obscene photos
-
గే యాప్లో పరిచయం.. నగ్నచిత్రాలు తీసి బెదిరింపులు
సాక్షి, బంజారాహిల్స్: గే యాప్లో పరిచయం చేసుకొని వారిని తన గదికి రప్పించి నగ్నదృశ్యాలు చిత్రించి బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ రౌడీషీటర్ను, ఆయన అనుచరుడిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని భోలానగర్లో నివసించే అఫ్రిది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్గా నమోదై ఉన్నాడు. ఇతను ఆవారాగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతూ బతుకువెల్లదీస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈజీమనీకి అలవాటు పడి గే యాప్లో యువకులను పరిచయం చేసుకోసాగాడు. వారిని తన గదికి రప్పించి దుస్తులు విప్పించి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులను ఇదే తరహాలో బెదిరించి నగదు, నగలు దోచుకున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్రిదీతో పాటు సహకరించిన హరూన్ (22) అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను.. -
సినీ అవకాశాల పేరుతో యువతులకు వల..దర్శకుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్ క్షత్రియన్. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జననీ (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో తాను పని చేసే సినిమా కంపెనీలో వీరప్పన్ పాలమూరుకు చెందిన దర్శకుడు వేల్ క్షత్రియన్. అతని సహాయకురాలు రాజపాళ్యంకు చెందిన జయజ్యోతి సినిమా అవకాశాల పేరుతో అనేక మంది యువతులను సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటితో బెదిరించి వారి జీవితాలను పాడు చేస్తున్నారని పేర్కొంది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్ క్షత్రియన్ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్ డిస్క్లు, ల్యాప్ట్యాప్, పెన్డ్రైవ్లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్డిస్క్లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! -
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. యువతులకు అసభ్యకర వీడియోలు పంపి..
బనశంకరి(బెంగళూరు): ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అశ్లీల చిత్రాల వీడియోలను పంపుతున్న వ్యక్తిని బుధవారం ఆగ్నేయ విభాగ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్చేశారు. మడివాళ బైబీమ్ నగరలో ఉండే 40 ఏళ్ల ఫుడ్ డెలివరి బాయ్ నిందితుడు. అతను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా యువతులు, మహిళలకు పోర్న్ను పంపేవాడు. ఫిర్యాదులు రావడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. బావమరిది చేతిలో బావ హతం కేజీఎఫ్: తాగిన మైకంలో స్వంత బావనే బావమరిది హత్య చేసిన ఘటన బంగారుపేట పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్.ఎ మోహన నగర్లో నివాసం జయప్ప (56) తన బామరిది మురళీతో కలిసి మంగళవారం మద్యం తాగి పరస్పరం గొడవ పడ్డారు. ఓ దశలో మురళీ జయప్ప తలపై రాడ్తో బలంగా బాదాడు. దీంతో అతను తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు నిందితుడు మురళీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్య నగ్న ఫొటోలను బంధువులకు షేర్ చేసిన భర్త.. ఆమె ఏం చేసిందంటే? -
యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్లో అశ్లీల ఫొటో
హోసూరు(కర్ణాటక): తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతికి వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆమెఫొటోను అశ్లీలంగా చిత్రించి వాట్సప్లో ఉంచిన యువకున్ని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు తాలూకా బి. ముదుగానపల్లి గ్రామానికి చెందిన నరేష్కుమార్(25) హోసూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంటికి వెళ్లి పిల్లను అడిగారు. తల్లిదండ్రులు నిరాకరించి మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ద్వేషం పెంచుకున్న నరేష్కుమార్ ఆ యువతి ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి వాట్సప్ ద్వారా పంపాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నరేష్కుమార్ను అరెస్ట్ చేశారు. ఇవీ చదవండి భర్తను చంపి.. బాత్రూంలో పాతిపెట్టి 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి..
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని కులకచర్ల మండలం లాల్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫోటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. నగ్న పోటోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకుంటున్నాడు. అనంతరం ఆ ప్రైవేట్ వీడియోలను స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతున్నాడు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదు మేరకు గత నెల 18న శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం బెయిల్పై తిరిగి వచ్చిన శ్రీనివాస్, అతని సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. అంతటి ఆగకుండా తిరికి వారిపైనే అక్రమ కేసులు పెట్టించారు. శ్రీనివాస్ను పోలీసులకు అండగా నిలుస్తున్నారని మహిళా బాధితురాలు ఆరోపించారు. శ్రీనివాస్పై కాగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు లంచం తీసుకొని నిందితులకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ల్యాప్టాప్లో కుమార్తె అభ్యంతరకర ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయి వాడిగా మారాడు. కూతురి అభ్యంతకర ఫోటోలను ల్యాప్టాప్లో సేవ్ చేసి.. వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు. తండ్రి నిజస్వరూపం తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నాచారం ప్రాంతంలో రెస్టారెంట్ ఓనర్గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు రెండో భార్య కుమార్తె అభ్యంతరకర ఫోటోలను తీసి తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్టాప్ తీసి చూడగా తండ్రి బాగోతం బయటపడింది. కన్నతండ్రి ల్యాప్టాప్లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది. (భార్య అందంగా లేదని.. గొంతు నొక్కి) దీని గురించి బాధితురాలు తల్లికి తెలిపింది. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతడికి కరోనా సోకడంతో మందలించి విడిచిపెట్టారు. కోలుకోవడంతో ప్రస్తుతం నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు. -
యువతి స్నానం చేస్తుండగా..
సాక్షి, న్యూఢిల్లీ : యువతి స్నానం చేస్తుండగా సెల్లో ఫొటోలు తీసేందుకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఢిల్లీలోని శంకరపురలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యువతి స్నానం చేసి వస్తుండగా పైఅంతస్తులో నివాసముండే 42 ఏళ్ల వ్యక్తి బాల్కనీలో ఉండడం గమనించారు. అతని చేతిలో మొబైల్ ఉండడం.. అంతకు ముందుకూడా తనతో అసభ్యంగా ప్రవర్తించి ఉండడంతో ఆమెకు అనుమానం కలిగింది. స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడేమోనని నిశ్చయించున్నారు. అదేవిషయమై అతన్ని ప్రశ్నించడంతో తటపటాయించాడు. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఇంట్లోకి జారుకున్నాడు. జరిగిన విషయాన్ని ఇంట్లోని వారికి చెప్పిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి నిందితున్ని నిలదీశారు. నిందితుడు తనకేమీ తెలియదని చెప్పి తప్పించుకోజూశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు. ఓ ప్రముఖ హిందీ దిన పత్రికలో నిందితుడు టెక్నిషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
-
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
- అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్మెయిలింగ్ - పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతులు - కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విశాఖ : అందమైన అమ్మాయిలతో మాటలు కలిపి నమ్మించి స్నేహం పెంచుకుంటాడు... అనంతరం వారితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీస్తాడు... వాటిని ఆసరాగా చేసుకుని కోరిక తీర్చమని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు మద్దిలపాలెంకు చెందిన నయవంచకుడు నితిన్. బీటెక్ చదువుతున్నానని, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకుని మోసం చేశాడు. అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకున్నాడని కొందరు యువతులు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెంలో ఉంటున్న నితిన్ తన స్నేహితుని సాయంతో కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఎలుకల గాయత్రి ఫోన్ నంబర్ సేకరించి స్నేహం పెంచుకున్నాడు. గాయత్రికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను షార్ట్ఫిల్మ్లు తీస్తానని, వాటిలో అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. అందుకోసం మంచి ఫొటోలు తీయించుకోవాలని చెప్పాడు. దీంతో సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకునేందుకు గాయత్రి అంగీకరించింది. అయితే ఫొటోలు తీయించుకునే సమయంలోను, దుస్తులు మార్చుకునేటపుడు అశ్లీల ఫొటోలు తీసిన నితిన్ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీరిస్తేనే ఫొటోలు ఇస్తానని చెప్పి గాయత్రిని లోబరుచుకున్నాడు. ఇలా మరో అమ్మాయి ప్రియను కూడా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రోజా అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్ చేయాలని రోజూ వేధిస్తుండేవాడని ఆ యువతి వాపోయింది. ఇలా సుమారు 30 మంది యువతులను నితిన్ వేధించాడని పోలీసులు, బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.