి ఫ్రిజ్లో పెట్టి.. పుట్టింటికి వెళ్లింది
సాక్షి: హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్లో జరిగిన టైలర్ హత్య కేసును పోలీసులు చేధించారు. సాధిక్ను హత్య చేసింది భార్య రుబినా అని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోభార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో రుబినా తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తల్లిగారింటికి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధిక్ తొలుత అమీర్పేట్లో టైలర్ షాపు నడిపేవాడు. కానీ లాక్డౌన్ కారణంగా షాప్ మూతపడింది. ఈ క్రమంలో ఇటీవలే కూకట్పల్లి ప్రాంతంలో మరో షాప్ ఓపెన్ చేశాడు. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ కోపంలో రుబినా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్లో పెట్టి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం గురించి తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రస్తుతం రుబినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణం -
కన్నేసి... కాటేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతిని బర్త్డే పార్టీ పేరుతో నగరానికి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టిన విషయం మరువకముందే నగరంలో అటువంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కేక్లో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు వేరైనా నేరం తీరు ఒకేరకంగా ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్గా నమోదైన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్హిల్స్ వినాయకనగర్లో నివసించే బొందలగడ్ల నవీన్రెడ్డి(22) క్లీనర్గా పనిచేస్తుండగా అదే ప్రాంతంలో నివసించే మాధవ్జీ జోసెఫ్(20) ప్లాస్టిక్ గ్లాసుల విక్రయం చేస్తుంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్ పనిచేసే రాగిని రాము(23) ముగ్గురూ ఫ్రెండ్స్ కాగా ఈ ముగ్గురికీ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నలుగురూ స్నేహితులుగా ఉండేవారు. ఎవరికి వారే ఆమెను ప్రేమలో పడేసేందుకు యత్నిస్తున్నారు. ఆ యువతి సికింద్రాబాద్లోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈనెల 5న ఫీజు చెల్లించేందుకు ఇంట్లోంచి కాలేజీకి వెళ్లింది. కలసి వేడుక చేసుకుందామని.. యువతికి జోసెఫ్ ఫోన్ చేసి తన పుట్టినరోజు ఉందని అందరం కలసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. నవీన్రెడ్డి, జోసెఫ్లు యువతి కళాశాలకు వెళ్లి ఆమెను బైక్పై కూకట్పల్లిలోని ఓయో రూమ్స్కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో స్నేహితుడు రాము వేచి ఉన్నాడు. ముగ్గురూ కలసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కేక్పై మత్తు చల్లి ఆమెకు తినిపించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని రోదిస్తుండగా ఈ విషయం బయటికి చెబితే నగ్న దృశ్యాలు వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయపడి ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. ఆరోగ్యం దెబ్బతినడంతో.. రెండ్రోజుల తర్వాత బాధిత యువతికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు లోతుగా అడగడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లిదండ్రులు ఆ ముగ్గురు యువకులను పిలిపించి తిట్టారు. కూతుర్ని కొట్టారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన కేపీహెచ్బీ ప్రాంతంలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ స్టేషన్కు ఏమైంది..?
బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులు... అటాచ్మెంట్లు.. సస్పెన్షన్లు.. గడువు తీరకుండానే అర్థాంతరపు బదిలీలు... సిబ్బందిపై కోల్పోతున్న పట్టు... ఎవరికివారే యుమునాతీరే చందంగా వసూల్ రాజాలు... ఇదీ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ తాజా పరిస్థితి. గత రెండేళ్లుగా పోలీస్స్టేషన్ను వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. మూడురోజుల క్రితం ఇన్స్పెక్టర్, ఎస్ఐలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ పోలీస్స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే పోలీస్స్టేషన్ నుంచి ఒకేసారి ముగ్గురు ఎస్ఐలు అటాచ్ అయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ లేకుండానే స్టేషన్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోలీస్స్టేషన్ అప్రతిష్టపాలవుతోంది. ఉన్నతాధికారులు తరచూ క్లాస్లు తీసుకుంటున్నా ఇక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటేనే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వణికిపోతున్నారు. ఇటీవలే ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ పనిచేయలేమంటూ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్టేషన్కు పదిమంది ఎస్ఐలు అవసరం. ప్రస్తుతం ఓ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్కాగా కేవలం నలుగురు మాత్రమే మిగిలారు. ఆరు ఎస్ఐ పోస్టులతో పాటు ఒక సీఐ పోస్టు ఖాళీగా ఉంది. అడ్మిన్ ఎస్ఐ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. క్రైమ్ ఎస్ఐ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సరిపడ సిబ్బంది లేక పోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఉపరాష్ట్రపతి ఇదే పీఎస్ పరిధిలో ఉండటంతో నిత్యం వీవీఐపీల రాకపోకలు జరుగుతుంటాయి. ప్రముఖులపై కేసులు, పబ్లలో గొడవలు నిత్యకృత్యం. అయితే ఇంటికి కీలకమైన పోలీస్స్టేషన్లోనూ అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రక్షాళన చేయాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ క్రైమ్ విభాగం కూడా పడకేసింది. కేసులు ముందుకు సాగడంలేదు. ఎక్కడి ఫైళ్లు అక్కడే పేరుకుపోతున్నాయి. మరి అధికారులు ఈ స్టేషన్ను ఎలా బతికిస్తారో..? వేచి చూడాల్సిందే. -
ఏసీబీ ఎదుట లొంగిపోయిన బల్వంతయ్య..
బంజారాహిల్స్: చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ దొరికిన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ పి.సుధీర్రెడ్డి కేసులో వాంటెడ్గా ఉన్న ఇన్స్పెక్టర్ బల్వంతయ్య శుక్రవారం ఏసీబీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కాగా, డబ్బులు ఇవ్వాలని తానే నిందితుడిని డిమాండ్ చేశానని.. ఎస్ఐ సుదీర్రెడ్డి ద్వారా తీసుకున్నట్లు బల్వంతయ్య వాం గ్మూలం ఇచ్చారని ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బల్వంతయ్యతో పాటు సు«దీర్ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ‘పేజ్ 3 లగ్జరీ సెలూన్’నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ నుంచి రూ.50 వేల నగదు, 2 మద్యం సీసాలు లంచంగా తీసుకుంటూ గురువారం సు«దీర్రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదిత మే. ఈ విషయం తెలియడంతో బల్వంతయ్య పరారయ్యారు. అనంతరం ఏసీబీ అధికారుల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. -
మోడల్పై లైంగిక దాడి.. వీడియో చిత్రీకరణ
బంజారాహిల్స్: ఓ మోడల్పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా మరో యువకుడు దానిని సెల్ఫోన్లో చిత్రీకరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ప్రాంతానికి యువతి(21) కొద్ది రోజుల క్రితం మోడలింగ్ చేయడానికి నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్లో ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు హాస్టల్ యజమాని కుమారుడు రిషితో పరిచయం ఏర్పడింది. కాగా నాలుగు నెలలుగా ఆమె తెలంగాణ మిస్ మోడల్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో తన చెల్లితో కలిసి అద్దెకు ఉంటోంది. గత నెల 28న ఆమె సోదరి బంధువుల వద్దకు వెళ్లడంతో రిషితో పాటు అతడి స్నేహితుడు నిఖిల్రెడ్డి భోజనం చేస్తామంటూ ఆమె గదికి వచ్చారు. గంజాయి మత్తులో ఉన్న రిషి ఆమెపై నోరు నొక్కి లైంగికదాడికి పాల్పడుతుండగా అతని స్నేహితుడు నిఖిల్రెడ్డి ఫోన్లో వీడియో తీశాడు. అంతేగాక నిఖిల్రెడ్డి ఆమె ఫోన్ లాక్కుని అందులో నుంచి రిషి ఫోన్కు ఓ తప్పుడు మెసేజ్ను కూడా పంపించాడు. అయితే తాను భయంతో ఎవరికీ చెప్పుకోలేక తన సొంత ఊరికి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచన మేరకు ఈనెల 7న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియాతో పేర్కొంది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు మార్చి రాయాలంటూ డీఐ రమేష్ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. తన కళ్లముందే ఎస్ఐ నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని పేర్కొంది. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్రావు పేర్కొన్నారు. -
ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది
అతడో ఆటో డ్రైవర్. తన ఆటోను తీసుకెళ్లి ఎంచక్కా ఓ సీసీ కెమెరా కింద ఆపాడు. అటూఇటూ చూసి ఎవరూ తనని చూడకపోవడంతో చకచకా ఆటోపైకి ఎక్కేశాడు. చటుక్కున సీసీ కెమెరా తీగలు కత్తిరించి దాన్ని పట్టుకుని ఉడాయించాడు. అనంతరం దాన్ని ముక్కలు చేసి పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. ఇక బస్తీలో తాను చేసే చిల్లర పనులు ఏ కెమెరా రికార్డు చేయలేదులే అన్న ధైర్యంతో బస్తీకి వచ్చేశాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతగాడిని పట్టుకొని పక్కనే ఉన్న మరో కెమెరాలో ఈయనగారు చేసిన చోరకళను చూపించి బిత్తరపోయేలా చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. వనపర్తికి చెందిన శాంతానాయక్(40) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని నందగిరిహిల్స్ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్లో గుడిసె వేసుకొని బతుకుతూ ఆటో నడుపుతున్నాడు. అతడు మద్యం సేవించడం, పేకాడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు నందగిరిహిల్స్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ సీసీ కెమెరా తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందనే కారణంగా ఏకంగా సీసీ కెమెరానే దొంగిలించి అమ్మేశాడు. అయితే అతడు ఈ కెమెరాను దొంగిలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇంకో కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయం తెలియని శాంతానాయక్ తాను దొంగతనం చేయలేదని బుకాయించగా పోలీసులు ఆ ఫుటేజీలను కళ్ల ముందుంచారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. సీసీ కెమెరా దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడం నగరంలో ఇదే మొదటిసారి. –హైదరాబాద్ -
పవన్కల్యాణ్పై జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు
హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం భీమవరంలో జరి గిన ఎన్నికల సభలో పవన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడు లు చేస్తున్నారని, తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన సమయంలో కూడా ఏ ఒక్కరిపైనా దాడు లకు పాల్పడలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కూడా ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టు కుని చూసుకుంటున్నామని, అన్నదమ్ములవలే ఎంతో సఖ్యతతో ఉన్నామని గుర్తుచేశారు. చంద్రబాబు సూచనలతో పవన్కల్యాణ్ ఓట్లకోసం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పా లని ప్రశ్నించారు. తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న పవన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సీ.హెచ్ ఉపేందర్, తూడి శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్గూడలోని జవహర్నగర్కు చెందిన యువతి (18)కి ఆమె అద్దెకుంటున్న ఇంటి కింది పోర్షన్లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అతడు అక్కడి టైలర్షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి లోనైన దుర్గాప్రసాద్ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ నిలదీశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో మెడపై పొడిచాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని కిందకి పరుగు తీసింది. దీనిని గుర్తించిన టైలర్షాపు యజమాని యూసుఫ్ ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. స్థానికులు దుర్గాప్రసాద్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమ య్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. హత్య హైదరాబాద్లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరిచంద్రరెడ్డి.. ఆమెను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
బెటాలియన్కు బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని అత్యంత కీలకమైన బలగాల యూనిట్ బెటాలియన్లో సంక్షేమ విభాగపు నిధులకు గండిపడింది. ప్రతీ బెటాలియన్లో బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీ సర్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. బెటాలియన్లో క్యాంటీన్, గ్యాస్, పెట్రోల్ పంప్, కామన్ గుడ్ ఫండ్ తదితరాల మెయింటెనెన్స్ మొత్తం ఈ బెటాలియన్ వెల్ఫే ర్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులను బురిడీ కొట్టించి కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. చెక్కులపై సంతకాలు ఫోర్జరీ యూసఫ్గూడలోని మొదటి పోలీస్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెల్ఫేర్ వింగ్లో పనిచేస్తున్నాడు. ప్రతీ నెలా మెయింటెనెన్స్ కింద వచ్చే డబ్బులను బ్యాంకులో జమ చేయడం, అకౌంట్ బుక్కులు, చెక్కులను అప్డేట్ చేస్తూ ఉండటం ఇతడి విధి. బ్యాంకుల్లో జమ చేయాల్సిన నగదును సొంత ఖాతాలో జమ చేసుకోవడం, బ్యాంకు చలానా కట్టినట్టుగా స్టాంప్, బ్యాంకు అధికారుల సంతకాలు తానే పెట్టి ఆడిటింగ్ ఫైళ్లలో పెట్టేవాడు. ఇలా 2013 నుంచి 2018 మార్చి వరకు మొత్తం రూ.40 లక్షల మేర శ్రీకాంత్ కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. బ్యాంకులో నగదు జమ చేసినట్టుగా ప్రతీ నెలా పాస్బుక్ అప్డేట్ చేయడం కోసం తన ఇంట్లోనే అప్డేట్ చేసే సాఫ్ట్వేర్, ప్రింటర్ను పెట్టుకున్నాడు. ఇలా ప్రతీ నెలా గ్యాస్, క్యాంటీన్, ఇతర మెయింటెనెన్స్ కింద వచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది. కానిస్టేబుల్పై కేసు నమోదు... కుంభకోణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ శ్రీకాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంది. చెక్కులపై సంతకాలు చేయడం, వాటి డిపాజిట్, తదితర వ్యవహారాలన్నింటిపై ప్రతీ మూడు నెలలకోసారి ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బాంకుల్లో ఉన్న నగదును కూడా చెక్ చేయాలి. కేవలం పాస్బుక్లను ఆధారంగా చేసుకొని ఆడిటింగ్ చేయడం, శ్రీకాంత్పై ఆరోపణలున్నా సంబంధిత ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో గతంలో పనిచేసిన వెల్ఫేర్ అధికారులతో పాటు కమాండెంట్లపై విచారణ జరపాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. 2013 నుంచి జరిగిన ఈ స్కాంలో ఆ సమయాల్లో పనిచేసిన బెటాలియన్ వెల్ఫేర్ అధికారులు, కమాండెంట్ల నుంచి సంబంధిత నగదును రికవరీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. గతంలోనే ఇలాంటి అవినీతి ఆరోపణల వ్యవహారంపై ‘సాక్షి’కథనాలు ప్రచురించింది. బెటాలియన్ వెల్ఫేర్ అధికారులతో పాటు ఎంటీవో (మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి) పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు సాగుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతమంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయినా.. మళ్లీ అక్కటే అటాచ్మెంట్ పేరుతో పాతుకుపోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా బయటపడింది... గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న ఈ కుంభకోణం ఓ చెక్కు వల్ల బయటపడింది. మార్చి 13న శ్రీకాంత్ తన స్నేహితుడు ఖాతాలో రూ.రెండు లక్షల చెక్కును బదిలీ చేశాడు. మొదటి బెటాలియన్కు సంబంధించి వివిధ బ్యాంకుల్లో 13 ఖాతాలున్నాయి. శ్రీకాంత్ నగదు జమచేసే బ్యాంకు ఎస్బీహెచ్ కాగా, బ్యాంకుల విలీనం వల్ల ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనం అయ్యింది. మార్చి వరకు పాత బ్యాంకు చెక్కులు చెలామణి కావడంతో పాత డేట్తో ఒక చెక్కును ఎస్బీఐ అకౌంట్ ద్వారా తన స్నేహితుడి ఖాతాకు రూ.రెండు లక్షలు పంపించాడు. అయితే ఈ ఎస్బీఐ ప్రధాన ఖాతాకు సంబందించిన సంక్షిప్త సందేశాలు ఏఆర్ఎస్ఐకి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.రెండు లక్షల చెక్కుకు సంబంధించి తామేమి లావాదేవీలు జరపలేదని గ్రహించి ఏఆర్ఎస్ఐ బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా, శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ పాత ఎస్బీహెచ్ చెక్కును బదిలీ చేసినట్టు తెలిపారు. దీంతో సందేహం వచ్చి బ్యాంకు పాసుబుక్లో ఉన్న నగదు, బ్యాంకులో డిపాజిట్లో ఉన్న నగదును టాలీ చేశారు. ఇక్కడే శ్రీకాంత్ అసలు కథ బయటపడింది. -
ఈ సోనమ్ ఎవరో తెలుసా
బంజారాహిల్స్: నగరంలోని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచారు. ఓ పక్క సమావేశం జరుగుతోంది.. వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు హాజరవుతున్నారు.. ఇంతలో ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ స్టేషన్లోకి అడుగు పెట్టింది. ఏదన్నా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిందేమోనని పోలీసు సిబ్బంది.. స్టేషన్కు వచ్చిన మరికొందరు ఫిర్యాదుదారులు ఆమె వైపే చూస్తున్నారు. ఆమె తిన్నగా కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్లేసరికి అంతా షాకయ్యారు. ‘నేనూ హిజ్రానే.. పేరు సోనమ్.. ఫ్రమ్ ముంబై’ అని చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. -
దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనవరి 26న ఫిలించాంబర్లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్పేట్లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తెను ప్రేమిస్తున్నాడని..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్గూడ జవహర్నగర్కు చెందిన మహేందర్, భరత్నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఈ నెల 21న అఖిల్, సాయి అనే ఇద్దరు యువకులు మహేందర్ను బలవంతంగా కారులో వెంకటేష్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. మల్లేష్, సాయి, వెంకటేష్ అతడిని తీవ్రంగా కొట్టడంతో మహేందర్ సృహతప్పి పడిపోవడంతో 22వ తేదీ తెల్లవారుజామున యూసుఫ్గూడ రహదారిపై పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి బాలమణి కుమారుడిని కేర్ ఆసుపత్రిలో చేర్చించాడు. బుధవారం కోలుకున్న మహేందర్ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సనత్నగర్ పోలీస్స్టేషన్కు పంపగా, వారు తమ పరిధి కాదంటూ జూబ్లీహిల్స్ కు పంపారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్లో వేధిస్తోందని యువతిపై ఫిర్యాదు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ఓ యువతి సెల్ఫోన్లో తనను వేధిస్తున్నదని ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జూబ్లీహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే సతీష్ అనే యువ వ్యాపారికి గత రెండేళ్లుగా ఫోన్లో నెట్కాలింగ్ ద్వారా అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫోన్లు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వాలంటూ లేకపోతే పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న యువతిని మీరెవరంటూ ఎన్నిసార్లు ప్రశ్నించినా సరైన సమాధానం ఉండేది కాదు. దీంతో సతీష్ ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించడంతో సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని..
హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇస్తానని ఒక వ్యక్తి తనను మోసం చేశాడంటూ కృష్ణవేణి అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆమె కోరింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నానని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన కృష్ణవేణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల క్రితం విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమయ్యాడని ఓ టీవీ చానల్తో చెప్పింది. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నానని అతడు చెప్పాడని వెల్లడించింది. సినిమా పరిశ్రమలో తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో అతడిని నమ్మి డబ్బు ఇచ్చినట్టు చెప్పింది. సినిమాల్లో అవకాశం అడిగితే ‘కమిట్మెంట్’ అడిగాడని తెలిపింది. కమిట్మెంట్ అంటే ఏంటని అడిగితే.. తనతో ఏకాంతంగా గడిపితే గడిపితే హీరోయిన్ చేస్తానని చెప్పాడని వెల్లడించింది. అందుకు తాను ఒప్పుకోకపోలేదని, తన డబ్బు తిరిగివ్వాలని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించింది. కాగా, కృష్ణవేణి ఆరోపణలను శ్రీనివాస్ తోసిపుచ్చాడు. ఆమె ఎవరో తనకు తెలియదని, హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పలేదని అన్నాడు. తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటానని తెలిపాడు. -
యాంకర్ రవిపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన యాంకర్ రవిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సినిమా వేడుకలో నటుడు చలపతిరావు మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఆ షోకు యాంకర్గా వ్యవహరించిన రవి సూపర్ అంటూ సమర్థించాడన్నారు. చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై కేసు నమోదు చేయాలని ఈ నెల 23న మహిళా, ప్రజాసంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చలపతిరావుపై అదే రోజు కేసు నమోదు చేయగా, న్యాయ సలహా అనంతరం యాంకర్ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చలపతిరావు, రవిపై ఇప్పటికే సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
'ఫ్యాషన్' మోసంపై ప్రియాంక ధ్వజం
హైదరాబాద్: ప్రియాంక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మిలీనియం ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. 2014-16 ఏడాదికిగానూ కోర్సు ఫీజు కింద మొదటి విడతలో రూ.2.8 లక్షల అడ్మిషన్ ఫీజు, రెండో ఏడాది రూ.15.7 లక్షలతోపాటు హాస్టల్ ఫీజు మరో రూ. 2.4 లక్షలు.. ఇలా ఫీజుల రూపంలోనే భారీ మొత్తాన్ని చెల్లించింది. అయితే మరో సంవత్సరం మిగిలి ఉండగానే కాలేజీ యాజమాన్యం కోర్సును అర్ధాంతరంగా నిలిపేసింది. తల్లిదండ్రులతోకలిసి కాలేజీ యాజమాన్యం దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. ఏం జరుగుతోదని ప్రశ్నించింది. సరైన సమాధానం చెప్పకపోగా ఆమను దుర్భాషలాడిన యాజమాన్యం.. ప్రియాంకను, ఆమె తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసింది. దీంతో.. నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియాంక ఇన్ స్టిట్యూట్ మోసంపై ఫిర్యాదుచేసింది. కళాశాల యాజమాన్యం తమను చీటింగ్ చేసిందని, తనతో పాటు చాలా మంది విద్యార్థులు కోర్సు పూర్తికాక భవిష్యత్తును పాడుచేశాయని ప్రియాంక ఆరోపించింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పేరుతో మోసాలకు పాల్పడుతోన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐపీసీ సెక్షన్ 406, 420, 506లను అనుసరించి రఫెల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ యాజమాన్యంపై కేసు నమోదుచేసకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కరెంటు మీటర్ల సీల్స్ చోరీ ముఠా అరెస్ట్
బంజారాహిల్స్: కరెంటు మీటర్లకు వేసే సీల్స్ను దొంగి లించి వాటిని విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారికి విక్రయిస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బంజారాహిల్స్ డివి జన్ ఏసీపీ ఉదయ్కుమార్రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ సామల వెంకట్రెడ్డి, డీఐ ముత్తు ఈ ఘట న వివరాలు వెల్లడించారు. జవహర్నగర్ జీటీఎస్ కాలనీలో ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్స్ గోడౌన్ లో మహ్మద్ నయీం(27) మీటర్ సీల్స్ పను లు చేస్తున్నాడు. ఇతడు కొంతకాలంగా కరెంటు మీటర్లకు వేసే సీల్స్ను దొంగిలిస్తున్నాడు. వీటిని ఎలక్ట్రీషియన్లు అయిన మహ్మద్ బాసిత్ఖాన్(39), మహ్మద్ నిసార్(32), గులాం సాం దాని(42), మహ్మద్ సాదిక్ హుస్సేన్(43)కు విక్రయించేవాడు. వీరు ఫ్యాక్టరీలు, బడా గోదాములకు ఈ మీటర్ సీళ్లను విక్రయిస్తున్నారు. ఇలా ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తనకు నెలనెలా లక్షల్లో కరెంటు బిల్లు వస్తుండటంతో మీటర్ సీల్ తొలగించి ముంబయి నుంచి ప్రత్యేకంగా ఎలక్టీషియన్ను రప్పించి మీటర్ ను ట్యాంపరింగ్ చేయించి దొంగిలించిన మీట ర్ సీల్ను వేశాడు. ఇదిలా ఉండగా, తన కార్యాలయంలో 130 మీటర్ సీళ్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఏఈ మురళీధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు ఏఈ కిందనే పని చేస్తున్న నయీం ఈ పని చేసినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నయీం వద్ద 59 సీల్ బిట్స్ లభించాయి. వాటి ని స్వాధీనం చేసుకుని నయీంతో పాటు ముగ్గురు ఎలక్టీషియన్లు, ఐస్ ఫ్యాక్టరీ మేనేజర్ను అరెస్టు చేశారు. ఎలా పని చేస్తుందంటే: జీటీఎస్కాలనీలోని మీటర్ సీల్స్ గోదాంనుంచి నయీం సీళ్లను చోరీచేసి ఒక్కొక్కటి రూ. 500 కు బాసిత్ అనే ఎలక్ట్రీషియన్కు విక్రయించేవాడు. బాసిత్ ఐస్ ఫ్యాక్టరీ యజమానికి రూ. 15 వేలకు సీల్ బిట్స్ విక్రయించాడు. ముం బయి నుంచి మీటర్ ట్యాంపరింగ్ చేసే వ్యక్తిని రప్పించి ఒరిజినల్ మీటర్ సీల్ తొలగించి దొం గిలించిన సీల్ను వేశారు. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మీటర్ తిరిగేలా దానికి ఎలక్ట్రిక్ రిమో ట్ కంట్రోల్ను కూడా బిగించారు. మొత్తం 130 సీళ్లు చోరీ కాగా, వాటిలో 59 మాత్రమే పోలీసులకు చిక్కాయి. మిగతావి ఎక్కడ బిగించారో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు
హైదరాబాద్: ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్ష తొలిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మన్నె గోవర్ధన్ రెడ్డి అనే టీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రేవంత్రెడ్డిపై 504, 290, 188, 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఈ కేసులు కొలిక్కి వచ్చేనా?
►‘ వీఐపీ’ ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు ► కేసులు ఛేదించడంలో పోలీసుల విఫలం బంజారాహిల్స్: ఫిల్మ్నగర్ సినార్ వ్యాలీలో రియల్టర్ ఎస్ఎస్ శర్మ ఇంట్లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. కేవలం ఈ కేసులో మాత్రమే కాదు... గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్జోన్ పరిధిలో చోటు చేసుకున్న అనేక ‘వీఐపీ’ కేసులూ కొలిక్కి రాకుండానే ఉన్నాయి. ప్రముఖులు నివసించే ఈ జోన్ పరిధిలోనే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఉన్న ప్రముఖుల్లో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ల పరిధిల్లోనే నివసిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో జరిగిన చోరీలను ఛేదించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. అనేక లోపాలను తమకు అనువుగా మార్చుకుంటున్న దొంగలు పక్కాగా రెక్కీ చేసి మరీ ఎలాంటి ఆధారాలు వదలకుండా ‘పని’ పూర్తి చేసుకెళ్తున్నారు. శర్మ ఇంట్లో జరిగిన పంథాలోనే గడిచిన కొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ పరిధిలో మూడు దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలన్నీ ఒకే వ్యక్తి చేశాడని అనుమానించడం మినహా... పోలీసులు సాధించిన పురోగతి అంటూ ఏమీ లేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆ తర్వాత దాని విషయం మర్చిపోతుండటం బాధితులకు శాపంగా మారుతోంది. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు కేసుల్ని కొలిక్కి తీసుకురమ్మని చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం, క్షేత్రస్థాయి పోలీసింగ్లో పోలీసుల వైఫల్యమో, నానాటికీ తెలివి మీరుతున్న చోరుల విధానమో... ఏదేమైనా బాధితులుగా ఉంటున్న ప్రముఖులకు సైతం నష్టమే మిగులుతోంది. ‘ప్రముఖ’ కేసుల్లో కొన్ని... ► ఫిల్మ్నగర్లో సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు నివాసంలో 2009 అక్టోబర్ 14న రెండు కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. వీటి విలువ రూ.60 లక్షలు. ► ఫిల్మ్నగర్లో సినీ నటుడు అశోక్ కుమార్ ఇంట్లో 2010 మార్చి నెలలో దొంగలు పడి రూ.25 లక్షలు విలువ చేసే నగలు ఎత్తుకెళ్లారు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లో ఎమ్మెల్యే, ఎంపీల కాలనీని ఆనుకొని ఉన్న సీఆర్పీఎఫ్ క్వార్టర్స్లో దక్షిణ భారత సీఆర్పీఎఫ్ ప్రధానాధికారి నివాసంలో నాలుగేళ్ల క్రితం దొంగలు పడ్డారు. దాదాపు రూ.1 కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ► బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని మాజీ చీఫ్ సెక్రటరీ హరిహరన్ నివాసంలో 2014 ఏప్రిల్ 11న దొంగలు పడ్డారు. దాదాపు రూ. 4 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లో నివసించే బ్లూ మూన్ హోటల్ మాజీ నిర్వాహకుడు గుండా సుధీర్ ఇంట్లో గతేడాది మార్చి 15న 190 తులాల బంగారం చోరీకి గురైంది. ► బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని మిథిలానగర్ సమీపంలో నివసించే మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఇంట్లో గతేడాది రూ.40 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ► ఫిల్మ్నగర్ వెంచర్-2లో ఎంపీ, నిర్మాత మురళీమోహన్ కుమారుడు నివసిస్తున్నారు. శ్రీలంక నుంచి వచ్చి ఈ ఇంట్లో బస చేసిన సన్నిహితురాలి వజ్రాల హారం గతేడాది చోరీకి గురైంది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో ఆర్కిటెక్ట్ రవి నివాసంలో ఇటీవల దొంగలు పడి రూ.7 లక్షలు విలువైన ఆభరణాలు తస్కరించారు. ► బంజారాహిల్స్ రోడ్ నెం.12లో మాజీ మంత్రి వినోద్ ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. -
ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్
హైదరాబాద్: 'ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుందో..'అనే సినిమా డైలాగ్ గుర్తుందికదా. సరిగ్గా అలాంటి గుబులే ఇప్పుడు నేరస్తులకు కలుగుతోంది ఓ పోలీస్ స్టేషన్ పేరు వింటే! అది.. సినిమా తారలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అంతకు మించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాక కూడా పోలీసులకు సవాళ్లు విసిరే పొగరుబోతులు తిరిగే చోటు, అప్పుడప్పుడూ రాత్రిపూట కార్లు రోడ్లను వీడి ఫుట్ పాత్ లపైకి వెళుంటాయక్కడ. ఒక్క కేసు నమోదు చేయాలంటే వంద వైపుల నుంచి ఒత్తిళ్లు. ఒక్క నిందితుణ్ని లాకప్ లో పెట్టాలంటే లక్ష తలనొప్పులు! అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నేరగాళ్లకు శిక్షలు పడేలా కేసులను త్వరితగతిన కేసులను పరిష్కరిస్తూ రికార్డు సాధించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఆ స్టేషన్ పరిథిలో ఎలాంటి నేరానికి పాల్పడేవారైనా హడలెత్తుతున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 13 స్టేషన్లలో జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదైన కేసుల పరిష్కారంలో అందరి కంటే ముందున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్(యూఐ) కేసుల మేళాలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. పెండింగ్ ఫైళ్లు, కేసుల పరిష్కారంలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అండర్ ఇన్వెస్టిగేషన్ మేళా(యూఐ) నిర్వహించారు. వెస్ట్జోన్ పరిధిలోని 13 పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు ఈ మేళాలో పాల్గొని గత మూడు నెలల నుంచి తాము సాధించిన పురోగతిని వివరించారు. ఎన్ని ఫైళ్లను పరిష్కరించారో చూపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేళాలో హైలెట్గా నిలిచారు. నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన 227 కేసుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు 218 కేసులను పరిష్కరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు చేసిన కృషిని వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ పోలీసులు 104.1 శాతం కేసులను పరిష్కరించినట్లయింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 348 యూఐ కేసులుండగా 218 కేసులను పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డితో పాటు ఎస్ఐలు డి.శ్రీను, గురుస్వామి, జగదీశ్, లోకారెడ్డి, రమేష్, డీఐ ముత్తు తదితరులు చేసిన కృషి ఫలితమిదని ఆయన అన్నారు. -
పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై కొందరు డిస్ట్రిబ్యూటర్లు దాడిచేసిన సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సి.కల్యాణ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల ‘లోఫర్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా నైజాం, సీడెడ్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ అనే డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టాలు రావడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురూ గత కొద్ది రోజుల నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని తనకేం సంబంధం లేదంటూ పూరీ బదులు చెప్పినా వీరు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -34లో ఉన్న పూరీ జగన్నాథ్ కార్యాలయానికి వచ్చిన అభిషేక్, సుధీర్, ముత్యాలరాందాస్ లు డబ్బులు ఇవ్వాలంటూ పూరీని బెదిరించారు. ఆ క్రమంలోనే పూరీపై దాడి కూడా చేసినట్లు తెలిసింది. దర్శకుడి కుటుంబ సభ్యులను సైతం నిందితులు భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దౌర్జన్యానికి పాల్పడ్డ ముగ్గురిని ఆపేందుకు పూరీ యత్నించినా ఫలితం లేకుండాపోయింది. కాగా, తన కార్యాలయంపై డిస్ట్రిబ్యూటర్లు దాడిచేశారంటూ పూరీ జగన్నాథ్ శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్విత్ 511 కింద కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
3డీ..రెడీ!
నేర, బందోబస్తు స్థలాల చిత్రీకరణకు 3డీ కెమెరాలు డివిజినల్ క్లూస్టీమ్స్కు రెండు చొప్పున కేటాయింపు ఒక్కొక్కటి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలు సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే గ్రంథి మాధవి కేసును ఛేదించడంలో నేర స్థలంలో లభించిన ఆధారాలే కీలకమయ్యాయి. దోపిడీ జరిగిన గదిలో గోడలపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా తెలిసిన వారి పనిగా అనుమానించిన పోలీసులు ఆ కోణంలో ముందుకు వెళ్లి... నిందితులను అరెస్టు చేశారు. ..నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలకు ఉన్న ప్రాధాన్యానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించే దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి క్రైమ్ సీన్స్ రికార్డింగ్కు 3డీ కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే అమలులోకి రానుంది. తరలింపుపైనే దృష్టి ఎలాంటి నేరం... ప్రమాదం చోటుచేసుకున్నా ఘటనా స్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? వారు రాకపోకలు సాగించిన మార్గాలు ఏమిటి? నేరం ఏ విధంగా చేశారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్ సీన్స్కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపునకు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఇప్పటి వరకు మాన్యువల్ మ్యాపింగ్... క్రైమ్ సీన్ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్ను రూపొందించడం అనివార్యం. దీన్ని ఎఫ్ఐఆర్ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. పోలీసు విభాగం ఇప్పటి వరకు ఈ మ్యాప్స్ను తెల్ల కాగితాలపై మాన్యువల్గా గీస్తోంది. దీనికి తోడుగా ఘటనా స్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందిస్తోంది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. మరోపక్క ఘటన తీవ్రతను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంలో విఫలమవుతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. రెండు రకాలైనవి కొనుగోలుకు నిర్ణయం ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసులు 3డీ కెమెరాలను కొనుగోలు చేస్తున్నారు. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్, రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్ డోర్ క్రైమ్ సీన్స్ను నిత్యం పోలీసులు సందర్శించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్సీన్స్కు వినియోగించేలా ఇండోర్, ఔట్డోర్ 3 డీ కెమెరాలు ఖరీదు చేస్తున్నారు. తొలి రరం ధర రూ.8 లక్షలు, రెండో రకం రూ.20 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తు తం నగర కమిషనరేట్లో సబ్-డివిజన్ స్థాయిలో 17 క్లూస్టీమ్స్ పని చేస్తున్నాయి. వీటికే ఈ రెండు రకాలైన కెమెరాలు అప్పగించాలని యోచిస్తున్నారు. కొలతలతో సహా చిత్రీకరణ... 3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరాను నేరం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్ కేంద్రంగా ఈ కెమెరా అన్ని దిక్కులను, అక్కడ వస్తువులను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా అవి హతుడు, నేర కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నాయనేదీ స్పష్టంగా నమోదు చేస్తాయి. ఈ రికార్డులను దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించి భౌతిక సాక్ష్యాల కోసం అన్వేషించవచ్చు. వీటినే న్యాయస్థానంలో దాఖలు చేయడానికీ అవకాశం ఉంటుంది. కేవలం నేర స్థలాలే కాకుండా బందోబస్తు, ప్రమాదాల చిత్రీకరణకు ఈ 3డీ కెమెరాలు ఉపకరించనున్నాయని అధికారులు చెబున్నారు. ఆరు రకాలుగా వినియోగం 1. బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ 2. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు 3. పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు 4. బందోబస్తు ప్లానింగ్ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ 5. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా 6. బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్ -
కూతురు కాదు.. కాలాంతకురాలు
తల్లిదండ్రులను కొట్టి.. ఇంటి నుంచి గెంటేసిన కూతురు పోలీసులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు యూసుఫ్గూడ: కన్నవాళ్లను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కూతురే వారిని ఇంటి నుంచి తన్ని తరిమేసింది. దీంతో రోడ్డునపడ్డ ఆ వృద్ధదంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. రెండు దశాబ్దాల క్రితం రెక్కలు ముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టి తాము నిర్మించుకొన్న ఇంటిని కూతురు తన మూడో భర్తతో కలిసి ఆక్రమించుకొని, తమను ఇంటి నుంచి గెంటేసిందని వారు కన్నీరుపెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్గాంధీనగర్లో ఉండే సీహెచ్ సరోజనమ్మ, చెన్నయ్య దంపతులకు 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలాన్ని కొని గూడు ఏర్పాటు చేసుకున్నారు. వీరి కూతురు భర్తను వదిలేసి మరో వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల అతడిని కూడా వదిలేసి బాబు అనే మరో వ్యక్తిని పెళి ్లచేసుకుంది. అప్పటి నుండే సరోజనమ్మ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇల్లు తమదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని, వృద్ధులని కూడా చూడకుండా కూతురు, అల్లుడు తరచూ వారిని కొడుతున్నారు. ఇప్పటికే సరోజనమ్మ దంపతులు మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపేశారు. బస్తీ పెద్దలతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే, ఇవేవీ ఆ వృద్ధులకు న్యాయం చేయలేకపోయాయి. మూడురోజుల నుంచి కూతురు, ఆమెతో పాటు ఉంటున్న బాబు వేధింపులు శ్రుతి మించాయని, తమను కొట్టి బయటకు నెట్టేశారని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపిన కానిస్టేబుల్
♦ హైదరాబాద్లో ఘటన ♦ మృతురాలిది రొంపిచర్ల మండలం బంజారాహిల్స్(హైదరాబాద్) : భార్యాభర్తల మధ్య విభేదాలు మహిళ ప్రాణాలు బలిగొన్నాయి. తనపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కడతేర్చాడు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం గురిపాడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మి (25), యూసుఫ్గూడ మొదటి పటాలంలో కానిస్టేబుల్ నర్సిరెడ్డి దంపతులు యూసుఫ్గూడ పోలీస్లైన్స్లోని క్వార్టర్స్లో నివాసముంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన గొడవలో నర్సిరెడ్డి తన భార్యను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె మొదటి పటాలం కమాండెంట్కు ఫిర్యాదు చేసింది. ఆ నోటా ఈనోటా ఈ విషయం బెటాలియన్తో పాటు పోలీస్ క్వార్టర్స్లో తెలిసిపోయింది. శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన నర్సిరెడ్డిని సహచరులు భార్యను గొడ్డునుబాదినట్టు బాదుతావా అంటూ ప్రశ్నించారు. మహిళపై ఎలా చేయిచేసుకున్నావంటూ అడిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నర్సిరెడ్డి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తనపై అధికారులకు సహచరులకు ఫిర్యాదు చేస్తావా అంటూ మళ్లీ కొట్టాడు. అక్కడే ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. తలపట్టుకొని గోడకేసి కొట్టడంతో ఆమె తల పగిలి రక్తస్రావం జరిగి విలవిలలాడుతూ కిందపడిపోయింది. కొద్దిసేపట్లోనే శ్వాసవిడిచింది. చుట్టుపక్కల వారు ఈ అరుపులకు, కేకలకు పరిగెత్తుకొచ్చి చూడగా అప్పటికే విజయలక్ష్మి విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తనకు సరిగా అన్నం వండిపెట్టడం లేదని సరిగా చూడటం లేదని పోలీసుల విచారణలో నర్సిరెడ్డి వెల్లడించారు. ఈ విషయంలోనే కలహాలు తలెత్తాయని వివరించారు. భార్య హత్యకు కారణమైన కానిస్టేబుల్ నర్సిరెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి వరుణ్రెడ్డి (3), పూజితారెడ్డి(5) ఇద్దరు పిల్లలున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను ఢీకొట్టిన మంత్రి కారు డ్రైవర్
జూబ్లీహిల్స్ పీఎస్లో కేసునమోదు బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్రావు కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని నవనిర్మాణ్ నగర్కు చెందిన సుమలత(24) మంగళవారం ఉదయం సమీపంలోని గుడికి వెళుతుండగా అతివేగంగా వచ్చిన ఏపీ33 జే1 ఆడీ కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడడంతో గుర్తించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని కారులో ఎక్కించుకుని, 5 కిలో మీటర్ల దూరంలోని నానక్రాం గూడ చెరువు సమీపంలో ప్రదేశంలో వదిలేశాడు. ఆమె చేతిలో రూ.100 పెట్టి తాను మంత్రి గంటా డ్రైవర్నని, ఈ విషయం బయటకు చెబితే అంతుచూస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన సుమలత రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చి తనభర్త వెంకన్నకు ఫోన్ చేయడంతో ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
పంజాగుట్ట పీఎస్ లో లొంగిపోయిన సి.కల్యాణ్
-
పంజాగుట్ట పీఎస్లో లొంగిపోయిన సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ బుధవారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మహిళపై దాడి చేసిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై చేయి చేసుకున్నారంటూ సి.కల్యాణ్ పై ఏప్రిల్ 28న డాక్టర్ కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత
-
మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై చేయి చేసుకున్నారంటూ ఆయనపై ఓ మహిళా డాక్టర్ ...జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
జూబ్లీహిల్స్ పీఎస్కు శృతిహాసన్ కేసు...
బంజారాహిల్స్: కాల్షీట్లు ఇచ్చి సరిగ్గా సినిమా షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ మెయిల్పట్టి దర్శక, నిర్మాతలను చీటింగ్ చేసిన ఘటనపై నటి శృతిహాసన్పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు సోమవారం బదిలీ చేశారు. సినిమా ఒప్పందం, కాల్షీట్ల డేట్లు, అడ్వాన్స్ చెల్లింపులు తదితర ప్రక్రియ అంతా బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని, ఆ స్టూడియో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును జూబ్లీహిల్స్కు బదిలీ చేశారు. ఫైల్ను అందుకున్న జూబ్లీహిల్స్ పోలీ సులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శృతిహాసన్కు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. నేడో రేపో ఆమెకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్లో హాజరుకావాల్సిందిగా సూచించనున్నారు. ఆమె నుంచి కేసుకు సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు. -
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
పోలీసుల అదుపులో నలుగురు నైజీరియన్లు యువదర్శకుడు, యువనిర్మాత కీలకపాత్ర బంజారాహిల్స్: డ్రగ్స్ముఠా గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఒక యువ దర్శకుడు, యువ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఏనుగు సుశాంత్రెడ్డి(28) ‘సూపర్స్టార్ కిడ్నాప్’ అనే సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపాడు. ఈ క్రమంలో డ్రగ్స్కు అలవాటుపడిన అతను యువ నిర్మాత, సినిమా డిస్ట్రిబ్యూటర్, ఆర్కె. మీడియా నిర్వాహకులు పనస రవికుమార్(35)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఫిలింనగర్లో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కొంత కాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ తాము తీసుకోవడమే కాకుండా సినిమా పరిశ్రమలో మరికొందరికి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. వారి సమాచారం ఆధారంగా నైజీరియాకు చెందిన సోలా అలియాస్ సుల్తాన్(29), శ్యాంసన్ ఎబూపా(24), ఉజోర్ ప్రామిస్(29), అటోబ్ బోషా కెల్విన్(33)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 90 గ్రాముల కొకైన్, 40 ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన సోలా గతంలో పలుమార్లు సినీ ప్రముఖులకు కొకైన్ సప్లయ్ చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వీరు గోవా, ముంబై నుంచి డ్రగ్స్ను తీసుకొస్తూ నగరంలో విక్రయిస్తున్నారన్నారు. ఉజోర్ ప్రామిస్కు వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పరారీలో ఉన్న విక్టర్, ప్యాట్రిక్ అనే మరో ఇద్దరు నైజీరియన్ల గాలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులు నిజాం కళాశాల విద్యార్థులుగా చెలామణీ అవుతూ నగరంలో తిష్టవేసినట్లు ఆయన వివరించారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, ఫారెనర్స్ యాక్ట్ 1946 కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో డ్రగ్స్ముఠాను పట్టుకున్నందుకు సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ మహేందర్రెడ్డికి రివార్డులు అందజేయనున్నట్లు డీసీపీ ప్రకటించారు. -
మీ ప్రేమ కోరే చిన్నారులం..
- అమ్మానాన్నలు కలిసి ఉండాలని చిన్నారుల మారాం - దంపతులను ఒక్కటి చేసిన వైనం సాక్షి, హైదరాబాద్: ‘అమ్మా నాన్నలు కలసి ఉండాలని పిల్లలు ఎన్నో దేవుళ్లను మొక్కుకోవడం... ఆలయాలను దర్శించుకోవడం... దేవ తలే దిగివచ్చి పిల్లలకు అండగా నిలవడం... చివరకు తల్లిదండ్రులను ఒక్కటి చేయడం...’ ఇదీ సుమారు దశాబ్దం క్రితం వచ్చిన ‘దేవుళ్లు’ సినిమాలోని దృశ్యం. అచ్చంగా అలాంటి ‘చిత్రమే’ నగరంలో చోటుచేసుకుంది. ‘అమ్మ కొడుతుంది... అమ్మకంటే నాన్నే మంచి వాడు.. మేం అమ్మ దగ్గరకు పోం... నాన్నతో కలసి ఉంటేనే ఆమె దగ్గర ఉంటాం..’ అంటూ ఇద్దరు చిన్నారులు పోలీసుల వద్ద మారాం చేశారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న తల్లి ఎట్టకేలకు భర్తతో కలసి ఉండడానికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఆసక్తి కలిగించే ఈ సంఘటన వివరాలివీ... వెంకటగిరికి చెందిన కాంట్రాక్టర్ తలారి సత్యంతో రామలక్ష్మి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పవన్ కార్తీక్ (10), అంజనా సౌమ్య (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. తనను అనుమానిస్తున్న భార్య రామలక్ష్మితో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన సత్యం గత ఏడాది ఆగస్టు 20న భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. అదే రోజు పిల్లలు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. కే సు నమోదు చేసిన ఎస్ఐ వీరభద్ర కుమార్ వీరి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తన భార్యకు దొరకరాదని భావించిన సత్యం ఫోన్ నంబర్లను, చిరునామాలను మార్చుతూ... చివరకు మచిలీపట్నంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ పిల్లలను స్థానికంగా ఓ పాఠశాలలో చదివిస్తున్నాడు. చిన్నారుల పట్టుదలతో... - భర్తను వెతికి పట్టుకొని పిల్లలను తనకు అప్పగించాలంటూ ఏడు నెలలుగా రామలక్ష్మి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లో పోలీసులు వెదుకుతూ వస్తున్నారు. చివరకు సత్యం బంధువుల ద్వారా మచిలీపట్నంలో ఉన్నట్లు తె లుసుకున్న పోలీసులు పిల్లలిద్దరినీ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. - అయితే తాము తండ్రి దగ్గరే ఉంటామని...తల్లి దగ్గరకు వెళ్లేది లేదని పిల్లలు తేల్చిచెప్పారు. దీంతో ఆ చిన్నారులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే సమాజంలో వచ్చే గుర్తింపు ఎలాంటిదో ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి వివరించారు. ఆ మాటలతో దిగివచ్చిన చిన్నారులు... తల్లితో వెళ్లాలంటే తండ్రిపై ఆమె పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. తండ్రిని కూడా ఇంటికి రానివ్వాలని గట్టిగా కోరారు. పిల్లల కోరిక మేరకు భర్తతో కలిసి ఉండేందుకు రామలక్ష్మి అంగీకరించింది. అనుమానాలను విడిచిపెట్టి భర్త, పిల్లలను సరిగా చూసుకోవాలని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి పంపించారు. దీంతో కథ సుఖాంతమైంది. ఆ పిల్లల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. -
అల్లరి చేస్తోందని వాతలు
ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్లో ఘటన బంజారాహిల్స్: అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది. చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు. -
లారెన్స్కు ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ‘రెబల్’ చిత్ర వివాదంలో ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ రాఘవకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో హాజరు కావాల్సిందిగా లారెన్స్ను ఆదేశించింది. రెబల్ చిత్రాన్ని రూ. 22.5 కోట్లతో నిర్మిస్తానని లారెన్స్ ఆ చిత్ర నిర్మాతలైన జె.భగవాన్, పుల్లారావులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చిత్ర నిర్మాణ సమయంలో ఆ బడ్జెట్ రూ.40 కోట్లకు చేరింది. దీనికితోడు చిత్రం ఆశించిన రీతిలో ఆడక నిర్మాతలు నష్టపోయారు. ఈ విషయంలో దర్శకుడికి, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా కొంత మొత్తాన్ని తాను భరిస్తానని లారెన్స్ అంగీకరించాడు. అయితే డబ్బులడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నిర్మాతలిరువురూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లారెన్స్పై సెక్షన్ 406, 420 కింద కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు శనివారం లారెన్స్కు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సంబంధిత పోలీస్స్టేషన్లో హాజరు కావాలని సూచించింది. -
జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబాటు యత్నం
సెక్యూరిటీ అప్రమత్తతతో పరార్ సాక్షి, హైదరాబాద్: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో నివాసం ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి చేతిలో తుపాకీ ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోనికి వెళ్లాడు. అలికిడి కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అటువైపుగా రావడంతో.. గమనించిన అగంతకుడు అక్కడ్నుంచి పారిపోయాడు. అగంతకుడు నెంబర్ప్లేట్ లేని వాహనంపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనంతా సమీపంలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.