MLC Farooq hussain
-
'ఎమ్మెల్సీ పదవికి ఫరూక్ అనర్హుడు'
-
ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ ఫరూఖ్ దౌర్జన్యం
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ విచక్షణ కోల్పోయారు. అద్దె చెల్లించలేదని, ఇంటిని ఖాళీ చేయాలని కోరిన యజమానిపై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర పదజాలంతో దూషించారు. మహిళ అని కూడా చూడకుండా మెడ పట్టి ఇంటి నుంచి గెంటేయించారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని స్కిల్ స్లె్పండర్ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన అమ్తుల్ వసై, మహ్మద్ వసై భార్యభర్తలు. వీరు అమెరికాలోని న్యూయార్క్లో కుటుంబంతో నివసిస్తున్నారు. స్కిల్ స్లె్పండర్ అపార్ట్మెంట్లోని తమ ఫ్లాట్ను ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్కు అద్దెకు ఇచ్చారు. అయితే రెండేళ్లుగా ఫరూక్ ఫ్లాట్ అద్దె చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ చేయాల్సిందిగా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్ను ఖాళీ చేయించేందుకు అమ్తుల్ వసై అమెరికా నుంచి నగరానికి వచ్చారు. ఉదయాన్నే తమ్ముడు మహ్మద్ ముజ్తుబాతో కలసి అమ్తుల్ వసై.. ఫరూఖ్ నివసిస్తున్న తమ ఫ్లాట్కు వెళ్లారు. ఇంట్లోకి వెళ్తూనే ముజ్తుమా ఫోన్లో వీడియా రికార్డింగ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లాట్ ఖాళీ చేయాలని రెండేళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ అమ్తుల్ గట్టిగా మాట్లాడటంతో ఫరూఖ్ విచక్షణ కోల్పోయారు. కాలిలోని చెప్పును తీసి అమ్తుల్ పైకి విసిరారు. దుర్భాషలాడుతూ, మెడ పట్టుకుని అక్కా తమ్ముడిని బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఎమ్మెల్సీపై పలు కేసులు నమోదు చేశారు. మహిళపై ఫరూక్ దుర్భాషలాడిన, దాడికి యత్నించిన వీడియోను పరిశీలించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నాపై వస్తున్న వార్తలన్నీ అబద్ధం: ఫరూక్ తనపై పలు టీవీ చానళ్లలో వచ్చిన వార్తలన్నీ అబద్ధమని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ చెప్పారు. తన ఇంటికి యూసఫ్ అలీ అనే వ్యక్తితో వచ్చిన మహిళ తనను పరుష పదజాలంతో దూషించిందని వివరించారు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ తనను తిట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల క్రితం మహ్మద్ సమద్ అనే వ్యక్తితో ఇంటిని అద్దెకు తీసుకున్నానని చెప్పారు. నెలకు రూ.11,500 అద్దెకు ఒప్పందం కుదుర్చుకున్నానని, ప్రతీ నెల 5లోగా అద్దె చెల్లిస్తున్నాని వివరించారు. తనకు కబ్జాలు చేసే అలవాటు లేదని, కబ్జాలు చేసేవాడినైతే ఇప్పటికే సొంత ఇల్లు ఉండేదన్నారు. ఇల్లు ఖాళీ చేయమని తనకు ఎవరూ నోటీసు ఇవ్వలేదని, నోటీసు చూపిస్తే 24 గంటల్లో ఖాళీ చేస్తానన్నారు. మహిళలంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనక ఎవరో ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. -
ఇది చారిత్రక అవసరం
♦ టీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా కేసీఆర్ ♦ చిల్లర మల్లర చేరికలు కావు.. ఇది రాజకీయ పునరేకీకరణ ♦ గులాబీ గూటికి ఎమ్మెల్యే పువ్వాడ అజ య్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ చారిత్రక అవసరమని... అందులో భాగంగానే టీఆర్ఎస్లోకి చేరికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వివిధ పార్టీల నుంచి జరుగుతున్న చేరికలు ఏవో చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావని గతంలోనే చెప్పానని, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అంతా కలసి పనిచేద్దామని తాను ఇదివరకే ప్రకటించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సోమవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణకు దశ, దిశ నిర్దేశించుకునే కీలక సందర్భంలో రాష్ట్రం ఉందన్నారు. రాజకీయ పునరేకీకరణ తెలంగాణకు చారిత్రక అవసరమని చెప్పారు. తెలంగాణ వస్తే పాలనే సరిగా సాగదని నాడు సమైక్యవాదులు ఎద్దేవా చేశారని, తెలంగాణ నిలిచి గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘‘కొందరు రాజకీయమే పరమావధిగా ఎడ్డెం అంటే తెడ్డెం అనుకుంట తయారైండ్రు. ఏదన్న పని మొదలు పెట్టకముందే విమర్శలు షురూ చేసున్నరు. వాళ్లను పట్టించుకోవద్దని ప్రజలు చెబుతనే ఉన్నరు. అయినా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ శాసనసభ సాక్షిగా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించి, భవిష్యత్ తరాలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఖమ్మం పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు పాలేరు నుంచి మంచినీటిని అందిస్తామన్నారు. గోదావరి నీళ్లను ఖమ్మం జిల్లా బీళ్లకు మళ్లించి సాగులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా మొదటిసారి గెలవడం సహజమేనని, తదనంతరం కొనసాగడమే కష్టమని.. ప్రజల ఆదరణ పొందడం కోసం పనిచేయాలని సూచించారు. తగిన ప్రాధాన్యం ఇస్తాం.. ‘‘ఎన్నాళ్లు బతికామని కాదు. ఎంత బాగా బతికామన్నదే ముఖ్యం. జీవితంలో ఎన్నో పనులు చేస్తం. అందులో మన బెస్ట్ కంట్రిబ్యూషన్ ఏమిటనేదే ముఖ్యం. మంచి పనులు చేస్తే ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తరు..’’ అని కేసీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్తో సంప్రదిస్తు న్న పువ్వాడ చివరకు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మలకు చేదోడు, వాదోడుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పువ్వాడకు సూచించారు. ఇక తన స్వస్థలానికి చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తనకు చిరపరిచితుడని... కలసి పనిచేద్దామని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. వీరిద్దరికీ తగిన ప్రా ధాన్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్కు చెందిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఖమ్మం, మెదక్ జిల్లాల నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు కేసీఆర్, తుమ్మల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు కవిత, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. -
ఫోటో లేదని ఫ్లెక్సీలు చింపేశారు....
-
ఫోటో లేదని ఫ్లెక్సీలు చింపేశారు....
మెదక్ : తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ నేతలు ....తమ తీరు మార్చుకోవటం లేదు.ఓవైపు మెదక్ లోక్సభ ఉప ఎన్నికకు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని చెబుతూనే మరోవైపు ఘర్షణలకు దిగటం విశేషం. అది కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. మెదక్ జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఫోటో వేయలేదంటూ ఆయన వర్గీయులు గొడవకు దిగారు. ఫ్లెక్సీలు చించివేసి పొన్నాల ఎదుటే ఘర్షణకు దిగారు. దాంతో అవాక్కవటం పొన్నాల వంతు అయ్యింది.