PCB chairman
-
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
పాక్ క్రికెట్లో కీలక పరిణామం.. చైర్మెన్గా సుప్రీంకోర్టు న్యాయవాది
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక చైర్మన్గా ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. షా ఖవార్ పీసీబీ ఎన్నికల కమీషనర్గా కూడా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 20న పీసీబీ చైర్మెన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవి చేపట్టి ఏడాది కాకముందే పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని షా ఖవార్ భర్తీ చేయనున్నాడు. ఈ మెరకు పాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కాకర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలలలో జరగనున్న పీసీబీ ఎన్నికల వరకు షా ఖవార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా పీసీబీ కొత్త అధ్యక్షుడి రేసులో పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ముందంజలో ఉన్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులగా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే వరల్డ్కప్-2023 నుంచి పాకిస్తాన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరల్డ్కప్ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో ఘోర ఓటములను చవిచూసింది. చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్లు ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్కప్తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
ఐసీసీ వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్తో మ్యాచ్ను మాత్రం అహ్మదాబాద్లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్ను అహ్మదాబాద్లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: వన్డే వరల్డ్కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు -
'పాక్కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్ను వ్యతిరేకిస్తున్నా'
''ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్ జకా అష్రఫ్ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్ సేథీ ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఈ హైబ్రిడ్ మోడల్ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్లన్నీ పాకిస్తాన్ బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు. PCB Nominated Chairman Zaka Ashraf Reject PCB hybrid Model for Asia Cup Interesting days ahead & controversy related #AsiaCup2023 #WorldCup2023 pic.twitter.com/3El1ISj0ym — Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) June 21, 2023 అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి పాక్కు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం. ఇక జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! #AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా'
పీసీబీ తాత్కాలిక ఛైర్మన్గా ఉన్న నజమ్ సేథీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో పీసీబీ ఛైర్మన్కు సంబంధించి జరగనున్న ఎన్నికల్లో రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపాడు. ''ఆసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్ల మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఇంతటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాద. ఈ పరిస్థితుల్లో నేను పీసీబీ చైర్మన్ అభ్యర్థి పదవికి పోటీ చేయలేను. అందుకే తప్పుకుంటున్నా. రేసులో ఉన్న మిగిలినవారికి ఆల్ ది బెస్ట్'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్లో రమీజ్ రాజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించిన ప్రధాని షాబాజ్ షరీఫ్ అతని స్థానంలో నజమ్ సేథీని తాత్కాలిక ఛైర్మన్గా ఎంపిక చేశాడు. పీసీబీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు నజమ్ సేథీ తాత్కాలిక ఛైర్మన్గా ఉంటారని పీసీబీ పేర్కొంది. కాగా 120 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. ఆరు నెలలు దాటిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన ఇంపాక్ట్ చూపించాడు. మికీ ఆర్థర్ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా, గ్రాంట్ బ్రాడ్బర్న్ హెడ్కోచ్గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్లో నిర్వహించే ప్రతిపాదన నజమ్ సేథీదే. మొత్తానికి ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్లో జరిగేలా చూడడంలో నజమ్ సేథీ సక్సెస్ అయ్యాడు. కాగా ఈ బుధవారం(జూన్ 21న)తో పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ పదవీకాలం ముగియనుంది. సమర్థంగా పనిచేసిన నజమ్ సేథీ మరోసారి పీసీబీ ఛైర్మన్గా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ నజమ్ సేథీని ఎన్నుకోవడం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇష్టం లేదు. మరోవైపు ప్రధాని షాబాజ్ షరీఫ్ మాత్రం నజమ్కు మద్దతుగా ఉన్నారు. కానీ తన వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని.. అది పీసీబీకి మంచిది కాదని పేర్కొన్న నజమ్ సేథీ తనంతట తానుగా రేసు నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా నజమ్ సేథీ రేసు నుంచి తప్పుకోగా. మిగిలిన వారిలో జకా అష్రఫ్ పీసీబీ ఛైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 చదవండి: 'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు' -
ఏకపక్షంగా ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు..? జై షాను నిలదీసిన పీసీబీ చీఫ్
ఆసియా కప్ 2023-24 (వన్డే ఫార్మాట్) సంవత్సరాలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు ఆసియా వేదికగా జరగాల్సి ఉన్న అన్ని క్రికెట్ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా నిన్న (జనవరి 5) విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్లో వరుసగా రెండు సంవత్సరాలు భారత్, పాక్లు ఒకే గ్రూప్లో తలపడపడాల్సి ఉంది. Thank you @JayShah for unilaterally presenting @ACCMedia1 structure & calendars 2023-24 especially relating to Asia Cup 2023 for which 🇵🇰 is the event host. While you are at it, you might as well present structure & calendar of our PSL 2023! A swift response will be appreciated. https://t.co/UdW2GekAfR — Najam Sethi (@najamsethi) January 5, 2023 అయితే ఈ క్యాలెండర్ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథీ తాజాగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. ఆతిధ్య దేశమైన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా షెడ్యూల్ను ఎలా ప్రకటిస్తారని ట్విటర్ వేదికగా జై షాను ప్రశ్నించాడు. అలాగే ఏసీసీ చైర్మన్ హోదాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) షెడ్యూల్ కూడా ప్రకటించాలని వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. పీసీబీ చైర్మన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. కాగా, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ పెద్దలు ముక్తకంఠంతో ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. తాజాగా జై షా ప్రకటించిన షెడ్యూల్లో 2023కు సంబంధించి ఆతిధ్య దేశం (పాక్) ప్రస్తావన లేకపోవడంతో పాక్కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే భారత్కు ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో పీసీబీ చైర్మన్ ఈ ట్వీట్ చేశాడు. -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్లో పిచ్ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్కప్లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
కన్నేసి ఉంచాలంటూ పాక్ ఆటగాళ్ల భార్యలను భారత్కు పంపించాం!
టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. రెండు దేశాలకు తమ గౌరావాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్షతో ఉంటాయి. ఏ జట్టుతో మ్యాచ్ ఓడినా పర్లేదు కానీ దాయాది చేతిలో ఓడితే మాత్రం విమర్శలు తప్పవు. కాగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగి చాలా కాలమే అవుతుంది. రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మేజర్ టోర్నీల్లో తప్ప భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరగడం లేదు. ఇటీవలే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ప్రస్తావించిన నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఆ టోర్నీలో ఆడబోయేది లేదని భారత్ ఐసీసీకి తెలిపింది. అయితే పాకిస్తాన్ జట్టు భారత్లో చివరిసారి 2012-13లో పర్యటించింది. ఆ సమయంలో మూడు వన్డేలు. రెండు టి20 మ్యాచ్లు ఆడేందుకు పాక్ టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియాకు కెప్టెన్గా ఎంఎస్ ధోని ఉండగా.. పాకిస్తాన్ కెప్టెన్గా మిస్బా-ఉల్-హక్ వ్యవహరించాడు. వన్డే సిరీస్ను 2-1 తేడాతో పాక్ కైవసం చేసుకోగా.. రెండు మ్యాచ్ల టి20 సిరీస్ను 1-1 డ్రా చేసుకున్నాయి. సిరీస్ ఫలితం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన ఒక సంఘటనను మాజీ పీసీబీ చైర్మన్ జాకా అశ్రఫ్ తాజాగా పంచుకున్నాడు. పాక్ ఆటగాళ్ల వెంబడి వారి భార్యలను కూడా తొలిసారి భారత్కు పంపించామని పేర్కొన్నాడు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆయన వివరించాడు. '' పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పుడు భారత్కు వచ్చినా.. ఆ దేశ మీడియా పాక్ ఆటగాళ్లపై ఆరోపణలు చేసేది. ఆటగాళ్లు ఎప్పుడు భారత్కు వచ్చినా తమ భార్యలను తీసుకురారని.. వాళ్లు రాకపోవడం వల్ల ఇక్కడ తమ సరసాలకు అడ్డు ఉండదని.. ఎవరు ఏం చేసినా అడిగేవారు ఉండరని.. అందుకే పాక్ ఆటగాళ్లు తమ భార్యలను తీసుకురారని వార్తలు రాసేవారు. కానీ వీటన్నింటికి చెక్ పెట్టడానికే.. పాక్ ఆటగాళ్లు వెళ్లిన తర్వాత.. ఒక కన్నేసి ఉంచమని వారి భార్యలను భారతదేశానికి పంపించాను. పీసీబీ మాజీ చైర్మన్ జాకా అశ్రఫ్ ఆ సమయంలో వాళ్లు పాక్ ఆటగాళ్లతోనే ఉండడంతో అక్కడి మీడియా(భారత్ మీడియా)కు వార్తలు రాయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్.. సెక్యూరిటీ విషయంలో హామీ ఇస్తే పాకిస్తాన్ పర్యటనకు భారత్ను పంపిస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ మాట నిలుపుకోలేకపోయారు. అయితే భారత్తో సిరీస్ ఆడేందుకు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం.. కానీ భారత్ ఒప్పుకునే ప్రతిపాదనలో కనిపించడం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Tim Southee: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్రౌండర్ Pollard Run-out: పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు! -
‘భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్.. ఇప్పట్లో సాధ్యం కాదు’
లాహోర్: మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సోమవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్సాన్ మని గత నెలలో పీసీబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్ను ఎన్నుకున్నారు. బోర్డు బాధ్యతలు రమీజ్కు కొత్తకాదు. 1992 వన్డే వరల్డ్కప్ విజేత పాక్ జట్టు సభ్యుడైన ఆయన 2003–2004 వరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. 59 ఏళ్ల రమీజ్ ఎన్నికైన వెంటనే భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్పైనే స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్ సాధ్యం కాదని తెలిపారు. చదవండి: Sourav Ganguly: ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్గా అనుమతించం -
పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్గా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా నియామకం ఖరారైంది. పాక్ ప్రధానే స్వయంగా రంగంలోకి దిగి తన మాజీ సహచరుడిని పీసీబీ బాస్గా నియమించారు. ప్రస్తుత పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి పదవీకాలం ముగిసిన వెంటనే రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు పాక్ ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. రమీజ్రాజా, ఎహ్సాన్ మణి ఇద్దరూ ఈనెల 23న ఇమ్రాన్ ఖాన్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ చైర్మన్ పదవికి రమీజ్ పేరును ప్రతిపాదించారు. కాగా, రమీజ్ రాజా.. 1984-1997 మధ్య కాలంలో పాక్కు ప్రాతినిథ్యం వహించాడు. 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు సాధించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో రమీజ్ సభ్యుడు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ హయాంలోనే పాక్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంది. రెండు రోజుల కిందటే విండీస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంది. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్పై బంతితో దాడి -
పాక్ క్రికెట్ లో ఖాన్ కామెంట్స్ దుమారం
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చేసిన 'డిగ్రీ' వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువులో వెనకబడ్డారని, మిస్బా-వుల్-హక్ మినహా డిగ్రీ చదివాళ్లే లేరని షహర్యార్ కామెంట్ చేశారు. దీనిపై సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుతో ఆటకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు. క్రికెట్టే తమకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. టెస్టు క్రికెటర్ గా చెప్పుకోవడానికి గర్వపడతానని, అదే తన డిగ్రీ అని వ్యాఖ్యానించాడు. అయితే అందరికీ చదువు ముఖ్యమేనని, దీనికి డిగ్రీలే కొలమానం కాదన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే వారు బహిరంగంగా మాట్లాడకుండా, తమ అభిప్రాయాలను పీసీబీ వర్గాలకు రహస్యంగా వెల్లడించినట్టు సమాచారం. -
లంచం ఇవ్వలేదు
జింబాబ్వే పర్యటనపై పాక్ కరాచీ: తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చామనే ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఖండించారు. జింబాబ్వే బోర్డుకు ఖర్చుల కింద దాదాపు 5 మిలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 20 లక్షలు)ను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పాక్లో ఆడినందుకు జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చారంటూ కథనాలు వచ్చాయి.